వరంగల్ అర్బన్: నిర్దేశిత ప్రమాణాల ప్రకారమే భవన నిర్మాణాలు చేపట్టాలని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. శుక్రవారం సాయంత్రం జీడబ్ల్యూఎంసీ పరిధి మడికొండలో భవన నిర్మాణ ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో కమిషనర్ పర్యటించి పరిశీలించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. చట్టంలో సూచించినట్లుగా ప్రమాణాల ప్రకారం నిర్మాణాలు చేపట్టే భవనాలకు అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందని కమిషనర్ తెలిపారు. కార్యక్రమంలో సిటీ ప్లానర్ వెంకన్న, ఏసీపీ బషీర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment