గాంధీనగర్(విజయవాడసెంట్రల్): సీఎం చంద్రబాబు నీచ రాజకీయంపై వైఎస్సార్ సీపీ ధర్మాగ్రహం వ్యక్తం చేసింది. టీటీడీ పవిత్రను శ్రీవారి ప్రసాదం విశిష్టతను, పేరు ప్రఖ్యాతలను మంటగలిపిన సీఎం చంద్రబాబు పాపాల ప్రక్షాళనకు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో శనివారం ఎన్టీఆర్ జిల్లాలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రబాబు పాపాలను ప్రక్షాళన చేద్దాం, వేంకటేశ్వర స్వామి ప్రతిష్టను అపవిత్రం చేస్తున్న చంద్రబాబు డౌన్డౌన్, శ్రీవారి లడ్డూపై అసత్య ప్రచారం చేస్తున్న చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ నీచ రాజకీయాలు చంద్రబాబు, టీడీపీ పార్టీకే చెల్లుబాటు అవుతాయన్నారు. దేవుడి ప్రసాదాన్ని కూడా రాజకీయాలకు వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల ప్రతిష్టను దెబ్బతీశారన్నారు. దుర్మార్గ రాజకీయాలు చేస్తున్న చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని వేడుకున్నారు.
విజయవాడ ఈస్ట్లో..
విజయవాడ ఈస్ట్లోని లబ్బీపేట శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమంలో డెప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, నేతలు పోతిన మహేష్, కొండారెడ్డి, తంగిరాల రామిరెడ్డి, నాయకులు ఆళ్ల చెల్లారావు తదితరులు పాల్గొన్నారు.
పశ్చిమలో..
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త, పొలిటికల్ ఎడ్వైజరీ కమిటీ సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వన్టౌన్ బ్రాహ్మణ వీధిలోని శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానం (కొత్తగుళ్లు)లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రీవారి లడ్డూపై విష ప్రచారం చేసిన వారికి ఈ జన్మలోనే శిక్ష తప్పదన్నారు. కార్యక్రమంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ రుహుల్లా, పోతిన మహేష్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
సెంట్రల్లో..
విజయవాడ సెంట్రల్లోని సత్యనారాయణపురం దాసాంజనేయ స్వామి ఆలయంలో నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ హిందూ ధర్మంపై మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదన్నారు. పుష్కరాల సమయంలో నలభై గుడులు కూల్చారన్నారు. బూట్లు వేసుకుని దేవుడికి పూజలు చేశారని గుర్తు చేశారు.
వైఎస్సార్ సీపీ ధర్మాగ్రహం చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని వేడుకోలు
Comments
Please login to add a commentAdd a comment