కరీంనగర్ కార్పొరేషన్: పెండింగ్ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ముస్లిం జేఏసీ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను హైదరాబాద్లో కలిసి, వినతిపత్రం అందజేశారు. చింతకుంట వద్ద అసంపూర్తిగా ఉన్న మైనార్టీ కమ్యునిటీ హాల్కు నిధులు మంజూరు చేసి, పూర్తి చేయాలని, మైనార్టీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని, వక్ఫ్బోర్డు, మదీనా కాంప్లెక్స్ సమస్యలను పరిష్కరించాలని, ఉర్దూ మీడియం పాఠశాలల్లో విద్యావలంటర్లీను నియమించాలని విన్నవించారు. ప్రస్తుత డీఎస్సీలో ఉర్దూ మీడియంలో ప్రభుత్వం కేటాయించిన ఎస్సీ, ఎస్టీ పోస్టులను డీరిజర్వ్ చేసి, అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. స్పందించిన మంత్రి వెంటనే వక్ఫ్బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేనితో ఫోన్లో మాట్లాడారు. అనంతరం ముస్లిం జేఏసీ ప్రతినిధులు వక్ఫ్బోర్డు చైర్మన్ వినతిపత్రం అందించారు. నాయకులు అబుబాకర్ ఖలీ ద్, ముఫ్తి ఘియాస్ మొహియుద్దీన్, మజర్ మొహియుద్దీన్ సాజిద్, ఫసియుద్దీన్ నవాబ్, జమీలొద్దీన్, సమద్ నవాబ్, ఎండీ.తాజొద్దీన్, అబ్బాస్ సమీ, ఎస్ఏ.మొహసీన్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి ‘పొన్నం’కు ముస్లిం జేఏసీ వినతి
Comments
Please login to add a commentAdd a comment