●కడపలో దాదాగిరీ తమ్ముళ్లదే | - | Sakshi
Sakshi News home page

●కడపలో దాదాగిరీ తమ్ముళ్లదే

Published Mon, Aug 26 2024 12:26 PM | Last Updated on Mon, Aug 26 2024 12:26 PM

-

జిల్లా కేంద్రమైన కడప ప్రశాంతంగా, శాంతిభద్రతలు అదుపులో ఉండాలని పౌరులంతా కోరుకోవడం సహజం. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. దౌర్జన్యా లు, భూ ఆక్రమణలన్నీ పచ్చ నేతల చుట్టే తిరుగుతున్నాయి. 30ఏళ్లుగా వ్యాపారం చేస్తున్న ఓ మద్యం వ్యాపారీ నుంచి ఎర్రముక్కపల్లె, కోటిరెడ్డిసర్కిల్‌లో ఉన్న రెండు బార్లు దౌర్జన్యంగా స్వాధీనం చేసుకున్నారు. ఇదంతా ఎమ్మెల్యే మాధవీరెడ్డి అనుచరులైన తెలుగుతమ్ముళ్లు చేసిందే. మరోవైపు భూ షటిల్‌మెంట్లు, రేషన్‌షాపుల వ్యవహారం, గ్రావెల్‌ అక్రమ తరలింపు, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే చర్యలకు పాల్పడడం తదితర విషయాలన్నీంటిపై అఽధికారపార్టీ వైపే వేళ్లు చూపిస్తున్నాయి. కడపలో ఎప్పుడూ లేని సంస్కృతి తెరపైకి వస్తోంది. వ్యాపారులు బెంబేత్తుతున్నారని పలువురు వాపోతున్నారు. ఎమ్మెల్యేగా స్వయంగా రోడ్లుపై కూర్చున్న వారికి ఓ విన్నపంటూ బెదిరింపులకు దిగిన ఓ వీడియో తాజాగా సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఎక్కడైనా చిన్న ఫిర్యాదు ఉందా? కచ్చితమైన సమాచారం లేకుండా హెచ్చరికలు చేయడాన్ని పలువురు తప్పుబడుతోన్నారు. ఎవరో ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేస్తే నియంత్రించాల్సింది ఎవరు? వ్యవస్థలను చేతులోకి తీసుకొని ఇష్టారాజ్యంగా స్టేట్‌మెంట్లు ఇవ్వడం ఏమిటని పలువురు నిలదీస్తున్నారు. చిత్తశుద్ధితో చేసే పనికి ఎప్పటికీ ప్రజామద్దతు ఉంటుంది. అలా కాకుండా బాధ్యతలేమితో వ్యవహారిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని పలువురు హెచ్చరికలు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement