రాయగడ: మలేసియాలోని పెర్క్ ఎలీనా స్టేడియంలో ఈనెల 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరిగిన 20వ అంతర్జాతీయ కరాటే ఛాంపియన్ షిప్ పోటీల్లో రాయగడ యువకుడు సత్తా చాటాడు. భారత్ తరుపున ఈ పోటీల్లో పాల్గొన్న ఎల్.రమేష్ కుమార్ 50 కిలోల కేటగిరిలో బంగారు పతాకాన్ని సాధించాడు. మూడు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో మలేసియా, ఇండోనేషియా, సింగపూర్ వంటి దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. బంగారు పతకాన్ని సాధించి తిరిగి స్వగ్రామానికి మంగళవారం వచ్చిన రమేష్ కుమార్కు స్థానిక సాక్ష్యం అనే సంస్థ ఘనంగా స్వాగతం పలికింది. రైల్వేస్టేషన్లో ఆయనకు స్వాగతం పలికినవారిలో జిల్లా క్రీడాశాఖ అధికారి షేక్ ఆలీనర్, తెరువలిలోని ఇంఫా పరిశ్రమ పీఆర్వో శక్తి కుమార్ పాణిగ్రహి, బృందావన్ బెహర, శ్యామ్దాస్, దివ్యా పండ తదితరులు ఉన్నారు. దివ్యాంగుడైన రమేష్ కరాటే వంటి క్రీడలో అంతర్జాతీయ స్థాయిలో పతకం సాధించడంపై అందరూ అభినందనలు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment