తిరుమలగిరి (తుంగతుర్తి): సమాజంలో ఎన్నో సంవత్సరాలుగా ట్రాన్స్జెండర్లు వివక్షను ఎదుర్కొంటున్నారు. పనికి వెళదామంటే ఎవరూ పిలవని పరిస్థితి. చాలా మంది ఊరిని, కన్న వారిని వదిలేసి ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. పట్టణాలు, నగరాల్లో భిక్షాటన చేస్తూ బతుకు వెళ్లదీస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వారు గౌరవంగా జీవించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఉపాధి హామీ పథకంలో పనులు కల్పించాలని మార్గదర్శకాలను జారీ చేసింది.
మార్గదర్శకాలు ఇలా..
● ఆధార్ ఆధారంగా జాబ్ కార్డు ఇవ్వాలి.
● ఒక గ్రామంలో ఇద్దరి కంటే ఎక్కువ మంది ఉంటే గ్రూపు ఏర్పాటు చేయాలి. లేదంటే వ్యక్తిగతంగా ఒకే పని కల్పించాలి.
● పని ప్రదేశంలో వారిపై వివక్ష చూపొద్దు.
● సమస్యల పరిష్కారానికి మండల, జిల్లా స్థాయిలో నోడల్ అధికారిని నియమించాలి.
● సొంత ఊరిలోనే ఉపాధి పొందేందుకు జాబ్ కార్డు మంజూరు చేయాలి.
18 ఏళ్లు నిండిన వారందరికీ జాబ్కార్డులు
ఓటరు జాబితా ప్రకారం జిల్లాలో 100 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. వీరితో పాటు జాబితాలో పేర్లు లేని వారు సైతం ఉన్నారు. 18 ఏళ్లు నిండిన వారందరికీ జాబ్ కార్డు ఇవ్వనున్నారు.
ఫ సమాజంలో గౌరవంగా
జీవించేలా ప్రభుత్వం చర్యలు
ఫ ఉన్న ఊరిలో ఉపాధి పని
కల్పించేలా ప్రణాళిక
ఫ మార్గదర్శకాలు జారీ
ఫ 100మందికి ప్రయోజనం
కలిగే అవకాశం
జాబ్కార్డులు ఇస్తాం
గ్రామాల్లో ట్రాన్స్జెండర్లు ఎంత మంది ఉన్నారో గుర్తిస్తాం. అడిగిన వారందరికీ జాబ్ కార్డులు ఇస్తాం. పని ప్రదేశంలో కావాల్సిన వసతులు ఉంటాయి. వారిపై వివక్ష చూపకుండా మిగతా కూలీలకు అవగాహన కల్పిస్తాం.
– అప్పారావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి.
Comments
Please login to add a commentAdd a comment