ఉత్సాహంగా రీజినల్‌ ఫారెస్ట్‌ స్పోర్ట్స్‌ మీట్‌ | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా రీజినల్‌ ఫారెస్ట్‌ స్పోర్ట్స్‌ మీట్‌

Published Fri, Sep 27 2024 1:18 AM | Last Updated on Fri, Sep 27 2024 1:18 AM

ఉత్సాహంగా రీజినల్‌ ఫారెస్ట్‌ స్పోర్ట్స్‌ మీట్‌

పాలమూరు: జిల్లాకేంద్రంలో రీజినల్‌ ఫారెస్ట్‌ స్పోర్ట్స్‌మీట్‌ ఉత్సాహంగా ప్రారంభమైంది. జిల్లామైదానంలో గురువారం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ శివేంద్రప్రతాప్‌లు ప్రారంభించారు. ఈ పోటీలకు మహబూబ్‌నగర్‌తో పాటు అచ్చంపేట, అమ్రాబాద్‌, గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్‌, నారాయణపేట ఫారెస్ట్‌ రీజియన్‌ 180 మంది అటవీశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. డీఎఫ్‌ఓ నుంచి డీట్‌ ఆఫీసర్‌ వరకు స్పోర్ట్స్‌ మీట్‌ ఉత్సాహంగా పోటీపడ్డారు. లాంగ్‌జంప్‌, హైజంప్‌, షాట్‌పుట్‌, జావెలిన్‌ త్రోతో పాటు పలు విభాగాల్లో పరుగుపందెం, 25 కిలోమీటర్ల మారథన్‌ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్‌ డీఎఫ్‌ఓ సత్యనారాయణ మాట్లాడుతూ దాదాపు పదేళ్ల తర్వాత అటవీ శాఖలో స్పోర్ట్స్‌ మీట్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్‌ 5, 6తేదీలలో రాష్ట్రస్థాయిలో, ఆ తర్వాత జాతీయ స్థాయిలో స్పోర్ట్స్‌ మీట్‌ ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో చీఫ్‌ కన్జర్వేటర్‌ శివాని డోగ్రా, అమ్రాబాద్‌ ఎఫ్‌డీఓ తిరుమల్‌రావు, అచ్చంపేట ఎఫ్‌డీఓ రాంమూర్తి, రాంమోహన్‌, డీఎస్‌డీఓ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement