సాక్షి, విశాఖపట్నం: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా జిల్లా టూరి జం కౌన్సిల్ నిర్వహించిన ఛాయాచిత్రాల పోటీల్లో ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్ ఎండీ నవాజ్ తీసిన చిత్రానికి మొదటి బహుమతి లభించింది. కలెక్టర్ హరేందిర ప్రసాద్ చైర్మన్గా వ్యవహరిస్తున్న డీటీసీ విశాఖ ఆధ్వర్యంలో టూరిజం అండ్ పీస్ పేరిట ఛాయాచిత్రాల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ‘ఫేసెస్ ఆఫ్ పీస్’ విభాగంలో సింహాచలం గిరి ప్రదక్షిణ సందర్భంగా ఎండీ నవాజ్ తీసిన చిత్రం మొదటి బహుమతికి ఎంపికై ంది. వీఎంఆర్డీఏ చిల్ట్రన్ ఎరీనాలో శుక్రవారం జరిగే వేడుకల్లో ఆయన ఈ అవార్డును స్వీకరించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment