ఉత్తమ రైతుగా శ్రీనివాసరావు
గుర్ల: మండలంలోని జమ్ముపేటకు చెందిన కురుమునెల్లి శ్రీనివాసరావు జిల్లా ఉత్తమ రైతు అవార్డు అందుకున్నారు. నాగపూర్లో ఆదివారం నిర్వహించిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శనలో తను పండించిన పంటలను ప్రదర్శించారు. ప్రకృతి వ్యవసాయంలో పద్మశ్రీ సాధించిన సీవీ రెడ్డి, భూషణ్త్యాగి, ప్రకృతి వ్యవసాయం రీజినల్ డైరెక్టర్ రాజ్పూత్ చేతులు మీదుగా సోమవారం అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పంటలు సాగుచేయడం వల్ల తక్కువ పెట్టుబడితో ఆరోగ్యకర పంటలు పండించవచ్చన్నారు. ప్రకృతి వ్యవసాయంలో జిల్లా ఉత్తమ రైతుగా ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment