నల్లగొండ : ఎంపీడీవోలు, ఎంిపీఈవోలు, పంచాయతీ కార్యదర్శులు సామూహిక సెలవును విరమించుకున్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించారన్న కారణంతో గుర్రంపోడు ఎంపీడీవోతోపాటు, ఒక పంచారతీ కార్యదర్శిని కలెక్టర్ సస్పెండ్ చేయగా మరో ఉద్యోగిని విధుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. అయితే సస్పెన్షన్ను నిరసిస్తూ ఎంపీడీవోలు, ఎంపీఈవోలు, పంచాయతీ కార్యదర్శులు బుధవారం సామూహిక సెలవులో వెళ్తున్నామని జిల్లా అదనపు కలెక్టర్కు నోటీసు ఇచ్చారు. గురువారం సెలవులోనే ఉన్నారు. కలెక్టర్ నారాయణరెడ్డి సూచనల మేరకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పూర్ణచందర్ గురువారం జిల్లా కలెక్టరేట్లో ఎంిపీడీవోలు, ఎంపీఈవోలు, పంచాయతీ కార్యదర్శులతో చర్చలు జరిపారు. సస్పెన్షన్ ఎత్తి వేయాలని, విధుల నుంచి తొలగించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. పంచాయతీల్లో నిర్వహిస్తున్న ఆడిట్ను నిలిపివేయాలని, జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని కోరారు. కలెక్టర్ నారాయణరెడ్డి సెలవు నుంచి రాగానే.. ఉద్యోగులపై సస్పెన్షన్ ఎత్తివేస్తామని, విధుల నుంచి తొలగించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకుంటామని, ఆడిట్ కూడా నిలిపివేయిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఉద్యోగులు అంతా సామూహిక సెలవును విరమిస్తున్నట్లు ప్రకటించారు. శుక్రవారం విధులకు హాజరవుతామని వారు పేర్కొన్నారు. ఉద్యో గులతో జరిపిన ఈ చర్చల్లో జిల్లా పరిషత్ సీఈవో ప్రేమ్కరణ్రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) మురళి తదితరులు పాల్గొన్నారు.
ఫ ఎంపీడీవోలు, ఎంపీఈవోలు, పంచాయతీ కార్యదర్శులతో అదనపు కలెక్టర్ చర్చలు
ఫ సస్పెన్షన్ ఎత్తివేతకు హామీ
ఫ నేటి నుంచి విధులకు హాజరుకానున్న ఉద్యోగులు
Comments
Please login to add a commentAdd a comment