IND vs AUS: సిడ్నీ వన్డేలో భారత్‌ ఘన విజయం | IND Vs AUS 2025 3rd ODI Match Toss, Playing XIs, Live Score Updates And Highlights In Telugu | Sakshi
Sakshi News home page

IND vs AUS: సిడ్నీ వన్డేలో భారత్‌ ఘన విజయం

Oct 25 2025 8:34 AM | Updated on Oct 25 2025 3:50 PM

IND vs AUS 2025 3rd ODI: Toss Playing XIs Updates And Highlights

Australia vs India, 3rd ODI Updates And Highlights: సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌లో టీమిండియాతో నామమాత్రపు మూడో వన్డేలో  టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా..  తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.  భారత బౌలర్ల ధాటికి 236 పరుగులకే ఆలౌట్‌ అయింది. భారత్‌ లక్ష్యం: 237 పరుగులుగా నిర్దేశించింది.

భారత్‌ ఘన విజయం..
సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో 9 వికెట్ల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించింది. దీంతో వైట్‌ వాష్‌ నుంచి టీమిండియా తప్పించుకుంది. 237 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ కేవలం ఒక్క వికెట్‌ మాత్రం కోల్పోయి చేధించింది. లక్ష్య చేధనలో సీనియర్‌ ద్వయం రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లిలు అద్బుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. రోహిత్‌ శర్మ సూపర్‌ సెంచరీతో చెలరేగగా.. కోహ్లి 74 పరుగులతో సత్తాచాటాడు. వీరిద్దరూ ఆఖరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్‌ను ఫినిష్‌ చేశారు.

విజయం దిశగా
32.6: జంపా బౌలింగ్‌లో సింగిల్‌ తీసి సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్‌ శర్మ. వన్డేల్లో రోహిత్‌కు ఇది 33వ శతకం. 33 ఓవర్లలో టీమిండియా స్కోరు 200-1. రోహిత్‌ 100, కోహ్లి 59 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా విజయానికి 37 పరుగుల దూరంలో ఉంది.

కోహ్లి హాఫ్‌ సెంచరీ..
వరుసగా రెండు మ్యాచ్‌లలో డకౌటైన విరాట్‌ కోహ్లి.. సిడ్నీ వన్డేలో మాత్రం సత్తాచాటాడు. కోహ్లి 56 బంతుల్లో తన హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. టీమిండియా స్కోరు: 178-1(29).

రోహిత్‌ శర్మ హాఫ్‌ సెంచరీ..
సిడ్నీ వ‌న్డేలోనూ రోహిత్ శ‌ర్మ అద్భుత‌మైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. 63 బంతుల్లో త‌న హాఫ్ సెంచ‌రీని పూర్తి చేసుకున్నాడు. 23 ఓవ‌ర్లు ముగిసే సరికి భార‌త్ వికెట్ న‌ష్టానికి 130 ప‌రుగులు చేసింది. క్రీజులో రోహిత్‌తో పాటు కోహ్లి(36) ఉన్నాడు.

తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌
10.2: గిల్‌ (24) రూపంలో టీమిండియా తొలి వికెట్‌ కోల్పోయింది. హాజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ క్యారీకి క్యాచ్‌ ఇచ్చి గిల్‌ పెవిలియన్‌ చేరాడు. విరాట్‌ కోహ్లి క్రీజులోకి వచ్చాడు. టీమిండియా స్కోరు: 70-1(10.3). రోహిత్‌ 32 పరుగులతో ఉన్నాడు. కోహ్లికి సిడ్నీలో ఇదే ఆఖరి మ్యాచ్‌ అన్నట్లుగా ప్రేక్షకులు స్టాండింగ్‌ ఓవియేషన్‌ ఇస్తూ ఎమోషనల్‌ అయ్యారు.

పవర్‌ ప్లేలో టీమిండియా స్కోరు: 68-0 (10).
గిల్‌ 24, రోహిత్‌ 31 పరుగులతో ఉన్నారు.

నిలకడగా ఆడుతున్న రోహిత్‌, గిల్‌
237 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది టీమిండియా. ఆది నుంచే ఆసీస్‌ బౌలర్లు కట్టడి చేయగా.. ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శుబ్‌మన్‌ గిల్‌ ఆచితూచి ఆడుతున్నారు. 8 ఓవర్లలో టీమిండియా స్కోరు 48-0. రోహిత్‌ 25, గిల్‌ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు.

హాజిల్‌వుడ్‌ బౌల్డ్‌
46.4: హర్షిత్‌ రాణా బౌలింగ్‌లో హాజిల్‌వుడ్‌ (0) బౌల్డ్‌ కావడంతో ఆసీస్‌ పదో వికెట్‌ కోల్పోయింది. ఫలితంగా 236 పరుగులకే ఆలౌట్‌ అయింది.

తొమ్మిదో వికెట్‌ డౌన్‌
46.2: హర్షిత్‌ రాణా బౌలింగ్‌లో కోహ్లికి క్యాచ్‌ ఇచ్చిన కన్నోలి (23). దీంతో ఆసీస్‌ తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. స్కోరు: 236-9(46.2). హాజిల్‌వుడ్‌ క్రీజులోకి రాగా... జంపా రెండు పరుగులతో ఉన్నాడు.
 

ఎనిమిదో వికెట్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా
43.5: ప్రసిద్‌ కృష్ణ బౌలింగ్లో రోహిత్‌ శర్మకు క్యాచ్‌ ఇచ్చి ఎనిమిదో వికెట్‌గా వెనుదిరిగిన నాథన్‌ ఎల్లిస్‌ (16). స్కోరు: 223-8(43.5). కన్నోలి 13 పరుగులతో ఉన్నాడు. జంపా క్రీజులోకి వచ్చాడు.

ఏడో వికెట్‌ డౌన్‌
38.4: కుల్దీప్‌ బౌలింగ్‌లో ఏడో వికెట్‌గా వెనుదిరిగిన స్టార్క్‌ (2). కుల్దీప్‌ అద్భుత బంతితో స్టార్క్‌ను బౌల్డ్‌ చేశాడు. ఆసీస్‌ స్కోరు: 201-7(38.4). నాథన్‌ ఎల్లిస్‌ క్రీజులోకి రాగా.. కన్నోలి 8 పరుగులతో ఉన్నాడు.

ఆరో వికెట్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా
ఓవెన్‌ (1) రూపంలో ఆసీస్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. హర్షిత్‌ బౌలింగ్‌లో రోహిత్‌కు క్యాచ్‌ ఇచ్చి ఓవెన్‌ పెవిలియన్‌ చేరాడు. స్టార్క్‌ క్రీజులోకి రాగా.. 38 ఓవర్లలో ఆసీస్‌ స్కోరు: 199-6(38). కన్నోలి 7, స్టార్క్‌ ఒక పరుగుతో ఉన్నారు. 

ఐదో వికెట్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా
36.2: వాషింగ్టన్‌ సుందర్‌ బౌలింగ్‌లో హాఫ్‌ సెంచరీ వీరుడు మ్యాట్‌ రెన్షా (56) లెగ్‌ బిఫోర్‌ వికెట్‌గా వెనుదిరిగాడు. అయితే, ఎల్‌బీడబ్ల్యూ విషయంలో ఆసీస్‌ రివ్యూకు వెళ్లగా.. బంతి లెగ్‌ స్టంప్‌ను హిట్‌ చేస్తున్నట్లుగా తేలింది. దీంతో ఆసీస్‌ ఐదో వికెట్‌ కోల్పోగా.. మిచెల్‌ ఓవెన్‌ క్రీజులోకి వచ్చాడు. 37 ఓవర్లలో ఆసీస్‌ స్కోరు: 197-5. కన్నోలి 6 పరుగులతో ఉన్నాడు.

నాలుగో వికెట్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా
33.4: హర్షిత్‌ రాణా బౌలింగ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌కు క్యాచ్‌ ఇచ్చి క్యారీ (24) అవుట్‌. అద్భుతమైన క్యాచ్‌తో మెరిసి టీమిండియా కీలక వికెట్‌ పొందడంలో తన వంతు పాత్ర పోషించిన శ్రేయస్‌ గాయపడినట్లు తెలుస్తోంది. కూపర్‌ కన్నోలి క్రీజులోకి రాగా 34 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా స్కోరు: 184-4. రెన్షా అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.

మూడో వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌
22.3: వాషింగ్టన్‌ సుందర్‌ బౌలింగ్‌లో కోహ్లికి క్యాచ్‌ ఇచ్చి మాథ్యూ షార్ట్‌ అవుటయ్యాడు. 41 బంతుల్లో 30 పరుగులు చేసి మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. అలెక్స్‌ క్యారీ క్రీజులోకి వచ్చాడు. 24 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్‌ మూడు వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. రెన్షా 22, క్యారీ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు.

 

రెండో వికెట్‌ డౌన్‌
15.1: మార్ష్‌ (41) రూపంలో ఆస్ట్రేలియా రెండో వికెట్‌ కోల్పోయింది. అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో మార్ష్‌ బౌల్డ్‌ అయ్యాడు. మ్యాట్‌ రెన్షా క్రీజులోకి రాగా.. షార్ట్‌ 11 పరుగులతో ఆడుతున్నాడు. స్కోరు: 92-2 (16)

తొలి వికెట్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా
9.2: సిరాజ్‌ బౌలింగ్‌లో ప్రసిద్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగిన ట్రావిస్‌ హెడ్‌. 25 బంతులు ఎదుర్కొని 29 పరుగుల చేసిన హెడ్‌ అవుట్‌. ఫలితంగా తొలి వికెట్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా. మాథ్యూ షార్ట్‌ క్రీజులోకి రాగా.. మార్ష్‌ 25 పరుగులతో ఆడుతున్నాడు. పది ఓవర్లలో ఆసీస్‌ స్కోరు: 63-1

ఐదు ఓవర్లలో ఆస్ట్రేలియా స్కోరు: 26-0(5)
మిచెల్‌ మార్ష్‌ 6, ట్రావిస్‌ హెడ్‌ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. సిరాజ్‌ భారత బౌలింగ్‌ అటాక్‌ ఆరంభించగా.. హర్షిత్‌ రాణా సిరాజ్‌ కలిసి ఆల్టర్నేటివ్‌ ఓవర్లలో బరిలోకి దిగాడు.

ఒక మార్పుతో బరిలోకి
ఈ సందర్భంగా ఆసీస్‌ కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌ మాట్లాడుతూ.. ‘‘వికెట్‌ బాగుందనిపిస్తోంది. అందుకే ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకున్నాం. యువ ఆటగాళ్లు రాణించడం మా జట్టుకు శుభపరిణామం. 3-0తో సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ చేసే సువర్ణావకాశం మా ముందుంది. 

గత మ్యాచ్‌లో కూపర్‌ కన్నోలి అద్భుతంగా ఆడాడు. ఈ వన్డేలో మేము ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నాం. జేవియర్‌ బార్ట్‌లెట్‌ స్థానంలో నాథన్‌ ఎల్లిస్‌ జట్టులోకి వచ్చాడు’’ అని తెలిపాడు.

టీమిండియాలో రెండు మార్పులు
మరోవైపు.. టీమిండియా గత మ్యాచ్‌లలో చేసిన పొరపాటును సరిచేసుకున్నట్లు అనిపిస్తోంది. రెండు వన్డేల్లో బెంచ్‌కే పరిమితం చేసిన చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌కు ఎట్టకేలకు పిలుపునిచ్చింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ తమ తుదిజట్టులో రెండు మార్పులు చేసింది. అర్ష్‌దీప్‌ సింగ్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి స్థానాల్లో కుల్దీప్‌ యాదవ్‌, ప్రసిద్‌ కృష్ణలను ఎంపిక చేసుకుంది.

టీమిండియా వర్సెస్‌ ఆస్ట్రేలియా మూడో వన్డే తుదిజట్లు
టీమిండియా
రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ (కెప్టెన్‌), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్‌ కీపర్‌), వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్‌ కృష్ణ.

ఆస్ట్రేలియా
మిచెల్ మార్ష్(కెప్టెన్‌), ట్రావిస్ హెడ్, మాథ్యూ షార్ట్, మ్యాట్ రెన్షా, అలెక్స్ క్యారీ(వికెట్‌ కీపర్‌), కూపర్ కన్నోలీ, మిచెల్ ఓవెన్, నాథన్ ఎల్లిస్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement