● చెన్నూర్ సివిల్ కోర్టు జడ్జి రవి
భీమారం: చదువుకుంటేనే సమాజంలో ప్రత్యేక గుర్తింపు ఉంటుందని చెన్నూరు సివిల్ కోర్టు జడ్జి పర్వతపు రవి అన్నారు. స్థానిక కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయంలో గురువారం సాయంత్రం మండల న్యాయసేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రుల ఆశలను వమ్ము చేయకుండా శ్రద్ధగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. విద్యార్థులకు న్యాయస్థానాలతోపాటు చట్టాలపై అవగాహన కల్పించేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ప్రతీ విద్యార్థి చట్టాల గురించి తెలుసుకోవాలని, రోజు రోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాలపై జాగ్రత్త వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్సై భూమన్న, ప్రత్యేక అధికారి కనకలక్ష్మి, చెన్నూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేశ్ గిల్డా, న్యాయవాదులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment