తీరంలో అప్రమత్తం | - | Sakshi
Sakshi News home page

తీరంలో అప్రమత్తం

Published Fri, Sep 27 2024 2:22 AM | Last Updated on Fri, Sep 27 2024 2:22 AM

తీరంలో అప్రమత్తం

పూసపాటిరేగ: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ఆవర్తన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్‌ తాడ్డి గోవింద తెలియజేశారు. వర్షాల కారణంగా కొత్త నీరు సముద్రంలో చేరడంతో కడలి అల్ల కల్లోలంగా మారుతోందన్నారు. అలల ఉధృతికి సముద్రం ముందుకు రావడంతో తీరం కొన్ని చోట్ల కోతకు గురైంది. తీరంలో ఉన్న పడవలు, వలలను మత్స్యకారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. తీరప్రాంత గ్రామాలైన చింతపల్లి, పతివాడబర్రిపేట, తమ్మయ్యపాలెం, పులిగెడ్డ, తిప్పలవలస, కోనాడ గ్రామాల్లో మత్స్యకారులు వర్షాల కారణంగా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించాలని తహసీల్దార్‌ సూచించారు. సముద్రాన్ని ఆనుకుని ఉన్న తిప్పలవలస, చింతపల్లి, పతివాడబర్రిపేట, కోనాడ గ్రామాల్లో భారీవర్షాలు, గాలులు వీస్తున్నందున మత్స్యకారులు అప్రమత్తంగా వ్యవహరించాలని హెచ్చరించారు.

ఉవ్వెత్తున ఎగసి పడుతున్న కెరటాలు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement