ఫెర్టిలైజర్సిటీ: రామగుండం ఎరువుల కర్మాగారంలో స్థానికేతరులను తొలగించి స్థానికులకు 80 శా తం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని గురువా రం రామగుండం నగరపాలక సంస్థ మేయర్ బి.అనిల్కుమార్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బొంతల రాజేశ్ ఆధ్వర్యంలో ఆర్ఎఫ్సీఎల్ సీజీఎం వోఆండ్ఎం ఉదయ్ రాజహంసకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బొంతల రాజేశ్ మాట్లాడుతూ రామగుండం ఎరువుల కర్మాగారంతో పునర్ ప్రారంభించిన సమయంలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన యాజమాన్యం స్థానికేతరులకు ఉద్యోగ అవకాశాలను కల్పించి స్థానిక నిరుద్యోగ యువతను మోసం చేసిందని అన్నారు. ఆర్ఎఫ్సీ ఎల్ నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితులు, ఆర్ఎఫ్సీఎల్ కర్మాగారం నుంచి వెలుబడుతున్న కాలుష్యంతో ప్రభావిత ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహంకాళి స్వామి, పెద్దల్లి ప్రకాశ్, మారెల్లి రాజిరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment