గోస్పాడు: సరైన ధ్రువపత్రాలు లేని రూ.8,55,250 విలువ చేసే ఎరువు, పురుగు మందులను తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు వ్యవసాయాధికారి స్వప్నికారెడ్డి తెలిపారు. మండలంలోని నెహ్రూనగర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ఎరువు, పురుగు మందుల దుకాణాలను గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రామంలోని లక్ష్మిగణపతి ఏజెన్సీస్, శ్రీలక్ష్మీనరసింహ, వెంకటేశ్వర, ఫర్టిలైజర్స్ అండ్ ఫెర్టిసైడ్స్ దుకాణాలను తనిఖీ చేసినట్లు తెలిపారు. మూడు దుకాణాల్లో పురుగు మందులు, ఎరువులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు సక్రమంగా లేకపోవడంతో అమ్మకాలను తాత్కాలికంగా నిలిపి వేసినట్లు తెలిపారు. ఎరువులు, పురుగు మందులను అధిక ధరలకు విక్రయిస్తే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment