పెద్దపల్లిరూరల్: యువత దేశ భవిష్యత్తు కోసం పనిచేయాలని ఇంటర్ నోడల్ అధికారిణి కల్పన అన్నారు. పెద్దపల్లి శివారు బందంపల్లిలో గురువారం ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు భారత త్రివిధ దళాల్లో కీలకమైన ఇండియన్ ఫోర్స్ ‘అగ్నివీర్ వాయు’ నియామకాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. దేశ రక్షణ రంగంలో ముందుకు వచ్చి పలు దేశాల్లో యువత పనిచేస్తున్నారని తెలిపారు. మన దేశం కోసం పనిచేసేందుకు ముందుకొచ్చి ఇలాంటి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వాయుసేన రంగంలో ఉద్యోగావకాశాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఆఫీసర్లు సందీప్, జైనా ఎయిర్ఫోర్స్, నౌకా దళాల్లో చేరేందుకు గల అవకాశాలను వివరించారు. ఇంటర్లో సైన్స్, నాన్ సైన్స్ సబ్జెక్టుల వారు 50శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలన్నారు. ప్రిన్సిపాల్ మైత్రేయి, రాంచంద్రారెడ్డి, రవీందర్రెడ్డితో పాటు పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు.
ఇంటర్ నోడల్ అధికారిణి కల్పన
Comments
Please login to add a commentAdd a comment