మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో బుధవారం నుంచి గురువారం వరకు 17 మిల్లీమీటర్ల సగ టు వర్షపాతం నమోదైంది. మందమర్రి మండలంలో 70.3 మిల్లీమీటర్లు, కాసిపేటలో 31.5, దండేపల్లిలో 26.1, తాండూర్లో 27.4, వేమనపల్లిలో 24.4, హాజీపూర్లో 16.6, నస్పూర్లో 14.5, జన్నారంలో 14.5, జైపూర్లో 11.9, లక్సెట్టిపేటలో 11.8, మంచిర్యాలలో 11, భీమి నిలో 9.1, కోటపల్లిలో 10, నెన్నెలలో 5.7, కన్నెపల్లిలో 5.6, బెల్లంపల్లిలో 6.4, భీమారంలో 3.7, చెన్నూర్లో 3.7 మిల్లీమీటర్ల వర్షపా తం నమోదైంది. జిల్లా సాధారణ వర్షపాతం 925.6 మిల్లీమీటర్లు కురువాల్సి ఉండగా 984.6 మిల్లీమీటర్లుగా నమోదైంది. జిల్లా సగటున 6 శాతం అధికంగా కురిసింది.
వేమనపల్లిలో భారీ వర్షం
వేమనపల్లి: మండలంలో ఉరుములు, పిడుగులతో బుధవారం అర్ధరాత్రి నుంచి రెండు గంటలకు పైగా భారీ వర్షం కురిసింది. వేమనపల్లి శివారులోని పత్తి చేనులో రెండు పిడుగులు ప డ్డాయి. బొగుడగూడంలో సప్పిడె గట్టు ఇంటి ముందున్న విద్యుత్ స్తంభంపై పిడుగు పడింది. దీంతో స్తంభం పెచ్చులూడగా సమీప ఇళ్లలోని కూలర్లు, ఫ్యాన్లు, విద్యుత్ మీటర్లు చెడిపోయాయి. నీల్వాయి వాగు, ఎంచపాయవా గు ఉధృతంగా ప్రవహించాయి. చామనపల్లి వాగు ఉప్పొంగి ప్రవహించడంతో గ్రామ పంచాయతీతోపాటు బొమ్మెన, నెన్నెల మండలంలోని గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. మామడ, నీల్వాయి మధ్యలో ఉన్న ఒర్రె ఉ ప్పొంగి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment