ఉపాధ్యాయ అర్హత పరీక్ష షురూ | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయ అర్హత పరీక్ష షురూ

Published Tue, May 21 2024 8:25 AM | Last Updated on Tue, May 21 2024 8:25 AM

-

విద్యారణ్యపురి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) విధానంలో సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. హనుమకొండలోని చైతన్య డీమ్డ్‌ యూనివర్సిటీ, ఎర్రగట్టుగుట్ట వద్ద గల ఐయాన్‌ డిజిటల్‌ జోన్‌, నోబెల్‌ టెక్నాలజీ అండ్‌ సొల్యూషన్స్‌, మోక్షిత కంప్యూటర్స్‌ పరీక్ష కేంద్రాల్లో టెట్‌ పేపర్‌–2 పరీక్షలు నిర్వహించారు. ఉదయం 9నుంచి 11:30 గంటల వరకు నిర్వహించిన ఐయాన్‌ డిజిటల్‌ పరీక్ష కేంద్రంలో 245మంది అభ్యర్థులకు గాను 214 మంది హాజరయ్యారు. అలాగే మధ్యాహ్నం 2 నుంచి 4:30 గంటల వరకు నిర్వహించిన పరీక్షకు 29మంది గైర్హాజరయ్యారు. చైతన్య డీమ్డ్‌ యూనివర్సిటీ పరీక్ష కేంద్రం, మోక్షిత కంప్యూటర్స్‌ పరీక్ష కేంద్రంలో పరీక్ష నిర్వహించారు. నోబెల్‌ పరీక్ష కేంద్రంలో ఉదయం 190మందికి 172 మంది హాజరయ్యారు. 18మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 190మందికి గాను 163 మంది హాజరు కాగా 27మంది గైర్హాజరయ్యారని సంబంధిత అధికారులు తెలిపారు. కాగా హనుమకొండ డీఈఓ ఎండీ అబ్దుల్‌హై పరీక్ష కేంద్రాలను సందర్శించి పరిశీలించారని సమాచారం. ఈనెల 21, 22, 24, 28, 29 తేదీల్లో పేపర్‌–2 పరీక్షలు కొనసాగుతాయి. ఈనెల 30, 31, జూన్‌ 1, 2 తేదీల్లో పేపర్‌–1 పరీక్షలు నిర్వహిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement