శివున్ని తలచి.. నిప్పులపై నడిచి | - | Sakshi
Sakshi News home page

శివున్ని తలచి.. నిప్పులపై నడిచి

Published Fri, Feb 28 2025 1:09 AM | Last Updated on Fri, Feb 28 2025 1:09 AM

-

ఎల్కతుర్తి: మండలంలోని సూరారం గ్రామ శివారు సింగరాయ విశ్వేశ్వరాలయంలో శివరాత్రి వేడుకలు అంబరాన్నంటాయి. గురువారం తెల్లవారుజామున అగ్ని గుండాల ప్రవేశం జరిగింది. జాగారం చేసిన భక్తులు దేవదేవున్ని తలుస్తూ నిప్పులపై నడిచి భక్తిని చాటుకున్నారు. మండల కేంద్రంలోని వీరభద్రస్వామి శివాలయంలో అన్నపూజ జరిగింది. నెయ్యి, తేనె, పెరుగన్నం కలిపిన నైవేద్యంతో శివలింగాన్ని అలంకరించారు. అర్చకులు ప్రత్యేక పూజలు పూర్ణాహుతి, కుంకుమాభిషేకం, అన్నపూజ నిర్వహించారు. మహాశివరాత్రి రోజు అంగరంగ వైభవంగా జరిగిన శివకల్యాణం అనంతరం ఆది దంపతులైన పార్వతీపరమేశ్వరులను వాహనంపై ఎక్కించి గ్రామ పర్యటన నిర్వహించారు. దీంతో భక్తులు కొబ్బరికాయలు సమర్పించి స్వామివారికి మొక్కులు చెల్లించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement