ఇబ్రహీంపట్నం రూరల్: అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా ఝుళిపించారు. శుక్రవారం ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని టీసీఎస్ ఎదురుగా ఉన్న అక్రమ నిర్మాణాలను కమిషనర్ బాలకృష్ణ, టీపీఓ అబీబ్ ఉన్నీసాలు సిబ్బందితో కలిసి కూల్చివేశారు. జేసీబీలతో నిర్మాణాలు కూల్చగా, డ్రిల్లింగ్ మిషన్లను పెట్టి ఇంటిపై కప్పులను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ కమిషనర్ బాలకృష్ణ మాట్లాడుతూ.. మున్ముందు అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే సహించేది లేదని హెచ్చరించారు. మున్సిపాలిటీలో నిర్మాణాలు చేపట్టడానికి సులభతర పద్ధతుల్లో అనుమతులు వస్తాయన్నారు. ప్రతి ఒక్కరూ అనుమతులు తీసుకొని నిర్మాణాలు చేపట్టాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment