గోదావరిఖని: సీఎంపీఎఫ్ కుంభకోణంపై విచారణ జరిపించాలని బీఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్త య్య డిమాండ్ చేశారు. గురువారం ఆర్జీ–2 జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి డీజీఎం(పర్సనల్)కు వినతిపత్రం అందజేశారు. సింగరేణి సంస్థ తమ వాస్తవ లాభాల్లో 33శాతం వాటా చెల్లించాలని అన్నారు. బొగ్గుగని కార్మికుల సమస్యల పరిష్కారానికి బీఎంఎస్ నిరంతరం కృషి చేస్తోందన్నారు. కార్మికునికి 250గజాల భూమి అప్పగించి రూ.50లక్షలు వడ్డీలేని రుణం అందజేసి సొంతింటి కల నిజం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సారంగపాణి, నాయకులు మాదాసి రవీందర్, వడ్డేపల్లి కుమారస్వామి, ప్రమోద్, అరుకాల ప్రసాద్, రమేష్, కర్రావుల మ హేశ్, యాదగిరి నరేశ్, శివాజీ, నర్సయ్య, మల్లికా ర్జున్, శంకర్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment