● ఎస్సార్బీసీ డివిజనల్ ఎస్ఈ
వరప్రసాద్
అవుకు: రిజర్వాయర్ పరిధిలోని గొల్లలేరు డ్రెయిన్ ఆక్రమణలను అడ్డుకుంటామని ఎస్సార్బీసీ డివిజనల్ ఎస్ఈ వరప్రసాద్ అన్నారు. తిమ్మరాజు చెరువు కట్ట రివిట్మెంట్ కుంగిన ప్రదేశాన్ని గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం మీడియా సమావేశంలో గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. ప్రస్తుతం రైతుల పంటలు సాగు చేశారని, వచ్చే ఏడాది మార్చిలో ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేస్తామన్నారు. పోలీసుల సహకారంతో ఆక్రమణలు అరికడతామన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి గొల్లేరు డ్రెయిన్, కట్టలను పూర్వస్థితికి తీసుకురావటానికి చర్యలు తీసుకుంటామన్నారు. గండికోట రిజర్వాయర్కు నీటిని విడుదల చేసేందుకు చెర్లోపల్లె గ్రామ సమీపంలో హెడ్ రెగ్యులేటర్ గేట్లను ఏర్పాటు చేశామన్నారు. అక్కడి నుంచి ఒకేసారి 30 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయవచ్చని తెలిపారు. అందువలన స్పిల్వే గేట్లను ఎత్తాల్సిన అవసరం రాదేమోనన్నారు. తిమ్మరాజు కట్ట రివిట్మెంట్ కుంగిన ప్రాంతంలో త్వరలో మరమ్మతు పనులు చేపడుతామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment