సత్తుపల్లిటౌన్/పెనుబల్లి: సత్తుపల్లిలో వంద పడకల ఆస్పత్రి భవ నం తుదిదశకు చేరినందున త్వరలోనే ప్రారంభించనున్నట్లు జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి డాక్టర్ కేసగాని రాజశేఖర్గౌడ్ తెలి పారు. సత్తుపల్లి ఏరియా ఆస్పత్రిని గురువారం తనిఖీ చేసిన ఆయన క్యాజు వాలిటీ, డయాలసిస్ కేంద్రం, ఆరోగ్యశ్రీ విభాగాల్లో చికిత్స పొందుతున్న వారితో మాట్లాడి వైద్యసేవలు, భోజనం నాణ్యతపై తెలుసుకున్నారు. వైద్యులు సురేష్ నారాయణ్, జయలక్ష్మి, నారాయణమ్మ, సాత్విక్, రాజేష్, ప్రణయ్, ఉద్యోగులు పాల్గొన్నారు. అలాగే, పెనుబల్లి ప్రభుత్వాస్పత్రిని సైతం తనిఖీ చేసిన డీసీహెచ్ఎస్ రాజశేఖర్ గౌడ్ మాట్లాడుతూ మరో ల్యాబ్ టెక్నీషియన్ను కేటాయించడంతో పాటు ప్లేట్లేట్ కౌంటింగ్ మిషన్ ఏర్పాటుకు కలెక్టర్ అనుమతి కోరినట్లు తెలిపారు. అలాగే 108, 104 వాహనాలు కేటాయిస్తామని చెప్పారు. కాగా, నెల వ్యవధిలో నాలుగో సారి డీసీహెచ్ఎస్ పెనుబల్లి ఆస్పత్రిని తనిఖీ చేయడంతో వైద్యసేవలు కొంత మేర మెరుగుపడ్డాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనంతరం ఔట్ సోర్సింగ్ వాచ్మెన్లకు వేతనాలు పెంచి నెలనెలా చెల్లించాలని పౌరహక్కుల సంఘం నాయకుడు కాటినేని శ్రీనివాసరావు కోరారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ కిరణ్, వైద్యులు రంజిత్కుమార్, వరుణ్, ఉద్యోగులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment