రాజోళి: విద్యార్థులకు మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహించవద్దని జెడ్పీ సీఈఓ కాంతమ్మ అన్నారు. గురువారం రాజోళిలోని కస్తూర్బా గాంధీ పాఠశాలను, పరిసరాలను ఆమె పరిశీలించారు. కిచెన్ షెడ్ అసంపూర్తిగా ఉందని, వీలైనంత త్వరగా దాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించడంతోపాటు ఏవై నా సమస్యలు ఎదుర్కొంటున్నారా అని ఆరా తీశా రు. అనంతరం స్థానిక పీహెచ్సీని, సదుపాయాలను పరిశీలించారు. వైద్య సిబ్బంది అందుబాటు లో ఉంటున్నారా లేదా అని రోగులను అడిగి తెలసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఖాజా మెయినుద్దీన్, ఆసుపత్రి, కేజీబీవీ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment