బక్రీద్‌ను శాంతియుతంగా జరుపుకోవాలి | - | Sakshi
Sakshi News home page

బక్రీద్‌ను శాంతియుతంగా జరుపుకోవాలి

Published Fri, Jun 14 2024 1:14 AM | Last Updated on Fri, Jun 14 2024 1:14 AM

బక్రీద్‌ను శాంతియుతంగా జరుపుకోవాలి

వరంగల్‌ అదనవు కలెక్టర్‌

సంధ్యారాణి

కాళోజీ సెంటర్‌: బక్రీద్‌ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని వరంగల్‌ అదనవు కలెక్టర్‌ జి.సంధ్యారాణి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ముస్లిం మతపెద్దలు, మున్సిపల్‌, పంచాయతీ, పోలీస్‌ అధికారులతో గురువారం సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి మాట్లాడుతూ బక్రీద్‌కు వెటర్నరీ అధికారులు ధ్రువీకరించిన జంతువులను మాత్రమే వినియోగించాలని, వాహనాల్లో తరలించే జంతువులకు అధికారులు జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలు ఉండాలని స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే పోస్టులపై నిర్ధారణ చేసుకోవాలని, ఎవరూ తొందరపడవద్దని అధికారులకు సూచించారు. కబేళాల నిర్వాహకులకు అధికారులు అవగాహన కల్పించాలన్నారు. పండుగ ముగిసే వరకు పారిశుద్ధ్య కార్మికులతో ప్రత్యేక పనులు చేపట్టాలన్నారు. సమావేశంలో జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి సౌజన్య, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి బాలకృష్ణ, ఆర్డీఓ సిదం దత్తు, తహసీల్దార్‌ ఇక్బాల్‌, మైనార్టీ మత పెద్దలు దర్శన్‌సింగ్‌, ఫుర్కాన్‌, పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement