Sudan Gold Mine Collapse: Officials Confirmed 38 People Died - Sakshi
Sakshi News home page

ఘోరం: సూడాన్‌లో బంగారు గని కూలి 38 మంది మృతి

Published Wed, Dec 29 2021 8:35 AM | Last Updated on Wed, Dec 29 2021 9:05 AM

Sudan Officials say Gold Mine Collapse Leaves 38 People Dead - Sakshi

Sudan Gold Mine Collapse: సూడాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పశ్చిమ కోర్డోఫాన్‌ ప్రావిన్స్‌లో బంగారు గని కూలిపోవడంతో 38 మంది మరణించారు. ప్రమాదంలో మరో 8 మంది వరకు గాయపడ్డారని, వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు సూడాన్ ప్రభుత్వ మినరల్ రిసోర్సెస్ కంపెనీ తెలిపింది.

సూడాన్‌ రాజధాని ఖార్టూమ్‌కు 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుజా గ్రామంలో ఈ ఘటన జరిగింది. అయితే ఈ గనిని గత కొంతకాలం క్రితమే ప్రభుత్వం మూసివేసింది. సూడాన్‌ ప్రభుత్వం గనుల్లో ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడమే వరుస ప్రమాదాలకు కారణంగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా, సూడాన్‌ దేశం 2020లో సుమారు 36.6 టన్నుల బంగారాన్ని వెలికితీసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement