సీతంపేట: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తూ విద్యార్థినిల పట్ల అసభ్యకరంగా ప్రవరిస్తున్న ఉపాధ్యాయుడు, వాచ్మేన్పై పోక్సో కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ వై.అమ్మన్నరావు తెలిపారు. పాఠశాలలో పని చేస్తున్న ఓ సబ్జెక్టు ఉపాధ్యాయుడు విద్యార్థినిలపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని ఓ విద్యార్థిని కుటుంబ సభ్యులు శుక్రవారం రాత్రి ఫిర్యాదు చేశారని తెలిపారు. అదే పాఠశాలలో పనిచేస్తున్న వాచ్మేన్పై కూడా ఇలాంటి ఆరోపణలతో ఫిర్యాదు అందడంతో అతనిపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. పాఠశాలకు వెళ్లి వివరాలు సేకరించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment