రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

Published Mon, Jun 17 2024 12:44 AM | Last Updated on Mon, Jun 17 2024 12:44 AM

రైలు నుంచి జారిపడి  వ్యక్తి మృతి

ధర్మవరం అర్బన్‌: స్థానిక రైల్వేస్టేషన్‌లో ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. వివరాలు.. ధర్మవరంలోని తారకరామాపురానికి చెందిన నాగరాజు (42) రైళ్లలో తిరుగుతూ తినుబండారాల విక్రయం ద్వారా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం తినుబండారాలను తీసుకుని స్థానిక రైల్వే స్టేషన్‌కు చేరుకున్న ఆయన అప్పటికే ప్లాట్‌ఫాం నుంచి బయలుదేరిన తిరుపతి రైలు ఎక్కే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో కాలు జారడంతో రైలు బోగికి ప్లాట్‌ఫాంకు మధ్యలో చిక్కుకుని తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement