వరద బాధితులకు కో–ఆపరేటివ్‌ బ్యాంకు రూ. 25 లక్షల విరాళం | - | Sakshi
Sakshi News home page

వరద బాధితులకు కో–ఆపరేటివ్‌ బ్యాంకు రూ. 25 లక్షల విరాళం

Published Fri, Sep 27 2024 2:00 AM | Last Updated on Fri, Sep 27 2024 2:00 AM

వరద బాధితులకు కో–ఆపరేటివ్‌ బ్యాంకు రూ. 25 లక్షల విరాళం

సీతమ్మధార: వరద బాధితుల సహాయార్ధం ముఖ్యమంత్రి సహాయనిధికి ది విశాఖపట్నం కోఆపరేటివ్‌ బ్యాంకు లిమిటెడ్‌ రూ.25 లక్షలు విరాళంగా అందించింది. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కో ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్స్‌ అండ్‌ క్రెడిట్‌ సొసైటీస్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో ది విశాఖపట్నం కోఆపరేటివ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌(రూ.25లక్షలు)తో పాటు మరో 13 అర్బన్‌ బ్యాంకులు రూ.52.90 లక్షలు సహాయంగా అందించాయి. ఈ మొత్తాన్ని చెక్‌ రూపంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకి ది విశాఖపట్నం కో ఆపరేటివ్‌ బ్యాంకు లిమిటెడ్‌ చైర్మన్‌, ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కోఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్స్‌ అండ్‌ క్రెడిట్‌ సొసైటీస్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్‌ కార్యదర్శి చలసాని రాఘవేంద్రరావు, అధ్యక్షుడు చిట్టూరి రవీంద్ర, ఉపాధ్యక్షుడు ఎస్‌.కె.అబ్దుల్‌ జీలాని, ఇతర ప్రతినిధులు అందజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement