ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు బాపట్ల జిల్లా రేపల్లెకు చెందిన ఎ.విజయ్కుమార్ శనివారం వెండి కంచాన్ని కానుకగా సమర్పించారు. విజయ్కుమార్ కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఈఓ కె.ఎస్.రామరావును కలిసి 752 గ్రాముల వెండితో తయారు చేయించిన వెండి నగిషీ కంచాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించగా, వేద పండితులు ఆశీర్వదించారు. దాతలకు అమ్మవారి ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.
● కనకదుర్గమ్మకు విజయవాడకు చెందిన భక్తులు శనివారం నాలుగు తీర్ధపు గిన్నెలు, నాలుగు ఉద్ధరిణిలను కానుకగా సమర్పించారు. విజయవాడ గవర్నర్పేటకు చెందిన వాగిచర్ల శ్రీనివాస్, సునీత దంపతులు శనివారం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఈవో కె.ఎస్.రామరావును కలిసి సుమారు రెండు కిలోల వెండితో తయారు చేయించిన నాలుగు తీర్ధపు గిన్నెలను దేవస్థానానికి కానుకగా సమర్పించారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment