ఉరేసుకొని లారీ డ్రైవర్‌ ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఉరేసుకొని లారీ డ్రైవర్‌ ఆత్మహత్య

Published Fri, May 24 2024 9:10 AM | Last Updated on Fri, May 24 2024 9:10 AM

-

షేర్‌మహ్మద్‌పేట క్రాస్‌ రోడ్‌(జగ్గయ్యపేట అర్బన్‌):చెట్టుకు ఉరి వేసుకొని లారీ డ్రైవర్‌ ఆత్మహత్య చేసుకున్న ఘటన జగ్గయ్యపేట పట్టణ సమీపంలోని షేర్‌మహ్మద్‌పేట క్రాస్‌ రోడ్‌ రావికంపాడు రెవెన్యూ పరిధిలోని పొలంలో చోటు చేసుకుంది. మృతుడి బంధువులు తెలియజేసిన వివరాల ప్రకారం... షేర్‌మహ్మద్‌పేట క్రాస్‌ రోడ్‌లో నివాసం ఉంటున్న యలక గోపిరెడ్డి (35) లారీ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. బుధవారం రాత్రి డ్యూటీకి అనిచెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చిన గోపిరెడ్డి షేర్‌ మహ్మద్‌పేట అడ్డరోడ్డు సమీపంలోని రావికంపాడు రెవెన్యూ పరిధిలోని పొలంలో ఉన్న వేపచెట్టుకు ఉరి వేసుకొని మృతి చెందాడు. గురువారం ఉదయం పొలం సమీపంలోని వారు చూసి మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గోపిరెడ్డి మృతికి గల కారణాలు తెలియరాలేదు. భార్య విజిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement