చేవెళ్ల: మతిస్థిమితం లేని ఓ మహిళ ఫిట్స్తో మృతి చెందిన సంఘటన శంకర్పల్లి మండలంలోని మోకిల పోలీస్స్టేషన్ పరిధిలోని మహారాజ్పేటలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్పల్లి మండలంలోని మహారాజ్పేట్ గ్రామానికి చెందిన వెంకటయ్య, లక్ష్మిలకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వీరిలో పెద్ద కూతురు సరిత(25)ను నాలుగేళ్ల క్రితం షాబాద్ మండలంలోని మద్దూర్ గ్రామానికి చెందిన రమేశ్కి ఇచ్చి వివాహం చేశారు. ఆమె మూడు సంవత్సరాలుగా మతిస్థిమితం లేకుండా కుటుంబసభ్యులకు దూరంగా ఉన్నారు. ఇటీవలే సరితను తల్లిదండ్రులు గుర్తించి ఇంటికి తీసుకువచ్చారు. వచ్చిన వారం రోజులు కూడా కాకముందే ఫిట్స్తో ఆమె మృతి చెందారు. కూతురు ఇంటికి వచ్చిందనే సంతోషం కూడా తీరకముందే తల్లిదండ్రులకు తీరని వేదన మిగిలింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment