కడపలో ఎల్‌ఐసీ చెస్‌, క్యారమ్స్‌ టోర్నమెంట్‌ | - | Sakshi
Sakshi News home page

కడపలో ఎల్‌ఐసీ చెస్‌, క్యారమ్స్‌ టోర్నమెంట్‌

Published Tue, Aug 27 2024 2:20 AM | Last Updated on Tue, Aug 27 2024 2:20 AM

-

కడప కల్చరల్‌ : ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ఎల్‌ఐసీ సిబ్బందికి జోనల్‌ స్థాయిలో ఈనెల 28, 29 తేదీల్లో కడపలో చెస్‌, క్యారమ్స్‌ టోర్నమెంట్‌ నిర్వహించనున్నట్లు ఎల్‌ఐసీ కడప డివిజన్‌ సీనియర్‌ డివిజనల్‌ మేనేజర్‌ జీకేఆర్‌వీ రవికుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ టోర్నమెంటుకు మూడు రాష్ట్రాల పరిధిలోని 17 డివిజన్ల నుంచి మొత్తం 80 మంది క్రీడాకారులు హాజరు కానున్నట్లు తెలిపారు. ఆగస్టు 28 ఉదయం 10 గంటలకు మద్రాస్‌ రోడ్‌ లోని హోటల్‌ శ్రీనివాస రెసిడెన్సిలో ఈ టోర్నమెంట్‌ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఒక ప్రభుత్వ రంగ సంస్థగా క్రీడలకు సముచిత రీతిలో ఎల్‌ఐసీ ప్రాధాన్యత ఇస్తోందని ఆయన తెలిపారు. ఈ పోటీల్లో అంతర్జాతీయ ఎల్‌ఐసీ క్రీడాకారిణి అపూర్వ పాల్గొంటున్నారని తెలిపారు.

29 నుంచి

ఆరోగ్యమాత ఉత్సవాలు

కడప కల్చరల్‌ : కడప వేలాంగణి ఆరోగ్యమాత తిరునాల ఉత్సవాలు ఈనెల 29 నుంచి ఘనంగా ప్రారంభమవుతాయని కడప నగరంలోని ఆరోగ్యమాత క్షేత్రం యువత విభాగం ప్రతినిధులు తెలిపారు. సోమవారం ఆరోగ్యమాత చర్చిలో బృందం సభ్యులు ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం సంస్థ యువత అధ్యక్ష, కార్యదర్శులు ప్రసాద్‌, మాథ్యూ మాట్లాడుతూ ఉత్సవాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయని, 29వ తేదీ పతాక ఆవిష్కరణకు కర్నూలు మేత్రాసన పీఠాధిపతులు రెవ డాక్టర్‌ బిషప్‌ గోరంట్ల జ్వనేస్‌ ముఖ్య అతిథులుగా హాజరవుతారని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement