ఉరి వేసుకొని ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఉరి వేసుకొని ఆత్మహత్య

Published Tue, Aug 27 2024 2:18 AM | Last Updated on Tue, Aug 27 2024 2:18 AM

-

ప్రొద్దుటూరు క్రైం : ఎర్రగుంట్ల రోడ్డులోని ఏకోపార్కులో కుళ్లాయప్ప (56) అనే వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. మోడంపల్లెకు చెందిన కుళ్లాయప్ప తాగుడుకు బానిసయ్యాడు. ఈ నెల 21న మద్యం తాగడానికి డబ్బు కావాలని భార్యతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆ రోజు నుంచి అతను ఇంటికి రాలేదు. ఈ క్రమంలో ఏకోపార్కులో ఒక వ్యక్తి చెట్టుకు ఉరేసుకొని మృతి చెందిన విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సోమవారం అక్కడికి వెళ్లి పరిశీలించారు. అప్పటికే మృతదేహం పూర్తిగా కుళ్లిపోయింది. మృతదేహంపై ఉన్న దుస్తులు, ఇతర ఆనవాళ్ల ఆధారంగా మృతుడు కుళ్లాయప్పగా పోలీసులు గుర్తించారు.

600 గ్రాముల గంజాయి స్వాధీనం

కడప అర్బన్‌ : కడప నగరం తాలూకా పోలీసు స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ భాస్కర్‌రెడ్డి, ఎస్‌ఐలు హుసేన్‌, ప్రదీప్‌నాయుడు, ఏఎస్‌ఐ వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్‌ పుల్లయ్య ఆధ్వర్యంలో సోమవారం దాడులు చేపట్టారు. రవీంద్రనగర్‌ పాత కిరణ్‌ బార్‌ వెనుకగల ఖాళీ స్థలంలో గంజాయి విక్రయిస్తున్న వల్లెపు నటేశ్వరరావు, సయ్యద్‌ ఆసిఫ్‌, పఠాన్‌ సుహైల్‌ఖాన్‌లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 600 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వారిని విచారించగా రామాంజనేయపురానికి చెందిన కొండారెడ్డి నుంచి 1200 గ్రాముల గంజాయి కొనుగోలు చేసినట్లు వారు అంగీకరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement