పాలమూరు: ఉదండాపూర్ రిజర్వాయర్ కోసం ఎనిమిదేళ్ల క్రితం భూసేకరణ జరిగినా ఇప్పటి వరకు నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వకపోవడం సరికాదని, పరిహారం ఇచ్చిన తర్వాతే ప్రాజెక్టు పూర్తి చేయాలని ఎంపీ డీకే అరుణ అన్నారు. జిల్లాకేంద్రంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో గురువారం ఉదండాపూర్ భూనిర్వాసితులు ఆమెను కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పరిహారం ఇవ్వాలని అడిగే ప్రయత్నం చేసిన నిర్వాసితులను పోలీసులు బెదిరించడం సరికాదన్నారు. ముందస్తు అరెస్టులు స్టేషన్కు తీసుకెళ్లడంతో పాటు కేసులు పెడుతామని భయపెడుతున్నారని తెలిపారు. క్షేత్రస్థాయిలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు లక్ష్యం నెరవేరడం లేదన్నారు. గత ప్రభుత్వం డీపీఆర్ మార్చడం వల్లే ప్రాజెక్టు పనుల్లో ఆలస్యం జరుగుతుందన్నారు. జూరాల నుంచి నీళ్లు తీసుకునే స్థలాన్ని మార్చడం వల్ల ఈ ప్రాజెక్టు ఆలస్యమవుతుందన్నారు. నార్లాపూర్, లక్ష్మీదేవిపల్లి, ఉదండాపూర్ ఎక్కడ కూడా భూ నిర్వాసితులకు నష్టపరిహారం అందలేదన్నారు. బాధితులకు రూ.25 లక్షల ప్యాకేజీ ఇస్తామని చెప్పి ఇవ్వడం లేదని, కచ్చితంగా చెప్పిన ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
● జిల్లాకేంద్రంలోని కొత్తగంజ్ లక్ష్మీనర్సింహస్వామిని గురువారం ఎంపీ డీకే అరుణ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామికి ఎంపీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత బీజేపీ వ్యవస్థాపకుడు దీన్దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఆలయ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం న్యూగంజ్లో నిర్వహించిన బీజేపీ సభ్యత్వాల నమోదులో పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, రమేష్, పాండురంగారెడ్డి, జయశ్రీ, లక్ష్మీదేవి, యాదయ్య, కిరణ్కుమార్రెడ్డి, అంజయ్య, హరికృష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment