‘గణప సముద్రం’ పనులు అడ్డుకున్న రైతులు | - | Sakshi
Sakshi News home page

‘గణప సముద్రం’ పనులు అడ్డుకున్న రైతులు

Published Fri, Sep 27 2024 12:40 AM | Last Updated on Fri, Sep 27 2024 12:40 AM

‘గణప సముద్రం’ పనులు అడ్డుకున్న రైతులు

ఖిల్లాఘనపురం: గణప సముద్రం రిజర్వాయర్‌లో భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు ఎంత పరిహారం ఇస్తున్నారు.. అలుగు ఎత్తు ఎంత.. ఎన్ని ఎకరాలు ముంపునకు గురవుతున్నాయి.. గ్రామంలోకి నీళ్లు వస్తే ఎవరు బాధ్యత తీసుకుంటారు.. తదితర విషయాలపై సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడిన తర్వాతే పనులు చేపట్టాలని గురువారం ఐబీ ఏఈ వెంకటేశ్వర్లును రైతులు నిలదీయడంతో పాటు పనులు అడ్డుకున్నారు. అలుగును 2.50 ఫీట్లు పెంచుతున్నారని తెలియడంతో గురువారం రైతులందరూ అక్కడికి చేరుకొని పనులు నిలిపివేయాలని ఏఈని కోరారు. రిజర్వాయర్‌ పూర్తిస్థాయిలో నిండితే జిల్లాకేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారి వరకు నీరు నిలుస్తోందని.. ఎత్తు పెంచితే ఏకంగా గ్రామంలోకి చేరుతాయని అనుమానం వ్యక్తం చేశారు. ప్రతి ఎకరాకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తమకు ఏ విషయం తెలుపకుండా పనులు ఎలా చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాస్థాయి అధికారులు సమావేశం నిర్వహించి పూర్తి సమాచారం తెలిపిన తర్వాతే పనులు చేపట్టాలని పట్టుబట్టడంతో నిలిపివేశారు. పూర్తి వివరాలను జిల్లా అధికారులకు విన్నవిస్తామని ఏఈ వెంకటేశ్వర్లు తెలిపారు.

పరిహారం ఎంతో

ప్రకటించాలని డిమాండ్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement