స్వర్ణాంధ్ర – 2047పై ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు ప్రభుత్వం గ్రామసభలను నిర్వహిస్తోంది. ప్రత్తిపాడు గ్రామ పంచాయతీలోనూ గురువారం పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో సభ ఏర్పాటైంది. అక్కడ ఇద్దరే ఇద్దరు వార్డు సభ్యులు కనిపించారు. జనం పట్టుమని నలుగురైదుగురు కూడా రాలేదు. ఇంకేముంది.. మూడు సచివాలయాల ఉద్యోగులు, ఏఎన్ఎంలు, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలను ఇలా గ్రూపుగా నిలబెట్టి పోస్టర్లు ఆవిష్కరిస్తున్నట్లు ఫొటోలు దిగారు. వచ్చిన వారితోనే సంతకాలు చేయించుకుని తూతూమంత్రంగా గ్రామసభను ముగించారు. ఇది ఒక్క ప్రత్తిపాడు పంచాయతీలోనే కాదండోయ్.. మండలంలోని అన్ని చోట్లా గ్రామసభల తీరు దాదాపుగా ఇలాగే ఉంది. చూసిన వారంతా ఇదెక్కడి చోద్యమంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. – ప్రత్తిపాడు
ఇదీ.. స్వర్ణాంధ్ర – 2047పై గ్రామసభ నిర్వహణ తతంగం
Comments
Please login to add a commentAdd a comment