కరీంనగర్రూరల్: సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలో ప్రజాపాలనను అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రచారం కోసం విమర్శించడం సరికాదని కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆకారపు భాస్కర్రెడ్డి అన్నారు. గురువారం తీగలగుట్టపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను అమలు చేస్తూ బడుగు బలహీన వర్గాలకు ఎంతో ప్రయోజనం కలిగిస్తోందని తెలిపారు. అమృత్ టెండర్లలో సీఎం అక్రమాలకు పాల్పడ్డారన్న కేటీఆర్కు వ్యాఖ్యలను బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఉపేందర్రెడ్డే ఖండించారని పేర్కొన్నారు. హైడ్రా కూల్చివేతలతో పేదలకు నష్టం జరిగితే ప్రభుత్వం పునరావాసం కల్పిస్తోందని, కేటీఆర్ మాత్రం ఆక్రమణదారులకు అండగా నిలుస్తున్నారని ఆరోపించారు. ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబులు మంత్రివర్గంలో కీలకంగా వ్యవహరిస్తూ ముఖ్యమంత్రికి అండగా ఉంటున్నారని తెలిపారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మూల రవీందర్రెడ్డి, నాయకులు వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment