మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రం మంచిర్యాలలో తొలిసారిగా రెండు లాడ్జీలపై కేసులు నమోదు చేసి శనివారం సీజ్ చేశారు. స్థానిక సీఐ బన్సి లాల్ వివరాలు వెల్లడించారు. బెల్లంపల్లి చౌర స్తా సమీపంలోని సాయినాథ్ రెసిడెన్సి అండ్ లాడ్జి, జన్మభూమి నగర్లోని వెంకటేశ్వర లాడ్జిలో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తూ ప్ర జల భద్రత, శాంతిభద్రతలకు విఘాతం కలిగి స్తూ, మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగి స్తున్నారని రామగుండం సీపీ శ్రీనివాసులు, ఆర్డీవో రాములు ఉత్తర్వుల మేరకు తహసీల్దార్ రఫతుల్లా హుస్సెన్ సమక్షంలో సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఇటీవల జరిపిన దాడుల్లో వ్యభి చారం నిర్వహిస్తూ పట్టబడడం, శాంతిభద్రతల దృష్ట్యా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. లాడ్జి యజమానులపై కేసులు నమోదు చేసి రిమాండ్ చేశామని, సాయినాథ్ రెసిడెన్సి యజమాని సిరిపురం శ్రీనివాస్ పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో కొందరు వ్యభిచారం దందా నడిపిస్తున్నారని, వారు పద్ధతి మార్చుకోవాలని, అసాంఘిక కార్యకలాపాలకు ఇళ్లు అద్దెకు ఇస్తే వారిపైనా కేసులు నమోదు చేసి సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ అజీజ్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment