బాలికల ఓవరాల్‌ చాంపియన్‌ వరంగల్‌ | - | Sakshi
Sakshi News home page

బాలికల ఓవరాల్‌ చాంపియన్‌ వరంగల్‌

Published Fri, Sep 27 2024 2:14 AM | Last Updated on Fri, Sep 27 2024 2:14 AM

బాలికల ఓవరాల్‌ చాంపియన్‌ వరంగల్‌

వరంగల్‌ స్పోర్ట్స్‌: వరంగల్‌ పోచమ్మమైదాన్‌లోని కెమిస్ట్‌ భవన్‌లో రెండు రోజుల పాటు నిర్వహించిన 68వ పాఠశాల క్రీడల సమాఖ్య రాష్ట్ర స్థాయి అండర్‌–14 బాలబాలికల జూడో పోటీలు గురువారం ముగిశాయి. హోరాహోరీగా సాగిన ఈ పోటీల్లో బాలికల విభాగంలో ఓవరాల్‌ చాంపియన్‌గా వరంగల్‌ నిలవగా రన్నరప్‌గా కరీంనగర్‌ బాలికలు నిలి చారు. బాలుర విభాగంలో కరీంనగర్‌ చాంపియన్‌గా ట్రోఫీని దక్కించుకోగా, వరంగల్‌ క్రీడాకారులు రెండో స్థానంలో నిలిచారు. 25 కేజీల బరువులోపు విభాగంలో నల్లగొండ జిల్లాకు చెందిన కె. కిరణ్‌కుమార్‌ ఉత్తమ క్రీడాకారుడిగా పతకం అందుకున్నాడు. బాలికల విభాగంలో 40 కేజీల బరువులోపు కేటగిరీలో ప్రతిభ కనబరిచిన కరీంనగర్‌కు చెందిన బి. యశ్వంతిక ఉత్తమ క్రీడాకారిణిగా నిలిచింది.

200 మంది క్రీడాకారులు హాజరు..

23, 27, 32, 36, 40, 44 కేజీల బరువు లోపు కేటగిరీతో పాటు 44 కేజీల పైన బరువు కేటగిరీల్లో నిర్వహించిన పోటీలకు ఉమ్మడి పది జిల్లాల నుంచి 200 మంది క్రీడాకారులు హాజరైనట్లు ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యదర్శి దస్రూనాయక్‌ తెలిపారు. ఏడు కేటగిరీల్లో జరిగిన పోటీల్లో బంగారు పతకం సాధించిన ఏడుగురు బాలికలు, ఏడుగురు బాలు రను జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు వివరించారు. వచ్చే నెల (అక్టోబర్‌) 3 నుంచి 6వ తేదీ వరకు గుజరాత్‌లో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో తెలంగాణ నుంచి ప్రాతినిథ్యం వహిస్తారని పేర్కొన్నారు. కాగా, నవంబర్‌ రెండో వారంలో కజకిస్తాన్‌లో జరిగే ఏషియన్‌ కప్‌ చాంపియన్‌షిప్‌కు షేక్‌పేటకు చెందిన సీనియర్‌ క్రీడాకారుడు పి. రంగా భారత జట్టుకు ఎంపికై నట్లు కోచ్‌ రాము తెలిపారు. కార్యక్రమంలో జూడో ఫెడరేషన్‌ బాధ్యులు కై లాస్‌యాదవ్‌, సంతోశ్‌, రాజు, కిషన్‌ పీడీ, పీఈటీలు పాల్గొన్నారు.

బాలుర విభాగంలో కరీంనగర్‌

ఉత్తమ క్రీడాకారులుగా కిరణ్‌,

యశ్వంతిక

ముగిసిన రాష్ట్ర స్థాయి 68వ ఎస్‌జీఎఫ్‌ జూడో పోటీలు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement