తిరుమలగిరి(నాగార్జునసాగర్): మండలంలో నెల రోజులుగా పైలట్ ప్రాజెక్టులో భాగంగా కాస్తు, కబ్జా ఆధారంగా భూ సర్వే చేపడుతున్నామని జిల్లా ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్ అన్నారు. గురువారం తిరుమలగిరి సాగర్ మండలంలో వివిధ గ్రామాల్లో చేపడుతున్న ఎంజాయ్మెంట్ సర్వేను రాత్రి సమయంలో ఆయన పరిశీలించి సర్వేయర్లకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన ఆర్ఓఆర్–2024 చట్టాన్ని తీసుకొచ్చే క్రమంలో మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిందని తెలిపారు. నెల రోజులుగా 17 మంది సర్వేయర్ల బృందం ఎంజాయిమెంట్ సర్వే చేపడుతున్నామని పేర్కొన్నారు. ఇప్పటివరకు వివిధ సర్వే నంబర్లలో సుమారు 8వేల ఎకరాలలో కాస్తు, కబ్జాలో ఉన్న వ్యవసాయ భూములను ఎంజాయ్మెంట్ సర్వే చేసినట్లు తెలిపారు. ఈ సర్వే అధికారులకు రైతులు సహకరించాలని కోరారు. ఆయన వెంట డీఈ రమణయ్య, యువజన కాంగ్రెస్ నేత మేరావత్ మునినాయక్, పలువురు సర్వేయర్లు పాల్గొన్నారు.
ఫ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్
Comments
Please login to add a commentAdd a comment