ఇసుక రీచ్‌లను గుర్తించాలి | - | Sakshi
Sakshi News home page

ఇసుక రీచ్‌లను గుర్తించాలి

Published Fri, Sep 27 2024 1:24 AM | Last Updated on Fri, Sep 27 2024 1:24 AM

-

● జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

మంచిర్యాలఅగ్రికల్చర్‌: ప్రజల అవసరాలకు అనుగుణంగా జిల్లాలో ఇసుక రీచ్‌లను గుర్తించాలని జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. గురువారం కలెక్టర్‌ చాంబర్‌లో మైనింగ్‌, జిల్లా పంచాయతీ అధికారి, ఇతర అధికారులతో ఇసుక రీచ్‌ల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఇసుక రీచ్‌లు వర్షాల కారణంగా నిలిపి వేసినట్లు తెలిపారు. జిల్లాలో నూతన ఇసుక రీచ్‌లను గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో మైనింగ్‌ ఏడీ జగన్మోహన్‌రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరావు పాల్గొన్నారు.

కేవీ భవన నిర్మాణం పరిశీలన

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): హాజీపూర్‌ మండలం గుడిపేటలో కేంద్రియ విద్యాలయం(కేవీ) భవన నిర్మాణ పనులను కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ గురువారం పర్యవేక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన విద్య, క్రీడల్లో రాణించేలా ప్రోత్సాహం అందుతుందని అన్నారు. రూ.26 కోట్లపై చిలుకు నిధులతో సాగుతున్న భవన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసేలా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. ప్రిన్సిపాల్‌ జక్కుల ప్రసాద్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement