ఆర్చరీలో సత్తాచాటిన విజయవాడ డివిజన్‌ ఉద్యోగులు | - | Sakshi
Sakshi News home page

ఆర్చరీలో సత్తాచాటిన విజయవాడ డివిజన్‌ ఉద్యోగులు

Published Fri, Sep 27 2024 3:44 AM | Last Updated on Fri, Sep 27 2024 3:44 AM

ఆర్చరీలో సత్తాచాటిన విజయవాడ డివిజన్‌ ఉద్యోగులు

రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): ఆలిండియా రైల్వే ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో దక్షిణ మధ్య రైల్వే జోన్‌ స్వర్ణ పతకం కై వసం చేసుకుంది. ఈ నెల 23 నుంచి 25 వరకు చిత్తరంజన్‌ లోకోమోటివ్‌ వర్క్స్‌లో 14వ ఆలిండియా రైల్వే ఆర్చరీ చాంపియన్‌షిప్‌ పోటీలు జరిగాయి. వీటిలో విజయవాడ డివిజన్‌కు చెందిన వై.చరణ్‌రెడ్డి, జి.బాలాజీ నాగుల్‌మీరా, ఎస్‌.తిరుమలైకుమార్‌, గంగామోహన్‌ దక్షిణ మధ్య రైల్వే ఆర్చరీ టీంకు ప్రాతినిధ్యం వహించారు. దేశవ్యాప్తంగా జరిగిన పోటీల్లో డివిజన్‌ క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనపర్చి ఫైనల్‌ ఈవెంట్‌లో దక్షిణ మధ్య రైల్వే క్రీడాకారులు 218/240 స్కోర్‌తో నార్త్‌ వెస్ట్రన్‌ రైల్వే క్రీడాకారులను ఓడించి బంగారు పతకాన్ని కై వసం చేసుకున్నారు. ఆర్చరీలో జాతీయ స్థాయిలో జోన్‌కు గుర్తింపు తీసుకురావడానికి కృషి చేసిన డివిజన్‌ క్రీడాకారులను డీఆర్‌ఎం ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో డివిజనల్‌ స్పోర్ట్స్‌ ఆఫీసర్‌, సీనియర్‌ డీఎస్‌సీ వల్లేశ్వర బీటీతో పాటు పలు బ్రాంచ్‌ అధికారులు ఆర్చరీ విజేతలను అభినందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement