వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురి బలవన్మరణం | - | Sakshi
Sakshi News home page

వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురి బలవన్మరణం

Published Mon, Jun 17 2024 12:46 AM | Last Updated on Mon, Jun 17 2024 12:46 AM

-

జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు బలవన్మరణానికి పాల్పడ్డారు. అనారోగ్యాన్ని తాళలేక ఇద్దరు, కుటుంబసభ్యులు తన బాగోగులు చూడడం లేదన్న బాధతో మరొకరు ఆత్మహత్య చేసుకున్నారు.

సోమందేపల్లి: మండలంలోని ఓబుళదేవరపల్లి గ్రామానికి చెందిన లక్ష్మయ్య(80) ఆత్మహత్య చేసుకున్నాడు. కొంతకాలం క్రితం భార్య మృతి చెందింది. అప్పటి నుంచి ఒంటరిగా ఉన్న లక్ష్మయ్య... తనకున్న ముగ్గురు కుమారులు బాగోగులు పట్టించుకోకపోవడంతో జీవితంపై విరక్తి పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఆదివారం ఇంట్లోనే పైకప్పుకు తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

ఎన్‌పీకుంట: మండలంలోని పెడబల్లి గ్రామానికి చెందిన వివాహిత మల్లిక (28) ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... శనివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో తాళలేక ఊయల వేసిన చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి ఫాతిమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ శ్రీధర్‌ తెలిపారు. కాగా మృతురాలికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.

పెనుకొండ: స్థానిక రైల్వే రోడ్డు మార్గంలో నివాసముంటున్న చాకలి శివయ్య (66) ఆత్మహత్య చేసుకున్నాడు. కొంత కాలంగా ఆయన క్షయ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ నేపధ్యంలో ఈ నెల 14న ఉదయం 10 గంటలకు ఇంట్లోనున్న కత్తి తీసుకుని రైల్వే బ్రిడ్జి కిందకు చేరుకుని గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం దుర్వాసన రావడంతో పాటు స్థానికులు అటుగా వెళ్లి చూశారు. కుళ్లిన మృతదేహాన్ని కుక్కలు పీక్కు తిన్నాయి. సమాచారం అందుకున్న ఎస్‌హెచ్‌ఓ దాదాపీర్‌ అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement