Ananthapur
-
అభివృద్ధి పనుల తీర్మానాల్లో రాజకీయ జోక్యం
ఆత్మకూరు: గ్రామాల అభివృద్ధి పనుల్లో టీడీపీ నేతల జోక్యం తారస్థాయికి చేరుకుంది. ప్రజాప్రతినిధులను కాదని టీడీపీ నేతలు సూచించిన పనులకే అధికారులు సైతం తీర్మానాలు రూపొందించి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. తాజాగా వేసవిని దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో చేపట్టాల్సిన పనులకు తీర్మానాలు రూపొందించాలని అధికారులను ఆత్మకూరు ఎంపీపీ సుబ్బర హేమలత కోరారు. తీర్మానాల కోసం మంగళవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం 6.30 గంటల వరకూ కార్యాలయంలోనే ఆమె వేచి చూసినా ఫలితం లేకపోయింది. చివరకు టీడీపీ నేతలు సూచించిన పనులకు సంబంధించి 30 తీర్మానాలను సిద్ధం చేశారు. వీటిలో ప్రజాప్రతినిధులు సూచించిన ఏ ఒక్క పని కూడా లేకపోవడం గమనార్హం. విషయం తెలుసుకున్న ఎంపీపీ హేమలత... అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు చెబితేనే తీర్మానాలు సిద్దం చేస్తామని చెప్పడం సబబు కాదని అన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై పరిష్కారం చూపే దిశగా గత వారం సమావేశం ఏర్పాటు చేసి ముందస్తు సమాచారం ఇచ్చినా ఏ ఒక్క అధికారి కూడా సమావేశానికి హాజరుకాలేదన్నారు. ఈ క్రమంలో 15వ ఆర్థిక సంఘం నిధులు దాదాపు రూ.50 లక్షలకు పైగా ఉన్నా... వాటితో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు ఎలాంటి సమావేశాలు నిర్వహించకుండానే తీర్మానాలు రూపొందించి, ఆమోదం తెలిపినట్లుగా రికార్డులు సిద్ధం చేస్తే ఎలా అంటూ ప్రశ్నించారు. గ్రామాల అభివృద్ధికి సహకరించాల్సిన అధికారులు రాజకీయ పార్టీల నేతల కనుసన్నల్లో పనిచేయాల్సి రావడం సిగ్గుచేటన్నారు. ఈ అంశంపై కలెక్టర్ స్పందించి అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. టీడీపీ నాయకులు చెబితేనే సిద్ధం చేస్తామంటున్న అధికారులు ప్రొటోకాల్ ధిక్కరించి టీడీపీ నేతలు ప్రతిపాదించిన తీర్మానాలకు ఆమోదం -
కార్మికులను మోసగిస్తున్న ప్రభుత్వం
అనంతపురం అర్బన్: వేలాది మంది ప్రజల దాహార్తిని తీరుస్తున్న శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కార్మికులను ప్రభుత్వం దగా చేస్తోందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.ఓబుళు మండిపడ్డారు. కార్మికులకు 10 నెలల వేతనం, 35 నెలల పీఎఫ్ బకాయిలు చెల్లించకుండా అన్యాయం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వేతన, పీఎఫ్ బకాయిల మంజూరుతో పాటు లీటర్ బేస్ విధానం రద్దు చేయాలనే డిమాండ్తో మంగళవారం కలెక్టరేట్ ఎదుట శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కార్మికులు నిరసన తెలిపారు. ఓబుళు మాట్లాడుతూ... శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కింద 600 మంది కార్మికులు పనిచేస్తున్నారన్నారు. వేతనాల కోసం ఏడాదిలో మూడు దఫాలు సమ్మెలు చేయాల్సి వస్తోందన్నారు. సరైన బడ్జెట్ కేటాయించి కార్మికులకు వేతనం, పీఎఫ్ సక్రమంగా చెల్లించాలన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన లీటర్ బేస్ విధానం కారణంగా నీటి సరఫరాలో చాలా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. అయితే వీటికి కార్మికులను బాధ్యులను చేస్తూ ఒక్కొక్క కార్మికుడికి రూ.2,500 చొప్పున వేతనంలో కోత విధించడం సబబు కాదన్నారు. సరైన వసతులు కల్పించని కారణంగా తలెత్తుతున్న ఈ వైఫల్యానికి తొలుత ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉందన్నారు. ఆ తరువాత చీఫ్ ఇంజనీర్, సూపరింటెండెంట్ ఇంజనీర్, ఈఈలు, డీఈఈ వరకు అధికారులను ఎందుకు బాధ్యులను చేయడం లేదని ప్రశ్నించారు. అనంతరం డీఆర్ఓ ఎ.మలోలను ఆయన చాంబర్లో నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో శ్రీరామరెడ్డి నీటి సరఫరా పథకం కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రాము, నాయకులు హొన్నూరు స్వామి, ప్రభాకర్, సోము, చిక్కన్న, హనుమంతరాయ, నాగేంద్ర, కార్మికులు పాల్గొన్నారు. వేతన బకాయిల కోసం ఏడాదిలో మూడు సార్లు ధర్నాలు చేయాలా? సరైన బడ్జెట్ కేటాయించి జీతభత్యాలు సక్రమంగా చెల్లించాలి సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబుళు -
ఆకట్టుకున్న కర్రసాము
పెద్దవడుగూరు(యాడికి): మండల కేంద్రమైన యాడికి చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం నిర్వహించిన కర్రసాము పోటీలు ఉత్సాహంగా సాగాయి. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన యువకులు పోటీ పడగా, యాడికి గ్రామానికి చెందిన నాగార్జున ప్రథమ, శివకుమార్ ద్వితీయ, మహేష్ తృతీయ స్థానాన్ని దక్కించుకున్నారు. విజేతలను అభినందిస్తూ నిర్వాహకులు నగదు పురస్కారాలతో సత్కరించారు. గురుకులంలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం గుత్తి రూరల్: మండలంలోని చెర్లోపల్లి వద్ద ఉన్న సేవాగఢ్ గిరిజన సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో 2025–26వ విద్యాసంవత్సరానికి గాను 5వ తరగతి, బ్యాక్లాగ్ కోటా కింద 6, 7, 8, 9వ తరగతులలో నూతన ప్రవేశాలకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ మేరకు ఆ పాఠశాల ప్రిన్స్పాల్ ఫయాజ్ అహమ్మద్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 5వ తరగతిలో 80 సీట్లు భర్తీ చేయనున్నారు. ఎస్టీలకు 78శాతం, ఎస్సీలకు 12శాతం, బీసీలకు 5శాతం, ఓసీలకు 2శాతం, ఏఈక్యూ కోటాకు 3శాతం రిజర్వేషన్ ఉంటుంది. ఎస్టీ బ్యాక్లాగ్ కోటా కింద 6వ తరగతిలో 49, 7వ తరగతిలో 30, 8వ తరగతిలో 19, 9వ తరగతిలో ఆరు సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 25వ తేదీలోపు https:// twreiscet.apcfss.in/వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న వారికి ఏప్రిల్ 6న రాత పరీక్ష నిర్వహించి, ప్రతిభ చాటిన వారికి అడ్మిషన్లు కల్పిస్తారు. పూర్తి వివరాలకు 98853 69079, 89782 39363లో సంప్రదించవచ్చు. యువకుడిపై పోక్సో కేసు నమోదు బెళుగుప్ప: మండలలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలికను వేధించిన ఘటనలో అదే గ్రామానికి చెందిన వెంకటేశులుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శివ మంగళవారం తెలిపారు. పదో తరగతి చదువుతున్న మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురి చేసేవాడని బాధిత కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారన్నారు. -
ప్రతి నిత్యం.. ప్రజాపక్షం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చాయి తర్వాత కాలగర్భంలో కలిసిపోయాయి. దేశాన్ని శాసించిన జాతీయ పార్టీలు సైతం ఏపీలో గల్లంతయ్యాయి. కానీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించి నిలబడ్డ పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే. ‘‘పార్టీ అంటే ప్రజలు.. పాలకులంటే ప్రజలే’’ అంటూ సరిగ్గా 14 ఏళ్ల క్రితం 2011 మార్చి 12న ఆవిర్భవించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీ రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లోనే పెను సంచలనంగా మారిందనడంలో అతిశయోక్తి లేదు. ప్రాంతీయ, జాతీయ పార్టీల ప్రజా వ్యతిరేక పాలనకు ఎదురొడ్డి పోరాడిన పార్టీగా వైఎస్సార్ సీపీ ముద్ర వేసుకుంది. కష్టాలొచ్చినా ఎదురొడ్డి.. పార్టీ అధ్యక్షుడి హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన పోరాటం ఇప్పటికీ అట్టడుగు వర్గాల్లోనూ చిరస్థాయిగా నిలిచింది. ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజల తరఫున కూడా ఆయన ఎన్నో పోరాటాలు చేశారు. ‘అనంత’ రైతుల ఆక్రందనలపై 2014–19 కాలంలో అసెంబ్లీలో గళమెత్తారు. రీయింబర్స్ మెంట్ రాక ఇబ్బంది పడుతున్న విద్యార్థుల తరఫున నిలబడ్డారు. డ్వాక్రా మహిళల అభ్యున్నతి కోసం శ్రమించారు. 2014లో చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వం చేసిన కుట్రలను ధీటుగా ఎదుర్కొన్నారు. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి మోసం చేసిన తీరును ఎండగట్టారు. చివరకు సుదీర్ఘ పాదయాత్ర చేసి అన్ని వర్గాల ప్రజా సమస్యలను విని విజయానికి చేరువయ్యారు. పాలన అంటే ఇలా ఉండాలని.. 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 12 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాలు గెలిచింది. సాధారణంగా ఎన్నికలముందు హామీలివ్వడం, ఆ తర్వాత తుంగలో తొక్కడం చూసి ఉంటాం. కానీ పాలన చేపట్టిన రోజు నుంచే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తూ.చ.తప్పకుండా జగన్ అమలు చేశారు. జిల్లాలో లక్షలాది మంది రైతులకు చెప్పిన తేదీకే ‘రైతు భరోసా’ అందించారు. డ్వాక్రా మహిళలకు ‘ఆసరా’, ‘సున్నా వడ్డీ’తో అండగా నిలిచారు. ఫీజు రీయింబర్స్మెంట్తో పేద విద్యార్థులను ఆదుకున్నారు. ప్రాథమిక ఆరోగ్యానికి పునరుజ్జీవం పోశారు. పాలన వికేంద్రీకరణ జరిగితేనే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని గ్రామ వార్డు సచివాలయాలు తెచ్చారు. ఈ క్రమంలో జిల్లాలో వేలాది మందికి ప్రభుత్వ ఉద్యోగాలొచ్చాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలోనే పెనుకొండకు మెడికల్ కాలేజీ, అనంతపురంలో ఎంసీహెచ్ బ్లాకు, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు, పీహెచ్సీకి ఇద్దరు డాక్టర్లు ఇలా ఒకటేమిటి ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఘనత జగన్దే. అయితే, ప్రజలను ఎలాగోలా మభ్యపెట్టి 9 నెలల క్రితం గద్దెనెక్కిన చంద్రబాబు.. వచ్చీ రాగానే విద్యార్థులు, రైతులు, డ్వాక్రా మహిళలు, అంగన్వాడీ కార్యకర్తలపై ఉక్కుపాదం మోపుతున్నారు. దీనిపై వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు నేడు ‘యువత పోరు’కు శ్రీకారం చుడుతున్నారు. వైఎస్సార్ ఆశయ సాధనే లక్ష్యం పేద, సామాన్య మధ్య తరతగతి, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కృషి చేశారు. ఆయన ఆశయ సాధనే లక్ష్యంగా ఏర్పాటైన పార్టీ వైఎస్సార్ సీపీ. మహానేత తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీని ఏర్పాటు చేసి 14 ఏళ్లు అయ్యింది. 2019 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజానీకం అఖండ విజయాన్ని అందించింది. గత ఐదేళ్ల పాటు జగన్ ప్రభుత్వం సంక్షేమానికి చిరునామాగా నిలిచింది. దేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్ జగన్ సుపరిపాలన అందించారు. రూ.లక్షల కోట్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాయకులు, కార్యకర్తలకు శుభాకాంక్షలు. – అనంత వెంకటరామిరెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆటుపోట్లకు ఎదురొడ్డి నిలిచిన ‘వైఎస్సార్ సీపీ’ ఉమ్మడి అనంత జిల్లాలో రైతులు, మహిళల పక్షాన ఎనలేని పోరాటాలు 2019లో అత్యధిక మెజారిటీతో అధికారంలోకి.. సీఎంగా పాలన అంటే ఇలా ఉండాలని చూపించిన జగన్ నేడు పార్టీ ఆవిర్భావ దినోత్సవం -
●గాలేరు–నగరి ద్వారా కుప్పంకు నీరు తీసుకెళ్లొచ్చు ●జిల్లా రైతులను ఇబ్బంది పెట్టేందుకే హంద్రీ–నీవాకు లైనింగ్ పనులు ●రైతు సదస్సులో విశ్వేశ్వరరెడ్డి
కూడేరు: ఉమ్మడి అనంత జిల్లా రైతులపై సీఎం చంద్రబాబు కక్షకట్టి హంద్రీ–నీవా కాలువకు లైనింగ్ పనులు చేపట్టేందుకు సిద్ధమయ్యారని ఉరవకొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. గ్రావిటీ ద్వారా కుప్పం ప్రాంతానికి గాలేరు–నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు నుంచి కృష్ణా జలాలను తీసుకెళ్లే అవకాశమున్నా... కాదనీ జిల్లా రైతాంగం సంక్షేమాన్ని కూటమి సర్కార్ కాలరాస్తోందన్నారు. మంగళవారం కూడేరులోని శివరావు కల్యాణమంటపం వేదికగా హంద్రీ–నీవా కాలువ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో కమిటీ సభ్యుడు, ఎంపీపీ నారాయణ రెడ్డి అధ్యక్షతన ‘రైతు సదస్సు’ జరిగింది. సదస్సులో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు స్వార్థానికి జిల్లా రైతాంగం తీవ్రంగా నష్టపోతోందన్నారు. గత ప్రభుత్వంలో గాలేరు–నగరి ద్వారా కుప్పం ప్రాంతానికి నీరందించేందుకు అప్పటి సీఎం వైఎస్ జగన్ చర్యలు తీసుకుని 75 శాతం పనులు పూర్తి చేశారని గుర్తు చేశారు. మిగిలిన పనులు పూర్తి చేస్తే జగన్కు మంచి పేరు వస్తుందన్న అక్కసుతో సీఎం చంద్రబాబు హంద్రీ–నీవా కాలువకు లైనింగ్ పనులకు టెండర్లు పిలిచారన్నారు. సుమారు రూ.736 కోట్లతో పూర్తయ్యే లైనింగ్ పనులకు రూ.200 కోట్లు అధికంగా పెంచి టెండర్లను తన అనుయాయులకు కట్టబెట్టారని మండిపడ్డారు. ఈ పనులు పూర్తయితే ఉమ్మడి అనంతపురం జిల్లాలో హంద్రీ–నీవా కాలువ ద్వారా 3.5లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలన్న లక్ష్యం నీరుగారిపోతుందన్నారు. లైనింగ్ పనులతో కాలువ గుండా ప్రవహిస్తున్న నీరు భూమిలోకి ఇంకదన్నారు. పక్కలకు ఊట రాదన్నారు. దీంతో భూగర్భ జలాలు అడుగంటి బోరు బావుల్లో నీటి లభ్యత పూర్తిగా తగ్గి పండ్ల తోటలు, ఇతర పంటలు సాగు చేసుకునే రైతులు తీవ్రంగా నష్ట పోతారన్నారు. భూములు బీళ్లుగా మారుతాయన్నారు. భవిష్యత్లో కాలువ వెడల్పు చేయడానికి అవకాశముండదన్నారు. లైనింగ్ పనులు ఆపాలని రైతులే వేడుకుంటున్నా... ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుండడం దుర్మార్గమన్నారు. కుప్పం ప్రాంతానికి హంద్రీ–నీవా ద్వారానే నీళ్లు తీసుకెళ్లాలనుకుంటే ముందుగా కాలువను వెడల్పు చేస్తే ఉమ్మడి అనంత జిల్లా రైతులు స్వాగతిస్తారన్నారు. జిల్లా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికై న లైనింగ్ పనులు ఆపాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కోశాధికారి రాయుడు, అభివృద్ధి వికేంద్రీకరణ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు రమణ, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు కృష్ణ, వైఎస్సార్సీపీ రైతు సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు సిద్ధార్థ, మండల అఽధ్యక్షుడు సిద్ధారెడ్డి, ఏపీ రైతు సంఘం మండల నేతలు నారాయణరెడ్డి, వీరప్ప, వెఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న, నేతలు రామచంద్రారెడ్డి, రంగారెడ్డి, రామ్మోహన్, క్రిష్టప్ప, గంగాధర్, నరేష్, కేశన్న తదితరులు పాల్గొన్నారు. ఆత్మహత్యలే శరణ్యం హంద్రీ నీవా కాలువకు కాంక్రీట్తో లైనింగ్ పనులు పూర్తయితే ఆత్మహత్యలు తప్ప మరో మార్గం లేదని రైతులు, రైతు సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సదస్సులో జయపురం, ఎంఎంహళ్లి, చోళసముద్రం, పి.నారాయణపురం, తిమ్మాపురం, కరుట్లపల్లితో పాటు మరికొన్ని గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. హంద్రీ నీవా కాలువ పరిధిలో రూ.లక్షల్లో పెట్టుబడితో వివిధ రకాల పంటలు, పండ్ల తోటలను సాగు చేస్తున్నామన్నారు. కాలువకు లైనింగ్ పనులు చేపడితే భూగర్భ జలాలు అడుగంటి పోయి బోరు బావులో నీటి మట్టం తగ్గి పంటలు సాగు చేసుకోలేక నష్టపోవాల్సి వస్తుందన్నారు. ఈ ప్రభుత్వం తమకు మేలు చేయకపోయిన పర్వాలేదని, నష్టం కల్గించే చర్యలు చేపట్టకుండా ఉంటే చాలన్నారు. హంద్రీ–నీవా కాలువ పరిరక్షణకు కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామన్నారు. -
ప్రకృతి వ్యవసాయంపై ఆసక్తి చూపాలి
కళ్యాణదుర్గం రూరల్: రైతులు ప్రకృతి వ్యవసాయంపై ఆసక్తి చూపాలని జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ సూచించారు. మంగళవారం మండలంలోని భట్టువానిపల్లి, పాలవాయి గ్రామాల్లో వ్యవసాయ అధికారులు పర్యటించారు. ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం నిర్వహించారు. భట్టువాని పల్లిలో సహజసిద్ధ వ్యవసాయం (న్యాచురల్ ఫార్మింగ్) చేస్తున్న రైతులతో సమావేశం నిర్వహించారు. సహజంగా పండించిన పంటలకు ప్రత్యేక మార్కెటింగ్ సౌకర్యం ప్రభుత్వం కల్పించాలని వ్యవసాయ అధికారులను రైతులు కోరారు. రబీలో రైతులు పండించిన పంటలు వేరుశనగ, మొక్కజొన్న పంటలకు దళారుల బెడద తప్పించి ప్రభుత్వమే మద్దతు ధరతో కొనుగోలు చేయాలన్నారు. కార్యక్రమంలో ఏడిఏ ఎల్లప్ప, మండల వ్యవసాయ అధికారి జగదీష్ తదితరులు పాల్గొన్నారు -
అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్
అనంతపురం: ఆలయ నిర్మాణానికి పోగు చేసిన మొత్తాన్ని దొంగలించిన ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.10.05 లక్షల నగదు, పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నారు. అనంతపురంలోని పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను అడిషనల్ ఎస్పీ డీవీ రమణమూర్తి వెల్లడించారు. కణేకల్లు మండలం సొల్లాపురం గ్రామంలో సీతారామాంజినేయులు ఆలయ నిర్మాణం కోసం గ్రామస్తులు చందాల రూపంలో పోగు చేసిన రూ.12 లక్షలను గుర్రం లక్ష్మన్న అనే వ్యక్తి వద్ద భద్రపరిచిన విషయం తెలిసిందే. ఈ మొత్తాన్ని దుండగులు అపహరించారు. ఘటనపై ఈ నెల 4న కణేకల్లు పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. పాములు పట్టుకుంటూ .. తమిళనాడుకు చెందిన గురునాథం రాజు.. బాతులు మేపుతో జీవనం సాగించేవాడు. గురునాథానికి వరుసకు మేనమామ అయిన జానయ్య ఇటుకల బట్టీలో పనిచేస్తుండేవాడు. వీరి తల్లిదండ్రులు ఊరారా తిరుగుతూ గ్రామాల్లో పాములు ఆడిస్తూ జీవనం సాగించేవారు. తమిళనాడు బాతులు మేపుతున్న సమయంలోనే అక్కడే వీరికి కార్తీక్ అనే యువకుడు పరిచయమై, మంచి స్నేహితులుగా మారారు. ఈ క్రమంలో వలస వచ్చిన ముగ్గురూ గత 20 రోజులుగా కణేకల్లు మండలంలో మోటార్ సైకిల్పై గ్రామాల్లో సంచరిస్తూ ఊరు చివర గుడారాలు వేసుకుని రెండు, మూడు రోజులు అక్కడే ఉంటూ పాములు ఆడిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆలయాల్లో హుండీలను అపహరించి, అందులోని భక్తుల కానుకలనూ అపహరించేవారు. దారిన పోతూ చోరీ ఈ నెల 2న కర్ణాటక ప్రాంతానికి వెళ్లిన గురునాథం రాజు, జానయ్య, కార్తీక్... రాత్రి ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమయ్యారు. అర్ధరాత్రి సమయంలో సొల్లాపురం వద్దకు చేరుకున్న వారికి గుర్రం లక్ష్మన్న అనే వ్యక్తి తాళం వేసిన ఇల్లు కనిపించడంతో పథకం వేసి 3వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత ఇనుపరాడ్తో తలుపు తాళాలు మెండి లోపలకు ప్రవేశించారు. స్క్రూడ్రైవర్ సాయంతో బీరువా తెరిచి అందులో ఉన్న రూ.12 లక్షల నగదు అపహరించారు. చోరీ అనంతరం జీడిపల్లి డ్యామ్ చేరుకుని రూ.50 వేలను జానయ్య తీసుకుని స్వగ్రామానికి వెళ్లిపోయాడు. మిగిలిన డబ్బు తర్వాత పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేయడంతో భయపడి కర్ణాటకలోని సిరిగుప్పకు మకాం మార్చేందుకు మంగళవారం జీడిపల్లి డ్యామ్ మీదుగా ద్విచక్ర వాహనంపై వెళుతుండగా పోలీసులు గుర్తించి కణేకల్లు క్రాస్ వద్ద అరెస్ట్ చేశారు. గురునాథం రాజుపై వైఎస్సారఱ్ జిల్లా యర్రగుంట్ల, కర్నూలు జిల్లా హాలహర్వి పీఎస్ల పరిధిల్లో చోరీ కేసులు ఉన్నాయి. తమిళనాడులోని పోలూరు, శ్రీపెరంబూరు పీఎస్ల పరిధిల్లోనూ ద్విచక్రవాహనాల అపహరణ కేసులు, కర్ణాటకలోని బొమ్మనహళ్లి, ఏపీలోని వి.కోట పీఎస్ పరిధిలోనూ మోటార్ సైకిళ్ల చోరీ కేసులు ఉన్నాయి. నిందితుల అరెస్ట్లో చొరవ చూపిన కళ్యాణదుర్గం డీఎస్పీ పి.రవిబాబు, రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ, కణేకల్లు ఎస్ఐ నాగమధు, డి.హీరేహళ్ ఎస్ఐ గురుప్రసాద్రెడ్డిను ఏఎస్పీ అభినందించారు. రూ.10.05 లక్షల నగదు, పల్సర్ బైక్ స్వాధీనం -
‘యువత పోరు’ను జయప్రదం చేద్దాం
అనంతపురం కార్పొరేషన్: ‘విద్యార్థులు, యువతను కూటమి ప్రభుత్వం దగా చేసింది. ఈ క్రమంలో సర్కారు మెడలు వంచడమే ధ్యేయంగా బుధవారం చేపడుతున్న వైఎస్సార్ సీపీ ‘యువత పోరు’ ర్యాలీని జయప్రదం చేయాలి’ అని పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. ఉదయం 10 గంటలకు జెడ్పీ కార్యాలయం సమీపంలోని దివంగత నేత వైఎస్సార్ విగ్రహం నుంచి ర్యాలీ ప్రారంభమై సప్తగిరి సర్కిల్, సూర్యనగర్, సంగమేష్ సర్కిల్ మీదుగా కలెక్టరేట్ వరకు సాగుతుందన్నారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందిస్తామన్నారు. నియోజకవర్గాల సమన్వయకర్తలతో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలు, విద్యార్థులు, తల్లిదండ్రులు,పెద్ద ఎత్తున యువత కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ విద్య, వైద్యానికి పెద్దపీట వేశారని, ‘విద్యా దీవెన’ పథకం ద్వారా ఐదేళ్లలో రూ. 12,612 కోట్లు, ‘వసతి దీవెన’ ద్వారా రూ. 5,992 కోట్లు అందించారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 9 నెలలు గడుస్తున్నా ఇంత వరకు ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. రూ.4,600 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏటా జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తామని చెప్పిన చంద్రబాబు.. సీఎం అయ్యాక మాట తప్పార న్నారు. రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇవ్వలేదన్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 17 వైద్య కళాశాలల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటే, కూటమి ప్రభుత్వంలో వాటిని ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ప్రజాస్వామ్య పద్ధతిలో ‘కూటమి’ ఆగడాలను తిప్పికొడతామని ‘అనంత’ స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి -
ఉపాధ్యాయుడికి ప్రతిభా పురస్కారం
తాడిపత్రి: కవయిత్రి మొల్లమాంబ జయంతిని పురస్కరించుకుని విశిష్టమైన వ్యక్తులు అందజేసే పురస్కారం ఈ ఏడాదికి గాను తాడిపత్రి మండలం యర్రగుంటపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రామాంజినేయులుకు దక్కింది. ఈ నెల 9న హైదరాబాద్లోని రవీంద్రభారతి వేదికగా జరిగిన పురస్కారాల ప్రదానంలో శాలివాహన విశిష్ట ప్రతిభా పురస్కారాన్ని ఆయనకు హైదరాబాద్ శాలివాహన చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఇటికాల వీరయ్య, తెలంగాణ మాజీ డీజీపీ పూర్ణచంద్రారావు అందజేసి, ఘనంగా సత్కరించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాఠశాల అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించినందుకు 2018లోనూ ఉత్తమ ఉపాధ్యాయుడిగా రామాంజినేయులు అవార్డు అందుకున్నారు. వృత్తితో పాటు అనేక సేవా కార్యక్రమాల్లోనూ ఆయన పాలుపంచుకుంటున్నారు. కార్యక్రమంలో తెలంగాణ, ఏపీ శాలివాహన ఉన్నతాధికారులు, ట్రస్ట్ సభ్యులు, సంఘం నాయకులు పాల్గొన్నారు. సచివాలయ ఉద్యోగులకు ‘షోకాజ్’ గుత్తి రూరల్: మండలంలోని ఊబిచెర్ల గ్రామ సచివాలయ ఉద్యోగులకు ఎంపీడీఓ ప్రభాకర్ నాయక్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మంగళవారం ఆయన గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేసేందుకు వెళ్లిన సమయంలో కొందరు ఉద్యోగులు ఉదయం 10 గంటలవుతున్నా విధులకు హాజరు కాలేదు. అంతేకాక ప్రభుత్వం చేపట్టిన సర్వేలోనూ ఊబిచెర్ల సచివాలయ ప్రగతి వెనుకంజలో ఉన్నట్లుగా నిర్ధారణ అయింది. దీంతో తనిఖీలకు వెళ్లిన ఆయన తొలుత రికార్డులు, ఉద్యోగుల హాజరు పట్టిక పరిశీలించారు. ఇద్దరు మినహా మిగిలిన ఉద్యోగులు ఎవరూ విధులకు హాజరు కాలేదు. గైర్హాజరైన వారికి ఫోన్ చేసి సంప్రదించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దీంతో సదరు ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఊరేగింపులో అపశ్రుతి పెద్దవడుగూరు(యాడికి): మండల కేంద్రమైన యాడికి గ్రామంలో వెలసిన చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి నిర్వహించిన శేష వాహనం ఉత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ముస్తఫా(18) ఊరేగింపులో తన మిత్రులతో కలసి చిందేస్తూ ఉన్నఫళంగా కుప్పకూలాడు. గమనించిన స్థానికులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లుగా నిర్ధారించారు. -
●హంస వాహనంపై వీణాపాణి
కదిరి: బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఖాద్రీ లక్ష్మీ నారసింహుడు మంగళవారం రాత్రి వీణాపాణిగా హంసవాహనంపై చదువుల తల్లి సరస్వతి అవతారంలో తిరుమాడ వీధుల్లో దర్శనమిచ్చారు. చేతిలో వీణ, విశేష దివ్యాభరణాలు, పట్టు పీతాంబరాలు ధరించి తిరువీధుల్లో ఊరేగుతున్న శ్రీవారి దివ్యమంగళరూపాన్ని దర్శించుకుని భక్తజనం తన్మయత్వం చెందారు. నారసింహుడు హంస వాహనాన్ని అధిరోహించి తిరువీధుల్లో దర్శనమివ్వడం ద్వారా భక్తులలో అహంభావాన్ని తొలగించి శరణాగతిని కల్గిస్తాడని అర్చక పండితులు తెలిపారు. పరమాత్మ వేదోపదేశాన్ని హంస రూపంలోనే చేసినందున తుచ్ఛమైన కోర్కెల అంధకారం వీడి శాశ్వతమైన పరబ్రహ్మ చెంతకు చేరే ముక్తిమార్గం వైపు నడవాలని ఈ హంసవాహనం ద్వారా స్వామివారు తన భక్తులకు చాటిచెబుతారని అర్చకులు వెల్లడించారు. ఉభయదారులుగా పట్టణానికి చెందిన తోటంశెట్టి రాజుగోపాల్శెట్టి కుటుంబీకులు వ్యవహరించారని ఆలయ ఈఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు. నేడు సింహవాహనంపై శ్రీవారి దర్శనం బ్రహ్మోత్సవాల్లో భాగంగా కాటమరాయుడు బుధవారం మాడవీధుల్లో సింహవాహనంపై దర్శనమివ్వనున్నారు. మనుషులలో జంతు స్వాభావికమైన ప్రవృత్తిని అదుపు చేసుకోవాలని లోకానికి చాటిచెప్పడానికే శ్రీవారు సింహవాహనంపై ఊరేగుతారని భక్తుల నమ్మకం. అర్చకులు ఉదయం యాగశాలలో పుణ్యాహవచనం జరిపి వాస్తు, అగ్ని ప్రతిష్ట చేస్తారు. రాత్రివేళ స్వామివారు తిరువీధుల్లో విహరించనున్నారు. -
తల్లిదండ్రుల అభిప్రాయాలు తీసుకోండి
అనంతపురం అర్బన్: ‘మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాథమిక పాఠశాలలను కలిపి మోడల్ ప్రైమరీ స్కూళ్లు ఏర్పాటు చేస్తారు. ఈ విషయంపై పిల్లల తల్లిదండ్రుల అభిప్రాయాలు తీసుకోవాలి. గతంలో చదివిన పాఠశాల కావాలా లేక మోడల్ ప్రైమరీ స్కూల్ కావాలా ఆరా తీయాలి’ అని కలెక్టర్ వి.వినోద్కుమార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో విద్య, అనుబంధ శాఖలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైమరీ స్కూల్ అంశంపై ఎంఈఓలు గ్రామపంచాయతీ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి, ప్రభుత్వ విధానాలను వివరించాలన్నారు. అక్కడ తీసుకున్న నిర్ణయాలను లిఖితపూర్వకంగా ఆమోదం పొందేలా చూడాలన్నారు. మండల, క్లస్టర్ కమిటీల ఏర్పాటు, పాఠశాల నిర్వహణ కమిటీతో సంప్రదించి తల్లిదండ్రుల అంగీకారంతో పనులు పూర్తి చేయాలని చెప్పారు. ఇబ్బందులున్న ప్రాంతాల్లో బేసిక్ స్కూళ్లు ఏర్పాటు చేయాలని, మూడు కిలోమీటర్ల లోపు ఉన్నత పాఠశాలలు లేనిచోట ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. రవాణా సదుపాయం లేని ప్రాంతాల్లో ఆ సౌకర్యం కల్పించాలన్నారు. సమస్యలను ప్రజాప్రతినిధులు, డిప్యూటీ డీఈఓ, డీఈఓ స్థాయిలో చర్చించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉపాధ్యాయుల పునర్వ్యస్థీకరణలో భాగంగా యూడైస్ డేటా ప్రకారం పోస్టుల కేటాయించాలన్నారు. సమావేశంలో డీఈఓ ప్రసాద్బాబు, సర్వశిక్ష అభియాన్ ఏపీసీ శైలజ, గిరిజిన సంక్షేమ అధికారి రామాంజినేయులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా టాప్–6లో ఉండాలి పంచాయతీ సెక్ట్, జీఎస్డబ్ల్యూఎస్ తదితర అంశాల్లో జిల్లా టాప్–6లో ఉండేలా పనిచేయాలని కలెక్టర్ వి.వినోద్కుమార్ ఆదేశించారు. తన క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహంచారు. త్వరలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఉంటుందని, అప్పటిలోగా రాష్ట్రస్థాయిలో ఆయా అంశాల్లో జిల్లాను టాప్–6లో ఉంచేందుకు కృషి చేయకపోతే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కలెక్టర్ వినోద్కుమార్ -
మద్దతు ధరతో పప్పుశనగ కొనుగోళ్లు
అనంతపురం అగ్రికల్చర్: ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ప్రకారం రబీలో రైతులు పండించిన పప్పుశనగ కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ పెన్నేశ్వరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. క్వింటా రూ.5,650 ప్రకారం కొంటామన్నారు. రైతులు తప్పనిసరిగా ఈ–క్రాప్ చేయించి ఉండాలన్నారు. 14 శాతం లోపు తేమ ఉన్న నాణ్యమైన పప్పుశనగ తీసుకురావాలని సూచించారు. ఆర్ఎస్కేల్లో సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ధర్మవరం–మచిలీపట్నం ఎక్స్ప్రెస్ పాక్షికంగా రద్దు గుంతకల్లు: ధర్మవరం రైల్వే జంక్షన్లో 5వ నంబర్ ప్లాట్ఫారం ఏర్పాటు పనుల్లో భాగంగా ధర్మవరం–మచిలీపట్నం మధ్య తిరుగుతున్న ఎక్స్ప్రెస్ రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీధర్ ఓ ప్రకటనలో తెలిపారు. అనంతపురం–మచిలీపట్నం మధ్య మాత్రమే నడుస్తున్నట్లు వెల్లడించారు. మచిలీపట్నం–ధర్మవరం(17215) ఎక్స్ప్రెస్ను ఈ నెల 12 నుంచి 30 వరకు, ధర్మవరం–మచిలీపట్నం (17216) ఎక్స్ప్రెస్ను 13 నుంచి 31 వరకు పాక్షికంగా రద్దు చేసినట్లు వివరించారు. నేడు స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు అనంతపురం ఎడ్యుకేషన్: స్కూల్ కాంప్లెక్స్ సమావేశాల నిర్వహణకు సంబంధించి కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుపై ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ఈ నెలకు సంబంధించి 15న నిర్వహించాలని ముందుగా నిర్ణయించినా... పదో తరగతి పరీక్షల నేపథ్యంలో 12 (నేడు)న నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో విద్యాశాఖ అధికారులకు సమాచారం పంపా రు. డీఈఓ అన్ని కాంప్లెక్స్లకు ఆగమేఘాల మీద ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం 10వ తరగతి విద్యార్థుల గ్రాండ్ టెస్ట్ పరీక్షల నిర్వహణ, సన్నద్ధత, పాఠశాల వార్షికోత్సవాలు, పదో తరగతి వీడ్కోలు సమావేశాలు నిర్వహించుకుంటున్నారు. ఓపెన్ స్కూల్ పరీక్షల ఇన్విజిలేషన్ డ్యూటీల్లో చాలామంది టీచర్లు ఉన్నారు. ముస్లిం టీచర్లు రంజాన్ మాసపు ప్రార్థనల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే విద్యాశాఖ అధికారులు ఉన్నట్లుండి సమావేశాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. ఉదయం పాఠశాలలు జరిపి మధ్యాహ్నం కాంప్లెక్స్ మీటింగ్లకు హాజరుకావాల్సిందేనని ఉత్తర్వులు జారీ చేశారు. ఓపెన్ స్కూల్ పరీక్షలు సెంటర్లుగా ఉన్న పాఠశాలల విద్యార్థులకు సెలవులు ప్రకటించారు. ఈ క్రమంలో ప్రభుత్వ తీరుపై టీచర్లు మండిపడుతున్నారు. ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టేలా వ్యవహరించడం సరికాదని ఏపీటీఎఫ్ జిల్లా శాఖ అధ్యక్షుడు రాయల వెంకటేష్, ప్రధాన కార్యదర్శి ఎస్. సిరాజుద్దీన్ మండిపడ్డారు. కేజీబీవీ విద్యార్థిని ఆత్మహత్య అనంతపురం ఎడ్యుకేషన్: అనంతపురం రూరల్ మండలం కురుగుంట కేజీబీవీలో 9వ తరగతి విద్యార్థిని పి.రుచిత (14) ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు...కురుగుంట వైఎస్సార్ కాలనీకి చెందిన రాజేష్, మునీశ్వరి దంపతుల కుమార్తె పి.రుచిత స్థానిక కేజీబీవీలో చదువుతోంది. ఇటీవల కొంతకాలంగా కేజీబీవీలో రుచిత వ్యవహారం వేరే విధంగా ఉండేది. ఇతర అమ్మాయిలతో అతి చనువుగా ఉండేది. వారు విభేదించడంతో చేతులు కోసుకోవడం లాంటి ఘటనలకు పాల్పడింది. ఈ విషయం నాలుగు రోజుల క్రితం టీచర్ల దృష్టికి వచ్చింది. ఎస్ఓతో పాటు టీచర్లూ కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా మార్పు రాకపోగా చేష్టలు మరింత ఎక్కువయ్యాయి. ఈ పరిస్థితుల్లో ముందు జాగ్రత్తగా తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో తల్లి మునీశ్వరిని కేజీబీవీకి పిలిపించారు. కొన్నిరోజులు ఇంట్లో పెట్టుకుని సర్దిచెప్పి పంపాలని సూచించారు. విద్యార్థిని నానమ్మ కేజీబీవీ సమీపంలో ఉండే రాధాస్వామి మందిరంలో వాచ్ఉమెన్గా ఉంటోంది. దీంతో మునీశ్వరి తన కుమార్తెను నేరుగా ఆ మందిరం వద్దకు పిలుచుకెళ్లారు. అక్కడే తండ్రి కాస్త గట్టిగా మందలించాడు. బాగా చదువుకోవాలని సూచించాడు. ఈ క్రమంలోనే ఇంటికి వెళ్లి డ్రస్సు తెస్తామని తల్లిదండ్రులిద్దరూ వెళ్లారు. వారు అలా వెళ్లగానే మందిరం కాంపౌండ్లో ఓ చెట్టుకు రుచిత ఉరి వేసుకుంది. రూరల్ పోలీసులు పరిశీలించి.. మృతదేహాన్ని సర్వజనాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. -
హోరాహోరీగా ఇరుసు ఎత్తు పోటీలు
పెద్దవడుగూరు(యాడికి): మండల కేంద్రమైన యాడికిలో చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఇరుసు ఎత్తే పోటీలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి గ్రామీణ యువకులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి పోటీ పడ్డారు. గుంతకల్లు మండలం తిమ్మాపురం వీరేష్ ప్రథమ స్థానాన్ని దక్కించుకోగా, ద్వితీయ స్థానంలో పామిడి మండలం వంకరాజుకాలువకు చెందిన నరేష్, తృతీయ స్థానంలో నాగలాపురం గ్రామానికి చెందిన నరేంద్ర నిలిచారు. విజేతలను అభినందిస్తూ నిర్వాహకులు నగదు పురస్కారాలతో సత్కరించారు. సమస్యలపై సత్వరమే స్పందించాలి : ఎస్పీ అనంతపురం: పిటీషనర్ల సమస్యలపై సత్వరమే స్పందించాలని సిబ్బందిని ఎస్పీ పి. జగదీష్ ఆదేశించారు. పోలీస్కాన్ఫరెన్స్ హాలులో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 61 వినతులు అందాయి. వినతులను ఎస్పీ స్వయంగా స్వీకరించారు. చట్ట పరిధిలో సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ చేసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చే పిటీషన్లను నిర్ణీత గడువు లోపు చట్ట పరిధిలో విచారించి పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ డీవీ రమణ మూర్తి, మహిళా పీఎస్ డీఎస్పీ మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు. సీనియారిటీ జాబితా లోపభూయిష్టం : వైఎస్సార్టీఏఅనంతపురం ఎడ్యుకేషన్: ప్రభుత్వం ప్రకటించిన ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాలో అనేక లోపాలున్నాయని వెఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి. అశోక్ కుమార్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటరమణప్ప, రాష్ట్ర కార్యదర్శి ఏ. గోపాల్, రవీంద్రారెడ్డి గోవిందరెడి, రామకృష్ణ, కృష్ణా నాయక్, సిద్ధ ప్రసాద్, వెంకటరెడ్డి సోమవారం ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితా తయారీలో భాగంగా వివిధ సబ్జెక్టుల్లో ప్రమోషన్ పొందిన తేదీలను జాయినింగ్ తేదీలుగా నమోదు చేశారని, మరికొందరు మరుసటి రోజు జాయినింగ్ డేట్గా నమోదు చేయడంతో జాబితా మొత్తం తప్పుల తడకగా మారిందన్నారు. అంతర్ రాష్ట్ర బదిలీల్లో భాగంగా జిల్లాకు వచ్చిన ఉపాధ్యాయుల సీనియారిటీని కాకుండా వారు కేడర్లో చేరిన తేదీని సీనియారిటీ జాబితాలో చూపించారన్నారు. ఫలితంగా జూనియర్లయినా వారు జాబితాలో మాత్రం సీనియర్లుగా కనిపిస్తున్నారన్నారు. అలాగే ఒక మేనేజ్మెంట్ నుంచి మరొక మేనేజ్మెంట్కు మారిన వారిని క్షుణ్ణంగా పరిశీలించి జాబితా సరి చేయాలని కోరారు. -
నాడు హామీలు... నేడు అరెస్టులా!
● సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర ధ్వజం అనంతపురం అర్బన్: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకు కూటమి నేతలు సిగ్గుపడాల్సిందిపోయి... వాటి గురించి ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం సిగ్గుచేటని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రకుమార్ మండిపడ్డారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు అవుతున్నా.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. అంగన్వాడీల అరెస్టులను నిరసిస్తూ నాయకులు, అంగన్వాడీలు సోమవారం స్థానిక టవర్క్లాక్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేంద్రకుమార్ మాట్లాడారు. డిమాండ్ల సాధన కోసం విజయవాడలో జరిగే శాంతియుత ధర్నాకు జిల్లా నుంచి బయలుదేరిన అంగన్వాడీలను వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్లో పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. అంగన్వాడీలకు వేతనం పెంచలేదన్నారు. చనిపోయాక మట్టి ఖర్చులు రూ.20 వేలు ఇస్తామని చెప్పి ఇప్పుడు రూ.15వేలు చెల్లించేలా జీఓ ఇచ్చారన్నారు. సుప్రీం కోర్టు చెప్పినట్లుగా అంగన్వాడీలకు గ్రాట్యూటీ చట్టాన్ని అమలు చేయకుండా రిటైర్మెంట్ బెనిఫిట్ ప్రకటించి చేతులు దులుపుకుంటే అంగీకరించే ప్రసక్తేలేదన్నారు. అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే తీవ్రస్థాయిలో పోరాటాలు సాగించాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు రామాంజినేయులు, ముత్తూజా, వెంకటనారాయణ, నాగరాజు, ఎర్రిస్వామి, తిరుమలేషు, అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల సంఘం నాయకురాళ్లు అరుణమ్మ, నక్షత్ర, రేవతి, పార్వతి, పద్మ, జ్యోతి, లక్ష్మీదేవి పాల్గొన్నారు. -
శేషవాహనంపై చెన్నకేశవుడు
పెద్దవడుగూరు(యాడికి): మండల కేంద్రమైన యాడికిలో వెలసిన లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం దేవేరులతో కలసి శేషవాహనంపై శ్రీవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం ఆలయంలో విశేష పూజలు పెద్ద ఎత్తున జరిగాయి. రాత్రి 10 గంటలకు శేష వాహన సేవలను నేత్రపర్వంగా నిర్వహించారు. కార్యక్రమంలో అర్చకులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. 12న జాబ్ మేళా గుంతకల్లు రూరల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో గుంతకల్లులోని న్యాక్ ట్రైనింగ్ సెంటర్లో ఈ నెల 12న జాబ్మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు న్యాక్ ఏడీ గోవిందరాజులు, డీఎస్డీఓ ప్రతాప్రెడ్డి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇంటర్, డిగ్రీ పూర్తి చేసి, 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసున్న నిరుద్యోగ యువతీయువకులు అర్హులు. టాటా క్యాపిటల్, సింధూజ మైక్రో క్రెడిట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల ప్రతినిధులు హాజరై ఆయా కంపెనీల అవసరాలకు అనుగుణంగా మానవ వనరులను ఎంపిక చేయనున్నారు. ఆసక్తి ఉన్న వారు ధ్రువీకరణ పత్రాలతో జాబ్మేళాకు హాజరు కావచ్చు. యువకుడి దుర్మరణం ఉరవకొండ: స్ధానిక అగ్నిమాపక శాఖ కార్యాలయం ఎదురుగా ఉన్న రోడ్డు డివైడర్ను ఢీకొని ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు.. ఉరవకొండలోని ఇంద్రా నగర్కు చెందిన కార్తీక్ (18), నందకుమార్ సోమవారం ఉదయం ద్విచక్ర వాహనంపై వెళుతూ వేగాన్ని నియంత్రించుకోలేక డివైడర్ను ఢీకొన్నారు. ఘటనలో కార్తీక్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన నందకుమార్ను స్థానికులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై సీఐ మహనంది కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. గుర్తు తెలియని యువకుడి ఆత్మహత్య గుంతకల్లు: స్థానిక తిమ్మనచర్ల రైలు మార్గంలో 440/29 కి.మీ. వద్ద పట్టాలపై ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు సోమవారం గుర్తించారు. సమాచారం అందుకున్న జీఆర్పీ ఎస్ఐ మహేంద్ర అక్కడకు చేరుకుని పరిశీలించారు. దాదాపు 25 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. ఆచూకీ తెలిసిన వారు 98661 44616కు ఫోన్ చేసి సమాచారం అందించాలని రైల్వే పోలీసులు కోరారు. -
రైతులంటే అంత చులకనా?
అనంతపురం అర్బన్: రైతులంటే సీఎం చంద్రబాబుకు చులకనై పోయారని, రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఏపీ రైతు సంఘం నాయకులు ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతున్నా కనీసంగా కూడా రైతులకు చేసిన మేలు ఏమీ లేదని దుమ్మెత్తిపోశారు. మిరప, పత్తి, పప్పుశనగ, సీడ్ జొన్న పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, 2024–25 ఖరీఫ్, రబీలో దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ప్రకటించి రైతులను ఆదుకోవాలంటూ సోమవారం కలెక్టరేట్ ఎదుట రైతు సంఘం నాయకులు, రైతులు బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు తరిమెల నాగరాజు, ప్రధాన కార్యదర్శి ఆర్.చంద్రశేఖర్రెడ్డి మాట్లాడారు. రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యంగా చెప్పుకుంటున్న ప్రజాప్రతినిధులు ఈ తొమ్మిది నెలల కాలంలో రైతులకు చేసిన మేలు ఏమిటో ఒక్కటైనా చెప్పాటని ప్రశ్నించారు. అన్నదాత సుఖీభవ కింద రూ.20వేలు పెట్టుబడి సాయం ఇస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేయలేదన్నారు. 2024–25 ఖరీఫ్, రబీలో అతివృష్టి, అనావృష్టి కారణంగా పంటలు దెబ్బతింటే ఈ రోజుకూ రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. మిరప, పత్తి, పప్పుశనగ, సీడ్ జొన్న పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఆ పంటలకు గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేయాలనే ఆలోచన కూడా ప్రభుత్వం చేయకపోవడం దుర్మార్గమన్నారు. ఇదేనా రైతు సంక్షేమం అంటూ నిలదీశారు. ఇప్పటికై నా రైతులను ఆదుకోకపోతే పెద్ద ఎత్తున పోరాటాలు సాగిస్తామని హెచ్చరిస్తూ కలెక్టర్ వినోద్కుమార్కు నాయకులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు రామిరెడ్డి, ఆర్వీనాయుడు, ఐద్వా రాష్ట్ర నాయకురాలు సావిత్రి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కృష్ణమూర్తి, రైతు సంఘం జిల్లా నాయకులు శివారెడ్డి, విరుపాక్షి, మధసూదన్ నాయుడు, రాజారాంరెడ్డి, బీహెచ్రాయుడు, దస్తగిరి, చెన్నారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. తొమ్మిది నెలలవుతున్నా పత్తాలేని పెట్టుబడి సాయం ప్రహసనంలా మారిన ‘అన్నదాత సుఖీభవ’ పంటలకు గిట్టుబాటు ధర లేదు కూటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట రైతుల ధర్నా -
గుడి.. గుడి స్థలం కూడా నాదే!
కళ్యాణదుర్గం రూరల్: ‘ఆలయం మా సొంతం. మాకన్నా దేవుడు గొప్ప కాదు. జాతరలో దుకాణం ఏర్పాటు చేయాలనుకునే వారు ఎవరైనా మా మాట వినాల్సిందే. మాకే డబ్బు చెల్లించాల్సిందే’ అంటూ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ప్రధాన అనుచరుడు, టీడీపీ నేత డిష్ మురళి దౌర్జన్యాలకు తెరలేపాడు. వివరాలు... కళ్యాణదుర్గం పట్టణ సమీపంలో అత్యంత ప్రసిద్ధి చెందిన అక్కమాంబ దేవాలయం ఉంది. కొన్నేళ్లుగా ఈ ఆలయానికి ఒంటిమిద్ది, కురాకులతోట, దేవాదులకొండ గ్రామాల ప్రజల ఆధ్వర్యంలో కమిటీ మెంబర్లను ఎన్నుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం దేవాదులకొండ గ్రామానికి చెందిన రాము అనే వ్యక్తి ఆలయ కమిటీ చైర్మన్గా ఉన్నారు. ఏటా ఉగాది పండుగ అయిన మరుసటి రెండు రోజుల పాటు ఇక్కడ జాతర జరుగుతుంది. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచే కాక పొరుగున ఉన్న కర్ణాటక ప్రాంతం నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటుంటారు. ఈ నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో వందకు పైగా వివిధ రకాల దుకాణాలు ఏర్పాటవుతుంటాయి. ఇందుకు సంబంధించి ఆలయ కమిటీ సభ్యులు ఉగాదికి ముందుగానే టెండర్లు నిర్వహించి దుకాణాల నిర్వహణకు సంబంధించి అనుమతులు జారీ చేస్తారు. ఇలా వచ్చిన ఆదాయాన్ని ఆలయ అభివృద్ధి పనులకు ఉపయోగిస్తుంటారు. టీడీపీ నేత బరితెగింపు ఈ ఏడాది టీడీపీ నేత డిష్ మురళి బరితెగించి ఆలయ ఆదాయ వనరుల దోపిడీకి శ్రీకారం చుట్టాడు. ఇందులో భాగంగా సోమవారం ఆలయ ప్రాంగణంలో తిష్టవేసి ఉగాది తర్వాత దుకాణాలు నిర్వహించదలుచుకునే వారు తనకే డబ్బు చెల్లించాలని హుకుం జారీ చేశాడు. ఇదేమని పలువురు ప్రశ్నిస్తే ‘దేవుడికి ఇస్తే ఏమొస్తుంది. ఆలయం సొమ్మంతా మాదే. రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం కాబట్టి అందరూ మా మాటే వినాలి. లేకపోతే ఏ ఒక్కరూ ఇక్కడ దుకాణం పెట్టుకోలేరు’ అంటూ బెదిరింపులకు దిగాడు. అంతటితో ఆగకుండా ‘గుడి మొత్తం నా స్థలంలోనే ఉంది. ఎక్కువగా మాట్లాడితే గుడి కూడా నాదే. ఎవ్వరేమీ చేసుకోలేరు’ అంటూ దౌర్జన్యానికి తెరదీశాడు. దీంతో దుకాణాలు నిర్వహించేందుకు సిద్ధపడి వచ్చిన వారు మరోమాట మాట్లాడకుండా డబ్బు చెల్లించి పేర్లు నమోదు చేసుకున్నారు. ఒక్కొ దుకాణానికి రూ.1,500 చొప్పున వందకు పైగా దుకాణాల నిర్వాహకులతో బలవంతంగా డబ్బు వసూలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అక్కమాంబ ఆలయ ఆదాయ వనరుల దోపిడీ జాతరలో దుకాణాల ఏర్పాట్లపై ముందస్తుగానే వసూళ్లు ఇదేమని ప్రశ్నిస్తే దేవుడికన్నా తామే గొప్ప అంటూ టీడీపీ నేత బరితెగింపు -
బాబు తొలి సంతకంపైనే స్పష్టత లేదు
బీఎడ్ పూర్తి చేశా. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే డీఎస్సీ నోటిఫికేషన్పై ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకం చేశారు. కానీ, తొమ్మిది నెలలు కావస్తున్నా దీనిపై స్పష్టత లేకుండా పోయింది. నిరుద్యోగులను నట్టేట ముంచేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. నిరుద్యోగ భృతి మాటేమో కానీ ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. – మహాలింగ, కై రేవు, శెట్టూరు మండలం నిరుద్యోగ భృతి ప్రకటించాలి కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు అందిస్తామన్న భృతిపై ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. భృతి ఇస్తే ఎంతో తోడ్పాటు అందించినట్లు అవుతుంది. ప్రభుత్వ చేయూత లేక నిరుద్యోగులు గ్రామాల్లోనే చిన్నచిన్న పనులు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పటికై నా నోటిఫికేషన్లు విడుదల చేసి ఉద్యోగాలు భర్తీ చేయాలి. –రామాంజనేయులు, గార్లదిన్నె న్యాయం చేయాలి నేను డిగ్రీ చదివా. ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నా. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పింది. లేకుంటే రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. చంద్రబాబు మాటలు నమ్మి టీడీపీకి ఓటేశా. అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ భృతిపై ప్రకటన లేకుండా పోయింది. కనీసం బడ్జెట్లో కూడా పైసా కేటాయించలేదు. నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలి. – అశోక్కుమార్, కణేకల్లు -
కమనీయం.. ఖాద్రీశుని కల్యాణం
కదిరి: ప్రహ్లాద వరదుడు, వసంత వల్లభుడు, కాటమరాయుడిగా పూజలందుకుంటున్న ఖాద్రీ లక్ష్మీ నారసింహుని కల్యాణం కమనీయంగా సాగింది. భక్తులు వేలాదిగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. నవ వధువులుగా అలంకృతులైన శ్రీదేవి, భూదేవితో పాటు వరుడు లక్ష్మీ నారసింహుడు రాత్రి 9.30 గంటల ప్రాంతంలో యాగశాల నుంచి పల్లకీపై కల్యాణ మండపం చేరుకున్నారు. అప్పటికే అక్కడ కిక్కిరిసిన భక్తజనం నోట శ్రీవారి గోవింద నామస్మరణ మార్మోగి పోయింది. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి విచ్చేసిన అర్చక పండితులు శ్రీవారి కల్యాణోత్సవ విశిష్టతను భక్తులకు వివరించారు. ముక్కోటి దేవతలు వీక్షించే స్వామివారి వివాహాన్ని సాక్షాత్తు బ్రహ్మదేవుడే ముందుండి జరిపిస్తున్నారని అర్చక పండితులు తెలియజేశారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య శ్రీవారికి ప్రతిరూపంగా విచ్చేసే కంకణ భట్టాచార్యులు మంగళ సూత్రాలను శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు అలంకరించారు. అనంతరం భక్తులందరికీ శ్రీవారి తలంబ్రాలు పంచిపెట్టారు. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు తీసుకొచ్చారు. అంతకుముందు ఆయన ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. లోకేష్ రాకతో ఆలయ ప్రాంగణం టీడీపీ శ్రేణులతో నిండిపోయింది. దీంతో సామాన్య భక్తులు శ్రీవారి కల్యాణోత్సవాన్ని కనులారా వీక్షించలేకపోయారు. ధ్వజారోహణంతో దేవతలకు ఆహ్వానం నృసింహుని బ్రహ్మోత్సవాలను నలుదిక్కులా చాటేందుకు సోమవారం ఉదయం ప్రధాన ఆలయం ముందున్న ధ్వజ స్తంభానికి అర్చక పండితులు గరుడ దండాన్ని ధ్వజారోహణం చేశారు. సకల దేవతలకు ఇదే శ్రీవారి బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రిక..అని ప్రధాన అర్చకులు నరసింహాచార్యులు పేర్కొన్నారు. పాల్గుణ కృష్ణ అష్టమి నాడు అంటే ఈ నెల 22న జరగనున్న తీర్థవాది ఉత్సవం రోజున శ్రీవారి చక్రస్నానం అనంతరం ఈ గరుడ దండాన్ని అవరోహణం చేస్తారు. దీంతో ఖాద్రీశుని బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. -
అర్జీలిస్తూనే ఉన్నా స్పందన లేదు
సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించాలి అనంతపురం అర్బన్: సమస్యల పరిష్కారం కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని బాధితులు వాపోయారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో ప్రజల నుంచి కలెక్టర్ వినోద్కుమార్తో పాటు డీఆర్ఓ ఎ.మలోల, డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, తిప్పేనాయక్, రామ్మోహన్, జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజల నుంచి 419 వినతులు అందాయి. వినతుల్లో కొన్ని... ● ‘పీఎం’ కిసాన్ డబ్బు అందడం లేదని ఆత్మకూరు మండలం తలపూరుకు చెందిన పి.ఎర్రి స్వామి విన్నవించాడు. 2.30 ఎకరాల్లో చీనీ పంట ఉందని, ‘పీఎం కిసాన్’ కింద డబ్బులు అందించాలని కోరాడు. ● వితంతు పింఛను ఇప్పించాలంటూ శింగనమల మండలం గోవిందరాయునిపేట గ్రామానికి చెందిన మంజుల అంజనమ్మ విన్నవించింది. తన భర్త వెంకటేష్ గత ఏడాది జనవరి 8న మరణించాడని, అప్పట్లో ఆయనకు వృద్ధాప్య పింఛను వచ్చేదని చెప్పింది. ● తన తండ్రి మరణ ధ్రువీకరణ పత్రం ఇప్పించాలని పుట్లూరు మండలం ఎస్.తిమ్మాపురం గ్రామానికి చెందిన జి.రవినాథ్రెడ్డి విన్నవించాడు. త్వరగా తగిన చర్యలు తీసుకోవాలని వేడుకున్నాడు. పరిహారం తక్కువిచ్చారు సజ్జలదిన్నె పొలం సర్వే నంబరు 338–1–64, 339–2–74లో మాకు 6 ఎకరాలు ఉంది. జాతీయ రహదారి 544– డీ నిర్మాణం కోసం అందులో 23 సెంట్లు తీసుకున్నారు. ఆరు ఎకరాల్లో వేసిన కంది పంటనూ తొలగించారు. రూ.5.75 లక్షల పరిహారం రావాల్సి ఉంటే ఒక్క రూపాయి ఇవ్వలేదు. తహసీల్దారు కార్యాలయం, కలెక్టరేట్లో చాలా సార్లు అర్జీ ఇచ్చాను. సమస్య పరిష్కారం కాలేదు. – ఇంజా లక్ష్మిరెడ్డి, వెంకటరెడ్డిపల్లి, తాడిపత్రి మండలం జాతీయ రహదారి 544–డీలో భాగంగా మాకున్న 4 సెంట్ల స్థలంతో పాటు ఇంటిని కోల్పోయాం. 15 ఏళ్ల వేపచెట్లు మూడు తొలగించారు. కేవలం రూ.2.30 లక్షల పరిహారం ఇచ్చారు. మా ఊరిలో చాలా మందికి రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పరిహారం అందింది. అందరితో సమానంగా పరిహారం ఇచ్చి ఆదుకోవాలి. అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నా సమస్య పరిష్కారం కాలేదు. – సుంకులమ్మ, సీపురం, శింగనమల మండలం అనంతపురం అర్బన్: చిన్నపాటి సమస్యలు జిల్లా కేంద్ర కార్యాలయాలకు రాకుండా క్షేత్రస్థాయిలోనే పరిష్కరించాలని కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశించారు. సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘‘తిప్పుకుని... తప్పుకుంటున్నారు’’ కథనానికి కలెక్టర్ స్పందించారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ వారం నుంచి తహసీల్దారు కార్యాలయాల తనిఖీ చేపడతామన్నారు. జాయింట్ కలెక్టర్, ఆర్డీఓలు వారానికి ఒక తహసీల్దారు కార్యాలయాన్ని తనిఖీ చేయాలని ఆదేశించారు. దీనికి సంబంధించి ఇన్స్పెక్షన్ ప్రొఫార్మా సంబంధిత కార్యాలయాలకు పంపిస్తామన్నారు. తనిఖీకి వచ్చినప్పుడు ‘వన్ సర్వే నంబర్– వన్ఫైల్’ విధానం అమలును పరిశీలిస్తామన్నారు. చుక్కల భూమికి సంబంధించి ప్రజాసేవ పోర్టల్లో పెండింగ్ ఉన్నవాటిని పరిష్కరించాలన్నారు. మండలస్థాయిలో ప్రజాసేవలు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఉద్యోగులకు సన్మానం పెన్షన్ పంపిణీ ఒకటో తేదీ మొదటి గంటలో 100 శాతం పూర్తి చేసిన వారిని కలెక్టర్ సన్మానించారు. ‘బెస్ట్ పెర్ఫార్మెన్స్’ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. జిల్లా ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ దాతల భాగస్వామ్యం (పీ4) పోస్టర్లను ఆవిష్కరించారు. లక్ష్యాలను పూర్తి చేయాలి ఉపాధి హామీ పథకం, ఇతర కార్యక్రమాల కింద కేటాయించిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశించారు. తన క్యాంపు కార్యాలయం నుంచి డ్వామా పీడీ, డీఎల్డీఓలు, ఎంపీడీఓలు, మునిసిపల్ కమిషనర్లు, ఏపీడీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. బాధితుల ఆవేదన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’కు 419 వినతులు -
పతాక స్థాయికి నిరుద్యోగం
● గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్లు ఉన్నా ఫలితం శూన్యం ● ఎంఎస్ఎంఈలు ఏర్పాటు కాక చిన్న ఉద్యోగాలకూ దిక్కులేని వైనం ● 20 లక్షల ఉద్యోగాలిస్తామని ముఖం చాటేసిన చంద్రబాబు ● భృతి ఇస్తామని చెప్పి రిక్తహస్తం చూపడంపై నిరుద్యోగుల మండిపాటు అనంతపురం నగరంలోని ఓ హోటల్లో రెండు రోజుల క్రితం ఓ ప్రముఖ జ్యువెలరీ సంస్థ సేల్స్మెన్ ఉద్యోగాలకు నిర్వహించిన వాక్ఇన్ ఇంటర్వ్యూలకు పోటెత్తిన నిరుద్యోగులు వీరు. ఇంజినీరింగ్ మొదలు ఎంబీఏ పట్టభద్రుల వరకు వందల మంది హాజరయ్యారు. దీంతో హోటల్ ప్రాంగణం కిక్కిరిసి పోయింది. చిన్న సేల్స్మెన్ ఉద్యోగం కోసం వచ్చిన వీరిని చూస్తే జిల్లాలో నిరుద్యోగ సమస్య ఎంతలా ఉందో అంచనా వేయొచ్చని పలువురు అభిప్రాయపడ్డారు. ● గార్లదిన్నెకు చెందిన రాజశేఖర్ ఇటీవల బీఎస్సీ పూర్తి చేశాడు. ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసినా రాలేదు. దీంతో ఆస్పత్రిలో ఔట్సోర్సింగ్ విధానంలో సెక్యూరిటీ గార్డుగా చేరాడు. మరో ఉద్యోగంలో చేరదామని ఎంత ప్రయత్నిస్తున్నా ఫలితం లేకపోతోందని రాజశేఖర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ● రాప్తాడుకు చెందిన శీనయ్య అనంతపురంలో బీకాం పూర్తి చేశాడు. తన అర్హతకు తగిన జాబు కోసం కొన్ని నెలలుగా ప్రయత్నించినా ఎక్కడా దొరకలేదు. దీంతో ఇటీవల ఓ పెట్రోలు బంకు యజమాని వద్ద నిర్వహణ మేనేజర్గా చేరాడు. రేయింబవళ్లు పనిచేస్తే రూ.12 వేలు వేతనం. వీరే కాదు.. ఉమ్మడి జిల్లాలో ఎంతో మంది నిరుద్యోగులది ఇదే పరిస్థితి. -
పెట్టుబడి కూడా అందలేదు
కక్కలపల్లి టమాట మండీకి వచ్చిన సరుకు అనంతపురం అగ్రికల్చర్: టమాటను నమ్ముకున్న రైతులు ఈ సారి కూడా భారీగా నష్టాలు మూటకట్టుకున్నారు. జిల్లాలో ఏకంగా ఖరీఫ్, రబీలో ఈ ఏడాది 45 వేల ఎకరాల భారీ విస్తీర్ణంలో టమాట సాగులోకి వచ్చింది. ఈ సారి 8 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా దిగుబడిని రైతులు సాధించారు. టన్ను సరాసరి కనిష్టంగా రూ.15 వేలు ప్రకారం అమ్ముడుబోయినా ఈ సారి రూ.1,200 కోట్ల మేర టర్నోవర్ ఉండేదని అంచనా. కానీ మార్కెట్ హెచ్చుతగ్గుల కారణంగా 80 శాతం మంది రైతులు భారీగా నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల పరిధిలో అనంతపురం జిల్లాలో 45 వేల ఎకరాల టమాట సాగులో మొదటి స్థానంలో ఉండగా... 22 వేల ఎకరాలతో శ్రీసత్యసాయి జిల్లా రెండో స్థానంలో ఉండటం విశేషం. ఆ తర్వాత అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు, వైఎస్సార్ జిల్లాలు ఉన్నాయి. నాలుగు నెలలుగా పతనావస్థలో.. సీజన్ ఆరంభమైన జూలై నుంచి అనంతపురం సమీపంలో ఉన్న కక్కలపల్లి మండీలో టమాట అమ్మకాలు మొదలయ్యాయి. మొదట్లో పరిస్థితి ఆశాజనకంగా ఉండటంతో రైతులు టమాట సాగుపై ఎక్కువగా దృష్టి పెట్టారు. ఫలితంగా సెప్టెంబర్ నుంచి పంట దిగుబడులు, మార్కెట్కు సరుకు రావడం పెరిగింది. ధర కొంచెం బాగున్నప్పుడు మధ్య మధ్యలో వర్షాలు రావడంతో పంట తడిసిందని, మచ్చ ఉందంటూ మండీ నిర్వాహకులు, వ్యాపారులు ‘నో సేల్’ పెట్టడంతో చాలా మంది రైతులకు అసలుకే మోసపోయారు. ఇలా డిసెంబర్ వరకు టమాట అమ్ముడుపోక కొందరు రైతులు తల్లడిల్లిపోయారు. ఇక డిసెంబర్ నుంచి మార్కెట్ పూర్తిగా పతనమైంది. గరిష్ట ధర రూ.10, కనిష్టం రూ.5, సరాసరి రూ.7 చొప్పున గత మూడు నెలలుగా మార్కెట్లో ధరలు కొనసాగుతుండటంతో టమాట రైతులు పూర్తిగా చిత్తయ్యారు. నాలుగైదు లాట్ల గరిష్ట ధర రూ.10 ప్రకారం అమ్ముడుబోగా మిగతాదంతా రూ.5 నుంచి రూ.7 కి మించి ధర పలకలేదు. దీంతో చాలా మంది రైతులు.. కూలీలు, రవాణా ఖర్చులు కూడా రాదని గ్రహించి పంటను పొలాల్లోనే వదిలేశారు. ‘కూటమి’ మోసం.. జిల్లాలోని 31 మండలాల్లో ఖరీఫ్లో 42 వేల ఎకరాలు, రబీలో 3 వేల ఎకరాల్లో టమాట సాగు చేసినట్లు ఉద్యానశాఖ నివేదికలు చెబుతున్నాయి. టమాట రైతులు ఇబ్బంది పడకుండా కిలో రూ.8 చొప్పున టన్ను రూ.8 వేలతో కొనుగోలు చేస్తామని కూటమి ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది. అయితే ఆచరణకు వచ్చేసరికి మార్కెటింగ్శాఖ ద్వారా ఇటీవల కేవలం 60 టన్నులు అంటే రూ.4.80 లక్షల విలువ చేసే టమాట మాత్రమే కొనుగోలు చేసి చేతులెత్తేసింది. అనంతపురం మండీకి ప్రస్తుతం కొంత తగ్గినా డిసెంబర్ నుంచి పరిగణనలోకి తీసుకుంటే రోజుకు సగటున 500 టన్నుల వరకు సరుకు వస్తోంది. కనీసం రోజుకు 100 టన్నులైనా కొనుగోలు చేస్తే కొంత వరకు రైతులకు వెసులుబాటు ఉంటుంది. కానీ సీజన్ అంతా కొన్నది కేవలం 60 టన్నులు మాత్రమే అంటే రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. నాలుగు నెలలుగా గిట్టుబాటు ధర లేక భారీగా నష్టాలు కిలో రూ.8 చొప్పున కొంటామని చెప్పిన కూటమి ప్రభుత్వం కేవలం 60 టన్నులతో చేతులెత్తేసిన మార్కెటింగ్ శాఖ రాష్ట్రంలోనే అత్యధికంగా 45 వేల ఎకరాల్లో టమాట పంట ఎకరాకు రూ.50 వేలకు పైగా పెట్టుబడి పెట్టి రెండున్నర ఎకరాల్లో టమాట సాగు చేశా. పంట దిగుబడి బాగా వచ్చింది. మార్కెట్లో గిట్టుబాటు ధర లేక భారీగా నష్టపోయాను. ఇటీవల మండీలో 15 కిలోల బాక్సు రూ.70కు మించి పలకలేదు. అంటే కిలో రూ.5 చొప్పున కూడా కొనుగోలు చేయడం లేదు. మొదటి నాలుగైదు కోతల్లో నాణ్యమైన కాయ ఉన్నా కొనలేదు. పెట్టుబడి మాట దేవుడెరుగు కనీసం కూలీలు, రవాణా ఖర్చులు కూడా చేతికి అందలేదు. ఇలా అయితే రైతులు ఎలా బతకాలి. – సుధాకర్, టమాట రైతు, దయ్యాలకుంటపల్లి, బీకేఎస్ మండలం -
ప్రభుత్వానికి సత్తా చూపుదాం
అనంతపురం కార్పొరేషన్: యువతతో పాటు అన్ని వర్గాలనూ దగా చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ఈ నెల 12న జరిగే ‘యువత పోరు’ కార్యక్రమం ద్వారా మన సత్తా ఏంటో చూపుదామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు.సోమవారం నగరంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ‘యువత పోరు’ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ‘అనంత’ మాట్లాడుతూ ఈ నెల 12న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవమన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో తమ పార్టీ చరిత్ర సృష్టించిందన్నారు. ఆ రోజున విద్యార్థులు, యువతకు అండగా నిలిచేందుకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. అనంతపురం జెడ్పీ కార్యాలయం నుంచి ప్రారంభమై సప్తగిరి సర్కిల్, సూర్యనగర్ సర్కిల్, సంగమేశ్ సర్కిల్ మీదుగా కలెక్టరేట్కు ర్యాలీ చేరుకుంటుందన్నారు. కలెక్టర్కు వినతి పత్రం అందించి ప్రభుత్వానికి హెచ్చరిక చేయబోతున్నామన్నారు.జిల్లాలోని ప్రతి నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు, యువత, విద్యార్థులు, తల్లిదండ్రులు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 9 నెలలవుతున్నా ఒక్క హామీ నెరవేర్చలేదని దుయ్యబట్టారు. ఇటీవల బడ్జెట్లోనూ సరైన కేటాయింపులు చేయలేదన్నారు. పేద విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసించాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెట్టారని, దీంతో ఎంతో మంది వైద్యులు, ఇంజినీర్లుగా ఎదిగారని గుర్తు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ‘వసతి దీవెన’ పథకం కింద హాస్టల్ ఖర్చులు అందజేశారని తెలిపారు. రూ.4,500 కోట్ల బకాయిలు.. ఫీజు బకాయిలు విడుదల చేసే వరకూ సీఎం చంద్రబాబును వదిలేది లేదని ‘అనంత’ స్పష్టం చేశారు. ఎన్నికల ముందు అన్ని విధాల ఆదుకుంటామని చెప్పి మోసం చేశారని విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద రూ.4,500 కోట్ల బకాయిలున్నాయని, వాటిని తక్షణం చెల్లించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి రూ.3 వేలు, 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మాట తప్పారన్నారు. ఈ విషయాలపై కనీసం బడ్జెట్లో కూడా ప్రస్తావించకపోవడం దుర్మార్గమన్నారు. వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రంలో 17 వైద్య కళాశాలలకు శ్రీకారం చుడితే... కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేట్ పరం చేయడానికి సిద్ధమైందన్నారు. అందరూ సంఘటితమై ఈ ప్రభుత్వ మెడలు వంచుదామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, మేయర్ వసీం, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్ రెడ్డి, అహుడా మాజీ చైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్, వైఎస్సార్ సీపీ నేతలు రమేష్ గౌడ్, కొండ్రెడ్డి ప్రకాష్రెడ్డి, ఆలమూరు శ్రీనివాస్ రెడ్డి, సాకే చంద్రశేఖర్, చంద్రశేఖర్ యాదవ్, చింతకుంట మధు, చింతా సోమశేఖర్ రెడ్డి, కృష్ణవేణి, ఉమ్మడి మదన్మోహన్ రెడ్డి, గౌని నాగన్న, మల్లెమీద నరసింహులు, సైఫుల్లాబేగ్, అమర్నాథ్రెడ్డి, కేశవరెడ్డి, మిక్చర్ రామకృష్ణా రెడ్డి, లబ్బే రాఘవ, దత్తా, అనిల్కుమార్ గౌడ్, రాధాకృష్ణ, కై లాష్, శ్రీదేవి, శోభారాణి, దేవి, శోభాబాయి, పార్వతి, భారతి, కార్పొరేటర్లు ఇసాక్, సాకే చంద్రలేఖ, లావణ్య, సుమతి, ఉష తదితరులు పాల్గొన్నారు. యువతకు అండగా నిలుద్దాం ఫీజు బకాయిలు విడుదల చేసే వరకూ బాబును వదిలేది లేదు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి -
నేడు కలెక్టరేట్లో ఫిర్యాదుల స్వీకరణ
అనంతపురం అర్బన్: ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్లో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వి.వినోద్కుమార్ తెలిపారు. రెవెన్యూ భవన్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ కార్యక్రమం సాగుతుందన్నారు. కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొంటారని, ప్రజలు తమ సమస్యలను క్లుప్తంగా అర్జీ రూపంలో తెలియజేయాలని సూచించారు. పట్టుకుంది 144.. కేసులో చూపింది 52! పుట్లూరు: తనిఖీల్లో 144 మద్యం బాటిళ్లు పట్టుపడితే.. కేసులో కేవలం 52 మాత్రమే చూపి పోలీసులు తమ నైజాన్ని బయటపెట్టుకున్నారు. వివరాలు.. పుట్లూరు మండలం చెర్లోపల్లి – నారాయణరెడ్డిపల్లి గ్రామాల మధ్య శనివారం రాత్రి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆటోలో మూడు కేసుల్లో మొత్తం 144 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే టి.నరసింహులు అనే వ్యక్తి 52 మద్యం బాటిళ్లు తరలిస్తూ పట్టుబడినట్లు కేసు నమోదు చేసి, చేతులు దులుపుకున్నారు. ఈ విషయం బహిర్గతం కావడంతో మిగిలిన 92 మద్యం బాటిళ్లు ఎవరి కోసం దాచారో చెప్పాలని పలువురు ప్రశ్నిస్తున్నారు. అక్రమంగా కేసుల నమోదుకు ఈ బాటిళ్లను అడ్డు పెట్టనున్నారా? లేదా పోలీసులే గుట్టుగా మద్యం వ్యాపారం సాగిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తం చేశారు. రాయదుర్గంలో జోరుగా పావురాల పందేలు రాయదుర్గంటౌన్: నియోజకవర్గ కేంద్రం రాయదుర్గంలో పావురాల పందేలు జోరుగా సాగుతున్నాయి. పావురాలను గాల్లోకి ఎగరవేసి వాటిలో ఏది ముందుగా గమ్యాన్ని చేరితే దానిని విజేతగా ప్రకటిస్తారు. ఈ క్రమంలో రూ. లక్షల్లో బెట్టింగ్ సాగుతోంది. ఆదివారం పావురాలను ఎగుర వేసి వాటి రాక కోసం పట్టణ శివారులోని పైతోట వద్ద జాతీయ రహదారిపై పెద్ద సంఖ్యలో పందెం రాయుళ్లు గుమికూడారు. దీంతో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. తెలుగు తమ్ముళ్ల కొట్లాట గుత్తి: బోరు బిల్లుల విషయంలో టీడీపీలో రెండు వర్గాల మధ్య కొట్లాట జరిగింది. వివరాలు.. ఎన్నికలకు ముందు, తర్వాత బోరు వేసిన బిల్లులు ఇప్పటి వరకూ చెల్లించలేదని, వీటిని వెంటనే మంజూరు చేయించాలంటూ టీడీపీ కార్యాలయంలో శనివారం రాత్రి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తనయుడు ఈశ్వర్ ఎదుట బోరు రిగ్గు నిర్వాహకుడు నాగరాజు వాపోయాడు. దీంతో అక్కడే ఉన్న టీడీపీ నేత చౌదరి జోక్యం చేసుకుని వాగ్వాదానికి దిగాడు. అక్కడే ఉన్న పలువురు నేతలు జోక్యం చేసుకుని సర్దిచెప్పడంతో అప్పటికి వివాదం సద్దుమణిగింది. అనంతరం ఇదే అంశాన్ని తనకు అత్యంత సన్నిహితుడైన గుత్తి ఆర్ఎస్కు చెందిన రాజాకు చౌదరి తెలిపాడు. దీంతో రాజా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే నాగరాజుకు ఫోన్ చేసి దుర్భాషలాడాడు. ఎంత ధైర్యముంటే చౌదరితో వాదనకు దిగుతావ్ అంటూ గద్దించాడు. అదే స్థాయిలో బోర్ రిగ్గు నిర్వాహకుడు కూడా సమాధానమివ్వడంతో ఇద్దరి మధ్య ఫోన్లోనే మాటల యుద్ధం సాగింది. దమ్ముంటే గాంధీ సర్కిల్కు రావాలంటూ ఇద్దరూ సవాల్ విసురుకున్నారు. అక్కడితో ఆగకుండా గాంధీ సర్కిల్ వద్ద రాత్రి 11 గంటల సమయంలో పెద్దసంఖ్యలో తమ అనుచరవర్గాలను దింపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సకాలంలో అక్కడకు చేరుకుని ఇరువర్గాల వారిని చెదరగొట్టారు. -
ఖాద్రీశుడి కల్యాణము చూతము రారండి
కదిరి: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న శ్రీవారి కల్యాణోత్సవం సోమవారం రాత్రి 9 గంటలకు జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి లోకేష్ స్వామివారికి పట్టువస్త్రాలు తీసుకొస్తారని స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ మీడియాకు తెలిపారు. శ్రీవారి కల్యాణోత్సవాన్ని భక్తులందరూ కనులారా వీక్షించేందుకు ఆలయ, పోలీసు అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు. వేదికపై అర్చకులు మాత్రమే కూర్చునే విధంగా అధికారులు నిర్ణయించారు. కల్యాణోత్సవం జరిపేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కొందరు అర్చక పండితులు హాజరుకానున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా నలుమూలల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు శ్రీవారి కల్యాణోత్సవానికి పెద్ద సంఖ్యలో హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. ● స్వామివారిని జిల్లా కలెక్టర్ వినోద్కుమార్ సతీసమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు కలెక్టర్ను సత్కరించి, స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. ఘనంగా అంకురార్పణ.. ముందుగా అర్చకులు శాస్త్రోక్తంగా అంకురార్పణ గావించి బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. మంగళ వాయిద్యాల మధ్య నారసింహుడు రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఆలయానికి నైరుతి దిశలో ఉన్న మండపానికి చేరుకున్నారు. అర్చక పండితులు నిర్ణీత పునీత ప్రదేశంలో ‘భూమిపూజ’తో పుట్ట మన్ను సేకరించి, ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. యాగశాలలో ఆ మట్టితో నింపిన 9 పాలిక(కుండ)లలో నవ ధాన్యాలతో అంకురార్పణ (బీజావాపం) చేశారు. ఈ నవధాన్యాలు దిన దినాభివృద్ధి చెందేలా అర్చకులు బ్రహ్మోత్సవాలు పూర్తయ్యే వరకూ రోజూ నీరు పోసి పచ్చగా మొలకెత్తేలా చూస్తారు. ఏ ధాన్యం బాగా మొలకెత్తుతుందో ఆ పంట ఈ యేడాది బాగా పండుతుందని ఈ ప్రాంత ప్రజల నమ్మకం. బ్రహ్మోత్సవాల్లో నారసింహుడు ఈ పక్షం రోజుల పాటు యాగశాలలోనే గడిపి, ఇక్కడి నుంచే తన భక్తులకు దర్శన భాగ్యం కల్గిస్తారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం నేడు స్వామివారి కల్యాణోత్సవం -
అంగన్వాడీలపై ఉక్కుపాదం!
తాడిపత్రి రూరల్: అంగన్వాడీలపై చంద్రబాబు ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయ కుండా మోసపూరితంగా వ్యవహరిస్తున్న వైనంపై నిరసన తెలిపేందుకు అంగన్వాడీలు సోమవారం విజయవాడలో మహా ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో జిల్లా నుంచి మహా ధర్నా కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న అంగన్వాడీలను ఎక్కడికక్కడ పోలీసులతో చంద్రబాబు ప్రభుత్వం అడ్డుకుంది. పైగా వారిని భయపెట్టేందుకు సెక్టార్ మీటింగ్ అంటూ డ్రామాకు తెరలేపింది. మహా ధర్నాకు బయలుదేరిన తీవ్ర పరిణామాలు ఉంటాయని ఐసీడీఎస్ అధికారులు హెచ్చరికలకు దిగారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు అంగన్వాడీల కదలికలపై నిఘా ఉంచారు. ముందస్తు నోటీసులు అందించారు. అయినా విజయవాడ మహాధర్నాకు వెళ్తున్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లను బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద పోలీసులు అడ్డుకున్నారు. యూనియన్ నాయకుల ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలకూ వెనుకాడలేదు. అంగన్వాడీ సెంటర్లను మూసివేసి ధర్నాకు వెళ్లే వారి వివరాలను సేకరించాలని గ్రామ సచివాలయ మహిళా పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. అయితే, ఎన్ని అడ్డంకులు సృష్టించినా మహా ధర్నాకు వెళ్లి తీరుతామని అంగన్వాడీలు తెలిపారు. అంగన్వాడీల డిమాండ్లు ఇలా... ● అంగన్వాడీలకు నెలకు రూ.28 వేల వేతనంతో పాటు గ్రాట్యుటీ అమలు చేయాలి. ● హెల్పర్ల పదోన్నతులపై విధివిధానాలను అమలు చేయాలి. ● ఇంటి అద్దెలు, టీఏ బిల్లులు మంజూరు చేయాలి. ● సర్వీస్లో మృతి చెందిన వారికి మట్టి ఖర్చుల కింద రూ. 20 వేలు ఇవ్వాలి. ● ప్రీ స్కూల్ను బలోపేతం చేసి ‘తల్లికి వందనం’ అమలు చేయాలి. ● ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇవే హామీలు ఇచ్చారని, వీటిని వెంటనే అమలు చేయాలని అంగన్వాడీలు డిమాండ్ చేస్తున్నారు. భయపడేది లేదు.. కూటమి ప్రభుత్వం చేస్తున్న బెదిరింపులకు అంగన్వాడీలు భయపడరు. ప్రభుత్వ మెడలు వంచైనా హామీలను నెరవేర్చుకుంటాం. గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అంగన్ వాడీలను గుర్రాలతో తొక్కించినా భయపడలేదు. ప్రస్తుతం మహాధర్నాను అడ్డుకోవడానికి శత విధాలా ప్రయత్నిస్తున్నారు. – శకుంతల, ఉమ్మడి జిల్లా అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు సెలవు ఇవ్వం ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం ఎవరికీ సెలవు ఇవ్వడం లేదు. సెక్టార్ మీటింగ్ పెట్టుకోవాలని ఆదేశాలు ఉన్నాయి. ప్రభుత్వం అమలు చేయనున్న పథకాల గురించి వివరించడానికి సూపర్వైజర్లు మీటింగ్ పెట్టుకుంటున్నారు. అంగన్వాడీలపై ఎలాంటి ఒత్తిళ్లు, బెదిరింపులు చేయడం లేదు. – సాజిదాబేగం, సీడీపీఓ, తాడిపత్రి -
తిప్పుకుని.. తప్పుకుంటున్నారు!
● ‘నీటి కుళాయి కోసం అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదు. కుళాయి కనెక్షన్ ఇప్పించేలా చూడండి’ అంటూ తాడిపత్రి మండలం చిన్నపొలమడ గ్రామానికి చెందిన సూర్యప్రకాష్ జనవరి 27న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్కు వినతి పత్రం అందజేశాడు. ● తాము నివాసముంటున్న 9వ వార్డులో మురికి కాలువ నిర్మాణం కోసం గ్రామసభలో తీర్మానం చేసినా పనులు చేపట్టలేదని, తగిన చర్యలు తీసుకోవాలని గార్లదిన్నె మండలం కల్లూరుకు చెందిన మహమ్మద్ రఫీ ఈనెల 3వ తేదీన ‘పరిష్కార వేదిక’లో కలెక్టర్కు విన్నవించుకున్నాడు. ● ‘ఇంటి స్థలం సర్వే నంబరు 506–4లో ప్లాట్ నంబరు 86 హద్దులు పోయాయి. అధికారులకు చెప్పి హద్దులు చూపించండి’ అంటూ కూడేరు మండలం సంగమేశ్వర కాలనీకి చెందిన బషీర్ అహమ్మద్ ఈనెల 3న పరిష్కార వేదికలో అధికారులను కోరాడు. .... ఇవన్నీ గ్రామ, మండల స్థాయిలో పరిష్కారం కావాల్సిన సమస్యలే. కానీ, అక్కడి అధికారులు పట్టించుకోకపోవడంతో చేసేది లేక ప్రజలు జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకొస్తున్నారు. ఒకటి రెండు కాదు ప్రతి వారం పదుల సంఖ్యలో ఇలాంటి సమస్యలు ఉంటున్నాయి. సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి ఏస్థాయిలో పరిష్కారం కావాల్సిన సమస్యలు ఆస్థాయిలోనే పరిష్కారం కావాలి. ఇక నుంచి ప్రత్యేకంగా తహసీల్దారు, రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్ని తనిఖీ చేస్తాం. వాటి స్థాయిలో పరిష్కారం కావాల్సిన సమస్యలను పరిశీలించి ఎన్ని పరిష్కరించారు.. ఎన్ని పెండింగ్ ఉన్నాయి..ఎందుకు పెండింగ్ పెట్టారు.. అనేదానిౖపై విచారణ చేస్తాం. అర్జీదారులతో కూడా ఫోన్ ద్వారా మాట్లాడి ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. – వి.వినోద్కుమార్, కలెక్టర్ అనంతపురం అర్బన్: గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు అధికారులు బాధ్యతగా విధులు నిర్వర్తించి ప్రజా సమస్యలకు సంతృప్తికర పరిష్కారం చూపించాల్సి ఉన్నా ఇలాంటి పరిస్థితి జిల్లాలో ఎక్కడా కానరావడం లేదు. ప్రజలకు జవాబుదారీగా ఉంటూ వారి సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరించాలనే ఆలోచన ఇక్కడి అధికారులు, సిబ్బందిలో కరువవుతోంది. దీంతో అర్జీదారులు జిల్లా కేంద్రంలో నిర్వహించే ‘పరిష్కార వేదిక’ను ఆశ్రయిస్తున్నారు. అర్జీల్లో అత్యధికంగా రెవెన్యూకు సంబంధించినవే ఉంటున్నాయి. అటు తరువాత సర్వే, భూరికార్డుల శాఖ, పోలీసు శాఖకు సంబంధించి ఉంటున్నాయి. నిర్లక్ష్య ధోరణి... అవినీతి! మండలస్థాయిలో సమస్యలు పరిష్కారం కాకపోవడానికి ప్రధానంగా కొందరు అధికారులు, సిబ్బందిలో నిర్లక్ష్యధోరణి, అవినీతి కారణమనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. సమస్యలు పరిష్కరించండంటూ చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదంటూ కొందరు.. డబ్బులు డిమాండ్ చేస్తున్నారంటూ మరికొందరు అర్జీ రూపంలో తమ సమస్యతో పాటు ఫిర్యాదును పరిష్కార వేదికలో కలెక్టర్, అధికారులకు దృష్టికి తీసుకొస్తుండటమే ఇందుకు నిదర్శనం. మండల స్థాయిలో పరిష్కారం కాని ప్రజాసమస్యలు వ్యయ ప్రయాసలకోర్చి కలెక్టరేట్కు వస్తున్న బాధితులు కిందిస్థాయి అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు -
యువతకు అండగా నిలుద్దాం
అనంతపురం కార్పొరేషన్: కూటమి ప్రభుత్వ పాలనలో దగా పడుతున్న యువతకు అండగా నిలిచేందుకు వైఎస్సార్సీపీ తలపెట్టిన యువత పోరును జయప్రదం చేద్దామంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం ఐక్య విద్యార్థి, కుల సంఘాల నాయకులతో కలసి అనంతపురంలోని ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డిమాండ్ల సాధనలో భాగంగా ఈ నెల 12న ఉదయం 10 గంటలకు అనంతపురంలోని జెడ్పీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకూ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ ఉంటుందన్నారు. తాము అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, తదితర హామీలను నెరవేరుస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు, లోకేష్ హామీనిచ్చి మోసం చేశారన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సచివాలయ వ్యవస్థ ద్వారా 1,35,000 మందికి, వైద్య రంగంలో 75,000 మందికి ఉద్యోగాలను కల్పించిందన్నారు. పేదరికం చదువుకు అడ్డు రాకూడదని ఫీజురీయింబర్స్మెంట్ను పక్కాగా అమలు చేశారన్నారు. కానీ కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకుండా దగా చేసిందన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో కేవలం 11 వైద్య కళాశాలలు మాత్రమే ఉండేవని, వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు చర్యలు చేపట్టిందన్నారు. ఇందులో 5 కళాశాలల్లో 2,550 మంది విద్యార్థులకు అడ్మిషన్లు సైతం కల్పించారన్నారు. అయితే కూటమి ప్రభుత్వం కొన్ని కళాశాలలు వద్దని కేంద్రానికి లేఖరాయడమే కాక, మిగిలిన వాటిని ప్రైవేట్ పరం చేయాలనే కుట్ర సాగించడం దుర్మార్గమన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్బీ జిల్లా ప్రధాన కార్యదర్శి పృథ్వీ, పీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు మంజుల నరేంద్ర, జీవీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు మల్లికార్జున నాయక్, ఎస్సీ జనసంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కుళ్లాయప్ప, ఏఐఎస్బీ జిల్లా అధ్యక్షుడు బిల్లే జగదీష్, ఎస్వీఎస్ఎఫ్బీసీ చక్రధర్ యాదవ్, ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జేన్నే చిరంజీవి, బీసీ ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కేశవ గౌడ్, జీపీఎస్ జిల్లా అధ్యక్షులు సాకే ఆనంద్, వైఎస్సార్ విద్యార్థి విభాగం నగరాధ్యక్షుడు కైలాష్ తదితరులు మాట్లాడారు. వైఎస్సార్సీపీ చేపడుతున్న ఆందోళనను జయప్రదం చేస్తామన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్గౌడ్ -
యువతపోరు విజయంతం చేద్దాం
బెళుగుప్ప: నిరుద్యోగ యువత, విద్యార్థుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ నెల 12న వైఎస్సార్సీపీ తలపెట్టిన యువతపోరు కార్యక్రమాన్ని విజయంతం చేద్దామంటూ ఆ పార్టీ ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. బెళుగుప్ప మండలం కాలువపల్లిలో వైఎస్సార్సీపీ మండల బీసీసెల్ అధ్యక్షుడు వెంకటేశులు స్వగృహంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిరుద్యోగ భృతికి బడ్జెట్లో నిధులు కేటాయించకుండా ప్రభుత్వం మొండి చెయ్యి చూపిందన్నారు. ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి తల్లికి వందనం పేరుతో ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున ఇస్తామని గత ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీకి దిక్కు లేదన్నారు. ఇలాంటి మోసాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. ఈ నెల 12న కలెక్టరేట్ ఎదుట తలపెట్టిన ఆందోళన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు పాల్గొనాలని కోరారు. కుప్పంకు నీటిని తరలించేందుకే హంద్రీనీవా లైనింగ్ పనులు.. కేవలం కుప్పం ప్రాంతానికి నీటిని తరలించాలనే లక్ష్యంతో జిల్లా రైతుల ఆశలకు శాశ్వతంగా సమాధి కడుతూ హంద్రీనీవా కాలువకు లైనింగ్ పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోందని విశ్వ మండిపడ్డారు. జిల్లా రైతుల సంక్షేమాన్ని సీఎం చంద్రబాబు పూర్తి విస్మరించారన్నారు. లైనింగ్ పనులు పూర్తయితే భూగ్బజలాలు అడుగంటి ఉద్యాన పంటలు పూర్తిగా దెబ్బతింటాయన్నారు. తక్షణమే లైనింగ్ పనులు ఆపడమే కాక జిల్లాలోని 3.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. హంద్రీనీవా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టే ప్రతి కార్యక్రమానికీ పార్టీలకు అతీతంగా రైతులందరూ బాసటగా నిలవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీసీ సెల్ అధికార ప్రతినిధి వీరన్న, సర్పంచ్ పెద్దన్న, డీసీసీబీ మాజీ డైరెక్టర్ శివలింగప్ప, అంకంపల్లి సర్పంచ్ రుద్రానంద, మాజీ సర్పంచ్ తిమ్మన్న, పార్టీ సీనియర్ నాయకులు మోహన్, శ్రీనివాసరెడ్డి, చందూ, కృష్ణారెడ్డి, మధుసూదన్రెడ్డి, తిప్పేస్వామి, వెంకటేశులు తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి -
‘వెలుగు’లో టీడీపీ నేత చిచ్చు
కుందుర్పి: స్వలాభం కోసం వెలుగు పథకంలో పనిచేస్తున్న ఏపీఎం, సీసీల మధ్య ఓ టీడీపీ నేత చిచ్చు రగిల్చాడు. ఇది కాస్త దావాలనమై కార్యాలయం నాలుగు గోడల మధ్య రెండు రోజుల క్రితం భగ్గున మండింది. పరస్పర దూషణలతో ఏపీఎం, సీసీ రెచ్చిపోయారు. కుందుర్పి మండల వెలుగు కార్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఆడియో వైరల్ కావడంతో టీడీపీ నేత బండారం బట్టబయలైంది. ఏం జరిగిందంటే.. కుందుర్పి మండలంలో పనిచేస్తున్న ఏపీఎం సర్ధానప్ప తీరుతో గత రెండు రోజులుగా మండల సమాఖ్య కార్యాలయంలో పెద్ద వివాదం నెలకొంది. పలు గ్రామాలకు చెందిన సంఘాల సభ్యులకు సంబంధించి రుణాల మంజూరుకు సీసీలు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఏపీఎం దృష్టికి పంపారు. అయితే దీనిపై ఏపీఎం అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్థానిక టీడీపీ నేత సూచించిన వైఎస్సార్సీపీ సానుభూతిపరుల దరఖాస్తులను తిరస్కరించారు. దీనిపై సీసీలను బాధిత సభ్యులు నిలదీయడంతో ఇందులో తమ ప్రమేయం లేదని చేతులెత్తేశారు. రుణాల మంజూరు అంశం ఏపీఎం పరిధిలో ఉంటుందని సమాధానమిచ్చారు. కుర్చీలు విసురుకుని... రుణాల అంశంలో అన్యాయానికి గురైన పలువురు సభ్యులు రెండు రోజుల క్రితం వెలుగు కార్యాలయంలో ఏపీఎం, సీసీలను నిలదీశారు. అందరి సమక్షంలో ఏపీఎం తీరుపై అసహనం వ్యక్తం చేశారు. మండుటెండలో చెమటోడ్చి పనులు చేస్తున్నది టీడీపీ నేత కాదనే విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని హితవు పలికారు. వివక్ష మాని అందరినీ సమదృష్టి చూడాలని, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. దీంతో అక్కడే ఉన్న సీసీ తిమ్మప్పపై ఏపీఎం సర్దానప్ప తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. టీడీపీ నేత చెబితే పనిచేసి తీరాల్సిందేనని, తాను టీడీపీ నేత మాట వినప్పుడు మీరెందుకు వినరంటూ సీసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. నువ్వెంతంటే.. నువ్వెంత అని దూషించుకుంటూ కుర్చీలను విసిరారు. అక్కడే ఉన్న సీ్త్ర నిధి మేనేజర్ గోవిందు జోక్యం చేసుకుని సర్దిచెప్పారు. సీసీలు ఏమంటున్నారంటే.. ఘటనకు సంబంధించి పలువురు సీసీలు మాట్లాడుతూ.. తమ సంతకాలు లేకుండానే టీడీపీ నాయకులు చెప్పిన వారికి రుణాలు చేస్తానని ఏపీఎం సర్ధానప్ప చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ తమ సంతకాలు లేకుండానే టీడీపీ కార్యకర్తల కుటుంబసభ్యులకు ఏపీఎం రుణాలు మంజూరు చేయడం వివాదానికి కారణమైందన్నారు. ఇదేం పెద్ద సమస్య కాదు ‘ఔను వాళ్లిద్దరూ వాదులాడుకున్నారు. కార్యాలయంలోనే గొడవ పడ్డారు. ఈ విషయంగా వారిని ఎమ్మెల్యే అల్లుడు ధర్మతేజ పిలిపించి మందలించాడు. ఆ సమయంలో నేను విజయవాడలో ఉన్నా. సోమవారం కార్యాలయానికి ఏపీఎం, సీసీలను పిలిపించుకుని మాట్లాడుతాను. ఇదేం పెద్ద సమస్య కాదు’. – నారాయణస్వామి, ఏరియా కో ఆర్డినేటర్, వెలుగు, కళ్యాణదుర్గం టీడీపీ నేత చెబితే చేసి తీరాల్సిందేనంటూ స్వామి భక్తి చాటిన ఏపీఎం సీసీల సంతకం లేకుండానే రుణాలు మంజూరు చేసిన వైనం నాలుగు గోడల మధ్య పరస్పర దూషణలతో రెచ్చిపోయిన వెలుగు సిబ్బంది -
పీఏబీఆర్లో తగ్గుతున్న నీటిమట్టం
కూడేరు: మండలంలోని పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్)లో నీటి మట్టం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఆదివారం నాటికి జలాశయంలో 2.99 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇన్ఫ్లో పూర్తిగా నిలిచిపోయింది. శ్రీసత్యసాయి, అనంత, శ్రీరామరెడ్డి, ఉరవకొండ, కూడేరు తాగునీటి పథకాలకు 55 క్యూసెక్కులు, ధర్మవరం కుడికాలువకు లీకేజీ ద్వారా 35 క్యూసెక్కులు, నీటి ఆవిరి, ఇతర లీకేజీల రూపంలో మరో 40 క్యూసెక్కుల నీరు రోజూ బయటకు వెళుతోంది. అబ్బుర పరిచిన రాతిగుండు పోటీలు పెద్దవడుగూరు(యాడికి): మండల కేంద్రమైన యాడికి చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన రాతిగుండు ఎత్తు పోటీలు అబ్బుర పరిచాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన పది మందికి పైగా పోటీల్లో పాల్గొన్నారు. కర్ణాటకు చెందిన కర్ణ అనే యువకుడు గుండును సునాయాసంగా ఎత్తి మొదటి స్థానాన్ని కై వసం చేసుకున్నాడు. అలాగే రెండో స్థానంలో రాయదుర్గం నివాసి రాజశేఖర్, మూడో స్థానంలో డోన్ మండలం దొరసానిపల్లికి చెందిన చందు నిలిచారు. విజేతలను అభినందిస్తూ నగదు పురస్కారాలతో నిర్వాహకులు సత్కరించారు. జాతీయ రహదారిపై చైన్ స్నాచింగ్బుక్కరాయసముద్రం: మండలంలోని 44వ జాతీయ రహదారిపై ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును దుండగులు లాక్కెళ్లారు. పోలీసులు తెలిపిన మేరకు... అనంతపురంలోని కళ్యాణదుర్గం రోడ్డులో నివాసముంటున్న రమేష్, వనజ దంపతులు కొంత కాలంగా గార్లదిన్నెలో హోటల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం వనజ, తన కుమారుడిని స్కూటీ వాహనంపై ఎక్కించుకుని గార్లదిన్నెకు బయలుదేరింది. లోలూరు క్రాస్ వద్దకు చేరుకోగానే 44వ జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరు యువకులు అడ్రస్ అడిగే నెపంతో వనజ వాహనాన్ని ఆపారు. ఆ సమయంలో ఆమె దృష్టిని ఏమార్చి మెడలోని 3 తులాల బంగారు గొలుసు లాక్కొని ఉడాయించారు. ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
ప్రాణాలు బలిగొన్న ఈత సరదా
● కుంటలో ఈతకెళ్లి ఇద్దరు బాలుర మృతి హిందూపురం: ఈత సరదా ఇద్దరు చిన్నారులను బలిగొంది. వివరాలు... హిందూపురం సమీపంలోని అటోనగర్లో నివాసముంటున్న జహీర్ కుమారుడు రిహాన్ (14), సుహేల్, ఉమేరా దంపతుల కుమారుడు అయాన్ (12) స్థానిక పాఠశాలలో 7, 6 తరగతులు చదువుకుంటున్నారు. ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో తోటి స్నేహితులతో కలసి సమీపంలోని నీటి కుంటలో ఈత కొట్టేందుకు వెళ్లారు. లోతైన ప్రాంతానికి వెళ్లడంతో నీట మునిగిపోయారు. పిల్లల కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న వారు అక్కడకు చేరుకుని నీట మునిగిన ఇద్దరినీ వెలికి తీశారు. అప్పటికే అపస్మారక స్థితికి చేరుకున్న ఇద్దరినీ వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి చేర్చారు. చికిత్సకు స్పందించిక రిహాన్, అయాన్ మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఆటో నగర్ వాసులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి చేరుకున్నారు. చిన్నారుల మృతదేహాలను చూడగానే కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. ఘటనపై రెండో పట్టణ పీఎస్ సీఐ అబ్దుల్ కరీం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. బీటెక్ విద్యార్థిని అదృశ్యం ధర్మవరం అర్బన్: స్థానిక రామనగర్కు చెందిన ఓ బీటెక్ విద్యార్థిని కనిపించడం లేదు. అనంతపురం శివారులోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఆమె శనివారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. విద్యార్థిని తండ్రి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి, గాలింపు చేపట్టినట్లు రెండో పట్టణ పీఎస్ సీఐ రెడ్డప్ప తెలిపారు. -
కూటమి దగాపై కదం తొక్కాలి
అనంతపురం కార్పొరేషన్: విద్యార్థులు, నిరుద్యోగులను దగా చేస్తున్న కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ఈ నెల 12న వైఎస్సార్సీపీ తలపెట్టిన ‘యువత పోరు’లో కదం తొక్కాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో యువజన విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 12న ఉదయం 10 గంటలకు జెడ్పీ కార్యాలయం వద్ద నుంచి కలెక్టరేట్ వరకూ ర్యాలీ ఉంటుందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి, ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్వహణ అంశాలపై చంద్రబాబు ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య ధోరణిపై కలెక్టర్కు వినతి పత్రం అందజేస్తామన్నారు. ర్యాలీలో యువత భారీగా పాల్గొనాలని కోరారు. కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతున్నాఒక్క హామీని పూర్తిగా నెరవేర్చలేదన్నారు. పైగా రూ.1.30 లక్షల కోట్ల అప్పుల భారాన్ని ప్రజలపై మోపిందన్నారు. ‘తల్లికి వందనం’ తొలి ఏడాది ఎగనామం పెట్టారన్నారు. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా సీఎం చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. 20 లక్షల మందికి ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇస్తామని యువతను మోసం చేశారని విమర్శించారు. వైఎస్ జగన్ హయాంలో 17 ప్రభుత్వ వైద్య కళాశాలలకు శ్రీకారం చుడితే వాటిని ప్రైవేట్ పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోందని దుయ్యబట్టారు. యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం మెడలు వంచైనా యువతకు అండగా నిలుస్తామన్నారు. యువత భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్కు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. కార్యక్రమంలో వివిధ నియోజకవర్గాల యువజన విభాగం నాయకులు, తదితరులు పాల్గొన్నారు. 12న ‘యువత పోరు’కు భారీగా తరలిరావాలి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత పిలుపు -
ఉమ్మడి జిల్లా కబడ్డీ జట్ల ఎంపిక
గుంతకల్లు: ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు వైఎస్సార్ జిల్లా పులివెందుల వేదికగా జరిగే రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో ప్రాతినిథ్యం వహించే ఉమ్మడి అనంతపురం జిల్లా బాల, బాలికల కబడ్డీ జట్లను ఆదివారం గుంతకల్లులోని రైల్వే గ్రౌండ్లో ఎంపిక చేశారు. ఈ మేరకు అనంతపురం జిల్లా కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ లక్ష్మణ్, సెలక్షన్ కమిటీ సభ్యుడు రాఘవేంద్ర తెలిపారు. బాలికల విభాగంలో విష్ణు ప్రియ (అనంతపురం), వర్ష (ప్రసన్నాయపల్లి), నవ్యశ్రీ (తాడిపత్రి), సుచరిత (ఎస్కేయూ), జాను (చిన్మయనగర్), వర్షియా (తాడిపత్రి), హిమవతి (కొర్రపాడు), ప్రణతి (కూడేరు), షాజియా (ధర్మవరం) అనుశ్రీ (విడపనకల్లు), కీర్తన (ప్రసన్నాయపల్లి), తాడిపత్రికి చెందిన యజ్ఞ, నందిని చోటు దక్కించుకున్నారు. బాలురు విభాగానికి లోకేష్ (కౌకుంట్ల), మహమ్మద్ ఆసీఫ్ (ధర్మవరం), మహమ్మద్ ఉస్మాన్ (తాడిపత్రి), మల్లికార్జున (గుంతకల్లు), వరుణ్కుమార్ (బొమ్మనహళ్), పవన్కుమార్ (అనంతపురం), సునీల్ కుమార్ (గుంతకల్లు), చరణ్ (అనంతపురం), రాజు (అనంతపురం), వేణు (వైటీ చెరువు). హర్షవర్థన్ (తాడిపత్రి), ఏసురాజు (ధర్మవరం), విశ్వసందేష్ (అనంతపురం) ఎంపికయ్యారు. -
టీటీసీ పరీక్ష ఫలితాల విడుదల
అనంతపురం ఎడ్యుకేషన్: టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ (టీటీసీ)–2024 థియరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. www. bse.ap. gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని డీఈఓ ప్రసాద్బాబు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉత్తీర్ణత సర్టిఫికెట్లు జిల్లా కార్యాలయానికి చేరగానే అభ్యర్థులకు పత్రికల ద్వారా తెలియజేస్తామని పేర్కొన్నారు. 5,847 కేసుల పరిష్కారం అనంతపురం: జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన ‘జాతీయ మెగా లోక్ అదాలత్’లో 5,847 కేసులకు న్యాయమూర్తులు పరిష్కారం చూపారు. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా మొత్తం 24 బెంచ్లు నిర్వహించారు. బాధితులు రాజీకి సమ్మతించడంతో 886 క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు 80, మోటారు వాహన ప్రమాద పరిహార కేసులు 48, ప్రీ లిటిగేషన్ కేసులు 388 పరిష్కారమయ్యాయి. ప్రమాద కేసుల్లో బాధితులకు రూ. 3.83 కోట్లు పరిహారంగా అందించారు. సివిల్ కేసుల్లో రూ.2.82 కోట్లు, ప్రీ లిటిగేషన్ కేసుల్లో రూ.68 లక్షలు రాజీ ప్రకారం బాధితులకు ఇప్పించారు. లోక్అదాలత్ను జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షుడు, ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. శ్రీనివాస్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జి. శివప్రసాద్ యాదవ్ పర్యవేక్షించారు. జిల్లా కోర్టులో కక్షిదారులకు న్యాయమూర్తి జి. శ్రీనివాస్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. కిరికెర సర్పంచ్కు ఉత్తమ పురస్కారం హిందూపురం: పంచాయతీ స్వశక్తి అధినేత్రి ఉత్తమ పురస్కారాన్ని హిందూపురం మండలం కిరికెర పంచాయతీ సర్పంచ్ వైఎన్ భాగ్యమ్మ అందుకున్నారు. ఢిల్లీలో 5,6 తేదీల్లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి రాష్ట్రం నుంచి ఆరుగురు మహిళా ప్రజాప్రతినిధులను ఎంపిక చేశారు. అందులో ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి కిరికెర సర్పంచ్ భాగ్యమ్మ ఉన్నారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆమె మహిళా సాధికారత, ఫ్రెండ్లీ ఉమెన్, గ్రామ పంచాయతీల అభివృద్ధి గురించి క్లుప్తంగా ప్రసంగించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. దీంతో ఆమెను ఉత్తమ అవార్డుకు ఎంపిక చేశారు. అనంతరం సర్పంచ్ భాగ్యమ్మకు కేంద్ర గ్రామీణ అభివృద్ధి కమిషనర్ వినోద్కుమార్ చేతుల మీదుగా ‘పంచాయతీ స్వశక్తి అధినేత్రి పురస్కారం’తో పాటు జాతీయ ఉత్తమ ప్రశంసా పత్రం, షీల్డ్ అందించి అభినందించారు. ఖాద్రీ లక్ష్మీనారసింహుడి బ్రహ్మోత్సవాలకు వేళాయె..కదిరి: ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆదివారం అంకురార్పణ చేయనున్నారు. బ్రహ్మోత్సవాల్లో అంకురార్పణ ఘట్టానికి విశేష ప్రాధాన్యముంది. నవ ధాన్యాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అంటారు. బ్రహ్మోత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడంతో పాటు స్వామివారి ఆశీస్సులు పొందటమే అంకురార్పణ ఘట్ట ముఖ్య ఉద్దేశం. సూర్యుడు అస్తమించిన తర్వాతే అంటే రాత్రి సమయంలో ఈ అంకురార్పణ ఘట్టం నిర్వహిస్తారు. ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో నిర్వహించే అంకురార్పణ ఘట్టంలో అగ్నిహోమం ద్వారా బ్రహ్మ, గరుడ, శేష, సుదర్శన, వక్రతుండ, సోమ, శంత, ఇంద్ర, ఇసాన, జయ అనే సకల దేవతలను ఆహ్వానిస్తారు. నవధాన్యాల మొలక సకల దేవతల ఆహ్వానం అనంతరం భూమాతను ప్రార్థిస్తూ పాలిక (కొత్తకుండ)లను మట్టితో నింపుతారు. ఈ పాలికలకు నూతన వస్త్రాన్ని అలంకరించి పుణ్యాహవచనం గావిస్తారు. అనంతరం అర్చక పండితులు సోమరాజ మంత్రం, వరుణ మంత్రం, విష్ణుసూక్తం పఠిస్తారు. -
నేడు చంద్రమౌళీశ్వరుని బ్రహ్మ రథోత్సవం
ఉరవకొండ: గవిమఠం చంద్రమౌళీశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారి బ్రహ్మ రథోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా జరగనుంది. ఇప్పటికే గవిమఠం సహాయ కమిషనర్ కె.రాణి ఆధ్వర్యంలో సిబ్బంది విస్తృత ఏర్పాట్లు చేశారు. భక్తులకు తాగునీరు, నిత్యాన్నదాన సేవ, తాత్కాలిక మరుగు దొడ్లతో పాటు గవిమఠం ఆవరణలో పోలీసు కంట్రోల్ రూం, ఉరవకొండ సీహెచ్సీ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. రథోత్సవంలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా స్పెషల్ పార్టీ బలగాలు బందోబస్తు చేపట్టనున్నాయి. ఉత్సవాన్ని తిలకించడానికి ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచే కాకుండా కర్ణాటక నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. కాగా, బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి చంద్రమౌళీశ్వర స్వామి బసవేశ్వర వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. -
అమ్మాయిల సంఖ్య తగ్గడానికి కారణాలివే..
● లింగనిర్ధారణ నిరోధక చట్టం సరిగా అమలు కాకపోవడం. ● డయాగ్నస్టిక్ సెంటర్ల రిజిస్ట్రేషన్లు, రెన్యూవల్స్ సరిగా చేయకపోవడం. ● ఫిర్యాదులను పట్టించుకోకపోవడం. ● కేసులు నమోదవుతున్నా కఠిన చర్యలు తీసుకోకపోవడం. ● జిల్లా స్థాయి కమిటీల పర్యవేక్షణ లేకపోవడం. ● లింగనిర్ధారణ నిరోధక చట్టం అమలుకు నిధులు ఇవ్వకపోవడం. ● ఇచ్చిన నిధులు కూడా సరిగా వినియోగించకపోవడం. -
మహిళా సాధికారతతోనే దేశ పురోగతి
సమానత్వంతోనే జాతి మనుగడ అనంతపురం: మహిళా సాధికారతతోనే దేశ పురోగతి సాధ్యమని కలెక్టర్ వినోద్కుమార్ అన్నారు. శనివారం జేఎన్టీయూ(ఏ) ఆడిటోరియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్తో పాటు జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి, ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు, అసిస్టెంట్ కలెక్టర్ బి. వినూత్న, రాష్ట్ర ఎస్పీ కార్పొరేషన్ డైరెక్టర్ కమలమ్మ, ప్రశాంతి జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు సుశీలమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలపై నేరాలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.జిల్లాలో బాల్య వివాహాలు సమస్యగా తయారయ్యాయన్నారు. అసిస్టెంట్ కలెక్టర్ బి. వినూత్న జిల్లాలో బాగా పనిచేశారని, న్యూఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేసేందుకు వెళ్తున్నారని చెప్పారు. జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ మాట్లాడుతూ తన భర్త ప్రోత్సాహంతోనే అందరి ముందు ఉన్నానని పేర్కొన్నారు.అనంతరం ఐసీడీఎస్, సెర్ప్, మెప్మా, పోలీసు, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యేలు పరిశీలించారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.ప్రశాంతి సమాఖ్య , సీ్త్రనిధి, పరిశ్రమల శాఖ పరిధిలో పీఎంఈజీపీ కింద ఎంఎస్ఎంఈ రుణాలు, పీఎం విశ్వకర్మ, స్టాండప్ ఇండియా, ‘ముద్ర’, హ్యాండ్లూం, టెక్స్టైల్స్, మెప్మా పరిధిలో రుణాల చెక్లను మహిళలకు అందజేశారు. అనంతపురం: జాతి మనుగడకు సీ్త్ర, పురుష సమానత్వం ముఖ్యమని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. శ్రీనివాస్ అన్నారు. జిల్లా కోర్టులో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జిల్లా జడ్జి శ్రీనివాస్, కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి శ్రీనివాస్ మాట్లాడుతూ భూదేవికి ఉన్నంత ఓర్పు, సహనం మహిళలకు ఉంటుందన్నారు. మహిళల ప్రాధాన్యతను వివరించారు. జిల్లా కలెక్టర్ వినోద్కుమార్ మాట్లాడుతూ.. మహిళలకు జిల్లా యంత్రాంగం సహకారం అందిస్తుందన్నారు. ఈ సందర్భంగా ప్రకాష్ కంటి ఆసుపత్రి, అక్బర్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో 300 మంది పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో అదనపు జిల్లా న్యాయమూర్తి సత్యవాణి, బార్ ప్రెసిడెంట్ గురుప్రసాద్,ఆలిండియా బార్ కౌన్సిల్ మెంబర్ ఆలూరి రామిరెడ్డి, మహిళా కోర్టు జడ్జి శోభారాణి, పోక్సో కోర్టు జడ్జి రాజ్యలక్ష్మి, సీనియర్ సివిల్ జడ్జి నిర్మల, ఎకై ్సజ్ కోర్టు జడ్జి పావని పాల్గొన్నారు. -
బాలిక.. ఇంకా వెనక!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఐఐటీల్లో సీట్లు సాధిస్తున్నా.. సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా రాణిస్తున్నా.. జననాల పరంగా మాత్రం అమ్మాయిలు ఇంకా వెనుకబడే ఉన్నారు. 30 ఏళ్లుగా ఇదే దుస్థితి కొనసాగుతోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో గడిచిన ఐదు దశాబ్దాల్లో ఒక్కసారైనా అబ్బాయిల కంటే అమ్మాయిల సంఖ్య పెరగలేదు. తాజా సామాజిక, ఆర్థిక సర్వే ప్రకారం అమ్మాయిల సంఖ్యా పరంగా ఇప్పటికీ ఉమ్మడి అనంతపురం జిల్లా అట్టడుగున ఉన్నట్లు వెల్లడైంది. యథేచ్ఛగా లింగనిర్ధారణ.. ఉమ్మడి జిల్లాలో పలు రేడియోడయాగ్నస్టిక్స్ సెంటర్లలో యథేచ్ఛగా లింగనిర్ధారణ జరుగు తోంది. ఈ దురవస్థ వ్యాపారంగా సాగుతోంది. కొంతమంది గైనకాలజిస్టులు, రేడియాలజిస్ట్లు అత్యంత గోప్యంగా ఏజెంట్ల ద్వారా అబార్షన్లు నిర్వహిస్తున్నారు. జిల్లా ఆరోగ్యశాఖ అధికారులు డయాగ్నస్టిక్ సెంటర్లు, సంబంధిత డాక్టర్లపై చర్యలు తీసుకోలేకపోతున్నారు. వారసుల కోసం ఆరాటం.. ఆస్తిపాస్తులు లేకపోయినా చాలా కుటుంబాల్లో ‘మగపిల్లాడు ఉండాలి.. వారసుడు అంటే మగపిల్లవాడే’ అన్న మూఢ విశ్వాసంతో ఉన్నారు. మహిళ గర్భం దాల్చిందని తెలియగానే ముందుగా ఆడపిల్లా, మగపిల్లాడా అని తెలుసుకునేందుకు రకరకాల మార్గాలు ఎంచుకుంటున్నారు. తొలికాన్పులో ఆడపిల్ల పుట్టిన వారు రెండో కాన్పులోనైనా మగ పిల్లవాడి కోసం ఇలా చేయడం పరిపాటిగా మారింది. ఇలాంటి నమ్మకాల వల్ల కూడా ఆడపిల్లల సంఖ్య తగ్గుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు అమ్మాయిలు లేక అబ్బాయిలకు 30 ఏళ్లు దాటినా పెళ్లిళ్లు కావడం లేదు. అమ్మాయిల సంఖ్యలో చివరి స్థానంలో ‘ఉమ్మడి అనంత’ ప్రతి వెయ్యిమంది అబ్బాయిలకు 977 మందే అమ్మాయిలు సామాజిక ఆర్థిక సర్వేలో వెల్లడి -
మహిళాభ్యున్నతికి జగన్ పెద్దపీట
అనంతపురం కార్పొరేషన్: మహిళాభ్యున్నతికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. శనివారం నగరంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మహిళా విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ‘అనంత’.. ముందుగా దివంగత నేత వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి మహిళా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలన్నారు. మహిళలు ఆర్థిక ప్రగతి సాధించేందుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారన్నారు. ఐదేళ్ల కాలంలో ఏకంగా రూ.1,89,519 కోట్లను నేరుగా మహిళల ఖాతాల్లో జమ చేశారన్నారు. రూ.25,571 కోట్ల డ్వాక్రా రుణాలను నాలుగు విడతల్లో మాఫీ చేశారన్నారు. సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేసి ఏకంగా రూ.4,969.04 కోట్లను అందించారన్నారు. కూటమి ప్రభుత్వంలో సున్నా వడ్డీ పథకానికి తిలోదకాలిచ్చారని విమర్శించారు. ‘తల్లికి వందనం’ పథకానికి ఎగనామం పెట్టారన్నారు. మహిళల రక్షణ, భద్రత కోసం తెచ్చిన ‘దిశ’ను కూడా నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఎప్పుడు సీఎంగా ఉన్నా మహిళాభ్యున్నతి, మహిళల రక్షణ అనేవి మేడిపండు చందంగా ఉంటాయని ఎద్దేవా చేశారు. జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య మాట్లాడుతూ మహిళలను నిర్లక్ష్యం చేస్తున్న కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతామన్నారు. గత ప్రభుత్వంలో మహిళలకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూరిందన్నారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్పర్సన్ నాగరత్నమ్మ, వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్. కృష్ణవేణి, జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, ఉపాధ్యక్షురాలు యాడికి లక్ష్మిదేవి, మహిళా విభాగం నాయకులు ఆశాబీ, పార్వతి, సాకే చంద్రలేఖ, నాగలక్ష్మి, ఉష, ప్రసన్న, శోభాబాయి, శోభారాణి, దేవి, సంధ్యారాణి, విశాల రెడ్ది తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి -
మహిళా సాధికారతకు ఉపాధ్యాయినులే నిర్దేశకులు
అనంతపురం ఎడ్యుకేషన్: మహిళా సాధికారతరకు ఉపాధ్యాయినులే దిశా నిర్దేశకులు అని సర్వశిక్ష అభియాన్ ఏపీసీ శైలజ పేర్కొన్నారు. శనివారం స్థానిక ఉపాధ్యాయ భవనంలో ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా ఉపాధ్యక్షులు గాయత్రి అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఏపీసీ మాట్లాడుతూ మహిళా సాధికారత ఎంతో అవసరమన్నారు. ఇందుకు పాఠశాల స్థాయిలోనే పునాది పడాలని సూచించారు. బుక్కరాయసముద్రం ఎంపీపీ సునీత మాట్లాడుతూ మహిళలు తమ అవకాశాలు, హక్కులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత సుజాత మాట్లాడుతూ మహిళలపై సోషల్ మీడియా ప్రభావం తీవ్రంగా చూపుతోందన్నారు. వివక్షత లేనటువంటి సమాజం నిర్మించాలన్నారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు రఘురామిరెడ్డి, రాష్ట్ర పూర్వ కార్యదర్శి బి. నరసింహులు, రాష్ట్ర కార్యదర్శి పాతిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు రాయల్ వెంకటేష్, ప్రధాన కార్యదర్శి ఎస్ సిరాజుద్దీన్, నాయకులు సర్దార్వలి, కే. వన్నప్ప, సతీష్ కుమార్, నరేష్ కుమార్, ఈజీ నాగభూషణం, నారాయణస్వామి సూర్యనారాయణ, పట్నం శ్రీనివాసులు, హరినాథ్, రామచంద్ర, తిప్పేస్వామి, సోహెల్ ఓబులేసు, సాయప్ప, ఎల్లప్ప, గంగాధర్, రామమూర్తి, శ్రీనివాసమూర్తి పాల్గొన్నారు. -
మాటకు కట్టుబడి ఉన్నా
● ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే 7 నెలల్లో 7,500 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తాం ● 50 వేల మంది మహిళల సొంతింటి కలను చిదిమేసిన పరిటాల సునీత ● మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ధ్వజం రాప్తాడురూరల్: ‘ఈ ఈవీఎంలతోనో, మరేదో కారణంగానో గెలిచారు. నన్ను ఆర్థికంగా, రాజకీయంగా అణచివేయాలనే దురాలోచనతో రాష్ట్రంలోని 50 వేలమంది మహిళల సొంతింటి కలను పరిటాల సునీత చిదిమేశారు. ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే ఆలమూరు, కొడిమి జగనన్న కాలనీల్లో 7,500 ఇళ్లను 7 నెలల్లో పూర్తి చేస్తా. ఇది నా ఛాలెంజ్’ అని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి సవాల్ విసిరారు. శనివారం నగర శివారులోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పరిటాల సునీతకు అనంతపురం ఎమ్మెల్యే భయపడుతున్నారో లేదంటే ఇళ్ల నిర్మాణం బాధ్యతను వదులుకున్నారో తెలీదన్నారు. జన్మలో ఆమె కానీ, ఆమె భర్తకాని సొంత డబ్బుతో పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకొచ్చారా?, పేదలకు రూ.1.80 లక్షలతో ఇల్లు కట్టాలనే ప్రయత్నం చేశారా అని పరిటాల సునీతను ప్రశ్నించారు. దప్పికయినప్పుడు బావి తవ్వాలనే విధానం పేరూరు డ్యాంకు హంద్రీ–నీవా మడకశిర బ్రాంచ్ కెనాల్ నుంచి రొద్దం మండలంలోని పెన్నానది మీదుగా నీళ్లు తీసుకురావొచ్చని తాము చెప్పినా వినలేదన్నారు. దప్పికయినప్పుడు బావి తవ్వాలనే విధానంతోనే పరిటాల సునీత 2018లో జీడిపల్లి నుంచి పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకొచ్చేందుకు కాలువ నిర్మాణానికి టెండర్లు పిలిపించి 2019లో పనులు ప్రారంభించారన్నారు. ముందుగానే కాంట్రాక్టర్ నుంచి కమీషన్లు దండుకున్నారన్నారు. ఒక రూపాయి కూడా నిధులు తేలేదన్నారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత వారికి సంబంధించిన కాంట్రాక్టర్కు రూ.170 కోట్ల నిధులు ఇప్పించి పనులు వేగవంతం చేయించామన్నారు. పూర్తిస్థాయిలో పనులు అవ్వాలంటే పదేళ్లు పడుతుందని భావించి అప్పటిదాకా ఈ ప్రాంత రైతులను ఎండబెట్టడం సరికాదని, అప్పటి సీఎం జగనన్నతో మాట్లాడి ప్రత్యేకంగా మడకశిర బ్రాంచ్ కెనాల్ నుంచి పేరూరు డ్యాంకు ఒక టీఎంసీ నీళ్లు తీసుకొచ్చేందుకు జీఓ తెచ్చామన్నారు. తర్వాత దాతలు, రైతుల సహకారంతో 45 కిలోమీటర్ల మేర కాలువ నిర్మించి డ్యాంకు నీళ్లు తీసుకొచ్చామని గుర్తు చేశారు. పరిటాల సునీత తత్వం రైతులకు బోధపడింది ప్రస్తుతం శ్రీశైలం డ్యాంలో పుష్కలంగా నీళ్లున్నాయని, చంద్రబాబుతో పరిటాల కుటుంబం సన్నిహితంగా ఉంటోందని, పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకొచ్చేందుకు అవకాశాలున్నా పరిటాల సునీత ఏరోజూ చంద్రబాబుతోగాని, లోకేష్తో గాని మాట్లాడలేదన్నారు. తీరా మడకశిర బ్రాంచ్ కెనాల్కు నీళ్లు వదిలే సమయంలో రిపేరీల పేరుతో డ్యాంకు ఉన్న గేట్లు తీయించారన్నారు. వచ్చే ఏడాది నీళ్లిస్తామంటూ కట్టుకథలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిటాల సునీత తనకు లాభం లేనిదే ఏపనీ చేయరనే తత్వం రైతులకు బోధపడిందన్నారు. ఇక కమీషన్ల కోసమే హంద్రీ–నీవా కాలువ లైనింగ్ పనుల కోసం కక్కుర్తి పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. పేరూరు డ్యాం, చెరువులను ఎండబెట్టి మీ జేబులను మాత్రం కమీషన్లతో నింపుకుంటారా?అని ప్రశ్నించారు. సమావేశంలో వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నాయకులు న్యాయవాది కురుబ నాగిరెడ్డి, ఆత్మకూరు మండల కన్వీనర్ బాలపోతన్న, పార్టీ నాయకులు నీరుగంటి నారాయణరెడ్డి, మాదన్న, ఈశ్వరయ్య, వీరాంజి తదితరులు పాల్గొన్నారు. కౌంటరు దాఖలు చేయని దద్దమ్మ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాల నిలుపుదలపై రాక్రీట్ సంస్థ కోర్టుకు వెళ్తే...మీ చేతకాని చవట దద్దమ్మ ప్రభుత్వం ఇప్పటిదాకా కనీసం కౌంటర్ వేయలేదని ప్రకాష్రెడ్డి మండిపడ్డారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాకుండానే విజిలెన్స్ విచారణ ఏంటని, రాక్రీట్ సంస్థకు ఎందుకు బిల్లులు ఆపారని జడ్జిగారు ప్రశ్నిస్తే.... తమకు, ఆ సంస్థకు సంబంధం లేదని అడ్వొకేట్ జనరల్ చెప్పారని గుర్తు చేశారు. ఈ కేసు నుంచి ఏమీ సాధించలేమని భావించి కౌంటర్ వేయకుండా నిలిపేశారన్నారు. 9 నెలలుగా మీ ప్రభుత్వమే అధికారంలో ఉందని, విజిలెన్స్ విచారణలన్నీ పూర్తి చేశారన్నారు. మళ్లీ ఈరోజు సునీత అసెంబ్లీలో రాక్రీట్ సంస్థ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. -
ఉత్సాహంగా ఉట్ల పరుష
రాప్తాడు: అయ్యవారిపల్లిలో ఎర్రిస్వామి తాత ఉట్లపరుషను శనివారం వైభవంగా జరిగింది. ముందుగా ఆలయంలో వినాయకుడు, శ్రీరాముడు, ఎర్రిస్వామి తాత, గోటుకూరుప్ప స్వాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆనవాయితీ ప్రకారం అయ్యవారిపల్లి, బోమ్మేపర్తి, బుక్కచెర్ల, కాటిగానికాలువ గ్రామాలకు చెందిన యాదవ కులస్తులు ఉట్టికొట్టారు. ఈ దృశ్యాన్ని వేలాది మంది తిలకించారు. ఆలయం వద్ద బుల్లే పెద్దఇటుకనల్లప్ప, బండి పెదయ్య, బుల్లే వెంకటరాముడు, బుల్లే రాంభూపాల్ వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. భక్తాదులకు ఎటువంటి అసౌకార్యాలు కలగకుండా కాల్వగొంచి నిర్వాహకులు, గ్రామస్తులు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా రాప్తాడు సీఐ శ్రీహర్ష ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
గుత్తి రూరల్: శ్రీపురం గ్రామ శివారులో 67వ నంబర్ జాతీయ రహదారి పక్కన శనివారం బి.రవి(38) అనే భవన నిర్మాణ కార్మికుడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. శ్రీపురం గ్రామ శివారులో జాతీయ రహదారి పక్కన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లు సమాచారం అందుకున్న సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ సురేష్ సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతుడి ప్యాంటు జేబులో ఉన్న ఓటరు కార్డును స్వాధీనం చేసుకున్న పోలీసులు మృతుడు గుంతకల్లు ఉమామహేశ్వరనగర్కు చెందిన రవిగా గుర్తించారు. కుటుంబసభ్యులను ఆరా తీయగా శుక్రవారం రాత్రి 11 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు తెలిపారు. బేల్దారు పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడని, గుత్తి బండగేరికి చెందిన మణి అనే యువతిని వివాహం చేసుకున్నట్లు చెబుతున్నారు. ఐదు నెలల క్రితం భార్య తమకు చెప్పకుండా భర్త, పిల్లలను వదిలి పుట్టింటికి వెళ్లిపోయినట్లు తెలిపారు. మృతుడికి కుమార్తె గౌతమి, కుమారుడు గోవర్ధన్ ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుత్తి ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రవిది హత్యా లేక రోడ్డు ప్రమాదమా? శ్రీపురం గ్రామ శివారులో రవి మృతి హత్యనా లేక రోడ్డు ప్రమాదమా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఘటన స్థలంలోని ఆనవాళ్లు అనుమానాలకు తావిస్తున్నాయి. మృతదేహం పక్కన పెనుగులాట జరిగినట్లు పాదముద్రలు ఉన్నాయి. రవిని ఇద్దరు లేదా ముగ్గురు హత్య చేసి రోడ్డుపై నుంచి లాక్కొచ్చినట్లు జాడలు ఉన్నాయి. తల, భుజం, ఛాతీపై రక్త గాయాలున్నాయి. సంఘటనా స్థలానికి కొద్ది దూరంలో భవన నిర్మాణ పనులకు ఉపయోగించే తాపీ పడి ఉంది. కుటుంబసభ్యులు సైతం రవి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మాత్రం రవి బైక్పై గుత్తి వైపునకు వేగంగా వస్తూ బైక్ నుంచి రోడ్డుపై పడి తీవ్ర గాయాలతో మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయంపై సీఐ వెంకటేశ్వర్లును సంప్రదించగా రవి మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
సమాజంలో మహిళల పాత్ర కీలకం
అనంతపురం: సమాజంలో మహిళల పాత్ర కీలకమని ఎస్పీ పి. జగదీష్ అన్నారు. పోలీసు కాన్ఫరెన్స్ హాలులో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ అన్ని రంగాల్లోనూ మహిళలు అభివృద్ధి సాధించారన్నారు. ఏ పోటీ పరీక్షల్లోనైనా మహిళల ప్రతిభ చాటుతున్నారు. పోలీసు శాఖలో మహిళా సిబ్బంది పాత్ర ప్రశంసనీయమన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్లో ఉమెన్ హెల్ప్ డెస్క్ నిర్వహిస్తున్నామన్నారు. మహిళా సాధికారిత వారోత్సవాల్లో నిర్వహించిన జరిపిన వ్యాసరచన, పెయింటింగ్ పోటీల్లో ప్రతిభ చాటిన విద్యార్థినులకు ఎస్పీ ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. అంతకు ముందు జిల్లా పోలీసు కార్యాలయం నుంచి అర్అండ్బీ అతిథి గృహం, అంబ్కేర్ కూడలి, వై.జంక్షన్ల మీదుగా సప్తగిరి సర్కిల్ వరకు ర్యాలీ జరిగింది. అదనపు ఎస్పీ ఇలియాజ్ బాషా, అనంతపురం మహిళా పోలీస్స్టేషన్ డీఎస్పీ ఎస్. మహబూబ్బాషా, అనంతపురం అర్భన్ డీఎస్పీ వి. శ్రీనివాసరావు, ఏ.ఆర్ డీఎస్పీ నీలకంఠేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ అనుబంధ కమిటీల నియామకం అనంతపురం కార్పొరేషన్: క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా వైఎస్సార్సీపీ వ్యవస్థాపకులు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల్లో కొన్ని నియామకాలు చేపట్టింది. ఇందులో భాగంగా మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పేరం స్వర్ణలత, అధికార ప్రతినిధిగా ఆర్.కృష్ణవేణి, రాష్ట్ర కార్యదర్శులుగా భూమిరెడ్డి జాహ్నవి, బోయ సుశీలమ్మ, కేఎల్ దేవి, వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పాటిల్ రామకృష్ణారెడ్డి, కార్యదర్శిగా నూకల పట్టాభి రామసుబ్బయ్య గుప్తా, రాష్ట్ర ఇంటిలెక్చువల్ ఫోరం ప్రధాన కార్యదర్శిగా బాణ రాఘవేంద్ర, అధికార ప్రతినిధిగా డాక్టర్ పి.శంకరయ్య, కార్యదర్శిగా కట్టుబడి తానీష నియమితులయ్యారు. -
‘డాలీ’ సేవలు ప్రశంసనీయం
అనంతపురం: పోలీసు జాగిలం ‘డాలీ’ జిల్లా పోలీసు శాఖకు అందించిన సేవలు ప్రశంసనీయమని జిల్లా ఎస్పీ పి. జగదీష్ అన్నారు. గత 11 సంవత్సరాలుగా సేవలందించిన ‘డాలీ’ శనివారం విధుల నుంచి నిష్క్రమించింది. ఈ సందర్బంగా డాలీకి ఎస్పీ సన్మానం చేశారు. హ్యాండ్లర్ నాగభూషణను అభినందించారు. 2014 సంవత్సరంలో 6 నెలల వయస్సు ఉన్నపుడు డాలీని అనంతపురం జిల్లాకు కేటాయించారన్నారు. దాదాపు 300పైగా నేర ప్రదేశాల్లో శోధించిందన్నారు. సుమారు 30 నేరాల ఛేదనకు దోహదపడిందని వెల్లడించారు. ముగిసిన హెచ్చెల్సీ కోటా అనంతపురం సెంట్రల్: తుంగభద్ర జలాశయం హెచ్చెల్సీ కోటా శనివారంతో పూర్తయింది. దీంతో నీటిని నిలుపుదల చేశారు. అదనపు జలాలతో కలిపి మొత్తం 33.931 టీఎంసీలు ఈ ఏడాది హెచ్చెల్సీకి విడుదలయ్యాయి. తొలుత దామాషా ప్రకారం కేవలం 26 టీఎంసీలు కేటాయించారు. వర్షాలు కురిసి జలాశయం నిండడంతో హెచ్చెల్సీ కోటా 30.881 టీఎంసీలు, కేసీ కెనాల్ కోటా 3.50 టీఎంసీలు మొత్తం 33.931 టీఎంసీలు విడుదల చేశారు. ఈ క్రమంలో 90,355 ఎకరాలకు సాగునీటిని అందించారు. వాస్తవంగా గత నెలలోనే కోటా పూర్తి కాగా గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ కింద పంటలు చివరి దశలో ఉండడంతో అదనంగా 0.5 టీఎంసీలను కేటాయించారు. ప్రస్తుతం కణేకల్లు చెరువులో 0.227 టీఎంసీలు, పీఏబీఆర్లో 3.029 టీఎంసీలు, ఎంపీఆర్లో 0.835 టీఎంసీల నీటి నిల్వ ఉంది. పీఏబీఆర్ నీటిని రానున్న వేసవిలో తాగునీటి అవసరాలకు వాడుకోనున్నారు. ఎంపీఆర్లో నిల్వ ఉన్న నీటిని సౌత్ కెనాల్, నార్త్ కెనాల్స్కు వరుసగా 200 క్యూసెక్కులు, 90 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నారు. ఈ విషయంపై ‘సాక్షి’తో హెచ్చెల్సీ ఎస్ఈ రాజశేఖర్ మాట్లాడుతూ తుంగభద్ర జలాశయం నుంచి ఆశించిన స్థాయిలో నీళ్లు విడుదలయ్యాయన్నారు. అదనపు కోటా కలిపి 33.931 టీఎంసీలు విడుదల కావడంతో దాదాపు లక్ష ఎకరాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సాగు నీరు విడుదల చేశామన్నారు. -
ఆవుట్ స్టాండింగ్ రైల్వే ఉమెన్ ఎంప్లాయీగా రజిత
గుంతకల్లు: తిరుపతి డిపోలో టీటీఐగా పని చేస్తున్న ఎం.రజిత దక్షిణ మధ్య రైల్వే జోనల్ ఆవుట్ స్టాండింగ్ రైల్వే ఉమెన్ ఎంప్లాయీగా అవార్డు అందుకున్నట్లు సీనియర్ డీసీఎం మనోజ్ తెలిపారు. న్యూఢిల్లీలోని రైల్ నిలయం శనివారం రాత్రి రైల్వే ఉమెన్స్ వెల్ఫేర్ సెంటల్ర్ ఆర్గనేజేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రైల్వే బోర్డు చైర్మన్, సీఈఓ సతీష్కుమార్ ఆమెకు అవార్డు అందించారన్నారు. గతేడాది డిసెంబర్ 22న తిరుపతి–చిత్తూరు (12697) వెళ్లే ఎక్స్ప్రెస్ రైలులో ఏ2 కోచ్లో బెర్త్ నం.3లో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు దాదాపు రూ.రెండు లక్షలు విలువ చేసే బ్రాస్లెట్ను పోగొట్టుకున్నాడు. ఆ సమయంలో విధుల్లో ఉన్న టీటీఐ రజితకు దొరికిన బ్రాస్లెట్ను చిత్తూరు జీఆర్పీ పోలీసుల ద్వారా ప్రయాణికుడికి అందజేశారు. ఆమెను డీఆర్ఎం చంద్రశేఖర్గుప్తా, ఏడీఆర్ఎం సుధాకర్ ప్రత్యేకంగా అభినందించినట్లు ఆయన తెలిపారు.అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు గుంతకల్లు: రైళ్లలో ప్రయాణికుల నుంచి విలువైన వస్తువులు తస్కరిస్తున్న అంతర్రాష్ట్ర దొంగను అరెస్టు చేసినట్లు జీఆర్పీ సీఐ అజయ్కుమార్ తెలిపారు. శనివారం స్థానిక జీఆర్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆర్పీఎఫ్లతో కలిసి రైల్వేస్టేషన్లో తనిఖీలు చేస్తుండంగా ఏడో నంబర్ ప్లాట్ఫారామ్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు. వీరిలో ఒకరిని గుంటూరులోని సోమిరెడ్డి బజార్కు చెందిన హర్షవర్ధన్రెడ్డిగా గుర్తించామన్నారు. ఇతను ఎక్స్ప్రెస్ రైళ్లలో ప్రయాణిస్తూ నిద్రపోతున్న ప్రయాణికులు బ్యాగులు, విలువైన వస్తువులు తస్కరిస్తున్నట్లు తెలిపారు. హర్షవర్ధన్పై గుంతకల్లు, గుంటూరు, గుత్తి, ఆదోని, ఎర్రగుంట్ల తదితర ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయన్నారు. ఇతని వద్ద నుంచి సుమారు రూ.79 వేలు విలువ చేసే ఓ బంగారు డాలరుతోపాటు వెండి పట్టీలు, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకుని రిమాండ్ తరలించామన్నారు. జీఆర్పీ ఎస్ఐ మహేంద్ర, ఆర్పీఎఫ్ పోలీసులు పాల్గొన్నారు. -
రైతు సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వాలు
కూడేరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమాన్ని ఏమాత్రం విస్మరించాయని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్, రైతు సంఘం రాష్ట్ర నేత రాంభూపాల్ ధ్వజమెత్తారు. రైతు సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్తో రైతు సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర శనివారం ముద్దలాపురం చేరుకుంది. పాదయాత్రకు డాక్టర్ గేయానంద్, రాంభూపాల్ సంఘీభావం తెలిపారు. ముద్దలాపురంలో బ్యాడిగి మిర్చి పంటను పరిశీలించి రైతులతో మాట్లాడారు. తెగుళ్లతో పంట దిగుబడి బాగా తగ్గిపోయిందని, మార్కెట్లో గిట్టుబాటు ధరలేక తీవ్రంగా నష్ట పోయామని రైతులు వాపోయారు. అనంతరం డాక్టర్ గేయానంద్, రాంభూపాల్ మాట్లాడారు. పంటల సాగుకు పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి రాక అప్పులతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిరప రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, 2024–25 ఖరీఫ్, రబీ సీజన్లలో పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజు, కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు రాజారాంరెడ్డి, సహాయ కార్యదర్శి నాగేంద్ర కుమార్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి క్రిష్టమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
ఆర్డీటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
తాడిపత్రి టౌన్: ఆర్డీటీ ఆధ్వర్యంలో శుక్రవారం తాడిపత్రిలో అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి అశోక్ పిల్లర్ సర్కిల్ వరకూ ర్యాలీ కొనసాగింది. అనంతరం మానవహారం ఏర్పాటు చేసి నినాదాలు చేసారు. విద్యార్థులకు పలు క్రీడా పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేసారు. కార్యక్రమంలో ఆర్డీటీ సీఓ ఆంజనేయులు చౌడేశ్వరి, విజయభాస్కర్, నల్లపరెడ్డి, పాఠశాలల ప్రిన్సిపాళ్లు అమర్నాథ్, శివప్రసాద్, పీఈటీ శివప్రసాద్, దాదాఖలందర్, అబ్రహం, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఐటీ కోర్టీం విభాగానికి అవార్డు అనంతపురం: పోలీసు శాఖకు అత్యంత ఉపయోగకరమైన క్రైం క్రిమినల్ ట్రాకింగ్ అండ్ నెట్వర్కింగ్ సిస్టం, ఇంటరాపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టం అప్లికేషన్లను సమర్థవంతంగా వినియోగించుకోవడంతో జిల్లా ఐటీ కోర్టీం విభాగానికి అవార్డు దక్కింది. నేషనల్ క్రైం రికార్డు బ్యూరో ఈ అవార్డుకు ఎంపిక చేసింది. ఐటీ కోర్ టీం హెడ్ కానిస్టేబుల్ సుకుమార్ బాబుకు ఎస్పీ పి.జగదీష్ చేతుల మీదుగా అవార్డు అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండు అవార్డులు రాగా, ఒక అవార్డు అనంతపురం పోలీస్ టీంకు వచ్చింది. కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ వరకు ఒక కేటగిరీ, ఎస్ఐ ఆపై స్థాయి అధికారులకు మరో కేటగిరిలో అవార్డులు ప్రకటిస్తారు. ఐటీ కోర్ హెడ్కానిస్టేబుల్ సుకుమార్ బాబుకు ఈ అవార్డు దక్కింది. ఈ అవార్డును డీజీసీ కార్యాలయంలోని పీసీఎస్ విభాగానికి ఎన్సీఆర్బీ వారు పంపగా, అక్కడ నుంచి జిల్లాకు రావడంతో ఎస్పీ చేతుల మీదుగా శుక్రవారం అందజేశారు. 10న అప్రెంటిషిప్ మేళా అనంతపురం ఎడ్యుకేషన్: స్థానిక ప్రభుత్వ బాలురు ఐటీఐలో ఈ నెల 10న ఉదయం 10 గంటలకు ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిషిప్ (పీఎంఎన్ఏఎం) నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆ కళాశాల ప్రిన్సిపాల్ రామమూర్తి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఐటీఐ, ఇంటర్ ఒకేషనల్, నర్సింగ్ కోర్సు ఉత్తీర్ణులై ఎన్టీసీ పొందిన విద్యార్థులు అర్హులు. మేళాకు హాజరయ్యే అభ్యర్థులు ఒరిజనల్ సర్టిఫికెట్లతో పాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలు వెంట తీసుకెళ్లాలి. పూర్తి వివరాలకు 88868 85173లో సంప్రదించవచ్చు. -
చిప్లు అమర్చి.. అక్రమార్జన
అనంతపురం: కొన్ని పెట్రోల్ బంకుల్లో మోసాలకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. ఫిల్లింగ్ యంత్రాల్లో చిప్లు అమర్చి.. రీడింగ్ మీటరుపై చూపిన దానికంటే ఆరు నుంచి పది శాతం తక్కువ ఇంధనం నింపుతున్నారు. అనుమానం వచ్చి పరీక్షించినా ఎక్కడా దొరకకుండా అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకుంటూ వాహనదారుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. ఇది వరకు జిల్లాలో రెండు పెట్రోల్ బంకుల్లో చిప్ అమర్చి తక్కువ ఇంధనం పడుతున్నారని విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో తేలింది. తాజాగా అనంతపురంలోని నడిమి వంక నుంచి బళ్లారి బైపాస్కు వెళ్లే రోడ్డులోని విజయ ఫిల్లింగ్ స్టేషన్లో ఇదే తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీల్లో బయటపడింది. అదే పెట్రోల్ బంకులోనే రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ వైబీపీటీఏ ప్రసాద్ శనివారం విలేకరులతో మాట్లాడారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి లీటర్కు 60 నుంచి 100 ఎంఎల్ ఇంధనం తక్కువగా వాహనాలకు పడుతున్నారన్నారు. ఎవరైనా వాహనాలకు కాకుండా బాటిళ్లలో పెట్రోల్ పట్టాల్సి వచ్చినప్పుడు ఈ విధానాన్ని ఆఫ్ చేసే వీలుగా ఆపరేట్ చేస్తున్నారు. జిల్లాలో మరిన్ని పెట్రోల్ బంకుల్లో తనిఖీలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో విజిలెన్స్ సీఐలు శ్రీనివాసులు, సద్గురుడు తదితరులు పాల్గొన్నారు. -
స్వీపర్ సావిత్రమ్మ ‘సూపర్’
●వివిధ రంగాల్లో మహిళల ప్రతిభ ●పురుషులతో దీటుగా రాణిస్తున్న వైనం ఆది యందు ‘ఆమె’ ఉండెను అప్పటి నుంచీ అన్నీ ‘ఆమె’ అయెను... బడిలో, గుడిలో, నారుమడిలో.. ఆమెలేని చోటులేదు..ఆమెకు సాటి లేదు.. కలం పట్టినా...హలం దున్నినా.. అధికారం చూపినా..అక్కున చేర్చుకున్నా.. అంతా ఆమె...అన్నింటా ఆమె.. సృష్టి, స్థితి, లయకారులకూ ‘ఆమె’నే ధైర్యం.. ‘ఆమె’కెన్నో రూపాలు.. మనం కూడా ప్రతిరూపాలమే.. ఆమె ఒక ధైర్యం..ఆ ఆదరణ లేకపోతే అంతా శూన్యం.. ఆమెను తలిస్తే అన్నీ దర్శించినట్టే.. అందుకే ఆమె కోసం ఓ రోజు.. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బతుకుపాఠంలో చెరగని ముద్ర వేసిన మహిళా మణుల గురించి ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. గుంతకల్లుకు చెందిన సుంకన్న, సావిత్రమ్మ నిరుపేద దంపతులు. వీరికి ఒక అమ్మాయి, ఇద్దరబ్బాయిలు సంతానం. పదేళ్ల క్రితం భర్త కరెంట్ షాక్తో మరణించాడు. పిల్లలను ఉన్నత చదువులు చదివించి ప్రయోజకులుగా తీర్చిదిద్దాలన్న భర్త ఆశయాన్ని సావిత్రమ్మ ముందుకు తీసుకెళ్లాలని సంకల్పించింది. అవుట్సోర్సింగ్ కింద స్థానిక మున్సిపాలిటీలో స్వీపర్గా పనిచేస్తూ పిల్లలను చదివించింది. ఇంజినీరింగ్ చదివిన పెద్ద కుమారుడు దేవేంద్రనాథ్ ఇస్రోలో ఉద్యోగం సాధించాడు. కన్యాకుమారిలోని ఇస్రోలో గ్రూప్–సీ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాడు. చిన్న కుమారుడు ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. కుమార్తెకు వివాహం చేసి పంపింది. ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి పాసై 2019లో సావిత్రమ్మ బ్యాక్లాగ్ పోస్ట్కు ఎంపికై అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో పబ్లిక్హెల్త్ వర్కర్(స్వీపర్)గా పనిచేస్తోంది. తన తల్లి సహకారంతోనే తాను ఈస్థాయికి ఎదిగానని, స్వీపర్గా పనిచేస్తూనే తమను ప్రయోజకులుగా తీర్చిదిద్దిందని ఇస్రో శాస్త్రవేత్త దేవేంద్రనాథ్ సంతోషం వ్యక్తం చేశారు. – గుంతకల్లు టౌన్: నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం -
‘లైనింగ్’తో హంద్రీనీవాకు మరణశాసనం
అనంతపురం అర్బన్: హంద్రీ–నీవా కాలువకు లైనింగ్ పనులు తలపెట్టి ఆ ప్రాజెక్ట్కు మరణ శాసనాన్ని కూటమి సర్కార్ లిఖిస్తోందని ఉరవకొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వకర్త, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. హంద్రీ–నీవా కాలువకు పిలిచిన టెండర్లను రద్దు చేయడంతో పాటు లైనింగ్ పనులు ఆపేలా ప్రభుత్వాన్ని గట్టిగా కోరుతున్నామన్నారు. డిమాండ్ సాధనలో భాగంగా కలెక్టర్ వినోద్కుమార్ను శుక్రవారం కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో నాయకులతో కలసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏవీఎస్ఎస్ అధ్యక్షుడు కేవీరమణ, కూడేరు ఎంపీపీ నారాయణరెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వీర్ బైరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి వీరన్న, రైతులు చిన్నరంగారెడ్డి, ఎర్రిస్వామి, ఆదినారాయణ, ఆనంద్ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో విశ్వ మాట్లాడారు. అత్యంత దుర్మార్గం : జిల్లాకు ప్రాణప్రదమైన హంద్రీ–నీవా కాలువలో నీటి ప్రవాహ సామర్థ్యం 11 వేల క్యూసెకులుంటే రోజుకు ఒక టీఎంసీ చొప్పున కృష్ణానదికి వరదలొచ్చిన 40 రోజుల్లో 40 టీఎంసీలను తీసుకురావడానికి వీలవుతుందన్నారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని రైతు సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 6 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్థ్యం ఉండేలా కాలువ వెడల్పు చేసే పనులకు టెండర్లు పిలిచిందన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం వాటిని రద్దు చేసి కొత్తగా ఫేస్–1 కింద 3,850 క్యూసెక్కుల సామర్థ్యానికి టెండర్లు పిలవడమే కాక, రూ.192 కోట్ల ఎక్సెస్కు ఆమోదించడం అత్యంత దుర్మార్గమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హంద్రీ–నీవా లైనింగ్ పనులు కాంట్రాక్టర్లకు తప్ప జిల్లా రైతులకు ఎంత మాత్రం ఉపయోగపడవన్నారు. ప్రజలు చైతన్యవంతులు కావాలి జీడిపల్లి నుంచి ఉమ్మడి జిల్లా సరిహద్దున పుంగనూరు బ్రాంచ్ కాలువ అప్టేక్ వరకు హంద్రీ–నీవా కాలువకు లైనింగ్ చేయాలని ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఈ పనులు పూర్తయితే జిల్లా పరిధిలోని కాలువ పరివాహక ప్రాంతం చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ బోరుబావులతో పాటు గ్రామాల్లోని తాగునీటి బోర్లూ ఎండిపోయే పరిస్థితి నెలకొంటుందన్నారు. అంతేకాక భవిష్యత్తులో కాలువ సామర్థ్యాన్ని పెంచడానికి వీలుండదన్నారు. భూగర్భ జలాలు పెంపొందే పరిస్థితులు శాశ్వతంగా మూసుకుపోతాయన్నారు. కాలువలో ప్రవహించే వర్షపు నీరు కూడా భూమిలోకి ఇంకదన్నారు. ప్రభుత్వం సేకరించిన కాలువ భూమి ఆక్రమణలకు గురవుతుందన్నారు. గతంలో హంద్రీ–నీవా ప్రాజెక్టును ఐదు టీఎంసీల మంచినీటి ప్రాజెక్టుగా మార్చడానికి చేసిన ప్రయత్నాన్ని జిల్లా ప్రజలు అడ్డుకున్నారని, అదే స్ఫూర్తితో జిల్లా ప్రజానీకం చైతన్యవంతులై పార్టీలకు అతీతంగా అందరూ ఐక్యంగా రైతులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. కలెక్టర్కు వినతిపత్రం ఇస్తున్న వై.విశ్వేశ్వరరెడ్డి, తదితరులు సాగు, తాగునీటి కష్టాలు తప్పవు కూటమి ప్రభుత్వ చర్యలతో రైతుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతోందన్నారు. హంద్రీనీవా కాలువకు లైనింగ్ పనులు పూర్తయితే బోరుబావులు ఎండిపోయి సాగు, తాగునీటి కష్టాలు తీవ్రమవుతాయన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం గాలేరి–నగరిని హంద్రీ–నీవాకు అనుసంధానం చేయడం ద్వారా హంద్రీ–నీవా నుంచి చిత్తూరుకు వెళ్లాల్సిన నీటిని ఆదా చేసి... కర్నూలు, అనంతపురం జిల్లాలకు మాత్రమే వినియోగించుకునేలా చేపట్టిన చర్యలను కొనసాగించాలన్నారు. గాలేరి–నగరి ద్వారా కుప్పానికి సమృద్ధిగా నీటిని ఇచ్చే అవకాశమున్నా... అనంత జిల్లా రైతులను బలిచేసి ఆ ప్రాంతానికి నీటిని తీసుకెళ్లాలనుకోవడం సబబు కాదన్నారు. కాంట్రాక్టర్లకు తప్ప రైతులకు ఎలాంటి ప్రయోజనమూ లేదు మీడియాతో మాజీ ఎమ్మెల్యే విశ్వ లైనింగ్ పనులు ఆపాలంటూ కలెక్టర్ వినోద్కుమార్కు వినతిపత్రం -
కూతురి భవిత కోసం పోరాటం
భర్త అకాల మరణం.. చుట్టుముట్టిన అప్పులు.. అయినా ఆమె వెరవలేదు. వ్యవసాయంలో రాణిస్తూ కష్టాలను అధిగమిస్తూ కూతురికి ఉజ్వల భవిష్యత్తు అందించడం కోసం పోరాడుతోంది. వజ్రకరూరు మండలం పాతకడమలకుంట గ్రామానికి చెందిన సత్యనారాయణ, లలిత దంపతులు. వీరికి ఒక కుమార్తె ఉంది. తమకున్న ఐదెకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ కూతురును చదవించేవారు. నాలుగేళ్ల క్రితం కుమార్తె దీవెన ఎంబీబీఎస్లో చేరింది. ఏడాది తిరిగేలోపే సత్యనారాయణ అనారోగ్యం బారినపడ్డాడు. అప్పులు చేసి రూ.40లక్షలు వెచ్చించి వైద్యం చేయించినా ఫలితం లేకపోయింది. సత్యనారాయణ చనిపోయాడు. కూతురి ఎంబీబీఎస్ చదువు ఆగిపోయింది. అయితే లలిత మరికొంత భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ తన కుతూరు భవిష్యత్తు కోసం బయో మెడికల్ ఇంజినీరింగ్ కోర్సులో చేర్పించింది. – ఉరవకొండ: -
ఐరావతంపై చంద్రమౌళీశ్వరుడు
ఉరవకొండ: బ్రహ్మోత్సవాల్లో భాగంగా గవిమఠం చంద్రమౌళీశ్వరస్వామి శుక్రవారం ఐరావత వాహనంపై భక్తులకు శుక్రవారం దర్శనిమిచ్చారు. ఉదయం స్వామి వారికి మహారుద్రాభిషేకం, మంగళహారతి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గవిమఠం ఉత్తరాధికారి డాక్టర్ కరిబసవ రాజేంద్రస్వామి, ఆదోని చౌకి మఠం పీఠాధిపతి కళ్యాణస్వామిజీ, మఠం సహాయ కమిషనర్ కె.రాణి ఆధ్వర్యంలో చంద్రమౌళీశ్వరస్వామి మూలవిరాట్ను ఊరేగింపుగా ప్రత్యేక వాహనం వద్దకు తీసుకొచ్చారు. అనంతరం ఐరావత వాహనంపై ఉత్సవమూర్తిని ఉంచి భక్తు లు ఊరేగించారు. కార్యక్రమంలో మఠం ఏజెంట్ రాజన్నగౌడ్, మఠం జూనియర్ అసిస్టెంట్లు గోపి, నారాయణస్వామి, వీర సంక్షేమ సంఘం నాయకులు పాటిల్ నిరంజన్గౌడ్ పాల్గొన్నారు. -
నేడు జేఎన్టీయూలో మహిళా దినోత్సవం
అనంతపురం: జేన్టీయూ ఆడిటోరియంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం ఆడిటోరియంలో జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జ్ మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ మలోల, ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారి రామకృష్ణారెడ్డి, ఆర్డీఓ కేశవనాయుడు, ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి, సమగ్రశిక్ష ఏపీసీ శైలజ, డీఆర్డీఏ పీడీ ఈశ్వరయ్య, బీసీ కార్పొరేషన్ ఈడీ సుబ్రహ్మణ్యం, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి ప్రతాప్రెడ్డి పాల్గొన్నారు. 15లోపు సప్లి ఫీజు చెల్లించాలి అనంతపురం ఎడ్యుకేషన్: నగరంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో 2016–17 నుంచి 2018–19 విద్యాసంవత్సరాల డిగ్రీ విద్యార్థులకు మెగా సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ పద్మశ్రీ ఓ ప్రకటనలో తెలిపారు. 1 నుంచి 6 సెమిస్టర్ల విద్యార్థులకు ఈ పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. పరీక్ష ఫీజు ఈ నెల 15లోగా చెల్లించాలని సూచించారు. ఈ నెల 16 నుంచి 18 వరకు రూ. వెయ్యి అదనపు రుసుముతో చెల్లించవచ్చని, 19 నుంచి పరీక్షలు ప్రారంభమయ్యే వరకు రూ.3 వేల అదనపు రుసుముతో ఫీజు చెల్లించవచ్చని స్పష్టం చేశారు. మెగా సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 24న మొదలయ్యే అవకాశం ఉందని, దీనిపై త్వరలోనే స్పష్టత ఇస్తామని తెలిపారు. మరిన్ని వివరాలకు కళాశాలలో పరీక్షల విభాగాధిపతిని సంప్రదించాలని సూచించారు. -
ఫీజు పోరు జయప్రదం చేయండి
అనంతపురం కార్పొరేషన్: విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్న కూటమి సర్కారుకు బుద్ధి చెప్పేందుకు ఈ నెల 12న నిర్వహించే ‘ఫీజు పోరు’ను జయప్రదం చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పార్ట శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి నిధులు విడుదల చేయాలని, వైద్య కళాశాలల సంఖ్యను కుదించరాదని 12న ఉదయం పది గంటలకు జెడ్పీ కార్యాలయం నుంచి సప్తగిరి సర్కిల్, సంగమేష్ సర్కిల్ మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. అనంతరం కలెక్టర్కు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేస్తామన్నారు. అధికారంలోకి వస్తే విద్యారంగానికి పెద్దపీట వేస్తామని చెప్పిన చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ ఇప్పుడు మాట తప్పారన్నారు. విద్యారంగాన్ని పూర్తిస్థాయిలో నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రూ.3,900 కోట్ల ఫీజు బకాయిలు చెల్లించాల్సి ఉంటే రూ.700 కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. ఫీజురీయింబర్స్మెంట్ చెల్లించకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తీసుకొస్తున్నాయన్నారు. ఒత్తిడి తట్టుకోలేకపోయిన పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత వైఎస్సార్సీపీ హయాంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారన్నారు. 2014–19 టీడీపీ హయాంలో పెండింగ్లో ఉన్న రూ.1,900 కోట్ల బకాయిలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం చెల్లించిందన్నారు. 2019 నుంచి 24 వరకు ఐదేళ్ల పాలనలో ఉన్నత విద్యకే రూ.26 వేల కోట్లు ఖర్చు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కూటమి సర్కారు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చినా.. బడ్జెట్లో కేటాయింపులే లేవన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో కొత్తగా 16 వైద్య కళాశాలలు మంజూరు చేయిస్తే.. కొత్తవి అవసరం లేదని సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడం విడ్డూరంగా ఉందన్నారు. అంతేకాక పీపీపీ విధానంలో వైద్యకళాశాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారని, అలా చేస్తే వైద్యవిద్య పూర్తిగా ప్రైవేట్పరం అవుతుందని అన్నారు. వెడల్పు చేశాక లైనింగ్ చేపట్టండి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తదితరులకు రాయలసీమపై చిత్తశుద్ధి, ప్రేమ ఉంటే మొదట హంద్రీ–నీవా కాలువను వెడల్పు చేసి.. ఆ తర్వాత లైనింగ్ పనులు చేపట్టాలని అనంత డిమాండ్ చేశారు. రాయలసీమ కరువును చూపి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుని.. ఇక్కడి ప్రజలకు న్యాయం చేయకపోతే ఎలాగ అని ప్రశ్నించారు. వెడల్పు చేయకుండా లైనింగ్ పనులు చేపడితే భవిష్యత్తులో అధికంగా నీరు తెచ్చే పరిస్థితి ఉండదన్నారు. 40 టీఎంసీల సామర్థ్యంతో హంద్రీ–నీవా కాలువ తవ్వారని, అయితే 12 పంపులున్నా 2,200 క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తోందని అన్నారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో 6,300 క్యూసెక్కుల సామర్థ్యాన్ని పెంచుతూ జీఓను విడుదల చేశారన్నారు. కానీ కూటమి ప్రభుత్వం 3,850కే క్యూసెక్కులకు సరిపెట్టారన్నారు. పోలవరం ప్రాజెక్టు మరో రెండేళ్లలో పూర్తవుతుందని, గోదావరి జలాలను పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా బనకచర్లకు నీటిని తీసుకువచ్చి రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని చంద్రబాబు చెబుతుండడం సంతోషకర విషయమైనా.. బనకచర్ల ద్వారా అనంతపురం, చిత్తూరు జిల్లాలకు నీరు వచ్చే పరిస్థితి లేదన్నారు. కేవలం కర్నూలు, కడపకు మాత్రమే నీరు తీసుకెళ్లేందుకు వీలుంటుందన్నారు. 10 వేల క్యూసెక్కులకు హంద్రీ–నీవా కాలువ వెడల్పు చేయడానికి మంత్రి కేశవ్, టీడీపీ ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. అలా కాకుండా 3,850 క్యూసెక్కులకే పరిమితం చేస్తే రాయలసీమ ప్రజలకు ద్రోహం చేసిన వారిగా కూటమి పాలకులు చరిత్రలో నిలిచిపోతారన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు రమేష్గౌడ్, ఆలమూరు శ్రీనివాస్రెడ్డి, చింతకుంట మధు, సైఫుల్లాబేగ్, రాధాకృష్ణ, దత్తా, చంద్రశేఖర్ యాదవ్, కార్పొరేటర్లు కమల్భూషణ్, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు. విద్యారంగాన్ని నిర్వీర్యం చేసిన కూటమి ప్రభుత్వం ఫీజురీయింబర్స్మెంట్ అందక విద్యార్థులపై తీవ్ర ఒత్తిళ్లు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి -
అట్రాసిటీ చట్టం పటిష్టంగా అమలవ్వాలి
● అధికారులకు కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశం అనంతపురం అర్బన్: జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి నిజమైన బాధితులకు న్యాయం చేయాలని అధికారులను కలెక్టర్ వి.వినోద్కుమార్ సంబంధిత ఆదేశించారు. ‘పౌర హక్కుల పరిరక్షణ, అత్యాచార నిరోధక చట్టం’ అంశంపై జిల్లా స్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎస్పీ పి.జగదీష్తో కలసి కలెక్టర్ మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ కేసుల్లో బాధితులకు పరిహారం అందించాలని చెప్పారు. ఇందుకు ప్రభుత్వం నుంచి రూ.58 లక్షలు నిధులు వచ్చాయన్నారు. ఎస్సీ కార్పొరేషన్ పరిధిలో భూములకు సంబంధించి వివరాల జాబితా సిద్ధం చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసుల్లో కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేసి, ఆయా వర్గాల వారికి మంజూరైన యూనిట్లు గ్రౌండింగ్ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ఏకలవ్య జయంతిని అధికారికంగా నిర్వహించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కేసులకు సంబంధించి కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ జోక్యం చేసు కుని బాధితులకు సరైన సలహాలు, సూచనలు అందించాలని కమిటీ సభ్యులు బీసీఆర్ దాస్, నెరమెట్ల యల్లన్న, సాకే చిరంజీవి, ఇమామ్వలి, రామన్న కోరా రు. సమావేశంలో డీఆర్ఓ ఎ.మలోల, ఆర్డీఓలు కేశవనాయుడు, వసతంతబాబు, శ్రీనివాస్, సాంఘీక సంక్షేమశాఖ జేడీ రాధిక, గిరిజన సంక్షేమాధికారి రామాంజినేయులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. దేశాభివృద్ధిలో యువత కీలకం దేశాభివృద్ధిలో యువత పాత్ర కీలకమని కలెక్టర్ వి.వినోద్కుమార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్ వద్ద ‘వికసిత్ భారత్ యువ పార్లమెంట్ 2025’ పోస్టర్ను ఆయన ఆవిష్కరించి, మాట్లాడారు. కార్యక్రమంలో రాఘవేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ప్రిన్సిపాల్ పద్మనాభరెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ ఉమామహేశ్వరరావు, జేన్టీయూఏ ఎన్ఎస్ఎస్ కో–ఆర్డినేటర్ శారద, ప్రోగ్రామ్ ఆఫీసర్ నాగశుభ, నెహ్రూ యువ కేంద్ర సంఘటన ప్రోగ్రామ్ ఇన్చార్జ్ శ్రీనివాస్ పాల్గొన్నారు. పది రోజుల్లో చార్జిషీట్ వేయాలి ఎన్నికల అనంతరం జరిగిన హింసకు సంబంధించిన కేసులపై పది రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ వి.వినోద్కుమార్ ఆదేశించారు. 2024 సాధారణ ఎన్నికల అనంతరం చోటు చేసుకున్న హింస, నమోదైన కేసులపై జిల్లా అధికారులతో శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో ఎస్పీ పి.జగదీష్తో కలసి ఆయన సమీక్షించారు. తాడిపత్రిలో 7 కేసులు నమోదు కాగా ఐదు కేసుల్లో చార్జిషీట్ దాఖలైందని, ఒకటి తప్పుడు కేసుగా నిర్ధారణ అయిందని తెలిపారు. మరో కేసు ఇన్వెస్టిగేషన్లో ఉందన్నారు. ఎన్నికల కమిషన్ పోర్టల్ ఓపెన్ అయిన నేపథ్యంలో చార్జిషీట్ దాఖలులో పోలీసు యంత్రాంగానికి సంపూర్ణ సహకారం అందించాలని ఆర్డీఓ, తహసీల్దార్లను ఆదేశించారు. సమావేశంలో డీఆర్ఓ ఎ.మలోల, ఆర్డీఓ కేశవనాయుడు, కో–ఆర్డినేషన్ విభాగం సూపరింటెండెంట్ యుగేశ్వరిదేవి, డీసీఆర్బీ హరినాథ్, తాడిపత్రి టౌన్ సీఐ సాయిప్రసాద్, తహసీల్దారు రజాక్వలి, ఎన్నికల డీటీ కనకరాజు, తదితరులు పాల్గొన్నారు. -
మహిళాభ్యున్నతితోనే మెరుగైన సమాజం
అనంతపురం సిటీ: మహిళాభ్యున్నతితోనే మెరుగైన సమాజం నిర్మితమవుతుందని జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ భవన్లో సీఈఓ రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్యతో కలసి శుక్రవారం ఆమె కేక్ కట్ చేసి, మహిళా ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపి, మాట్లాడారు. అమ్మాయి, అబ్బాయిల పెంపకంలో వివక్ష చూపరాదన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తుండడం గర్వంగా ఉందన్నారు. బాలికలు విద్యావంతులైనప్పుడే సమాజంలో సమానత్వం పొందగలరన్నారు. ప్రతి అమ్మాయి స్వేచ్ఛగా చదువుకునే వాతావరణం కల్పించాలని సూచించారు. ఆర్థిక ఇబ్బందులతో అమ్మాయిల చదువు ఆగిపోకూడదన్నారు. కార్యక్రమంలో పరిపాలనాధికారులు షబ్బీర్నియాజ్, మహబూబ్ వలి, విజయ భాస్కర్రెడ్డి, రత్నాబాయి, శ్రీవాణి, ధనుంజయ, కమ్మ నాగరాజు, ఉషారాణి, మహిళా ఉద్యోగినులు పాల్గొన్నారు. జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ జిల్లా పరిషత్ కార్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం -
జీడిపల్లి రిజర్వాయర్లో మహిళ మృతదేహం
బెళుగుప్ప: మండలంలోని జీడిపల్లి రిజర్వాయర్లో శుక్రవారం గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న ప్రొబేషనరీ డీఎస్పీ అష్రప్ అలీ, ఎస్ఐ శివ, సిబ్బంది అక్కడకు చేరుకుని మృతదేహాన్ని వెలికి తీశారు. సుమారు 50 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసున్న మహిళ రెండు చేతులపై ముగ్గుల బొమ్మల పచ్చబొట్లు ఉన్నాయి. ఎర్ర రంగు జాకెట్ ధరించి ఉంది. కొన్ని రోజులుగా నీటిలో మునిగి ఉండడంతో మృతదేహం పూర్తిగా ఉబ్బి గుర్తు పట్టలేని విధంగా మారింది. పంచనామ అనంతరం అక్కడే పోస్టుమార్టం నిర్వహించి ఖననం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. మహిళ మిస్సింగ్ కేసులో సంబంధీకులు ఎవరైనా ఉంటే బెళుగుప్ప పోలీసులను సంప్రదించాలని కోరారు. -
No Headline
అమ్మాయిల చదువులకు తోడ్పాటు అందించడం, సామాజిక సేవాకార్యకర్తగా పర్యావరణ కార్యక్రమాలు, చిన్నారుల సృజనను ప్రోత్సహించడం, విద్యాలక్ష్యాలను చేరుకోవడం కోసం నిత్యం పరితపిస్తుంటారు ఏజీ ప్రమీలారెడ్డి. వయసు ఎనిమిది పదులు దాటినా నేటికీ చురుగ్గా సమాజహితం కోసం పాటుపడుతుంటారు. క్షామపీడిత అనంత సస్యశ్యామలం కావడం కోసం విరివిగా మొక్కల పంపిణీ, పక్షులకు కృత్రిమ గూళ్ల ఏర్పాటుకు సహకరిస్తున్నారు. ముఖ్యంగా కరోనాపై పోరాట మహాయజ్ఞంలో ఏజీఎస్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా ఆమె చూపిన చొరవ, ‘హీల్ అనంతపురం’ పేరుతో అందించిన సేవలు ఎంతోమందికి స్ఫూర్తినిచ్చాయి. నిరాశ్రయులకు, అనాథలకు, ఆశ్రమాల్లోని వృద్ధుల జీవితాల్లో వెలుగులు నింపడానికి వాహనాల ద్వారా ఆహార పొట్లాలు అందిస్తున్నారు. – అనంతపురం కల్చరల్:సేవకు ప్రతిరూపం ప్రమీల -
మహిళా దినోత్సవం పేరుతో అనధికార వసూళ్లు
● ఒక్కో సభ్యురాలితో రూ.వంద చొప్పున రూ.కోటికి పైగా వసూలు అనంతపురం కార్పొరేషన్: కూటమి ప్రభుత్వంలో మెప్మా అధికారుల దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. కొందరు ప్రజాప్రతినిధులకు ఏమాత్రం తీసిపోకుండా మహిళా సంఘాల నాయకురాళ్ల ముక్కుపిండి అనధికారిక వసూళ్లకు అధికారులు తెరలేపారు. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తాయి. 11,530 సంఘాలతో రూ.కోటికి పైగా వసూలు అనంతపురం నగరపాలక సంస్థ, తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు, కళ్యాణదుర్గం, రాయదుర్గం తదితర మునిసిపాలిటీల మెప్మా పరిధిలో 11,530 మహిళా సంఘాలున్నాయి. ప్రతి సంఘంలో 10 నుంచి 12 మంది సభ్యులున్నారు. మహిళా దినోత్సవం పేరుతో వీరి నుంచి ఒక్కొక్కరితో రూ.100 చొప్పున కొందరు ఆర్పీలు వసూళ్లు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ లెక్కన రూ.కోటికిపైగా వసూలైనట్లు తెలుస్తోంది. సభ్యులు ఇదేమిటని ప్రశ్నిస్తే రూ.వంద చెల్లించాల్సిందేనని లేకపోతే భవిష్యత్తులో నిధులు మంజూరు చేయకపోవడంతో పాటు సంఘం నుంచి తొలగిస్తారని బెదిరింపులకు పాల్పడినట్లు పలువురు వాపోయారు. ఈ బాగోతం వెనుక మెప్మా విభాగంలోని ఓ కీలక అధికారి, ఓ టెక్నికల్ అసిస్టెంట్ కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలున్నాయి. -
లైనింగ్కు టెండర్లు సరికాదు
● సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రాంభూపాల్ అనంతపురం అర్బన్: ‘‘హంద్రీ–నీవా కాలువను 10 వేల క్యూసెక్కుల సామార్థ్యంతో వెడల్పు చేయాలి. పంట కాల్వలు తవ్వి ఆయకట్టుకు నీరు ఇవ్వాలి’ అని రైతులు కోరుతుంటూ లైనింగ్ పనులకు ప్రభుత్వం టెండర్లు పిలవడం సరికాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వి.రాంభూపాల్ అన్నారు. శుక్రవారం స్థానిక గణేనాయక్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీమ అభివృద్ధికి సాగునీటి వనరుల అభివృద్ధి కీలకమన్నారు. హంద్రీ–నీవా కాలువను వెడల్పు చేయకుండా అత్యంత వెనబడిన ఉమ్మడి అనంతపురం జిల్లాను ఎలా అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. కృష్ణాజలాల కోసం చేసిన పోరాటాల ఫలితమే హంద్రీ–నీవా ద్వారా 2012 నుంచి జీడిపల్లికి కృష్ణాజలాలు వస్తున్నాయన్నారు. ప్రస్తుతం వస్తున్న 40 టీఎంసీలు కాకుండా అదనంగా నీరు ఇస్తామని ఎన్నికల ముందు ప్రధాన రాజకీయ పార్టీలు హామీలు ఇస్తూనే ఉన్నాయన్నారు. హంద్రీ–నీవా డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చేసి ఆయకట్టును స్థిరీకరించాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే సీఎం చంద్రబాబుతో సానుకూల నిర్ణయం ప్రకటింపజేయాలన్నారు. 6,300 క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్థ్యానికి కాలువను వెడల్పు చేసేలా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం టెండర్లు పిలిచిందన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఖరారు చేసిన టెండర్లలో 3,850 క్యూసెక్కులకే పరిమితం చేయడం, రెండవ దశ కాలువ లైనింగ్ పనులకు సిద్ధపడడం చూస్తుంటే సీఎం చంద్రబాబు తీరు ఏరుదాటాక తెప్పతగలేసినట్లుగా ఉందన్నారు. వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి కళ్యాణదుర్గం రూరల్: మండలంలోని వేర్వేరు ప్రాంతాల్లో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. వివరాలు... కళ్యాణదుర్గం నుంచి అనంతపురానికి గురువారం అర్ధరాత్రి వెళుతున్న అంబులెన్స్ వాహనం గొళ్ల గ్రామం సమీపంలోకి చేరుకోగానే రోడ్డు దాటుతున్న అదే గ్రామానికి చెందిన కుళ్లాయప్ప (60)ను ఢీకొంది. ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే మంగళకుంట గ్రామం వద్ద గురువారం అర్ధరాత్రి రోడ్డు దాటుతున్న అదే గ్రామానికి చెందిన పెద్ద మల్లయ్యను ట్రాక్టర్ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన వృద్ధుడిని స్థానికులు వెంటనే కళ్యాణదుర్గంలోని సీహెచ్సీకి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలించారు. చికిత్సకు స్పందించక శుక్రవారం ఆయన మృతి చెందాడు. ఈ రెండు ఘటనలపై కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. డీఎస్సీ ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోండి అనంతపురం రూరల్: డీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని బీసీ స్టడీ సర్కిల్ ఉప సంచాలకులు సుమన జయంతి పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. టెట్ పరీక్షల్లో అర్హత సాధించిన బీసీ, ఈబీసీ అభ్యర్థులు అర్హులు. ఈ నెల 10 నుంచి దరఖాస్తు చేసుకోవాలి. టెట్లో సాధించిన మార్కుల ఆధారంగా ఉచిత శిక్షణకు ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు 08554–275575లో సంప్రదించవచ్చు. -
No Headline
ఆమె ఆలోచన పలువురిని కదిలించింది. అంతా ఒక సంఘంగా ఏర్పడి సామాజిక సేవవైపు నడిచారు. తాడిపత్రిలోని ఓంశాంతినగర్కు చెందిన భూమా రాగిణి సారథ్యంలో మొదట నలుగురు స్నేహితులతో కలిసి ‘ఫెమినైన్’ అనే సంస్థను ప్రారంభించారు. ఆస్పత్రిలో రోగులకు అన్నదానంతో ప్రారంభమైన సంస్థ సామాజిక సేవా కార్యక్రమాలు సోషల్ మీడియా ద్వారా వైరల్ అయ్యాయి. అలా మూడు నెలల వ్యవధిలోనే వివిధ జిల్లాల నుంచి మొత్తం 190 మంది మహిళలు ఇందులో సభ్యులుగా చేరి సేవలో పాలు పంచుకుంటున్నారు. ప్రతి సభ్యురాలు నెలనెలా సేవా కార్యక్రమాల కోసం కొంతమొత్తం వెచ్చిస్తున్నారు. అంతేకాదు సభ్యుల్లోని కుటుంబాల్లో పుట్టిన రోజు తదితర శుభకార్యాల సందర్భాలను పురస్కరించుకుని అభాగ్యులకు అవసరమైన సహాయాలను అందిస్తున్నారు. ఇప్పటి వరకు దివ్యాంగులకు వీల్చైర్లు, మూడు చక్రాల సైకిళ్లు, ఒంటరి మహిళలకు స్వయం ఉపాధి కోసం కుట్టుమిషన్లు అందించారు. ఓ పేదరిక కుటుంబానికి ప్రతి నెలా రేషన్ సరుకులు సరఫరా చేస్తున్నారు. అలివేలు మంగ అనే దివ్యాంగురాలికి పింఛన్ తరహాలో ప్రతి నెలా రూ.1000 ఆర్థికసాయం అందిస్తున్నారు. వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు, ఆస్పత్రుల్లో అన్నదానాలు నిర్వహిస్తున్నారు. – తాడిపత్రిటౌన్ :అభాగ్యులకు అండగా నిలవాలని.. -
●అన్నింటా ఆమె
ఆమె శాంతం... ఆమె సహనం... ఆమె రౌద్రం... ఆమె లౌక్యం... అన్నింటా ఆమె... అన్నీ ఆమే! జీవన పోరాటంలో ఎన్ని గాయాలైనా లెక్కచేయదు. నేటి మహిళలు అడుగు మోపని రంగమంటూ లేదు. నైపుణ్యమున్నా ఆర్థిక పరిస్థితులు సహకరించక ఇంటికే పరిమితమైన గ్రామీణ మహిళలు సైతం తర్వాతి క్రమంలో అవకాశాలను అందిపుచ్చుకుని సాధికారతే లక్ష్యంగా సాగుతున్నారు. ‘ఆమె’ అంటే ‘ఆకాశంలో సగం’ అనేవారు ఒకప్పుడు.. కానీ ‘ఆమె’ ఇప్పుడు ‘సగం’ మాత్రమే కాదు.. ‘సర్వం’. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం: కలెక్టరేట్ వద్ద గంపలో చిరుతిండ్లు విక్రయిస్తున్న వృద్ధురాలు -
బీసీ గురుకుల ప్రవేశ పరీక్ష కేంద్రాల పెంపు
అనంతపురం ఎడ్యుకేషన్: మహాత్మ జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరానికి గాను ఐదో తరగతి ప్రవేశాలకు నిర్వహించనున్న రాత పరీక్షకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏడు కేంద్రాలను పెంచారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 16 కేంద్రాలు ఉండగా.. దరఖాస్తులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో అదనంగా ఏడు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అనంతపురం జిల్లా కన్వీనర్ జోనాథన్ తెలిపారు. కొత్త పరీక్ష కేంద్రాలు శనివారం నుంచి ఆన్లైన్లో కనిపిస్తాయని పేర్కొన్నారు. ఏవైనా సందేహాలుంటే 98665 59653, 90523 16764 నంబర్లలో సంప్రదించాలని కోరారు. అదనంగా పెంచిన కేంద్రాలివే.. ● ప్రభుత్వ బీసీ కళాశాల బాలికల వసతి గృహం, కళ్యాణదుర్గం ● ప్రభుత్వ బీసీ కళాశాల బాలికల వసతి గృహం, శింగనమల (అనంతపురం రామ్నగర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ పక్కన) ● ప్రభుత్వ బీసీ కళాశాల బాలుర వసతి గృహం, నార్పల (అనంతపురంలోని కొత్తూరు బాలుర జూనియర్ కళాశాల) ● ప్రభుత్వ బీసీ కళాశాల బాలికల వసతి గృహం, నార్పల (అనంతపురం హౌసింగ్బోర్డు మెయిన్ రోడ్డు ఎస్వీఆర్ కేఫ్ పక్కన) ● ప్రభుత్వ బీసీ బాలుర వసతిగృహం, రాయదుర్గం ● ప్రభుత్వ బీసీ కళాశాల బాలికల వసతి గృహం, అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి వెనుక, అరవిందనగర్) ● ప్రభుత్వ బీసీ కళాశాల బాలుర వసతి గృహం, మోడల్ స్కూల్ దగ్గర ధర్మవరం -
No Headline
ప్రకాశం జిల్లా పామర్రు గ్రామానికి చెందిన భోగ్యం కృష్ణయ్య, పద్మావతి దంపతులకు నలుగురు సంతానం. ముగ్గురు కుమార్తెల్లో లక్ష్మీప్రసన్న ఒకరు. వారిని పెంచడానికి తండ్రి పడ్డ కష్టాన్ని ఆమె కళ్లారా చూశారు. ఉన్నత చదువులు చదివి ఒక స్థాయికి చేరుకుని బాలికలకు అండగా ఉండాలని భావించారు. పీజీ కోర్సు పూర్తవగానే లక్ష్మీప్రసన్న ఐసీడీఎస్లో సీడీపీఓగా ఉద్యోగం సాధించారు. తాను అనుకున్న లక్ష్యం నెరవేరిందని చాలా సంతోష పడ్డారు. ప్రకాశం జిల్లాలో ఎనిమిదేళ్లు పనిచేశారు. ఆ తర్వాత కళ్యాణదుర్గం సీడీపీఓగా వచ్చారు. విధి నిర్వహణలో భాగంగా పలు చోట్ల బాల్య వివాహాలను అరికట్టగలిగారు. లింగ వివక్ష లేకుండా చైతన్యవంతులను చేశారు. భ్రూణహత్యలు జరగకుండా వైద్య సిబ్బందితో కలిసి ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఆమె సేవలను గుర్తించి 2020లో మహాత్మ జ్యోతిరావు పూలే ఫౌండేషన్ వారు తిరుపతిలో లక్ష్మీప్రసన్నకు ‘సావిత్రి బాయి ఫూలే ఎక్సలెన్స్’ అవార్డు అందజేశారు. ఈ అవార్డు ఆమెలో బాధ్యతను మరింత పెంచింది. – కళ్యాణదుర్గం: బాలికల కోసం పనిచేయాలని... -
డీఎంఎల్టీలో స్టేట్ టాపర్గా కావ్య
అనంతపురం మెడికల్: ఇటీవల జరిగిన డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ పరీక్ష అనంతపురం వైద్యకళాశాలలోని పారామెడికల్ కోర్సు విద్యార్థిని కావ్య... రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంక్ను దక్కించుకుంది. ఈ ఏడాది జనవరిలో జరిగిన పరీక్షల్లో 480 మార్కులకు గానూ 87.77 శాతంతో 416 మార్కులు సాధించింది. విద్యార్థిని ప్రతిభను గుర్తించిన మెడికల్ కళాశాల (జీఎంసీ) ప్రిన్సిపాల్ డాక్టర్ మాణిక్యరావు గురువారం ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థిని మంచి మార్కులు సాధించం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాళ్లు డాక్టర్ షంషాద్బేగం, డాక్టర్ షారోన్, డిప్యూటీ ఆర్ఎంఓ డాక్టర్ హేమలత పాల్గొన్నారు. -
ట్రాక్టర్ కిందపడి డ్రైవర్ మృతి
అనంతపురం: డ్రైవింగ్ చేస్తూ అదుపు తప్పి కిందపడిన డ్రైవర్.. తన వాహనం చక్రాల కింద నలిగి దుర్మరణం పాలయ్యాడు. అనంతపురం నగరంలోని రద్దీగా ఉండే అశోక్ నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు... నగరంలోని మరువకొమ్మ కాలనీలో నివాసముంటున్న ముత్యాలు (38) ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం పనిలో భాగంగా ట్రాక్టర్ను డ్రైవింగ్ చేస్తూ అశోక్గనగర్లోని హరిహర ఆలయం వద్దకు చేరుకోగానే ముత్యాలుకు మూర్ఛవచ్చింది. వాహన నియంత్రణ కోల్పోవడంతో పాటు అదుపు తప్పి కిందకు జారిపడ్డాడు. అదే సమయంలో ట్రాక్టర్ వెనుక చక్రాలు ఆయన మీదుగా దూసుకెళ్లాయి. ఘటనలో ముత్యాలు అక్కడికక్కడే మృతి చెందాడు. రోడ్డుపై అడ్డదిడ్డంగా వెళుతున్న ట్రాక్టర్ను గమనించిన స్థానిక మెకానిక్లు వెంటనే స్పందించి చాకచక్యంగా బ్రేకులు వేసి, వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపారు. సమాచారం అందుకున్న వన్టౌన్ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, ముత్యాలు మృతదేహాన్ని సర్వజనాస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
పేరూరు డ్యాంకు నీళ్లివ్వాలి
రాప్తాడు రూరల్: శ్రీశైలంలో కృష్జజలాలు పుష్కలంగా ఉన్న నేపథ్యంలో రానున్న రోజుల్లో పేరూరు డ్యాంకు నీళ్లిచ్చేలా స్థానిక ఎమ్మెల్యే పరిటాల సునీత చొరవ తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి అన్నారు. త్వరలో హంద్రీ–నీవా కాలువకు నీటి సరఫరా నిలిపేస్తున్నట్లు అధికారులు చెబుతున్న నేపథ్యంలో గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. శ్రీశైలం డ్యాంలో 70 టీఎంసీల నీటి నిలువ ఉందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు రోజూ అర టీఎంసీ చొప్పున నీటిని వినియోగిస్తున్నాయని, ఈ లెక్కన 140 రోజుల వరకు నీరు అందే అవకాశం ఉంటుందన్నారు. ఈలోపు పేరూరు డ్యాంకు నీళ్లు నింపేందుకు అన్ని అవకాశాలూ ఉన్నాయన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ను పరిటాల సునీత కలిసినా పేరూరు డ్యాంకు నీళ్లు ఇవ్వాలని అడగక పోవడం బాధాకరమన్నారు. అప్పట్లో వరుసగా మూడేళ్లు నింపాం వైఎస్ జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరుసగా మూడేళ్లు పేరూరు డ్యాంను నీటితో నింపినట్లు ప్రకాష్రెడ్డి గుర్తు చేశారు. డ్యాంలో నీళ్లు లేకపోతే రాబోయే ఎండాకాలంలో నియోజకవర్గంలో వందలాది గ్రామాలు కనీసం తాగునీటికి కూడా తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంటాయన్నారు. భూగర్భజలాలు పూర్తిగా అడుగంటిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. పేరూరు డ్యాంను నీటితో నింపడం ద్వారా రామగిరి, కనగానపల్లి, రాప్తాడు, ఆత్మకూరు మండలాల్లో భూగర్భజలాలు పెరిగి, 10 వేల ఎకరాల్లో పంటల సాగు అందుబాటులోకి వస్తుందన్నారు. రొద్దం మండలం తురలాపట్నం వంకలో నీళ్లు వదిలితే నేరుగా డ్యాంకు చేరుకుంటాయన్నారు. దీనికి కరెంటు ఖర్చు తప్ప ఇతర ఖర్చులేమీ ఉండవన్నారు. ఇంత చిన్న అంశాన్ని పరిటాల సునీత ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. డిమాండ్ రాగానే గేట్లు తొలిగించారు పేరూరు డ్యాంకు నీళ్లు ఇవ్వాలనే డిమాండ్ రైతుల నుంచి మొదలవగానే మరమ్మతుల పేరుతో ఉన్న గేట్లను తొలిగించడం దారుణమన్నారు. రైతులపై కక్ష తీర్చుకునేలా డ్యాంలో ఉన్న కొద్దిపాటి నీటిని కూడా పరిటాల సునీత వైఖరి కారణంగా దిగువకు వృధాగా పారాయన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 40 టీఎంసీల నీటి ప్రవాహ సామర్థ్యంతో హంద్రీ–నీవా కాలువను తెచ్చారని, వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ కాలువను 83 టీఎంసీల నీటి ప్రవాహ సామర్థ్యానికి పెంచారని గుర్తు చేశారు. పీఏబీఆర్ నుంచి రూ. 90 కోట్లతో మంచినీటి పైపులైను ఏర్పాటు చేశారన్నారు. జీడిపల్లి అప్పర్ పెన్నార్ లిఫ్ట్ ఇరిగినేషన్ స్కీమ్కు రూ.170 కోట్ల నిధులిచ్చారన్నారు. అయితే టీడీపీ హయాంలో చేసిందేమీలేదని, రూపాయి ఖర్చు లేకుండా నీళ్లిచ్చే అంశాన్ని సైతం ఎమ్మెల్యే సునీత నిర్లక్ష్యం చేస్తుండడం గమనిస్తే నియోజకవర్గ రైతులు, ప్రజల సంక్షేమం పట్టలేదనేది అర్థమవుతోందన్నారు. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి -
లేగదూడ దవడకు శస్త్రచికిత్స
అనంతపురం అగ్రికల్చర్: మూగజీవాలకు పశు సంవర్ధకశాఖ ఏడీలు, డాక్టర్లు అరుదైన శస్త్రచికిత్సలు చేస్తూ రైతుల మన్ననలు పొందుతున్నారు. తాజాగా విరిగిపోయిన లేగదూడ దవడకు శస్త్రచికిత్స చేశారు. వివరాలు.. గార్లదిన్నె మండలం తలకాసులపల్లి గ్రామం వడ్డే నరేష్కు చెందిన పాడి ఆవు మూడు రోజుల కింద కోడేదూడను ఈనింది. దూడ ఆరోగ్యంగా ఉన్నా కింది దవడ ఎముక విరిగిపోవడంతో వేలాడసాగింది. దవడ నొప్పి వల్ల పాలు తాగలేక రోజురోజుకూ నీరసిస్తున్న దూడను గమనించి స్థానిక పశువైద్యాధికారి శింగనమల పశువైద్యశాల ఏడీ డాక్టర్ జి.పద్మనాభానికి రెఫర్ చేశారు. దీంతో ఆటోలో అనంతపురంలోని సాయినగర్లో ఉన్న పశువైద్యశాలకు దూడను తీసుకువచ్చి తన బృందంతో డాక్టర్ పద్మనాభం శస్త్రచికిత్స చేశారు. దవడ ఎముకకు రెండు వైపులా 2.5 మి.మీ స్టెయిన్లెస్ స్టీల్ పిన్నులను అమర్చారు. శస్త్రచికిత్స తర్వాత దూడ దవడ సాధారణ స్థితికి చేరుకోవడం, పాలు తాగడం మొదలు పెట్టింది. దూడకు అవసరమైన ఫ్లూయిడ్స్, యాంటీబయాటిక్స్, అనాల్జిసిక్స్ లాంటి మందులు కూడా అందించినట్లు పద్మనాభం వెలిపారు. శస్త్రచికిత్సలో 1962 అంబులెన్స్ డాక్టర్ సునీత, ట్రైనీ డాక్టర్ నేహ, కమలాకార్, గీత పాల్గొన్నట్లు తెలిపారు. -
యువకుడిపై దాడి
గుత్తి రూరల్: మండలంలోని గొందిపల్లికి చెందిన రామకృష్ణపై నలుగురు యువకులు దాడి చేసి గాయపరిచారు. వివరాలు.. రామకృష్ణ బుధవారం రాత్రి ఎంగిలిబండ వద్ద ఉన్న ధాబా వద్దకు వెళ్లాడు. అప్పటికే అక్కడున్న తొండపాడు గ్రామానికి చెందిన నలుగురు యువకులు చిన్నపాటి అంశానికి రామకృష్ణతో గొడవ పడ్డారు. అక్కడున్న వారు సర్ది చెప్పడంతో అప్పటికి వివాదం సద్దుమణిగింది. అయితే ఈ అంశంపై కక్ష పెంచుకున్న తొండపాడు గ్రామానికి చెందిన నలుగురు యువకులు బుధవారం అర్ధరాత్రి గొందిపల్లికి చేరుకుని రామకృష్ణ ఇంట్లోకి చొరబడి కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేసి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన రామకృష్ణను కుటుంబసభ్యులు గుత్తిలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం వైద్యుడి సూచన మేరకు అనంతపురానికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. 9న రెడ్డి ఉచిత వివాహ పరిచయ వేదిక రాప్తాడు రూరల్: రాయలసీమ రెడ్డి జన సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 9న ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉచిత రెడ్డి వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు సంఘం వ్యవస్థాపకుడు రొద్దం సురేష్రెడ్డి, గౌరవ అధ్యక్షుడు చిన్నరాసి చంద్రమౌళి రెడ్డి, సెక్రటరీ కిషోర్రెడ్డి తెలిపారు. అనంతపురం రూరల్ మండలం పాపంపేటలోని రెడ్డి జన సంఘం కార్యాలయంలో జరిగే వేదికకు హాజరయ్యేవారు కాబోయే అబ్బాయిలు, అమ్మాయిల వివరాలు తీసుకురావాలని తెలిపారు. పూర్తి వివరాలకు 94415 75641, 93902 84296, 94907 67224 సంప్రదించాలని కోరారు. సామాజిక స్పృహతోనే వృత్తిలో రాణింపు అనంతపురం: సామాజిక స్పృహ కలిగి ఉన్నప్పుడే వృత్తిలో రాణింపు సాధ్యమవుతుందని రాయలసీమ రీజియన్ హోంగార్డ్స్ ఇన్చార్జ్ కమాండెంట్ ఎం.మహేష్ కుమార్ అన్నారు. అనంతపురంలోని పోలీస్ పరేడ్ మైదానంలో గురువారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, హోంగార్డుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. ఉద్యోగంలో చేరే ముందు శిక్షణలో నేర్చుకున్న అంశాలను గుర్తు చేసుకోవాలన్నారు. హోంగార్డుల దైనందిన విధులు సవాళ్లతో కూడకుని ఉంటాయన్నారు. ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. అనంతరం దర్బార్ నిర్వహించి హోంగార్డుల సమస్యలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆర్ఐ మధు, ఆర్ఎస్ఐ జాఫర్ పాల్గొన్నారు. -
ఒక్కో సంఘానికి ఒక్కో మేట్
● శ్రమశక్తి సంఘాల ముసుగులో దోపిడీకి ఎత్తుగడ ● ఉపాధి మేట్లగా 90 శాతం అనుయాయులే ● వారి చేతిల్లోనే హాజరు, కూలీల డిమాండ్ ఉపాధి పనులు చేస్తున్న కూలీలు (పైల్) రాయదుర్గం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఉపాధి హామీ పథకంలో అక్రమాలు ఊపందుకున్నాయి. మస్టర్లలో దొంగపేర్లు రాసి సొమ్మంతా సొంత ఖాతాల్లో వేసుకునేలా టీడీపీ నాయకులు రంగం సిద్ధం చేశారు. కొత్తగా ఏర్పాటవుతున్న శ్రమశక్తి సంఘాల ముసుగులో దోపిడీకి పక్కాగా స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ప్రతి 25 నుంచి 50 మంది కూలీలకు ఓ శ్రమశక్తి సంఘం ఏర్పాటు చొప్పున ఈ ప్రక్రియ జిల్లాలో దాదాపు పూర్తికావొచ్చింది. మొత్తం ఏడు నియోజకవర్గాలోని 31 మండలాల్లో యాక్టివ్ జాబ్కార్డుల సంఖ్య 2.60 లక్షలు కాగా, వీటి పరిధిలో 4.58 లక్షల మంది కూలీలు నమోదయ్యారు. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా సుమారు 13,164 శ్రమశక్తి సంఘాలు ఏర్పాటయ్యాయి. అనుయాయులకే పెద్దపీట నిబంధనల మేరకు ప్రతి శ్రమశక్తి సంఘానికి ఓ మేట్ను నియమించారు. అయితే స్థానిక టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఉపాధి కూలీల్లో సీనియార్టీకి తిలోదకాలు ఇచ్చి టీడీపీ నేతలు సూచించిన వారి అనుయాయులకే పెద్దపీట వేశారు. ఇలా ప్రతి గ్రామంలోనూ టీడీపీ నేతలు గుర్తించిన వారే క్షేత్ర సహాయకులు, మేట్లగా చలామణి అవుతున్నారు. ఈ విధానంపై ఉపాధి కూలీల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పరోక్షంగా టీడీపీ నేతలకు దోచిపెట్టేందుకే మేట్ల వ్యవస్థను కూటమి సర్కార్ అమల్లోకి తెచ్చిందని మండిపడుతున్నారు. మండుటెండలో శ్రమించే తమపై వీరి పెత్తనం ఏమిటంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే విషయాన్ని బాహటంగా ప్రశ్నిస్తే వేతనాల్లో కోత వేస్తారమే భయం కూడా కూలీలను వెంటాడుతోంది. మేట్ల ముసుగులోనే అసలు దోపిడీ మేట్లుగా ఎంపికై న వారు కూలీలను ఉపాధి పనులకు తీసుకెళ్లడం, వారి అవసరాల మేరకు ఆన్లైన్లో డిమాండ్ పెంచుకోవడం, హాజరు నమోదు, వేతనాలకు సిఫారసు చేయడం లాంటి పనులను పర్యవేక్షించాల్సి ఉంది. ఈ మొత్తం ప్రక్రియనే టీడీపీ నేతల అక్రమాలకు ఊతమైంది. మస్టర్లలో దొంగ పేర్లు చేర్చి ఉపాధి కూలీల సొమ్ము కాజేసేలా పక్కా ప్రణాళికను రచించి, ఆ మేరకు అడుగులు వేశారు. మేట్గా ఉన్న వారికి వారి పరిధిలోని ఒక్కొ కూలీపై రూ.1.50 చొప్పున చెల్లిస్తారు. ఈ లెక్కన జిల్లాలో యాక్టివ్గా ఉన్న 4.58 లక్షల మంది కూలీలకు గాను రోజుకు రూ.6.87 లక్షలు మేట్ల ఖాతాలకు చేరుతోంది. 100 రోజులకు రూ.6.87 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ రకంగా కూలీల శ్రమదోపిడీకి కూటమి సర్కార్ తెరలేపింది. గతమంతా స్వర్ణయుగం గత వైఎస్సార్సీపీ హయాంలో ఉపాధి కూలీల సంక్షేమానికి అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. రికార్డు స్థాయిలో పనులు కల్పించారు. ఎన్ఐసీ సర్వర్ ద్వారా ప్రతి పనినీ పర్యవేక్షిస్తూ పైసా అవినీతికి తావు లేకుండా చర్యలు చేపట్టారు. శ్రమశక్తి సంఘాలతో కూలీల శ్రమదోపిడీని గుర్తించి వాటిని రద్దుచేశారు. ప్రతి పైసాను కష్టపడిన కూలీల ఖాతాకు చేర్చారు. ఫలితంగా అప్పటికే ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు సైతం స్వగ్రామాలకు చేరుకుని ఉపాధి పనులతో ఎంతో సంతోషంగా జీవించారు. జిల్లాలో శ్రమశక్తి సంఘాల ఎంపిక దాదాపు పూర్తయింది. ఒక్కో సంఘానికి ఒక్కో మేట్ను నియమించాం. ఆ గ్రూపు పర్యవేక్షణ, హాజరు చూసే బాధ్యత మేట్పై ఉంటుంది. క్షేత్రసహాయకుడు, టెక్నికల్, ఏపీఓ, ఎంపీడీఓ పర్యవేక్షణ ఉంటుంది. ఎక్కడైన మేట్లు అవకతవకలకు పాల్పడితే సత్వరం తొలగిస్తాం. – సలీమ్ బాషా, పీడీ, డ్వామా -
క్వింటా చింతపండు రూ.31 వేలు
హిందూపురం అర్బన్: చింతపండు ధర మార్కెట్లో నిలకడగా కొనసాగుతోంది. స్థానిక వ్యవసాయ మార్కెట్కు గురువారం 1,214.70 క్వింటాళ్ల చింతపండు రాగా, అధికారులు ఈ–నామ్ పద్ధతిలో వేలం పాట నిర్వహించారు. ఇందులో కరిపులి రకం చింతపండు క్వింటా గరిష్టంగా రూ.31 వేలు, కనిష్టంగా రూ.8,100, సగటున రూ.18 వేల ప్రకారం ధర పలికింది. ఇక ప్లవర్ రకం చింతపండు క్వింటా గరిష్టంగా రూ. 12 వేలు, కనిష్టంగా రూ.4,200, సగటున రూ. 6,500 ప్రకారం క్రయవిక్రయాలు సాగినట్లు మార్కెట్ కార్యదర్శి జి. చంద్రమౌళి తెలిపారు. -
మట్కా నిర్వాహకుల అరెస్ట్
తాడిపత్రి టౌన్: స్థానిక పలు ప్రాంతాల్లో మట్కా నిర్వహిస్తున్న పలువురిని అరెస్ట్ చేసినట్లు సీఐ సాయిప్రసాద్ తెలిపారు. పట్టుబడిన వారిలో వైఎస్సార్ జిల్లా బాపనపల్లికి చెందిన కొండమనాయుడు, తాడిపత్రిలోని అంబేడ్కర్ నగర్ నివాసి నాగల మణికంఠ, భగత్సింగ్ నగర్కు చెందిన సుబ్బరాయుడు, చాకలి ఆదినారాయణ ఉన్నారు. వీరు గురువారం ఉదయం తాడిపత్రిలోని ఆర్టీసీ బస్డాండ్ వద్ద అరెస్ట్ చేసి రూ.30వేలు నగదు, పట్టీలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పట్టపగలే చోరీ రాయదుర్గం టౌన్: స్థానిక మారెమ్మ గుడి ప్రాంతంలోని ఓ ఇంట్లో పట్టపగలే చోరీ జరిగింది. వివరాలు... ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న మంజునాథ్ భార్య స్థానిక ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం ఇంటికి తాళం వేసి ఆటో అద్దెల కోసం మంజునాథ్, ఆయన భార్య ప్రైవేట్ స్కూల్కు వెళ్లారు. మధ్యాహ్నం 1 గంటకు భోజనానికి ఇంటికి చేరుకున్న మంజునాథ్.. అప్పటికే ఇంటి తలుపులు తీసి ఉండడం గమనించి లోపలకు వెళ్లి పరిశీలించాడు. లోపల వస్తువులన్నీ చెల్లాచెదురు చేసి ఓ క్యారియర్లో దాచి ఉంచిన రూ.80 వేలును అపహరించి, ఇంటి వెనుక ఉన్న మరో తలుపు నుంచి దుండగులు ఉడాయించినట్లుగా గుర్తించాడు. బీరువాకు వేసిన తాళం తీసేందుకు విఫలయత్నం చేశారని, బీరువా తలుపు తెరుచుకోకపోవడంతో అందులో ఉంచిన బంగారు నగలు భద్రంగా ఉన్నట్లు బాధితుడు తెలిపాడు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నాడు. ప్రమాదంలో డ్రైవర్కు తీవ్ర గాయాలు గుత్తి రూరల్: మండలంలోని కొత్తపేట గ్రామ శివారున 67వ జాతీయ రహదారిపై బొలెరో వాహనాన్ని లారీ ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్ జనార్ధన్కు తీవ్ర గాయాలయ్యాయి. నంద్యాల జిల్లా అవుకు మండలం రామాపురం గ్రామానికి చెందిన బొలెరో డ్రైవర్ జనార్ధన్ బుధవారం రాత్రి గుత్తిలో సరుకు అన్లోడ్ చేసి తిరుగు ప్రయాణమయ్యాడు. కొత్తపేట వద్దకు చేరుకోగానే గుత్తి వైపు వస్తున్న వేగంగా వస్తున్న లారీ ఎదురుగా ఢీకొంది.ప్రమాదంలో బొలెరో వాహనం నుజ్జునుజ్జయింది. అందులో ఇరుక్కొని డ్రైవర్ జనార్ధన్ తీవ్రంగా గాయపడ్డాడు. అతి కష్టంపై జనార్దన్ను స్థానికులు కాపాడి గుత్తిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. యువకుడి బలవన్మరణం ఆత్మకూరు: మండల కేంద్రానికి చెందిన ఎగ్గిడి లోకేష్ (20) ఆత్మహత్య చేసుకున్నాడు. గేదెల పోషణతో జీవనం సాగించే లోకేష్ కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం కడుపు నొప్పి తీవ్రత తాళలేక స్థానిక బైపాస్ సమీపంలోని ఓ రేకుల షెడ్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
బైక్ ఢీకొని యువకుడి మృతి
బొమ్మనహాళ్: ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో మరో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... బొమ్మనహాళ్ మండలం నేమకల్లుకు చెందిన తలారి హనుమంతు, పార్వతి దంపతుల కుమారుడు లోకేష్ (35)కు ఏడేళ్ల క్రితం కల్లుహోళ గ్రామానికి చెందిన అంజలితో వివాహమైంది. వీరికి ఓ కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. సొంతూరిలోనే ఫర్టిలైజర్ షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న లోకేష్ బుధవారం వ్యక్తిగత పనిపై బొమ్మనహాళ్కు వచ్చాడు. పనిముగించుకుని రాత్రి ద్విచక్ర వాహనంలో తిరుగు ప్రయాణమయ్యాడు. నేమకల్లు చెక్పోస్టు దాటగానే ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం ఢీకొనడంతో లోకేష్కు తీవ్ర రక్తస్రావమై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ప్రమాదానికి కారణమైన మరో ద్విచక్ర వాహనదారుడు తమిళనాడుకు చెందిన రాజుకూ తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు వెంటనే అంబులెన్స్ ద్వారా బళ్లారిలోని విమ్స్కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న రాజును కుటుంబసభ్యులు బెంగళూరుకు తీసుకెళ్లారు. లోకేష్ను మెరుగైన చికిత్స కోసం అనంతపురానికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ నబీరసూల్ తెలిపారు. కాగా, బాధిత కుటుంబసభ్యులను వైఎస్సార్సీపీ సర్పంచ్ పరమేశ్వర పరామర్శించి, అండగా ఉంటామని భరోసానిచ్చారు. -
బెణికల్లులో ‘బెల్టు’ చిచ్చు
సాక్షి, టాస్క్ఫోర్స్: ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో ‘బెల్టు షాపు’ చిచ్చును టీడీపీ నేతలు రాజేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక ‘వీధికోటి... సందుకోటి’ చొప్పున బెల్టుషాపులు వెలిశాయి. తమ అనునూయులకు ఆదాయం చేకూర్చడమే లక్ష్యంగా కూటమి నేతలు గ్రామాల్లో బెల్టుషాపులు పెట్టించారు. ఈ నేపథ్యంలో ‘బెల్టు షాపు’ నిర్వహణ అంశంలో స్థానిక టీడీపీ నేత తీసుకెళ్లిన ఒత్తిడి ఆ గ్రామంలో ఉద్రిక్తతకు దారి తీసింది. న్యాయ పోరాటానికి సిద్ధమైన బాధితుడు కణేకల్లు మండలం బెణికల్లు గ్రామంలో టీడీపీ నేత, మాజీ ఎంపీటీసీ ఎర్రిస్వామి తమ పార్టీ కార్యకర్త జీవనోపాధి కోసం బెల్టుషాపు పెట్టించారు. గత పది రోజులుగా బెల్టు షాపు ద్వారా ఆశించిన మేర వ్యాపారం జరగలేదు. దీంతో ఆదాయం తగ్గింది. ఈ విషయాన్ని టీడీపీ కార్యకర్త సదరు నేత దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎన్డీపీఎల్ (నాన్ డ్యూటీఫైడ్ లిక్కర్) అమ్మడం వల్లే బెల్టు షాపులో అమ్మకాలు తగ్గాయని, ఇందుకు కారకుడైన అదే గ్రామానికి చెందిన వన్నూరు స్వామిని అరెస్ట్ చేయాలంటూ ఎకై ్సజ్ సీఐ ఉమాబాయిపై ఒత్తిళ్లు తీసుకెళ్లాడు. దీంతో బుధవారం సాయంత్రం తన సిబ్బందితో కలసి సీఐ వన్నూరుస్వామి ఇంట్లో తనిఖీలు చేపట్టారు. అక్కడ ఎలాంటి మద్యం దొరకలేదు. ఇదే విషయాన్ని సదరు టీడీపీ నేతకు ఆమె ఫోన్ చేసి తెలిపారు. అయితే ఎలాగైనా వన్నూరుస్వామిపై కేసు బనాయించి గ్రామంలో బెల్టుషాపు సజావుగా జరిగేలా చూడాల్సిందేనంటూ ఆయన హుకుం జారీ చేయడంతో వన్నూరు స్వామిని స్టేషన్కు తరలించి చితకబాది కర్ణాటక మద్యం అమ్ముతున్నట్లు ఒప్పించేలా చేశారు. ఈ మొత్తం వ్యవహారం ఎందుకు చేయాల్సి వచ్చిందో కాసేపటి తర్వాత వన్నూరుస్వామి కుటుంబసభ్యులకు ఓ అధికారి తెలిపారు. దీంతో అదే రోజు రాత్రి గ్రామానికి చేరుకున్న వన్పూరుస్వామి కుటుంబసభ్యులు నేరుగా ఎర్రిస్వామి ఇంటికెళ్లి తప్పుడు కేసు ఎందుకు పెట్టించావంటూ నిలదీశారు. తాను చెప్పినట్లు వినకపోతే ఏమైనా చేస్తామంటూ ఆ సమయంలో ఎర్రిస్వామి రెచ్చిపోవడమే కాక తన వర్గీయులతో దాడులకు తెగబడ్డాడు. అంతటితో ఆగకుండా తనపై వన్నూరుస్వామి, ఆయన తండ్రి మల్లికార్జున, తల్లి లింగమ్మ, కుటుంబసభ్యులు అనిత, భూలక్ష్మి, చిన్న వండ్రయ్య దాడి చేశారంటూ ఫిర్యాదు చేయడంతో ఆ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చావుదెబ్బలు తిన్న తల్లి లింగమ్మ ఫిర్యాదను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. ఘటనపై వన్నూరు స్వామి మాట్లాడుతూ... తనను స్టేషన్కు తీసుకెళ్లి కొట్టి కర్ణాటక మద్యం అమ్ముతున్నట్లు అక్రమంగా కేసు నమోదు చేశారని, అంతేకాక తన కుటుంబసభ్యులపై దాడి చేసి చితకబాదారని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై న్యాయపోరాటం సాగిస్తానని పేర్కొన్నారు. బెల్ట్ షాప్లో ఆదాయం తగ్గిందంటూ వ్యక్తిపై టీడీపీ నేత కుట్ర కర్ణాటక మద్యం విక్రయిస్తున్నట్లుగా కేసు నమోదు చేయాలంటూ ఎకై ్సజ్ అధికారులకు హుకుం వాస్తవాలు గుర్తించకుండా పట్టుకెళ్లిన ఎకై ్సజ్ పోలీసులు గ్రామంలో ఇరువర్గాల ఘర్షణ.. ఏకపక్ష దాడులతో ఉద్రిక్తత -
‘ఉపాధిలో అక్రమాలు.. ఇద్దరు ఫీల్డ్ అసిస్టెంట్ల సస్పెన్షన్
● మరొకరికి షోకాజ్ అనంతపురం టౌన్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో అక్రమాలకు పాల్పడిన ఇద్దరు ఫీల్డ్ అసిస్టెంట్లను సస్పెండ్ చేశారు. మరొకరికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఆత్మకూరు మండలం రంగంపేట గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ సుశీలమ్మ ఉపాధి పనులు చేపట్టకుండానే కూలీలను మస్టర్లలో నమోదు చేయడంతోపాటు పాత పనులు చేస్తున్న కూలీల ఫొటోలను సాఫ్ట్వేర్లో నమోదు చేశారు. అలాగే, రాప్తాడు మండలంలోని గొల్లపల్లి ఫీల్డ్ అసిస్టెంట్ బ్రహ్మయ్య రెండేళ్ల క్రితం గ్రామంలో చేపట్టిన ఉపాధి పనులను తాజాగా చేసినట్లు మస్టర్లలో నమోదు చేశారు. 32 మంది కూలీలు పనులకు హాజరు కాగా ఏకంగా 62 మంది ఉన్నట్లు చూపారు. ఈ విషయాలపై అనుమానం వచ్చిన సాంకేతిక నిపుణులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టగా అక్రమాలు బట్టబయలయ్యాయి. దీంతో అధికార యంత్రాంగం ఇద్దరిపై సస్పెన్షన్ వేటు వేసింది. తోపుదుర్తి ఫీల్డ్ అసిస్టెంట్ను కాపాడేందుకు యత్నాలు.. ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ సురేష్నాయుడు సైతం గ్రామంలో ఎలాంటి పనులు చేపట్టకుండానే పాత ఫొటోలను ఆన్లైన్లో అప్లోడ్ చేయడంతో పాటు మస్టర్లను సైతం నమోదు చేసి బిల్లుల కోసం పంపినట్లు తెలిసింది. అయితే సురేష్నాయుడును కాపాడేందుకు పలువురు టీడీపీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో కేవలం షోకాజ్ నోటీసుతో సరిపెట్టే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి ఉపాధి పనుల్లో అక్రమాలకు అధికార యంత్రాగం సైతం ‘పచ్చ’జెండా ఊపుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. -
క్వాలిటీ కంట్రోల్.. వసూళ్లు ఫుల్!
పంచాయతీరాజ్ శాఖ క్వాలిటీ కంట్రోల్ విభాగంపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ‘క్యాష్’ కొడితే గానీ క్వాలిటీ కంట్రోల్ రిపోర్ట్ (ధ్రువీకరణ పత్రం) ఇవ్వడం లేదని పలువురు కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిల్లుల్లో ఒక శాతం, ఇతర లోపాలు ఏమైనా ఉంటే అదనంగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. కమీషన్లు ఇచ్చుకోలేక కాంట్రాక్టర్లు నలిగిపోతున్నారు. ● పంచాయతీరాజ్ క్వాలిటీ కంట్రోల్ విభాగంలో వసూళ్ల పర్వం ● టార్గెట్లు విధించి మరీ లాగుతున్న ఓ డీఈ స్థాయి అధికారి ● గగ్గోలు పెడుతున్న కాంట్రాక్టర్లు అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి క్వాలిటీ కంట్రోల్ పరంగా నాలుగు సబ్ డివిజన్లు ఉన్నాయి. వీటిలో ప్రతి డివిజన్కు ఒక డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(డీఈఈ), ముగ్గురు లేదా నలుగురు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు(ఏఈఈ)లు ఉంటారు. వీరందరిపై ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఈఈ) ఉన్నారు. రోడ్డు గానీ, భవనాలు గానీ నిర్మించాక.. ప్రభుత్వ నిబంధనల మేరకు నాణ్యతాప్రమాణాలు పాటించారా లేదా అని క్వాలిటీ కంట్రోల్ అధికారులు తనిఖీ చేస్తారు. నిర్దేశిత నిష్పత్తి మేరకు సిమెంట్, ఇసుక తదితరాలు వాడారా లేదా పరిశీలించి రిపోర్ట్ ఇస్తారు. రూ.30 లక్షల్లోపు బిల్లులు అయితే డీఈఈ స్థాయి, అంతకన్నా ఎక్కువైతే ఈఈ స్థాయిలో క్యూసీ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని బట్టి కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు ఉంటుంది. యథేచ్ఛగా వసూళ్లు.. అయితే, క్యూసీ(క్వాలిటీ కంట్రోల్ రిపోర్ట్)ల మంజూరు మాటున కొందరు అధికారులు యథేచ్ఛగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక బిల్డింగ్ లేదా రోడ్డు నిర్మాణానికి రూ.40 లక్షలు మంజూరు చేస్తే.. అందుకు ఒక శాతం అంటే రూ.40 వేలు కమీషన్ ఇచ్చుకోవాల్సిందేనని సమాచారం. దీంతో కొందరు కాంట్రాక్టర్లు రిపోర్ట్ తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. ‘క్యూసీ’ సమర్పిస్తే ఎంత బిల్లు వస్తుందో అంతకంటే ఎక్కువ నష్టపోయినా పర్వాలేదంటున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బరితెగించిన డీఈఈ.. కూటమి ప్రభుత్వం వచ్చాక బదిలీపై వచ్చిన ఓ డీఈఈ బరితెగించినట్లు తెలుస్తోంది. ప్రజాప్రతినిధులతో పరిచయాలున్నాయని చెబుతూ అందిన కాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. టార్గెట్లు విధించి మరీ కమీషన్లు వసూలు చేసి ఇవ్వాలని తన కింది స్థాయి సహాయ ఇంజినీర్లకు పట్టుబడుతున్నట్లు శాఖలో చర్చ జరుగుతోంది. మరి కొందరు ఉద్యోగులపైనా అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పనులను చెక్ చేసేందుకు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లాలంటే వాహనాలు ఏర్పాటు చేయడంతో పాటు సకల సౌకర్యాలు కల్పించాల్సి వస్తోందని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. ఇక.. క్వాలిటీ కంట్రోల్ విభాగంలో కొందరు ఇష్టారాజ్యంగా విధులకు డుమ్మా కొడుతున్నట్లు తెలిసింది. పర్యవేక్షణ కరువవడంతోనే ఇలా తయారయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటా నా దృష్టికి రాలేదు. కమీషన్ కోసం వేధించే అధికారుల గురించి బాధిత కాంట్రాక్టర్లు ఎవరైనా రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే పరిశీలించి తగు చర్యలు తీసుకుంటా. – మల్లికార్జున మూర్తి, ఈఈ -
అన్న, కొడుకును చంపేందుకు కుట్ర!
రాయదుర్గం: ఆస్తిపై కన్నేసిన ఓ సోదరుడు తన సొంత అన్న, అతడి కుమారుడిని హత్య చేసేందుకు పన్నిన కుట్రను రాయదుర్గం పోలీసులు భగ్నం చేశారు. ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేశారు. గురువారం రాయదుర్గం అర్బన్ పీఎస్లో సీఐ జయనాయక్ విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన మేరకు.. కర్ణాటక రాష్ట్రం రాంపురం సమీపంలోని కేకే పుర గ్రామానికి చెందిన మురారి దామోదర్ గౌడ్, మధుసూదన్ గౌడ్లు అన్నదమ్ములు. వీరికి సుమారు రూ.12 కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. వీటికి సంబంధించి సోదరుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. వారం క్రితం కూడా గ్రామంలో ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో దామోదర్ గౌడ్ను మధుసూదన్ గౌడ్ కుమారుడు భార్గవ్ చెప్పుతో కొట్టాడు. దీంతో కసితో రగిలిపోయిన దామోదర్ గౌడ్.. తన అన్న, అతడి కుమారుడిని అంతమొందించాలని భావించాడు. ఇందుకు రాయదుర్గం మండలంలోని మెచ్చిరి గ్రామానికి చెందిన మారుతిరెడ్డికి రూ.23 లక్షలకు సుపారీ ఇచ్చాడు. గురువారం పల్లేపల్లి గేటు సమీపాన రూ.3 లక్షల అడ్వాన్స్, ఇద్దరినీ హత్య చేసేందుకు మూడు వేట కొడవళ్లు అందజేశాడు. విశ్వసనీయ సమాచారం మేరకు అప్పటికే అక్కడ కాపు కాసిన పోలీసులు.. దామోదర్ గౌడ్తో పాటు మారుతి రెడ్డిని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. కేసులు నమోదు చేసి కటకటాల వెనక్కి పంపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పక్కా సమాచారంతో ప్రణాళికబద్ధంగా ఆపరేషన్ నిర్వహించినట్లు సీఐ జయనాయక్ తెలిపారు. రూ.3 లక్షల నగదు, మూడు వేట కొడవళ్లు, రెండు సెల్ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఇటీవల మెచ్చిరి గ్రామంలో జరిగిన ఓ హత్య కేసులో మారుతిరెడ్డి నిందితుడిగా ఉన్నాడని, దీంతో దామోదర్ గౌడ్ అతణ్ని ఆశ్రయించాడని వెల్లడైందన్నారు. కాగా, హత్యల కుట్రను భగ్నం చేసిన సీఐ, పోలీస్ సిబ్బందిని ఎస్పీ జగదీష్, డీఎస్పీ రవిబాబు అభినందించి రివార్డులు ప్రకటించారు. కార్యక్రమంలో ఎస్ఐ బాలరాజు, సిబ్బంది పాల్గొన్నారు. ఆస్తి కోసం సోదరుడి పన్నాగం రూ. 23 లక్షలకు సుపారీ భగ్నం చేసిన రాయదుర్గం పోలీసులు -
కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి పేదలకు కష్టాలు ఒకదాని వెంట ఒకటి నీడలా వెన్నంటి వస్తున్నాయి. ‘సూపర్ సిక్స్’ హామీలతో అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు... పథకాలు అమలు అటుంచి ఉన్న వాటికి కూడా కోతలు పెడుతున్నారు. తాజాగా రేషన్ సరుకుల్లో కోత పెట్టడంపై సర్వ
అనంతపురం మారుతీనగర్లో రేషన్ సరుకుల కోసం క్యూలో నిల్చున్న కార్డుదారులు (ఫైల్)అనంతపురం అర్బన్: జిల్లావ్యాప్తంగా 6,60,330 బియ్యం కార్డులు ఉన్నాయి. కార్డులోని ఒక్కో సభ్యునికి ప్రతి నెలా 5 కిలోల చొప్పున బియ్యం, కార్డుకు అరకిలో చెక్కర, కిలో కందిపప్పు పంపిణీ చేయాల్సి ఉంటుంది. అయితే, మార్చి నెలకు సంబంధించి కందిపప్పు కోటా 625 టన్నులను ప్రభుత్వం సరఫరా చేయలేదు. కార్డుదారులకు కేవలం బియ్యం, చక్కెర పంపిణీతో సరిపెడుతున్నారు. గత రెండు నెలలు కూడా కందిపప్పు సక్రమంగా పంపిణీ చేయలేదని కార్డుదారులు ఆరోపిస్తున్నారు. ఇక అరకొర సరుకులు తీసుకునేందుకూ చౌక దుకాణాల వద్ద బారులు తీరి గంటల పాటు పడిగాపులు పడాల్సిన దుస్థితి నెలకొనడంతో కార్డుదారులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. బియ్యం నొక్కుడు కొందరు డీలర్లు కార్డుదారులకు ఇవ్వాల్సిన కోటా నుంచి బియ్యం నొక్కేస్తున్నారు. కార్డుకు మూడు కిలోల బియ్యం బదులు జొన్నలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. కార్డుదారులు జొన్నలు తీసుకున్నా... తీసుకోకపోయినా బియ్యం మాత్రం మూడు కిలోలు ఇవ్వడం లేదని సమాచారం. ఇలా మిగుల్చుకున్న బియాన్ని బ్లాక్ మార్కెటింగ్ చేసే వ్యక్తులకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. షాపుల వద్ద బారులు ఒక ఎండీయూ (బియ్యం పంపిణీ వాహనం) నిర్వాహకుని వద్ద ఈ–పాస్ యంత్రం ఉంటుంది. ఎండీయూ పరిధిలో మూడు నుంచి నాలుగు స్టోర్లు వస్తాయి. దీంతో అన్ని స్టోర్లలో ఒకేసారి సరుకుల పంపిణీకి వీలుకపోవడంతో మూడు రోజులు ఒక స్టోర్ వద్ద ఈ–పాస్ యంత్రం పెట్టుకుని దాని డీలర్ ద్వారా రేషన్ ఇస్తున్నాడు. అటు తరువాత మరో స్టోర్ వద్ద, ఇలా మూడు రోజులకు ఒక స్టోర్ వద్ద సరుకులు పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో కార్డుదారులు తెరిచిన స్టోర్ వద్దకు పెద్దసంఖ్యలో చేరుకుని సరుకులు తీసుకునేందుకు బారులు తీరుతూ పడిగాపులు కాస్తున్నారు. అమలు కాని విధానం ప్రభుత్వం నిబంధనల ప్రకారం ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు కార్డుదారులకు సరుకులు ఇవ్వాలి. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సరుకులు పంపిణీ చేయాలి. స్టోర్ డీలర్ రిజిస్టర్ నిర్వహించాలి. అయితే జిల్లాలో ఈ విధానం అమలు కావడం లేదు. ప్రతి రేషన్ షాపు డీలర్కు ఒక ఈ–పాస్ యంత్రాన్ని ప్రభుత్వం ఇవ్వకపోవడంతో సరుకులు తీసుకునేందుకు లబ్ధిదారులు ఇబ్బందిపడాల్సి వస్తోంది. 1,645 జిల్లాలో చౌకదుకాణాలుఏఏవై కార్డులు52,371పురుషులు9,71,251మహిళలు9,80,503 కందిపప్పు కోటా సరఫరా చేయని చంద్రబాబు ప్రభుత్వం బియ్యం, చక్కెరతో సరిపెడుతున్న వైనం అరకొర సరుకులు తీసుకునేందుకూ పేదల పడిగాపులు ప్రభుత్వ తీరుపై మండిపాటు -
తలకు మించిన భారం.. తొలగించక తప్పదు!
అనంతపురం: ‘గతంలో అప్కాస్ ద్వారా మీకు జీతాలు చెల్లించేవారు. ఇటీవల ఆ వ్యవస్థను రద్దు చేయడంతో నేరుగా వర్సిటీనే చెల్లించాల్సి వస్తోంది. దీంతో తలకు మించిన భారం అవుతోంది. ఈ క్రమంలోనే కొంత మందిని తొలగించక తప్పదు’ అని అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జేఎన్టీయూ(ఏ) రిజిస్ట్రార్ కృష్ణయ్య స్పష్టం చేశారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఆధ్వర్యంలో గురువారం జేఎన్టీయూ నూతన వీసీ సుదర్శనరావును సత్కరించారు. ఈ సందర్భంగా వీసీ సమక్షంలోనే రిజిస్ట్రార్ కృష్ణయ్య అవుట్సోర్సింగ్ ఉద్యోగులనుద్దేశించి మాట్లాడారు. వర్సిటీ పరిధిలోని ఇంజినీరింగ్ కళాశాలలు సింహభాగం అటానమస్గా మారిపోతున్నాయన్నారు. దీంతో వర్సిటీకి ఆదాయం గణనీయంగా తగ్గిపోతోందని, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు చెల్లింపు కష్టతరంగా మారిందని చెప్పారు. కొంత మందిని తొలగించక తప్పదన్నారు. ఆసక్తి ఉన్న వారు అనంతపురం నుంచి కలికిరి ఇంజినీరింగ్ కళాశాలకు వెళ్లొచ్చని, అక్కడ క్వార్టర్స్ సౌకర్యం కూడా ఉందన్నారు. కొంత మంది ఒక సెక్షన్ నుంచి మరొక సెక్షన్కు మారిస్తేనే నేరుగా ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచి ఫోన్ చేయించి సిఫార్సు చేస్తున్నారన్నారు. ఫింగర్ప్రింట్ పెట్టి విధులకు హాజరు కాకుండా వెళ్లిపోతున్నారని, అలాంటి వారిపై నిఘా ఉంచామన్నారు.ఇప్పటికే 9 మందిని తొలగించామని, భవిష్యత్తులో మరింత మందిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. -
కర్మచారీ వ్యవస్థను నిర్మూలించాలి
అనంతపురం అర్బన్: ‘సఫాయి కర్మచారీ (మాన్యువల్ స్కావెంజర్) వ్యవస్థనను సమూలంగా నిర్మూలించాలి. వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పనకు అవసరమైన శిక్షణ ఇవ్వడంతో పాటు రుణాలు మంజూరు చేయాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 8న అన్ని మునిసిపాలిటీల్లో మహిళా పారిశుధ్య కార్మికులకు మెడికల్ క్యాంపులు నిర్వహించాలి’ అని కలెక్టర్ వి.వినోద్కుమార్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో జిల్లా విజిలెన్స్ కమిటీ (మాన్యువల్ స్కావెంజర్స్ చట్టం– 2013) సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మ్యాన్హోల్స్లో మనుషులతో పనిచేయించడం సరికాదని, ఇలా పనిచేయించిన అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని మునిసిపల్ కమిషనర్లను ఆదేశించారు. పారిశుధ్య కార్మికులకు దుస్తులు, సబ్బులు, రేడియం జాకెట్, గ్లౌజులు, యూనిఫాం, కొబ్బరినూనె, గమ్బూట్లు, పనిముట్లు ఇవ్వాలన్నారు. స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న కర్మచారీలకు రుణాలు, శిక్షణ అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నెలకోసారి హెల్త్ క్యాంపు నిర్వహించి పారిశుధ్య కార్మికులతో పాటు కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు చేయాలన్నారు. సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ జేడీ రాధిక, నగర పాలక కమిషనర్ బాలస్వామి, డ్వామా పీడీ సలీమ్బాషా, హౌసింగ్ పీడీ శైలజ, ఎల్డీఎం నర్సింగరావు, డీఎంహెచ్ఓ ఈబీదేవి, పీఆర్ఎస్ఈ జహీర్ అస్లాం, బీసీ కార్పొరేషన్ ఈడీ సుబ్రహ్మణ్యం, గిరిజన సంక్షేమాధికారి రామాంజినేయులు, సభ్యులు పెన్నోబుళేసు, వినోద్కుమార్, రియాజ్ బాషా, సద్మావతి, మునిసిపల్ కమిషనర్లు, అధికారులు పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకంగా మహిళా దినోత్సవ ఏర్పాట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకుని అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ వి.వినోద్కుమార్ ఆదేశించారు. గురువారం తన చాంబర్ నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం జేఎన్టీయూ ఆడిటోరియంలో కార్యక్రమం ఉంటుందన్నారు. ఐసీడీఎస్, మెప్మా, డీఆర్డీఏ, పోలీసు, సమగ్రశిక్ష తదితర శాఖల పరిధిలోని మహిళలకు అందిస్తున్న లక్పతి దీదీ, లైవ్లీ హుడ్ యూనిట్లు, బ్యాంక్ లింకేజీ, ఉన్నతి, పీఎంఈజీపీ, పీఎం విశ్వకర్మ కింద యూనిట్లు, రుణాలు మంజూరు, గ్రౌండింగ్ చేయాలన్నారు. మెప్మా, ప్రేరణ సఖీ, శక్తియాప్, అనంత ఆత్మరక్షణ, 112 కాల్ సెంటర్, తదితర అన్ని రకాల స్టాళ్లు ఏర్పాటు చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో డీఆర్ఓ మలోల, ఎఫ్ఎస్ఓ రామకృష్ణారెడ్డి, వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు. -
అబ్బేదొడ్డిలో చిరుత కలకలం
గుత్తి రూరల్: మండలంలోని అబ్బేదొడ్డి గ్రామ శివారులో చిరుత సంచారం కలకలం సృష్టించింది. మూడు నెలలుగా సమీప అటవీ ప్రాంతం నుంచి గ్రామ శివారులోని రిజర్వాయర్ వద్దకు వస్తూ రైతులు, గ్రామస్తులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మూడు రోజుల క్రితం గుంతకల్లు మండలం నాగసముద్రం గ్రామానికి ప్రయాణికులతో ఆటో వెళ్తుండగా రెండు చిరుతలు రోడ్డు దాటుతూ కనిపించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే గురువారం వేకువజామున మాముడూరు గ్రామానికి వెళ్లే దారిలో చిరుత కనిపించింది. రైతులు ఓ చెట్టు పక్కన దాక్కొని ప్రాణాలు కాపాడుకున్నారు. చిరుత పాదముద్రల ఫొటోలు తీసి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇప్పటికై నా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. యాజమాన్య పద్ధతులు పాటించాలి ● ఉద్యాన అధికారి నరసింహరావు గార్లదిన్నె: చీనీ రైతులు యాజమాన్య పద్ధతులు పాటించాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి నరసింహరావు పేర్కొన్నారు. గురువారం మండల పరిధిలోని కొప్పల కొండ, శిరివరంలో చీనీ పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెట్ట పరిస్థితుల వల్ల తోటల్లో వేరుకుళ్లు, బంక తెగులు ఉన్నట్లు గుర్తించామన్నారు. ‘బెట్ట’ పెరిగే కొద్దీ వ్యాధి ఉధ్రుతి ఎక్కువవుతుందన్నారు. వ్యాధి నివారణకు ట్రైకోడెర్మా, సుడోమనాస్ వంటి శిలీంధ్ర నాశకాలు, పశువుల ఎరువుతో కలిపి చెట్లకు అందించాలన్నారు. సూక్ష్మ పోషకధాతు లోపాలు లేకుండా చూసుకోవాలన్నారు. కార్బెండిజం మందు ఒక గ్రామును లీటర్ నీటికి కలిపి పాది మొత్తం తడిసేలా పిచికారీ చేయాలన్నారు. కార్యక్రమంలో రాప్తాడు ఉద్యానశాఖ అధికారి రత్నకుమార్, ఉద్యాన విస్తరణ అధికారి రామాంజనేయులు, శ్రీనివాసులు, గ్రామ ఉద్యానశాఖ అధికారులు గంపరాజు, మల్లికార్జున రైతులు పాల్గొన్నారు. ఏపీఆర్ఎస్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం పరిగి: మండలంలోని కొడిగెనహళ్లిలో ఉన్న ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ బాలుర పాఠశాలలో (ఏపీఆర్ఎస్ఓఈ) ప్రవేశానికి 2025–26 విద్యా సంవత్సరానికి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విద్యా సంస్థల జిల్లా కన్వీనర్, ప్రిన్సిపాల్ ఎన్వీ మురళీధర్బాబు ఓ ప్రకటనలో తెలిపారు. ఈమేరకు గురువారం స్థానిక పాఠశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. పాఠశాలలో 5వ తరగతిలో ప్రవేశానికి 80 సీట్లు ఉన్నాయన్నారు. రాయలసీమలోని ఉమ్మడి నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్న బాలురు అర్హులన్నారు. ఏపీఆర్ఎస్ క్యాట్ (ఏపీఆర్ఎస్ సీఏటీ) అర్హత పరీక్ష ద్వారా ప్రవేశం పొందవచ్చన్నారు. అర్హులైన విద్యార్థులు https://aprs. apcfss.in వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 31 వరకూ గడువు విధించామన్నారు.అదేవిధంగా ఏప్రిల్ 25న జరిగే ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన వారి మార్కుల ఆధారంగా ప్రవేశాన్ని కల్పిస్తున్నట్లు వివరించారు. మరిన్ని వివరాలకు 87126 25065 సెల్ నంబరును సంప్రదించాలన్నారు. తిరుపతి రైలు తిరిగేలా లేదప్పా! రాయదుర్గంటౌన్: ఇప్పట్లో రాయదుర్గం ప్రాంత ప్రజలకు కదిరిదేవరపల్లి–తిరుపతి రైలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. దాదాపు ఏడాది నుంచి ఈ ప్యాసింజర్ను రైల్వే అధికారులు పాక్షికంగా రద్దు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే మరోసారి కదిరిదేవరపల్లి–తిరుపతి మధ్య రాకపోకలు సాగించే రైలు (57405/57406) రద్దును ఈ నెలాఖరు వరకూ పొడిగించారు. ఈ మేరకు సౌత్ వెస్ట్రన్ రైల్వే పీఆర్ఓ మంజునాథ కనమడి ఒక ప్రకటనలో తెలిపారు. రాయదుర్గం–తుమకూరు మార్గంలో ట్రాక్ పనులు పూర్తయిన కదిరిదేవరపల్లి వరకు నడుపుతున్న ఏకైక రైలును సైతం రద్దు చేస్తూ వస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
నాన్న కాదు.. నరహంతకుడు..
దారుణాతి దారుణం.. ఘోరాతి ఘోరం.. కన్నతండ్రే కూతురికి స్వయంగా మరణశాసనం రాశాడు. దగ్గరుండి మరీ కన్నబిడ్డను కాటికి పంపాడు. కళ్లెదుట కన్నకూతురు ప్రాణాలు పోతున్నా ఆ పాషణ హృదయం కరగలేదు. ప్రేమించిన వాడిని మరిచిపోలేనని చెప్పిన పాపానికి కూతురిని కర్కశంగా బలితీసుకున్నాడో నరహంతక తండ్రి. ఈ అవమానవీయ ఘటన గురించి తెలిసిన వారందరూ భయంతో వణికిపోతున్నారు. ఇలాంటి సమాజంలో ఉన్నందుకు సిగ్గుతో తలదించుకుంటున్నారు.గుంతకల్లు రూరల్: కుమార్తె ప్రేమ వ్యవహారం (love affair) కారణంగా కుటుంబ పరువు, మర్యాద మంటగలసి పోతున్నాయనే ఉద్దేశంతో కన్న కూతురినే కడతేర్చాడో తండ్రి. అనంతపురం జిల్లా (Anantapur District) గుంతకల్లులో ఐదు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగు చూసింది. గుంతకల్లు పట్టణంలోని తిలక్ నగర్లో నివాసం ఉంటున్న తుపాకుల రామాంజనేయులు, సావిత్రి దంపతులకు నలుగురు కుమార్తెలు. హోటల్ నిర్వహణతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ముగ్గురు కుమార్తెలకు ఇదివరకే వివాహం చేశారు. చివరి కుమార్తె భారతి (20) కర్నూలులోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతోంది. ఈమె ఇంటికి సమీపంలోనే ఉంటున్న యువకుడిని ప్రేమించింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వారిస్తూ వచ్చారు. ఎంతకూ వారి మాట వినని భారతి ‘చావనైనా చస్తాను గానీ ప్రేమించిన యువకుడిని మరచిపోలేన’ని తెగేసి చెప్పింది. నిర్మానుష్య ప్రాంతంలో ఘాతుకం..తండ్రి రామాంజనేయులు ఈ నెల ఒకటో తేదీన కుమార్తెతో మరోమారు మాట్లాడి.. ఆమె మనసు మార్చే ప్రయత్నం చేశాడు. అయినా వినకపోవడంతో తనతో పాటు ఒక తాడును తీసుకొని కుమార్తెను స్కూటర్పై తీసుకొని కసాపురం గ్రామ శివారులోని తిక్కస్వామి తోట సమీపంలో నిర్మానుష్య ప్రాంతానికి చేరుకున్నారు. తాడుతో అక్కడి చెట్టుకు ఉరితాడు సిద్ధం చేశాడు. ఇప్పటికైనా మాట వింటావా లేక చస్తావా అని అడిగాడు. తాను చావడానికైనా సిద్ధమని స్పష్టం చేయడంతో ‘సరే చావు’ అంటూ ఆమెను ఎత్తి పట్టుకున్నాడు. వెంటనే ఆ అమ్మాయి చెట్టుకు వేలాడుతున్న ఉరితాడును తన మెడకు వేసుకుంది.కుమార్తెను మరోసారి బతిమాలిన రామాంజనేయులు ఆమె మాట వినకపోవడంతో ఉరికి వదిలేసి.. వెనక్కు తిరిగి చూడకుండా ముందుకు కదిలాడు. కొంత దూరం వచ్చాక తిరిగి వెనక్కు వెళ్లి చూడగా అప్పటికే భారతి విగతజీవిగా ఉరికి వేలాడుతోంది. దీంతో మృతదేహాన్ని కిందకు దింపి తన స్కూటర్లోని పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అక్కడి నుంచి నేరుగా ఇంటికి చేరుకున్నాడు. మూడు రోజుల తర్వాత ఈ నెల నాల్గో తేదీన గుంతకల్లు టూటౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్లి.. కుమార్తెను చంపేశానని చెప్పి లొంగిపోయాడు.చదవండి: పాపం శిరీష.. ఆడపడుచు కపట ప్రేమకాటుకు బలైందికసాపురం శివారులో ఘటన జరిగినట్లుగా తెలపడంతో రామాంజనేయులుతో కలిసి రూరల్ సీఐ ప్రవీణ్కుమార్, ఎస్ఐ టీపీ వెంకటస్వామి, పోలీసులు మంగళవారం రాత్రి 9.30 గంటల వరకూ గాలింపు చేపట్టినా ఘటనా స్థలాన్ని గుర్తించలేకపోయారు. దీంతో బుధవారం ఉదయం మరోమారు గాలించి సంఘటన స్థలాన్ని గుర్తించారు. కాలిన మృతదేహాన్ని కొంతమేర కుక్కలు పీక్కు తిన్నట్లు గుర్తించిన పోలీసులు అక్కడే పోస్టుమార్టం నిర్వహింపజేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
టీడీపీ నేతల అవినీతి బాగోతం బట్టబయలు
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: కదిరిలో టీడీపీ నేతల అవినీతి బాగోతం బయటపడింది. ఒక్కో ఇంటి పట్టాకు రూ. 50 వేలు టీడీపీ నేతలు వసూలు చేస్తున్నారు. కదిరి ఆర్డీవో కార్యాలయం ఎదుట ఇంటి పట్టాలు ఇప్పిస్తామంటూ దందా సాగిస్తున్నారు. టీడీపీ నేతలు పబ్లిగ్గా డబ్బు వసూలు చేస్తున్నా కానీ రెవెన్యూ, పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదు. టీడీపీ నేతల వసూళ్ల పర్వం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.స్టోర్ డీలర్పై టీడీపీ నేత దాడిమరోవైపు, టీడీపీ నేతల దౌర్జన్యాలకు అంతులేకుండా పోతోంది. తాము హెచ్చరించినా రేషన్ దుకాణం వదులుకోలేదన్న కోపంతో టీడీపీ నాయకుడు అంజినప్ప దళిత సామాజిక వర్గానికి చెందిన ఓ రేషన్ షాపు డీలర్పై దాడి చేశాడు. ఈ ఘటన బుధవారం హిందూపురం మండలం కగ్గల్లు గ్రామంలో చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు... దళిత సామాజిక వర్గానికి చెందిన ఆదినారాయణ దివ్యాంగుడు. 2006 నుంచి గ్రామ (ఎఫ్ఫీ షాప్నంబర్ 1257060) డీలర్గా పనిచేçసూŠత్ జీవనం సాగిస్తున్నాడు.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగానే డీలర్ షిప్ వదులుకోవాలని టీడీపీ నేతలు ఆదినారాయణను బెదిరించారు. దీని గురించి గ్రామ సర్పంచ్ హనుమంతు రాయప్పకు బాధితుడు చెప్పుకోగా.. సర్పంచ్ కూడా టీడీపీ నేతలకే వత్తాసు పలుకుతూ రేషన్ డీలర్ షిప్ వదులుకోవాలని బెదిరించాడు. దీంతో ఆదినారాయణ తప్పనిసరి పరిస్థితిలో కోర్టును ఆశ్రయించి డీలర్గా కొనసాగేలా అనుమతులు తెచ్చుకున్నాడు.దీంతో రెవెన్యూ అధికారులు ఆదినారాయణ ఎఫ్సీ షాపునకు నెలసరి రేషన్ బియ్యం కోటాను మంజూరు చేశారు. ఈ క్రమంలో ఆదినారాయణ బుధవారం బియ్యం బస్తాలను లారీ నుంచి దించుకుంటుండగా.. టీడీపీ నాయకుడు అంజినప్ప అక్కడికి వచ్చి పరుష పదజాలంతో దూషించాడు. అంతేకాకుండా భౌతికదాడి చేయడంతో పాటు అందరి ముందు చెప్పుకాలితో తన్నాడు. తనకు కోర్టు అనుమతి ఉందని ఆదినారాయణ చెబుతున్నా ‘ప్రభుత్వం మాది... మాదే జరుగుతుంది... కోర్టు గీర్టు జాన్తా నై.. నీ ఇష్టం వచ్చిన వాడికి చెప్పుకో’’ అంటూ అందరి ముందు దుషించాడు. దీనిపై బాధితుడు బుధవారం హిందూపురం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంజినప్పపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
ప్రతి తప్పునూ సరిదిద్దుతాం
● సీనియార్టీ జాబితాపై ఆందోళన చెందాల్సిన పనిలేదు ● పాఠశాల విద్య రీజినల్ జాయింట్ డైరెక్టర్ శామ్యూల్ అనంతపురం ఎడ్యుకేషన్: టీచర్ల సీనియార్టీ జాబితాలో ప్రతి తప్పునూ సరిదిద్దుతామని పాఠశాల విద్య ఆర్జేడీ శామ్యూల్ స్పష్టం చేశారు. బుధవారం స్థానిక డీఈఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఈఓ ప్రసాద్బాబు, ఏడీ కృష్ణయ్యతో కలిసి ఆయన మాట్లాడారు. అన్ని కేడర్ల టీచర్ల పదోన్నతులు, బదిలీలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో శాశ్వతంగా సీనియార్టీ జాబితాలు తయారు చేస్తున్నామన్నారు. జిల్లాలో మొత్తం 15,059 మంది టీచర్లు పని చేస్తున్నారన్నారు. వీరిలో స్కూల్ అసిస్టెంట్లు 6,849 మంది, ఎస్జీటీలు 7,307 మంది, లాంగ్వేజ్ పండిట్లు 117 మంది, పీఈటీలు 60 మంది, పీఎస్హెచ్ఎంలు 340, గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులు 386 మంది ఉన్నారన్నారు. వీరికి సంబంధించిన తాత్కాలిక సీనియార్టీ జాబితాలను విడుదల చేశామన్నారు. డీఈఓ బ్లాగ్లోని జాబితాలను పరిశీలించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే స్థానిక సైన్స్ సెంటర్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్లో తెలియజేయాలని సూచించారు. రోజూ సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. ఈనెల 10 వరకు ఫిర్యాదులు అందజేయవచ్చన్నారు. ప్రతి ఫిర్యాదునూ పరిశీలించి పరిష్కరిస్తామని చెప్పారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కొత్త విధానంతో భవిష్యత్తులో సీనియార్టీ బదిలీలు, పదోన్నతుల సమయంలో ఎలాంటి ఆటంకాలు ఉండవని ఆర్జేడీ స్పష్టం చేశారు. -
‘పీఎం సూర్యఘర్’ వేగవంతం కావాలి
అనంతపురం టౌన్: జిల్లాలో ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకం అమలు వేగవంతం కావాలని కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ పేర్కొన్నారు. బుధవారం విద్యుత్ కార్యాలయంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణతో కలిసి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లాకు కేటాయించిన లక్ష్యాన్ని 45 రోజుల్లో పూర్తి చేయాలన్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 46 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయన్నారు. అన్నింటినీ గ్రౌండింగ్ చేసే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. సోలార్ రూఫ్ టాప్ల ఏర్పాటుకు అవసరమైన పరికరాలను వెండర్స్ సిద్ధం చేసుకునేలా చూడాలన్నారు. ఎంపీ అంబికా మాట్లాడుతూ ‘పీఎం సూర్యఘర్’ అమలులో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో ఉండేలా ప్రత్యేక చొరవ చూపాలన్నారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్ఈ శేషాద్రిశేఖర్, ఈఈలు జేవీ రమేష్తోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ‘ఎంఎస్ఎంఈ’లకు భూమి కేటాయించండి అనంతపురం అర్బన్: ‘ప్రతి నియోజకవర్గం పరిధిలో ఒక ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందుకు అవసరమైన భూమి కేటాయింపు ప్రక్రియను చేపట్టండి’ అని కలెక్టర్ వి.వినోద్కుమార్ ఆదేశించారు. బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి జాయింట్ కలెక్టర్, డీఆర్ఓ, జిల్లా రిజిస్ట్రార్, తహసీల్దార్లు, మండల సర్వేయర్లు, ఆర్ఎస్డీటీలు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈ–సేవ, ఆధార్ సీడింగ్, అడంగల్ కరెక్షన్, మ్యుటేషన్ తదితర అంశాలపై సమీక్షించారు. సమావేశంలో ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ సోనీ తదితరులు పాల్గొన్నారు. -
తారస్థాయికి ఖాకీల వేధింపులు
అనంతపురం: రాప్తాడు పంచాయతీ పరిధిలోని ప్రసన్నాయపల్లికి చెందిన భూమిరెడ్డి మహానందరెడ్డిపై పోలీసుల వేధింపులు తారస్థాయికి చేరాయి. తరచూ పోలీసుస్టేషన్కు పిలవడం, ముందస్తు సమాచారం లేకుండానే నేరుగా ఇంట్లోకి వెళ్లి సోదాలు చేయడం వంటి ఘటనలతో కుటుంబ సభ్యులను భయాందోళనకు గురి చేస్తున్నారు. మహానందరెడ్డి సోదరుడు భూమిరెడ్డి శివప్రసాద్రెడ్డిని ప్రత్యర్థులు 2015 ఏప్రిల్ 29న రాప్తాడు తహసీల్దార్ కార్యాలయంలోనే దారుణంగా హత్య చేశారు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆ సమయంలో రాప్తాడు ఎంపీపీగా ఉన్నారు. అప్పట్లో దగ్గుపాటి కారును శివప్రసాదరెడ్డి హత్య కేసులోని నిందితులు వాడినట్లు తేలింది. ఈ క్రమంలో దగ్గుపాటి, మహానందరెడ్డి మధ్య విభేదాలు ఉన్నాయి. సీఐ స్వామి భక్తి! ఎమ్మెల్యే దగ్గుపాటి అండతో అనంతపురం వన్టౌన్ సీఐగా పోస్టింగ్ తెచ్చుకున్న రాజేంద్రనాథ్ యాదవ్ స్వామిభక్తి ప్రదర్శిస్తూ మహానందరెడ్డిని లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురి చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఇది పోలీసుల సాయంతో రాజకీయ కక్ష సాధింపులకు పరాకాష్టగా పలువురు పేర్కొంటున్నారు. మహానందరెడ్డి గత ఎన్నికల్లో దగ్గుపాటికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ అభ్యర్థి విజయం కోసం ముమ్మర ప్రచారం సాగించారు. దీంతో ఆయనపై కక్ష పెంచుకున్న ఎమ్మెల్యే దగ్గుపాటి పథకం ప్రకారం సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ను రంగంలోకి దింపి కక్ష సాధింపులకు తెరలేపారనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా బుధవారం మహానందరెడ్డిని వన్టౌన్ పోలీసుస్టేషన్కు పిలుచుకెళ్లిన పోలీసులు కాసేపటి తర్వాత వదిలేశారు. అంతకు ముందు ఆయన ఇంట్లో విస్తృత సోదాలు చేశారు. ఇలా పది రోజులకోసారి సోదాలు నిర్వహించడం ప్రసన్నాయపల్లిలో కలకలం రేపుతోంది. ప్రసన్నాయపల్లి మహానంద రెడ్డిని ముప్పుతిప్పలు పెడుతున్న వైనం తరచూ ఇంట్లో సోదాలు సీఐ రాజేంద్రనాథ్ తీరుపై విమర్శలు -
తారస్థాయికి ఖాకీల వేధింపులు
అనంతపురం: రాప్తాడు పంచాయతీ పరిధిలోని ప్రసన్నాయపల్లికి చెందిన భూమిరెడ్డి మహానందరెడ్డిపై పోలీసుల వేధింపులు తారస్థాయికి చేరాయి. తరచూ పోలీసుస్టేషన్కు పిలవడం, ముందస్తు సమాచారం లేకుండానే నేరుగా ఇంట్లోకి వెళ్లి సోదాలు చేయడం వంటి ఘటనలతో కుటుంబ సభ్యులను భయాందోళనకు గురి చేస్తున్నారు. మహానందరెడ్డి సోదరుడు భూమిరెడ్డి శివప్రసాద్రెడ్డిని ప్రత్యర్థులు 2015 ఏప్రిల్ 29న రాప్తాడు తహసీల్దార్ కార్యాలయంలోనే దారుణంగా హత్య చేశారు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆ సమయంలో రాప్తాడు ఎంపీపీగా ఉన్నారు. అప్పట్లో దగ్గుపాటి కారును శివప్రసాదరెడ్డి హత్య కేసులోని నిందితులు వాడినట్లు తేలింది. ఈ క్రమంలో దగ్గుపాటి, మహానందరెడ్డి మధ్య విభేదాలు ఉన్నాయి. సీఐ స్వామి భక్తి! ఎమ్మెల్యే దగ్గుపాటి అండతో అనంతపురం వన్టౌన్ సీఐగా పోస్టింగ్ తెచ్చుకున్న రాజేంద్రనాథ్ యాదవ్ స్వామిభక్తి ప్రదర్శిస్తూ మహానందరెడ్డిని లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురి చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఇది పోలీసుల సాయంతో రాజకీయ కక్ష సాధింపులకు పరాకాష్టగా పలువురు పేర్కొంటున్నారు. మహానందరెడ్డి గత ఎన్నికల్లో దగ్గుపాటికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ అభ్యర్థి విజయం కోసం ముమ్మర ప్రచారం సాగించారు. దీంతో ఆయనపై కక్ష పెంచుకున్న ఎమ్మెల్యే దగ్గుపాటి పథకం ప్రకారం సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ను రంగంలోకి దింపి కక్ష సాధింపులకు తెరలేపారనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా బుధవారం మహానందరెడ్డిని వన్టౌన్ పోలీసుస్టేషన్కు పిలుచుకెళ్లిన పోలీసులు కాసేపటి తర్వాత వదిలేశారు. అంతకు ముందు ఆయన ఇంట్లో విస్తృత సోదాలు చేశారు. ఇలా పది రోజులకోసారి సోదాలు నిర్వహించడం ప్రసన్నాయపల్లిలో కలకలం రేపుతోంది. ప్రసన్నాయపల్లి మహానంద రెడ్డిని ముప్పుతిప్పలు పెడుతున్న వైనం తరచూ ఇంట్లో సోదాలు సీఐ రాజేంద్రనాథ్ తీరుపై విమర్శలు -
ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదు
అనంతపురం ఎడ్యుకేషన్: అక్రమ అరెస్ట్లతో రాష్ట్రంలో అల్లకల్లోలం సృస్టిస్తూ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ హెచ్చరించారు. అత్యాచార ఘటనలో బాధితుల పేర్లు బహిరంగంగా ప్రకటించారనే ఫిర్యాదుతో విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు గోరంట్ల మాధవ్కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. బుధవారం విచారణకు హాజరుకావాల్సి ఉండగా...ఉదయం బయలుదేరి వెళ్లారు. మాధవ్ ఇంటివద్దకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాధవ్ మాట్లాడుతూ... ప్రత్యేక పరిస్థితుల కారణంగా ఆలస్యంగా వస్తానని పోలీసులకు ముందస్తు సమాచారం అందించానని తెలిపారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను అనేక రకాలుగా వేధింపులకు గురి చేస్తున్నారని వాపోయారు. కూర్చుంటే కేసు, లేస్తే కేసు, విమర్శిస్తే కేసులు నమోదు చేస్తూ పౌరుల హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. ఈ పరిస్థితులు కొనసాగితే కులాలు,మతాలకు అతీతంగా కూటమి ప్రభుత్వంపై తిరుగుబాటు, విప్లవం తప్పదని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ పరామర్శ.. గోరంట్ల మాధవ్ను మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మాజీ ఎంపీ తలారి రంగయ్య పరామర్శించారు. మాజీ ఎంపీ రంగయ్య మాట్లాడుతూ...రూల్ ఆఫ్ లా అనేది అందరికీ ఒకేలా ఉండాలన్నారు. పార్టీ మారినంత మాత్రాన ప్రభుత్వం మారకూడదన్నారు. ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్న తీరు మంచిగా లేదన్నారు. గోరంట్ల మాధవ్కు ఏ విధంగా నోటీసులు ఇచ్చారో గతంలో బాధితుల పేర్లు వెల్లడించిన వారందరికీ ఇదే రకంగా నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. ఇప్పుడు చట్టం తన పని తను ఎలాగా చేస్తోందో రానున్న రోజుల్లోనూ అలాగే చేస్తుందన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను భయపెడుతూ పార్టీ కేడర్ను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందన్నారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పేదల సంక్షేమం గురించి పట్టించుకోకుండా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల అరెస్ట్పై ఫోకస్ పెట్టారన్నారు. ఇవి ఎన్నో రోజులు సాగవన్నారు. అనంతరం గోరంట్ల మాధవ్ పెద్ద ఎత్తున కాన్వాయ్తో విజయవాడ బయలుదేరి వెళ్లారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్ హెచ్చరిక విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసుల నోటీసుల నేపథ్యంలో విచారణకు బయలుదేరి వెళ్లిన మాధవ్ -
‘పీఎం సూర్యఘర్’ వేగవంతం కావాలి
అనంతపురం టౌన్: జిల్లాలో ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకం అమలు వేగవంతం కావాలని కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ పేర్కొన్నారు. బుధవారం విద్యుత్ కార్యాలయంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణతో కలిసి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లాకు కేటాయించిన లక్ష్యాన్ని 45 రోజుల్లో పూర్తి చేయాలన్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 46 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయన్నారు. అన్నింటినీ గ్రౌండింగ్ చేసే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. సోలార్ రూఫ్ టాప్ల ఏర్పాటుకు అవసరమైన పరికరాలను వెండర్స్ సిద్ధం చేసుకునేలా చూడాలన్నారు. ఎంపీ అంబికా మాట్లాడుతూ ‘పీఎం సూర్యఘర్’ అమలులో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో ఉండేలా ప్రత్యేక చొరవ చూపాలన్నారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్ఈ శేషాద్రిశేఖర్, ఈఈలు జేవీ రమేష్తోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ‘ఎంఎస్ఎంఈ’లకు భూమి కేటాయించండి అనంతపురం అర్బన్: ‘ప్రతి నియోజకవర్గం పరిధిలో ఒక ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందుకు అవసరమైన భూమి కేటాయింపు ప్రక్రియను చేపట్టండి’ అని కలెక్టర్ వి.వినోద్కుమార్ ఆదేశించారు. బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి జాయింట్ కలెక్టర్, డీఆర్ఓ, జిల్లా రిజిస్ట్రార్, తహసీల్దార్లు, మండల సర్వేయర్లు, ఆర్ఎస్డీటీలు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈ–సేవ, ఆధార్ సీడింగ్, అడంగల్ కరెక్షన్, మ్యుటేషన్ తదితర అంశాలపై సమీక్షించారు. సమావేశంలో ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ సోనీ తదితరులు పాల్గొన్నారు. -
సేవలతో ప్రజా మన్ననలు పొందాలి
అనంతపురం మెడికల్: ఉత్తమ సేవలు అందించి ప్రజల మన్ననలు పొందాలని కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఆవరణంలో 2కే19 బ్యాచ్ స్నాతకోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ వినోద్కుమార్ హాజరై ముందుగా జ్యోతిప్రజ్వలన గావించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం అందించేందుకు యువత ముందుకురావాలన్నారు. తాను వైద్యునిగా గ్రామీణ ప్రాంతాల్లో అందించిన సేవలు, కలెక్టర్గా సాధించిన విజయాలను పంచుకున్నారు. ఐఏఎస్ సాధించాలన్న ఆశ ఎవరికై నా ఉంటే ఇష్టంతో చదవాలని సూచించారు. ప్రజలకు విలువలతో కూడిన వైద్యం అందించడం ముఖ్యమన్నారు. గురువులు, తల్లిదండ్రులను గౌరవించాలన్నారు. వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మాణిక్య రావు మాట్లాడుతూ రాష్ట్రంలోనే అనంతపురం వైద్య కళాశాలకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. చాలా మంది ఇక్కడ విద్యనభ్యసించేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు. అనంతరం విద్యార్థులకు మెమొంటోలు, పట్టాలను కలెక్టర్ అందజేశారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వర రావు, వైస్ ప్రిన్సిపాళ్లు డాక్టర్ షంషాద్బేగం, డాక్టర్ షారోన్ సోనియా తదితరులు పాల్గొన్నారు. వైద్య విద్యార్థులకు కలెక్టర్ వినోద్కుమార్ పిలుపు ఘనంగా అనంతపురం వైద్య కళాశాల 2కే 19 బ్యాచ్ స్నాతకోత్సవం -
యువరైతు బలవన్మరణం
గార్లదిన్నె/అనంతపురం సిటీ: ఆర్థిక సమస్యలు తాళలేక ఓ యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపిన మేరకు... ఆత్మకూరు మండలం ముట్టాల గ్రామానికి చెందిన గోపు ఆనంద్రెడ్డి(29) తల్లిదండ్రుల మృతి అనంతరం తన అన్న సాయిప్రతాపరెడ్డి కుటుంబంతో కలసి జీవిస్తున్నాడు. డిప్లొమా వరకు చదువుకున్న ఆనందరెడ్డి జేసీబీ పెట్టుకొని, అన్నతో కలసి తమకున్న పొలంలో వివిధ రకాల పంటలు సాగు చేసేవాడు. ఈ క్రమంలో పంటలకు గిట్టుబాటు ధర లేక నష్టాలు మూటగట్టుకున్నాడు. దీంతో పంటల సాగుకు చేసిన అప్పులకు వడ్డీల భారం పెరిగి రూ.10 లక్షలకు చేరుకుంది. అప్పులు తీర్చే మార్గం కానరాక మద్యానికి బానిసైన ఆనందరెడ్డి... మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వచ్చేశాడు. అర్ధరాత్రి సమయంలో గార్లదిన్నె మండలం గుడ్డాలపల్లి సమీపంలో పట్టాలపైకి చేరుకుని గూడ్స్ రైలుకు ఎదురుగా నిలబడి ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ముక్కలైన మృతదేహాన్ని సర్వజనాస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న సాయిప్రతాపరెడ్డి మార్చురీకి చేరుకుని మృతుడిని ఆనందరెడ్డిగా ధ్రువీకరించాడు. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
8న జాతీయ లోక్అదాలత్
● అదాలత్ తీర్పు ‘సుప్రీం’ ● ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. శ్రీనివాస్ అనంతపురం: ఉమ్మడి జిల్లాలో ఈ నెల 8వ తేదీన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. శ్రీనివాస్ పేర్కొన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జాతీయ లోక్ అదాలత్లో ఇచ్చే తీర్పులు సుప్రీం కోర్టు తీర్పుతో సమానమన్నారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని కోర్టుల్లోనూ లోక్ అదాలత్ ఉంటుందన్నారు. గత లోక్ అదాలత్లో కేసుల పరిష్కారం పరంగా రాష్ట్రంలోనే జిల్లా 9వ స్థానంలో నిలిచిందని, ఈ సారి ఆ స్థానాన్ని మెరుగుపరచాలన్నారు. మార్చి 8న నిర్వహించే జాతీయ లోక్అదాలత్లో 6,294 కేసులను పరిష్కరించడానికి ఆయా బెంచ్లు కృషి చేస్తాయన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జి. శివప్రసాద్ యాదవ్ పాల్గొన్నారు. ఐసీడీఎస్ పీడీగా నాగమణి అనంతపురం సెంట్రల్: జిల్లా ఐసీడీఎస్ పీడీగా ఎం.నాగమణి నియమితులయ్యారు. ఉమ్మడి జిల్లాల్లో మహిళా,శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వ కార్యదర్శి సూర్యకుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలు జిల్లా మంత్రాలయం సీడీపీఓగా పనిచేస్తున్న ఎం. నాగమణికి పదోన్నతి కల్పించి జిల్లా పీడీగా నియమించారు. శ్రీసత్యసాయి జిల్లా ఐసీడీఎస్ పీడీగా తాడిపత్రి సీడీపీఓ టి. శ్రీదేవికి అదనపు బాధ్యతలు (ఆన్డ్యూటీ) అప్పగించారు. ఇంటర్ సిటీ ప్యాసింజర్ రైళ్లకూ బ్రేకులు! గుంతకల్లు: హుబ్లీ–తిరుపతి మధ్య గుంతకల్లు జంక్షన్ మీదుగా తిరుగుతున్న ఇంటర్ సిటీ ప్యాసింజర్ రద్దును కూడా ఈ నెల 31 వరకు పొడిగించారు. ఈ మేరకు బుధవారం దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీధర్ ఆదేశాలు జారీ చేశారు. తిరుపతి–హుబ్లీ (57401) ప్యాసింజర్ ఈ నెల 30 వరకు, హుబ్లీ–తిరుపతి ప్యాసింజర్ (57402) ప్యాసింజర్ రద్దును ఈ నెల 31 వరకు పొడిగించినట్లు వివరించారు. కాగా, కుంభమేళాకు తరలించిన పలు ప్యాసింజర్ రైళ్లు ఈ నెలాఖరు వరకూ రాకపోకలు సాగించవని ఇదివరకే అధికారులు ప్రకటించారు. వాహనం ఢీకొని పాత్రికేయుడికి తీవ్రగాయాలు పెద్దవడుగూరు: వాహనం ఢీకొన్న ఘటనలో యాడికి మండల ‘సాక్షి’ విలేకరి శ్రీనివాసులు గౌడ్ తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. యాడికి మండలం చందన గ్రామానికి చెందిన శ్రీనివాసులు గౌడ్ బుధవారం ఉదయం వ్యక్తిగత పనిపై ద్విచక్రవాహనంలో గుత్తికి బయలుదేరారు. మార్గమధ్యంలో తనను కలసిన పెద్దపప్పూరు మండలం చెర్లోపల్లికి చెందిన వృద్ధుడు లక్ష్మీరెడ్డిని వాహనంపై ఎక్కించుకుని వెళుతుండగా... పెద్దవడుగూరు మండలం అప్పేచర్ల వద్దకు చేరుకోగానే గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ వాహనాన్ని నిలపకుండా ముందుకు దూసుకెళ్లాడు. ప్రమాదంలో శ్రీనివాసులు గౌడ్, లక్ష్మీరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. అటుగా వెళ్తున్న వాహనదారులు గమనించి సమాచారం ఇవ్వడంతో ఎ.తిమ్మాపురం గ్రామానికి చెందిన సీపీఐ నేత వెంకట్రాముడు యాదవ్, పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రు లను 108 అంబులెన్స్లో గుత్తిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వైద్యులు అనంతపురానికి రెఫర్ చేశారు. పరిస్థితి విషమంగా ఉండడంతో శ్రీనివాసులుగౌడ్ను కర్నూలులోని ఆస్పత్రికి కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. కాగా, ప్రమాద స్థలానికి అరగంట ఆలస్యంగా చేరుకున్న 108 సిబ్బంది అక్కడ తీవ్రంగా గాయపడిన శ్రీనివాసులుగౌడ్ను చూడగానే అంబులెన్స్లోకి ఎక్కించి ప్రేక్షక పాత్ర పోషించడాన్ని స్థానికులు తప్పుబట్టారు. కనీసం స్ట్రెచర్ కూడా తీయకుండా అది పనిచేయడం లేదంటూ బుకాయించడాన్ని మండల సీపీఐ కార్యదర్శి వెంకట్రాముడుయాదవ్ ఖండించారు. క్షతగాత్రుల విషయంలో 108 అంబులెన్స్ సిబ్బంది వ్యవహరించిన తీరును ఆయన ఆక్షేపించారు. -
చంద్రబాబువి దిగజారుడు రాజకీయాలు
● వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్ అనంతపురం కార్పొరేషన్: సీఎం చంద్రబాబు నాయుడుపై రాజద్రోహం కింద కేసు నమోదు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్గౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఇటీవల చిత్తూరు పర్యటనలో చంద్రబాబు నాయుడు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలకు పనులు చేస్తే పాముకు పాలు పోసినట్లేనని వ్యాఖ్యానించడం దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. సీఎంగా, ప్రతిపక్ష నేతగా సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు దిగుజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. ప్రజల పట్ల వివక్ష చూపడం ఎంత వరకు న్యాయమన్నారు. సీఎం అనే వ్యక్తి అందరినీ సమాన ధోరణితో చూడాలని.. కేవలం కొన్ని పార్టీలకు మాత్రమే పథకాలు ఇవ్వాలని మాట్లాడటం దారుణమన్నారు. మంత్రి లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. అధికారులు, నాయకులపై పోలీసులతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ప్రజలన్నీ గమనిస్తున్నారని.. రానున్న రోజుల్లో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్కు ప్రజాస్వామ్య పద్ధతిలో బుద్ధి చెబుతారన్నారు. -
మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ముఖ్య అనుచరుడు అరెస్ట్
సాక్షి,అనంతపురం: మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ముఖ్య అనుచరుడు మహానందరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహానందరెడ్డిపై ఎలాంటి కేసులు లేకున్నా అదుపులోకి తీసుకోవడంపై ఆయన కుటుంబ సభ్యుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అయితే, టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఒత్తిడితో మహానందరెడ్డిని పోలీసులు వేధిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో మహానందరెడ్డి అరెస్ట్ను మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఖండించారు. మహానందరెడ్డికి పోలీసుల నుంచి ప్రాణహాని ఉంది. మహానందరెడ్డిని చంపడానికి టీడీపీ నేతలు కుట్రలు చేస్తున్నారు. అందుకు పోలీసులు సహకరిస్తున్నారని ఆరోపించారు. -
గవిమఠం చంద్రమౌళీశ్వరుడి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ఉరవకొండ: ప్రసిద్ధి గాంచిన ఉరవకొండ గవిమఠం చంద్రమౌళీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామి వారి మూలవిరాట్కు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. గవిమఠం పీఠాధిపతులు జగద్గురు చెన్నబసవ రాజేంద్రస్వామి ఆధ్వర్యంలో కంకణ ధారణ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. గవిమఠం ఆవరణం నుంచి గంగాజలాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లారు. కంకణ మండపంలో కుండల్లో మట్టి వేసి నవధ్యానాలు ఉంచారు. బ్రహ్మోత్సవాలు ముగిసేలోపు మట్టికుండలో ధాన్యాలు బాగా పండితే పంటలు చేతికొచ్చి రైతులు సుభిక్షంగా ఉంటారని భక్తుల విశ్వాసం. కార్యక్రమంలో ఆదోని చౌకి మఠం పీఠాధిపతి కల్యాణ స్వామీజీ, గవిమఠం ఏజెంట్ రాజన్నగౌడ్ పాల్గొన్నారు. రథోత్సవాన్ని విజయవంతం చేద్దాం చంద్రమౌళీశ్వర స్వామి బ్రహ్మరథోత్సవాన్ని విజయవంతం చేద్దామని గుంతకల్లు ఆర్డీఓ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ నెల 9న రథోత్సవం జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లు, భక్తులకు సదుపాయాలు, పోలీసు భద్రత తదితర అంశాలపై ఉరవ కొండ తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఆర్డీఓ మాట్లాడుతూ బ్రహ్మోత్సవానికి తరలివచ్చే భక్తులకు ఎక్కడా చిన్న ఇబ్బంది కూడా తలెత్తకుండా సౌకర్యాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్, గవిమఠం మేనేజర్ కె.రాణి, తహసీల్దార్ మహబూబ్బాషా, ఎంపీడీఓ రవిప్రసాద్, అర్బన్ సీఐ మహానంది తదితరులు పాల్గొన్నారు. -
వైభవం..గావుల మహోత్సవం
కనగానపల్లి: ఉరుముల శబ్దాలు, పోతురాజుల నృత్య విన్యాసాలు, భక్తుల కోలాహలం మధ్య దాదులూరు పోతలయ్యస్వామి గావుల మహోత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. స్వామి కాపులు, భక్తులు వేకువజామునే ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామి వారికి బోనాలు సమర్పించారు. అనంతరం ఉరుముల శబ్దాలకు అనుగుణంగా పోతురాజులు నృత్య విన్యాసాలు చేసుకుంటూ ఆలయంలోకి వచ్చారు. ఆలయ పూజార్లు పోత లయ్యస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల కోలాహలం మధ్య 11 మంది పోతురాజులు మేకపోతు పిల్లలను స్వామికి గావుల (బలి) మహోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం భక్తులు ఆలయం ముందు పొట్టేళ్లు, మేకపోతులను బలి ఇచ్చి మొక్కులు తీర్చుకున్నారు. పోతలయ్యస్వామి గావుల మహోత్సవాన్ని తిలకించేందుకు ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలిరావటంతో ఆలయ ఆవరణమంతా కిక్కిరిసిపోయింది. -
హెచ్చెల్సీలో ఓ అవినీతి బాగోతం వెలుగుచూసింది. రైతులు పండించిన పంటను దళారులే కాకుండా అధికారులు కూడా బొక్కేస్తున్న వైనం సర్వత్రా చర్చకు దారితీస్తోంది. అనేక సంవత్సరాలుగా నడుస్తున్న ఈ తతంగం... తాజాగా పంపకాల్లో తేడాలతో బట్టబయలైంది.
ఫిర్యాదులొచ్చాయి.. కణేకల్లు మండలంలో ధాన్యం వసూళ్లపై ఫిర్యాదులు వస్తున్నాయి. గతంలో కూడా ఫిర్యాదులు రావడంతో విచారణ చేశారు. ఈ ఏడాది మళ్లీ వచ్చాయి. అక్కడ ఉద్యోగుల మధ్య వివాదం కారణంగా ఇలా జరుగుతోంది. దీనిపై మైనర్ ఇరిగేషన్ ఎస్ఈ విచారిస్తున్నారు. – రాజశేఖర్, ఎస్ఈ, హెచ్చెల్సీ విచారణ జరుగుతోంది.. ఈఎన్సీ ఆదేశాల మేరకు కణేకల్లులో ఓ డీఈ, లస్కర్లపై విచారణ చేస్తున్నాం. అసలు అక్కడ ఏం జరుగుతోందో తెలియడం లేదు. విచారణ పూర్తయితే తప్ప చెప్పలేం. త్వరలో దీనిపై నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తాం. – విశ్వనాథరెడ్డి, ఎస్ఈ, చిన్న నీటిపారుదల శాఖ అనంతపురం సెంట్రల్: తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ) ద్వారా ప్రతి ఏటా లక్ష ఎకరాలకు పైగా సాగునీరు అందిస్తున్నారు. ఇందులో రాయదుర్గం నియోజకవర్గంలోని కణేకల్లు, బొమ్మనహాళ్ మండలాల్లోనే 40 వేల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో పంటలు సాగవుతున్నాయి. ఇక్కడి రైతుల్లో సింహభాగం వరిని సాగు చేస్తున్నారు. జిల్లాలో పండిస్తున్న వరిధాన్యంలో సగం ఈ ప్రాంతం నుంచే ఉత్పత్తి అవుతోంది. బలవంతంగా వసూళ్లు.. తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ(హెచ్ఎల్ఎంసీ)లో డిస్ట్రిబ్యూటరీల కింద సాగు చేస్తున్న రైతుల నుంచి ఎకరాల ప్రకారం అక్రమంగా ధాన్యం వసూలు చేస్తున్నారు. హెచ్చెల్సీ ఆయకట్టుకు నీరు అందించే లస్కర్లు, డీఈ స్థాయి అధికారులు కుమ్మక్కై ఈ బాగోతం నడిపిస్తున్నారు. ఏదో బస్తానో రెండు బస్తాలో కాకుండా ఏటా రూ. లక్షలు విలువజేసే ధాన్యం అక్రమంగా సేకరిస్తున్నారని తెలుస్తోంది. అనధికారికంగా పంటలు సాగు చేసుకునే రైతుల నుంచైతే రెట్టింపు స్థాయిలో తీసుకుంటున్నట్లు సమాచారం. ఇలా సేకరించిన ధాన్యాన్ని స్థానికంగా మిల్లుల్లో ఆడించిన అనంతరం విక్రయించి... ఆ వచ్చే డబ్బును వాటాలుగా పంచుకోవడం ఆనవాయితీగా మార్చుకున్నారు. అయితే ఈ సారి లస్కర్లు, ఓ డీఈకి మధ్య పంపకాల్లో తేడాలు రావడంతో వివాదం రేగింది. ఒకరిపై ఒకరు నేరుగా ఈఎన్సీ (ఇంజినీర్ ఇన్ చీఫ్)కి ఫిర్యాదు చేసుకున్నారు. స్పందించిన ఆయన... వాస్తవాలను నిగ్గు తేల్చాలంటూ జిల్లా చిన్ననీటి పారుదలశాఖ ఎస్ఈ విశ్వనాథరెడ్డిని విచారణ అధికారిగా నియమించారు. దీనిపై గుట్టుగా విచారిస్తున్నారు. సర్వత్రా విమర్శలు.. ఆరుగాలం శ్రమించి పంట పండించే రైతులకు వచ్చే ఆదాయం అంతంత మాత్రమే. ఒకవైపు పెట్టుబడులు తడిసి మోపెడవుతుంటే.. మరోవైపు చీడపీడల ధాటికి అల్లాడిపోతున్నారు. ఇక ప్రకృతి కోపిస్తే నష్టాలను మూటగట్టుకోవాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో అన్నదాతలకు అండగా నిలవాల్సింది పోయి పీల్చిపిప్పి చేస్తున్న వైనం విమర్శలకు దారితీస్తోంది.హెచ్చెల్సీలో అవినీతి బాగోతం రైతుల నుంచి ఇష్టారాజ్యంగా ధాన్యం వసూళ్లు ప్రతి ఏటా దందా ఈ సారి తేడాలు రావడంతో రచ్చ ఈఎన్సీ ఆదేశాలతో గుట్టుగా విచారణ -
మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహిద్దాం
అనంతపురం అర్బన్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ వి.వినోద్కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సూచించారు. మంగళవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 8వ తేదీన జేఎన్టీయూ ఆడిటోరియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. ఇందుకు ప్రజాప్రతినిధులను ఆహ్వానించాల న్నారు. కార్యక్రమ నిర్వహణకు హెచ్ఎన్ఎస్ఎస్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ను నోడల్ అధికారిగా నియమిస్తున్నామన్నారు. అదే రోజు 2కే మారథాన్ నిర్వహించాలన్నారు. స్టాల్స్ ఏర్పాటు చేయాలని, మహిళలకు హెల్త్ చెకప్, వైద్య శిబిరాలు, న్యూట్రీషన్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలన్నారు. వివిధ రంగాల్లో సత్తా చాటుతున్న మహిళలను సన్మానించాలన్నారు. మహిళా అధికారులందరూ తప్పక హాజరు కావాలని సూచించారు. మహిళలకు రుణాలివ్వాలి.. మహిళా దినోత్సవం సందర్భంగా బ్యాంకర్లతో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణాలు ఇవ్వాలన్నారు. పీఎంఈజీపీ, ఎంఎస్ఎంఈ రుణాలు, పీఎం విశ్వకర్మ, ముద్ర రుణాలు మంజూరు చేయాలని చెప్పారు. సమావేశంలో డీఆర్ఓ మలోల, ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి, ఎల్డీఎం నర్సింగరావు, డీఎంహెచ్ఓ ఈబీదేవి, డీఆర్డీఏ పీడీ ఈశ్వరయ్య, మెప్పా పీడీ విశ్వజ్యోతి, ఏడీసీసీ బ్యాంక్ సీఈఓ సురేఖరాణి, పరిశ్రమల శాఖ జీఎం శ్రీధర్, నోడల్ అధికారి ఇషాంత్, కలెక్టరేట్ పరిపాలనాధికారి అలెగ్జాండర్, తదితరులు పాల్గొన్నారు. తాగునీటి ఎద్దడి తలెత్తకూడదు వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ వి.వినోద్కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని చెప్పారు. తన క్యాంపు కార్యాలయం నుంచి డీఆర్ఓ, ఆర్డీఓలు, మునిసిపల్ కమిషనర్లు, డీఎల్డీఓలు, ఎంపీడీఓలు, వివిధ శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వేసవి కార్యాచరణ ప్రణాళిక, సానుకూల ప్రజా అవగాహన, అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఎంఎస్ఎంఈ పార్కు, ఫీడర్ లెవల్ పోలరైజేషన్ స్కీమ్కు ప్రభుత్వ భూమి కేటాయింపు, ఎంఎస్ఎంఈ సర్వే తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఉచిత వైద్యం అందాలి ‘ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్’ ద్వారా పేదలకు ఉచిత వైద్యం కచ్చితంగా అందించాలని కలెక్టర్ వి.వినోద్కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ మంగళవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ జిల్లా క్రమశిక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపానల్ ఆస్పత్రుల్లో వైద్యులు అందుబాటులో ఉండాలన్నారు. రోగుల నుంచి డబ్బు వసూలు చేయకూడదన్నారు. డబ్బు వసూలు చేస్తున్నట్లు క్షేత్రస్థాయిలో ఎక్కడైనా ఫిర్యాదులు వస్తే సంబంధిత ఆస్పతికి నోటీసు ఇచ్చి విచారణ కోరాలన్నారు. ఆర్టీజీఎస్, ఐవీఆర్ఎస్ ద్వారా నేరుగా ప్రజలకు ఫోన్ చేసి ఆస్పత్రుల్లో వైద్యులు అందుబాటులో ఉన్నారా.. సిబ్బంది ప్రవర్తన ఎలా ఉంది..వైద్య మిత్రలు, ఆస్పత్రి సిబ్బంది ఎవరైనా డబ్బులు అడిగారా.. మందులు అక్కడే ఇస్తున్నారా.. పరిశుభ్రత ఎలా ఉంది.. తదితర అంశాలపై ప్రభుత్వం ఆరా తీస్తోందని, వీటిలో ఎక్కడైనా తేడా వస్తే ఆ ఫిర్యాదు తమకు వస్తుందని కలెక్టర్ చెప్పారు. సమావేశంలో ఎన్టీఆర్ వైద్యసేవ ట్రాస్ట్ కో–ఆర్డినేటర్ కిరణ్కుమార్రెడ్డి, డీఎంహెచ్ఓ ఈబీదేవి, డీసీహెచ్ఎస్ పాల్ రవికుమార్, రిటైర్డ్ సూపరింటెండెంట్ లక్ష్మణ్ప్రసాద్, ఆస్పత్రుల అధిపతులు పాల్గొన్నారు. -
798 మంది విద్యార్థుల గైర్హాజరు
అనంతపురం ఎడ్యుకేషన్: ఇంటర్ పరీక్షల్లో భాగంగా మంగళవారం జరిగిన ఇంగ్లిష్ పేపర్–1 పరీక్షకు జిల్లాలో 798 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జనరల్ విద్యా ర్థులు 24,452 మందికి 23,789 మంది హాజరయ్యారు. 663 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థులు 2,475 మందికి 2,340 మంది హాజరయ్యారు. 135 మంది గైర్హాజరయ్యారు. ఇంటర్ పరీక్షల నిర్వహణ కమిటీ కన్వీనర్, బోర్డ్ ప్రాంతీయ పర్యవేక్షణాధికారి వెంకటరమణనాయక్ 3 పరీక్షా కేంద్రాలు, పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు 5, సిట్టింగ్ స్క్వాడ్ సభ్యులు 10, ఫ్లయింగ్ స్క్వాడ్ సభ్యులు 14, కస్టోడియన్లు 13 కేంద్రాలను తనిఖీ చేశారు. నాటుసారా నిర్మూలనే లక్ష్యం అనంతపురం అర్బన్: నాటుసారా నిర్మూలనే లక్ష్యంగా ‘నవోదయం 2.0’ కార్యక్రమం అమలు చేయాలని కలెక్టర్ వి.వినోద్కుమార్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘నవోదయం 2.0’ కళాజాత ప్రచార వాహనాన్ని మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటుసారా సేవనం వల్ల కలిగే దుష్ప్రభావాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య, అసిస్టెంట్ కమిషనర్ మునిస్వామి, సూపరింటెండెంట్ రామ్మోహన్రెడ్డి, సీఐలు జయనాథ్, సత్యనారాయణ, ఎస్ఐలు జాకీర్హుసేన్, కృష్ణారెడ్డి, కళాజాత బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వెబ్సైట్లో ‘పది’ హాల్టికెట్లు అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించిన హాల్టికెట్లు వెబ్సైట్లో అందుబాటులో ఉంచారని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.ప్రసాద్బాబు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు.వాట్సాప్ మనమిత్ర నంబరు 95523 00009 ద్వారా హాల్టికెట్లు పొంద వచ్చన్నారు. అలాగే www.bse. ap.gov.in వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చని వెల్లడించారు. హాల్టికెట్లలో విద్యార్థుల పేరు, పుట్టిన తేదీ, మీడియం, ఫొటో, సంతకం తదితర వివరాలు తప్పుగా ఉంటే వెంటనే ప్రధానోపాధ్యాయుల ద్వారా dir_govexams@yahoo.com మెయిల్కు ఫిర్యాదు చేయాలని డీఈఓ, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందునాయక్ తెలిపారు. అనంతపురంలోని పాత డీఈఓ కార్యాలయం, ప్రభుత్వ పరీక్షల విభాగంలో కూడా సంప్రదించవచ్చని సూచించారు. నెలాఖరు వరకూ ఆ ప్యాసింజర్ రైళ్లు తిరగవ్! గుంతకల్లు: కుంభమేళాకు వెళ్లిన ప్యాసింజర్ రైళ్లు తిరిగి గుంతకల్లు డివిజన్ చేరుకునేందుకు ఈ నెలాఖరు వరకూ పడుతుందని డివిజన్ అధికారులు తెలిపారు.ఈ క్రమంలో తిరుపతి–కదిరిదేవరపల్లి (57405) ప్యాసింజర్ రద్దును ఈ నెల 30 వరకూ పొడిగించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా కదిరిదేవరపల్లి–తిరుపతి (57406) ప్యాసింజర్ను ఈ నెల 31 వరకు, గుంతకల్లు–తిరుపతి (57404) ప్యాసింజర్ 30 వరకు, తిరుపతి–గుంతకల్లు (57403) ప్యాసింజర్ ఈ నెల 31 వరకు తిరగవన్నారు. తిరుపతి–హుబ్లీ (57401) ప్యాసింజర్ను ఈ నెల 15 వరకు, హుబ్లీ–తిరుపతి ప్యాసింజర్ రద్దును ఈ నెల 16 వరకూ పొడిగించినట్లు వెల్లడించారు. -
నకిలీ నోట్ల ముఠా గుట్టు రట్టు
అనంతపురం: నగరంలో నకిలీ కరెన్సీ చెలామణి చేస్తున్న ఓ ముఠా గుట్టును వన్టౌన్ పోలీసులు రట్టు చేశారు. మొత్తం 8 మందిని అరెస్ట్ చేసి రూ.48 వేల విలువైన నకిలీ నోట్లు, ల్యాప్టాప్, ప్రింటర్, కట్టర్ స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం నగరంలోని వన్టౌన్ పోలీస్స్టేషన్లో అనంతపురం అర్బన్ డీఎస్పీ వి. శ్రీనివాస రావు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అనంతపురం బుడ్డప్పనగర్కు చెందిన దూదేకుల ఖాసీం, బోయ పవన్కుమార్, పడిగల సుకుమార్, బెళుగుప్ప మండలం జీడిపల్లి గ్రామానికి చెందిన బొమ్మినేని అశోక్ చౌదరి, అనంతపురం సంఘమిత్ర నగర్వాసి దేవరకొండ రవీంద్ర స్నేహితులు. దూదేకుల ఖాసీం గతంలో శ్రీ సత్యసాయి బాల వికాస్ స్కూల్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తూ, నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసేవాడు. దీంతో అతడిని అనంతపురం త్రీటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. జైలులో రిమాండ్ ఖైదీగా ఉండి, బెయిల్పై విడుదలై వచ్చాడు. అప్పటి నుంచి ఖాసీం ఇంటి వద్దే ఉంటున్నాడు. పెద్దవడుగూరు మండలంలో పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తూ సస్పెండ్ అయిన కృష్ణా రెడ్డి ఇతనికి పరిచయమయ్యాడు. ఇద్దరూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో, వాటి నుంచి బయటపడడానికి బోయ పవన్, పడిగల సుకుమార్, బొమ్మినేని అశోక్, రవీంద్రతో కలిసి నకిలీ కరెన్సీ తయారీకి పూనుకున్నారు. ఇందుకు కృష్ణా రెడ్డి ల్యాప్టాప్ ఇచ్చాడు. ముందుగా దేవరకొండ రవీంద్ర ఇచ్చిన రూ.20 వేలతో నగరంలోని కమలానగర్లో ఒక ప్రింటర్, పేపర్ కట్టర్, కలర్ జిరాక్స్ పౌడర్ పేస్ట్, బ్రష్లను కొనుగోలు చేశారు. అశోక్ చౌదరి సమకూర్చిన రూ.10 వేలతో బెంగళూరులో పేపర్ కొన్నారు. బుడ్డప్ప నగర్లోని సుకుమార్ ఇంట్లో నకిలీ కరెన్సీ తయారు చేశారు. ముందుగా సదరు కరెన్సీని ధర్మవరం నగరానికి చెందిన సత్యనారాయణ అలియాస్ సత్తికి ఇచ్చారు. ఈ క్రమంలోనే మంగళవారం దేవరకొండ రవీంద్ర ద్వారా టీవీ టవర్ సమీపంలోని ఓ ఫంక్షన్ హాలు వద్ద పెద్దపప్పూరు మండలం చిక్కేపల్లి గ్రామానికి చెందిన నొస్సాం మురళీమోహన్ రెడ్డి, రాప్తాడు కళాకారుల కాలనీకి చెందిన సాకే రామాంజినేయులు అలియాస్ పొట్టి రామాంజి, అనంతపురం నాయక్ నగర్కు చెందిన యలమకూరి రామాంజినేయులు అలియాస్ దుబ్బ రామాంజిలకు దొంగ నోట్లు ఇస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.48 వేల విలువైన నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. 8 మంది నిందితుల అరెస్టు ల్యాప్టాప్, ప్రింటర్, రూ. 48 వేల విలువైన నకిలీ నోట్ల స్వాధీనం -
ట్రాప్.. గప్చుప్!
దిక్కులేని ఏసీబీ ● జిల్లాలో వేళ్లూనుకుపోతున్న అవినీతి ● ట్రాప్ చేయలేకపోతున్న ఏసీబీ ● కూటమి సర్కారు వచ్చాక నిర్వీర్యం● అనంతపురం నగరంలోని ఎన్టీఆర్ మార్గ్లో రోడ్డు వెడల్పు పనుల్లో భాగంగా ఓ వ్యక్తి భూమి పోయింది. ఇందుకు పరిహారం మంజూరు కోసం బాధితుడు మున్సిపాలిటీ అధికారులను ఆశ్రయించగా.. ఓ మహిళా అధికారి రూ.3 లక్షలు డిమాండ్ చేశారు. డబ్బు ఇవ్వలేదనే కారణంతో మూడేళ్లుగా అతడిని తిప్పించుకుంటున్నారు. ● అనంతపురంలోని రాజు రోడ్డులో ఓ బంగారు నగల దుకాణ భవనం నిర్మాణమవుతోంది. ఇక్కడ సెల్లార్లోకి వెళ్లేందుకు ర్యాంప్ వేశారు. ర్యాంప్ కారణంగా వర్షం నీళ్లు సరిగా వెళ్లవంటూ ఇటీవల మున్సిపల్ సిబ్బంది ఆ భవన నిర్మాణం వద్ద కూర్చున్నారు. ‘మమ్మల్ని మున్సిపల్ అధికారి మంజుల మేడం పంపించారు. మాకెంతో కొంత ఇస్తేగానీ వెళ్లం’ అంటూ తెగేసి చెప్పారు. ● అనంతపురం ఆర్డీఓ కార్యాలయానికి ఇటీవల శింగనమలకు చెందిన ఓ వ్యక్తి భూమి కన్వర్షన్ కోసం వెళ్లారు. ‘రూ.3 లక్షలు ఇస్తేనే పని పూర్తి చేస్తాం’ అంటూ రెవెన్యూ అధికారులు ఆయనకు కరాఖండీగా చెప్పారు. వారు అడిగినంత ముట్టజెప్పి బాధిత రైతు పని పూర్తి చేసుకున్నారు. -
ప్రేమ తెచ్చిన తంటా... జైలుపాలైన విద్యార్థి
రాప్తాడు రూరల్: ప్రియురాలిపై హత్యాయత్నం చేసిన కేసులో ఎస్కేయూ పీజీ విద్యార్థి జైలు పాలయ్యాడు. ఇటుకలపల్లి పోలీసులు తెలిపిన మేరకు... గార్లదిన్నె మండలానికి చెందిన కురుబ బ్యాళ్ల విష్ణువర్దన్ ఎస్కేయూలో ఎంఎల్ఐసీ చదువుతున్నాడు. ఈ క్రమంలో ఎస్కేయూలో బీటెక్ చేస్తున్న అనంతపురం రూరల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతితో పరిచయమై, ప్రేమకు దారితీసింది. ఇద్దరూ సన్నిహితంగా ఉన్న సమయంలో ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. కొంత కాలంగా ఆమె స్వగ్రామానికి చెందిన మరో యువకుడితో చనువుగా ఉంటోందన్న అనుమానంతో విష్ణువర్దన్ రగిలిపోయాడు. ఫిబ్రవరి 27న యువతిని ఓ గదికి తీసుకెళ్లి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా వారిద్దరూ చనువుగా ఉన్న సమయంలో తీసుకున్న ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశాడు. ఘటనకు సంబంధించి బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఇటుకలపల్లి పోలీసులు... అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశులు నేతృత్వంలో దర్యాప్తు వేగవంతం చేశారు. మంగళవారం ఉదయం పూలకుంట గ్రామ శివారులోని కురుబ తిమ్మప్పస్వామి గుడి వద్ద తచ్చాడుతున్న నిందితుడు బ్యాళ్ల విష్ణువర్దన్ను గుర్తించి అరెస్ట్ చేశారు. అతడి నుంచి ఓ ద్విచక్ర వాహనంతో పాటు మూడు సెల్ఫోన్లు, ఫొటోలు, వీడియోలు ఉన్న పెన్డ్రైవ్ స్వాధీనం చేసుకుని, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. -
కర్ణాటకలో ప్రమాదం... నేమకల్లు వాసుల మృతి
బొమ్మనహాళ్: కర్ణాటకలో చోటు చేసుకున్న ప్రమాదంలో బొమ్మనహాళ్ మండలం నేమకల్లు గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తులు తెలిపిన మేరకు.. నేమకల్లు గ్రామానికి చెందిన తిప్పేస్వామి, రత్నమ్మ దంపతుల కుమారుడు జి.నాగరాజు (19), వన్నూరు, వనజాక్షి దంపతుల కుమారుడు కె.గణేష్ (14) ఇద్దరూ మంచి స్నేహితు లు. తల్లిదండ్రులకు వ్యవసాయంలో చేదోడుగా ఉండేవారు. సోమవారం సాయంత్రం గ్రామానికి చెందిన కొందరితో కలసి నాగరాజు, గణేస్ పాదయాత్రగా కర్ణాటకలోని గూళ్యం గ్రామంలో గాదిలింగేశ్వర జాతరకు బయలుదేరారు. రాత్రి 9.30 గంటల సమయంలో కప్పగల్–సిరివర క్రాస్ వద్ద రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతుండగా వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన బొలెరో ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నాగరాజు, గణేష్ను గ్రామస్తులు వెంటనే బళ్లారిలోని విమ్స్కు అంబులెన్సులో తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే వారు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై కర్ణాటక పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం అనంతరం స్నేహితుల మృతదేహాలను మంగళవారం నేమకల్లుకు కుటుంబసభ్యులు తీసుకువచ్చారు. విషయం తెలియగానే పెద్ద సంఖ్యలో స్థానికులు అక్కడకు చేరుకుని మృతదేహాలను పరిశీలించి కన్నీటిపర్యంతమయ్యారు. బాధిత కుటుంబసభ్యులను సర్పంచ్ పరమేశ్వర పరామర్శించి, అండగా ఉంటామని భరోసానిచ్చారు. -
ఆర్ఎంపీలు పరిధికి మించి వైద్యం చేస్తే కఠిన చర్యలు
● డీఎంహెచ్ఓ ఈబీ దేవి రాయదుర్గంటౌన్: ఆర్ఎంపీలు ప్రాథమిక వైద్యం మాత్రమే చేయాలని, వారి పరిధికి మించి వైద్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని డీఎంహెచ్ఓ డాక్టర్ ఈబీ దేవి హెచ్చరించారు. ఇటీవల రాయదుర్గంలోని బళ్లారి రోడ్డులో ఉన్న ఆర్ఎంపీ వైద్యుడు చన్నవీర వైద్యం వికటించి ఓ యువకుడు మృతి చెందిన విషయం తెలిసిందే. మంగళవారం ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యులతో విచారణ అనంతరం స్థానిక ఎపీఎన్జీఓ భవనంలో అర్బన్, రూరల్ పరిధిలోని ఆర్ఎంపీలతో ఆమె సమావేశమై మాట్లాడారు. ప్రాథమిక చికిత్స దాటి ఎవరైనా ఆర్ఎంపీలు వైద్యం అందజేస్తున్నట్లు తమ దృష్టికి వస్తే కచ్చితంగా వారిపై చర్యలతోపాటు సర్టిఫికెట్ రద్దు చేస్తామన్నారు. ఇంజక్షన్లు వేయడం, సెలెన్ ఎక్కించడం లాంటి వైద్యం చేయరాదన్నారు. సమావేశంలో వైద్యులు రమేష్, మోహన్సాయి, సందీప్, మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ నాగేంద్రప్రసాద్, హెల్త్ ఎడ్యుకేటర్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. బాలుడి మృతదేహం వెలికితీత కళ్యాణదుర్గం రూరల్: మండలంలోని నారాయణపురం గ్రామానికి చెందిన దుర్గేష్, ప్రీతి దంపతుల కుమారుడు దర్శిత్ (12) ఆదివారం ఈతకు వెళ్లి నీటి కుంటలో గల్లంతైన విషయం తెలిసిందే. విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువుల సమాచారంతో కదిరి రూరల్ పోలీసులు, ఫైర్ సిబ్బంది, గజ ఈతగాళ్లు అక్కడకు చేరుకుని సోమవారం ఉదయం నుంచి గాలింపు చేపట్టారు. మంగళవారం ఉదయం బాలుడు దర్శిత్ మృతదేహం లభ్యమైంది. కుమారుడి మృతదేహాన్ని చూడగానే తండ్రి సొమ్మసిల్లిపోయాడు. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. -
బదిలీల్లో ప్రాధాన్యతనివ్వాలి
● వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ బదిలీల్లో వితంతు, లీగల్లీ సపరేట్ మహిళా ఉపాధ్యాయులకు ప్రిఫరెన్షియల్ కేటగిరీల్లో ప్రాధాన్యత ఇవ్వాలని వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి, రాష్ట్ర నాయకులు గోపాల్, వెంకటరమణప్ప డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక ఉపాధ్యాయ భవనంలో వారిని పలువురు మహిళా టీచర్లు కలసి తమ సమస్యలు విన్నవించారు. వితంతు, లీగల్లీ సపరేటెడ్ మహిళా ఉపాధ్యాయులకు బదిలీ చట్టంలో కేవలం పాయింట్లు మాత్రమే కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్టీఏ జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి మాట్లాడుతూ.. వితంతు, లీగల్లీ సపరేట్ మహిళా ఉపాధ్యాయులకు ప్రిఫరెన్షియల్ కేటగిరిలోనే బదిలీలు నిర్వహించాలన్నారు. గతంలో మహిళలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తూ చైల్డ్ కేర్ లీవులు కూడా 180 రోజులకు పెంచారని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం కూడా మహిళా ఉద్యోగుల పట్ల సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని కోరారు. యువకుడి బలవన్మరణం గుత్తి: స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని పత్తికొండ రైల్వే గేటు వద్ద మంగళవారం తెల్లవారుజామున రైలు కింద పడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. జీఆర్పీ ఎస్ఐ నాగప్ప తెలిపిన మేరకు... గుంతకల్లు మండలం ఓబులాపురం గ్రామానికి చెందిన సురేష్ (25) కర్ణాటకలోని రాయచూర్లో ఉన్న ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం ఓబులాపురం బయలుదేరిన సురేష్ మంగళవారం తెల్లవారుజామున రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక పరమైన అంశాలే ఆయన ఆత్మహత్యకు కారణాలుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
పీజీ తెలుగు పాఠ్యాంశంగా ‘తడియారని స్వప్పం’
అనంతపురం: ప్రముఖ కవి లోసారి సుధాకర్ రచించిన ‘తడియారని స్వప్నం’ కవితా సంపుటిని ఎస్కేయూ ఎంఏ తెలుగు కోర్సులో పాఠ్యాంశంగా చేర్చారు. 2025–26 విద్యాసంవత్సరం నుంచి 2027–28 విద్యా సంవత్సరం వరకూ ఈ పాఠ్యాంశం ఉంటుంది. ఈయన ప్రస్తుతం విజయవాడ ఏసీబీ అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్నారు. ఆయన రచించిన మొదటి కావ్యం ‘మైనపు బొమ్మలు’ సైతం ఎస్కేయూతో పాటు యోగివేమన వర్సిటీ, రాయలసీమ విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు పాఠ్యాంశంగా చేర్చిన విషయం తెలిసిందే. తడియారని స్వప్నం కవితా సంపుటిలో వస్తు వైవిధ్యం, సామాజిక స్పృహ, సీ్త్ర దృక్కోణం, దళిత స్పృహ అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. కాగా, శ్రీసత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం కర్ణాటక నాగేపల్లికి చెందిన లోసారి సుధాకర్ ఎస్కేయూలో 1990–92 బ్యాచ్లో ఎంఏ పొలిటికల్ సైన్సెస్ పూర్తి చేశారు. పొలిటికల్ సైన్సెస్ చదివినప్పటికీ, తెలుగు సాహిత్యం, కవిత్వంపై మంచి పట్టు ఉంది. అనేక కవిత్వాలు, గ్రంథాలు రచించారు. -
ఆటో బోల్తా – డ్రైవర్ దుర్మరణం
శింగనమల: ఆటో బోల్తాపడిన ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... శింగనమల మండలం ఆనందరావుపేటకు చెందిన వీరనారాయణ(56)కు భార్య, ఓ కుమారుడు, కుమారై ఉన్నారు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. మంగళవారం ఉదయం అదే గ్రామానికి చెందిన సంజప్ప, రమేష్... వీరనారాయణ ఆటోను అద్దెకు మాట్లాడుకుని పామిడి గ్రామానికి వెళ్లి ఐస్క్రీమ్లు కొనుగోలు చేసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో కల్లుమడి వద్దకు చేరుకోగానే నియంత్రణ కోల్పోవడంతో ఆటో అదుపు తప్పి రోడ్డు పక్కన బోల్తాపడింది. ఘటనలో వీరనారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. సంజప్ప, రమేష్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు. చేపల వలలో చిక్కిన మృతశిశువుశింగనమల: చేపల కోసం వేసిన వలలో ఓ పసికందు మృతదేహం చిక్కింది. ఇంకా అవయవాలు పూర్తిగా ఏర్పడని ఓ పసికందు (మగ) మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్లో ఉంచి శింగనమల చెరువు చిన్న కాలువలో పడేశారు. మంగళవారం ఉదయం శింగనమలకు చెందిన మత్స్యకారులు కొందరు విసుర వలతో చిన్న కాలువలో చేపలు పడుతున్న సమయంలో అందులోకి చేపలతో పాటు ప్లాస్టిక్ కవరు చిక్కింది. ప్లాస్టిక్ కవర్ను విప్పి చూసిన మత్స్యకారులు ఒక్కసారిగా విస్తుపోయారు. 6– నెలల గర్భస్థ సమయంలోనే ప్రసవం జరిగి శిశువు మృతిచెందాడా? లేదా అబార్షన్ చేయించుకుని పోతూ శిశువు మృతదేహాన్ని కాలువలో పడిసి వెళ్లారా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. -
వాహనంలో లోపాలకు కంపెనీ, డీలరే బాధ్యులు
అనంతపురం: వాహనంలో తలెత్తిన లోపానికి కంపెనీతో పాటు డీలర్ బాధ్యులు అవుతారని, వెంటనే బాధితుడికి వాహనం ధర రూ.76,700తో పాటు మనో వేదనకు గురి చేసినందుకు గాను రూ.50 వేలు, ఖర్చులు రూ.5 వేలు 45 రోజుల్లోపు చెల్లించాలని వినియోగదారుల కమిషన్ అధ్యక్షురాలు ఎం.శ్రీలత మంగళవారం తీర్పు వెలువరించారు. వివరాలు... గార్లదిన్నెకు చెందిన భూపాలం విష్ణువంశీ ఓ ప్రైవేట్ కంపెనీలో క్షేత్రస్థాయి ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. రోజువారీ విధుల్లో భాగంగా ద్విచక్ర వాహనంపై పలు ప్రాంతాలను ఆయన సందర్శించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అనంతపురంలోని నరసింహా మోటార్స్ నుంచి న్యూఢిల్లీకి చెందిన హీరో మోటోకార్ప్ లిమిటెడ్ తయారు చేసిన హీరో మోటార్ సైకిల్ వాహనాన్ని 2021, జులై 7న కొనుగోలు చేశాడు. అయితే ఆ వాహనం కొనుగోలు చేసినప్పటి నుంచి పలుమార్లు మరమ్మతులకు లోనవుతూ వచ్చింది. ప్రతి సారీ షోరూంకు తీసుకెళ్లి చూపించడం, వారు మరమ్మతు చేసి ఇస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే వాహనం మరోసారి మొరాయించడంతో షోరూమ్లోనే వదిలి తనకు వాహనాన్ని మార్చి ఇవ్వాలని విష్ణువంశీ కోరాడు. ఇందుకు డీలర్ అంగీకరించకపోవడంతో లీగల్ నోటీసులు పంపాడు. అయినా ఫలితం లేకపోవడంతో జిల్లా వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించాడు. కమిషన్ ద్వారా నోటీసులు అందుకున్న కంపెనీ ప్రతినిధులతో పాటు అనంతపురంలోని డీలర్ కూడా కమిషన్ ఎదుట హాజరై తమ వివరణ ఇచ్చారు. వాహనాన్ని అన్ని జాగ్రత్తలు తీసుకుని ఎలాంటి లోటుపాట్లు లేకుండా రూపొందిస్తామని తయారీదారులు పేర్కొన్నారు. ఏదో కారణంగా ఆగిపోయినంత మాత్రాన దానిని మార్చి కొత్త వాహనం ఇవ్వటం లేదా దాని ఖరీదు తిరిగి చెల్లించమని కోరడం సరికాదని తమ వాదనలు వినిపించారు. అయితే ఫిర్యాదుదారుడు తన వాదనకు అనువైన 20 పత్రాలను సాక్ష్యాలుగా చూపాడు. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత వినియోగదారుడుకి లోపభూయిష్టమైన వాహనాన్ని విక్రయించినందుకు కంపెనీని, డీలర్ను బాధ్యుల్ని చేస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. మోటార్ సైకిల్ ధర రూ.76 వేలు, మనోవేదనకు రూ.50 వేలు చెల్లించాలి వినియోగదారుల కమిషన్ అధ్యక్షురాలు ఎం. శ్రీలత తీర్పు -
50 శాతం రాయితీతో యాంత్రీకరణ పనిముట్లు
అనంతపురం అగ్రికల్చర్: పీఎం–ఆర్కేవీవై, ఎస్ఎంఏఎం పథకాల కింద ప్రస్తుత 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను రైతులకు 50 శాతం రాయితీతో 1,661 యాంత్రీకరణ పనిముట్ల మంజూరుకు రూ.2.86 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వ్యవసాయశాఖ జేడీ ఉమామహేశ్వరమ్మ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఏపీ ఆగ్రోస్ ద్వారా 250 స్ప్రేయర్లు, 600 పవర్ ఆపరేటెడ్ స్ప్రేయర్లు, ఏడు ట్రాక్టర్ ఆపరేటెడ్ స్ప్రేయర్లు, 740 ట్రాక్టర్ డ్రాన్ సీడర్ పరికరాలు, 28 రోటావీటర్లు, 18 పవర్వీడర్లు, 13 బ్రష్ కట్టర్లు, ఐదు పవర్ టిల్లర్లు ఇవ్వనున్నారు. గత ఐదేళ్లుగా పనిముట్ల లబ్ధిపొందని ఎస్సీ ఎస్టీ మహిళా రైతులు, చిన్న సన్నకారు రైతులు అర్హులు. ఈ–పంట నమోదు తప్పనిసరిగా ఉండాలి. అటవీ భూముల సాగుదారులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కుటుంబంలో ఒక రైతుకు మాత్రమే లబ్ధి చేకూరుతుంది. ట్రాక్టర్ కలిగిన రైతులు మాత్రమే వాటికి సంబంధించిన పనిముట్లకు దరఖాస్తు చేసుకోవాలి. రైతు సేవా కేంద్రాల్లో సంప్రదించి ఈ నెల 26 లోపు దరఖాస్తులు అందజేయాలి. ఏపీఎఫ్ఆర్ గుర్తింపు కార్డు తప్పనిసరి : జేడీఏ యాడికి: ఏపీ ఫార్మర్ రిజిస్ట్రీ(ఏపీఎఫ్ఆర్) గుర్తింపు కార్డు కలిగి ఉంటేనే భవిష్యత్తులు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తిస్తాయని, రైతులందరూ తప్పనిసరిగా ఏపీఎఫ్ఆర్ కార్డును పొందాలని జేడీఏ ఉమామహేశ్వరమ్మ పేర్కొన్నారు. యాడికి మండలం వేములపాడులోని రైతు సేవా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ఆమె రైతులతో సమావేశమై మాట్లాడారు. రైతు గుర్తింపు కార్డులు లేకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు వర్తించవన్నారు. రబీలో దిగుబడులు సరిగ్గా లేనందున యాడికి మండలాన్ని కరువు ప్రాంతంగా ఖరారు చేయుటకు ప్రతిపాదనలు పంపామన్నారు. పంటల యాజమాన్యంపై ఎప్పటికప్పుడు రైతు సేవాకేంద్రం ద్వారా సలహాలు తీసుకుని మంచి దిగుబడులు సాధించాలన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మహబూబ్ బాషా, వ్యవసాయ విస్తరణ అదికారి జహిరూన్, గ్రామ వ్యవసాయ అధికారి సతీష్ బాబు పాల్గొన్నారు. ఈ –క్రాప్ నమోదు త్వరగా పూర్తి చేయండి పెద్దవడుగూరు: రబీ పంటకు సంబంధించి రైతులు సాగు చేసిన పంటల వివరాల ఈ క్రాఫ్ నమోదు త్వరగా పూర్తి చేయాలని సంబంధింత అధికారునలు జేడీఏ ఉమామహేశ్వరమ్మ ఆదేశించారు. మంగళవారం పెద్దపప్పూరు మండలం జూటూరులో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏపీఎఫ్ఆర్ గుర్తింపు కార్డు ప్రాధాన్యతపై చైతన్య పరిచారు. కంది పంటకు ప్రభుత్వం రూ.7,550 గిట్టుబాటు ధర కల్పించిందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏఓ ఆంజనేయులు, రైతు సేవా కేంద్రం సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. -
●పాతవే ముద్దు.. కొత్తవి వద్దు
అనంతపురం అగ్రికల్చర్: పశుసంవర్ధకశాఖ పరిధిలో రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన నూతన భవనాలు వృథాగా మారాయి. అన్ని వసతులతో నిర్మించిన పెద్ద పెద్ద భవనాల్లో ఒకరిద్దరు పనిచేస్తుండగా పాతబడిన భవనంలోనే పూర్తి స్థాయి సిబ్బంది విధులు నిర్వర్తిస్తుండడం గమనార్హం. ఖాళీగా ఉన్న కొత్త భవనాల్లో కృత్రిమ గర్భోత్పత్తికి సంబంధించిన సామగ్రితో పాటు కొన్ని మందులు పెడుతున్నారు. ఇదీ పశుసంవర్ధకశాఖ జేడీ కార్యాలయ ప్రాంగణంలోని భవనాల దుస్థితి. జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ (డీఎల్డీఏ) ఆధ్వర్యంలో రూ.70 లక్షలు వెచ్చించి అధునాతన వసతులతో నిర్మించిన అతిపెద్ద భవనంలో డీఎల్డీఏ ఈఓ, ఓ డాక్టర్, మరొక సిబ్బంది... కేవలం ముగ్గురు మాత్రమే పనిచేస్తున్నారు. మిగిలిన గదులు, హాలు నాలుగైదు సంవత్సరాలుగా వృథాగా ఉన్నాయి. ఐదేళ్ల క్రితం రూ.72 లక్షలతో గొర్రెల అభివృద్ధి విభాగం కింద నిర్మించిన ఈ అతి పెద్ద భవనంలో ఒక్కరు కూడా విధులు నిర్వర్తించడం లేదు. నిర్వహణ లేకపోవడంతో గోడలు నెర్రెలు బారాయి. బాత్రూంలు కంపుకొడుతున్నాయి. దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ పాత భవనంలోనే జేడీతో పాటు ఏడీలు, డాక్టర్లు, ఇతర కార్యాలయ మినిస్టీరియల్ స్టాఫ్ 25 మంది వరకు పనిచేస్తున్నారు. ఈ పాత భవనాల పైకప్పులు రాలి పడుతుంటాయి. గోడలు నెర్రెలు బారాయి. వానొస్తే భవనం కారుతుంది. అయినా అందులోనే విధులు నిర్వర్తిస్తున్నారు. జేడీ కార్యాలయ ఆవరణలోనే డీడీ కార్యాలయ భవనమూ నిర్మించారు. ఇందులోనూ డీడీ, ఏడీతో పాటు కార్యాలయ సిబ్బంది పనిచేస్తున్నారు. ఇక్కడే 50 ఏళ్ల కిందట నిర్మించిన మరో భవనం రేపోమాపో కూలిపోయే స్థితిలో ఉంది. పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నా ఈ భవనంలో కృత్రిమ గర్భోత్పత్తి మందులు, క్యాన్లు, ఇతర సామగ్రి డంప్ చేశారు. -
సొల్లాపురంలో చోరీ
కణేకల్లు: మండలంలోని సొల్లాపురం గ్రామ శివారులో నివాసముంటున్న గుర్రం లక్ష్మణ్ణచౌదరి ఇంట్లో సోమవారం అర్థరాత్రి చోరీ జరిగింది. ఆలయ నిర్మాణం కోసం బీరువాలో ఉంచిన నగదును దుండగులు అపహరించారు. నాలుగేళ్ల క్రితం గ్రామంలో నూతనంగా సీతారామాలయం నిర్మించాలని గ్రామస్తులు నిర్ణయం తీసుకొన్నారు. ఈ క్రమంలో రూ.2.50 కోట్లను విరాళాల రూపంలో సేకరించి, నిర్మాణ పనులు చేపట్టాలని నిర్ణయించి, ఆ మేరకు ఆలయ నిర్మాణానికి అంకుర్పారణ చేసిన విశ్రాంత ఇంజనీర్ గుర్రం లక్ష్మణ్ణచౌదరికి బాధ్యతలను అప్పగించారు. ఏప్రిల్ నెలాఖరున బసవ జయంతి నాడు ఆలయాన్ని ప్రారంభించాలనే ఉద్దేశ్యంతో నిర్మాణ పనులు వేగవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కూలీల వేతనాలు, సామగ్రి కొనుగోలు కోసం డబ్బు అవసరముండటంతో లక్ష్మణ్ణచౌదరి తన ఇంటిలోని బీరువాలో కొంత మొత్తాన్ని భద్రంగా ఉంచాడు. శనివారం కళ్యాణదుర్గం వాసవీకన్యకాపరమేశ్వరీ ట్రస్ట్ నిర్వహకులు విరాళంగా అందజేసిన రూ.2లక్షలను లక్ష్మణ్ణచౌదరికి పూజారి అప్పగించారు. ఈ మొత్తంతో కలిపి బీరువాలో రూ.10లక్షల వరకు డబ్బు ఉంచి శనివారం ఆలయం నిర్మాణ పనులు ముగించుకుని రాత్రికి లక్ష్మణ్ణ చౌదరి అనంతపురానికి వెళ్లారు. సోమవారం అర్ధరాత్రి దుండగులు ఇంటి తాళాన్ని బద్ధలుగొట్టి లోపలకు ప్రవేశించి, బీరువాలోని డబ్బును అపహరించారు. విషయం తెలుసుకున్న రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ, కణేకల్లు ఎస్ఐ నాగమధు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఎరువుల ర్యాక్ పాయింట్లో జేసీ తనిఖీలు రాప్తాడు: మండలంలోని ప్రసన్నాయపల్లి రైల్వేస్టేషన్ వద్ద ఉన్న ఎరువుల ర్యాక్ పాయింట్ను మంగళవారం జాయింట్ కలెక్టర్ శివ్నారాయణ శర్మ తనిఖీ చేశారు. ఎరువుల నిల్వలు, వాటిని వాహనాల్లోకి లోడ్ చేస్తున్న తీరు, ఆ వాహనాలు ఏ ప్రాంతానికి వెళుతున్నాయి, తదితర అంశాలను పరిశీలించారు. ప్రతి వాహనానికి వే బిల్, స్టాక్ వివరాలు తెలిపే ఇన్వాయిస్ బిల్లు కచ్చితంగా ఉండాలన్నారు. అనంతరం అవేజ్ ఫర్టిలైజర్స్ గోదామును పరిశీలించారు. అక్కడ వివిధ డీలర్లకు సంబంధించిన ఎరువుల స్టోరేజ్పై ఆరా తీశారు. కార్యక్రమంలో ఏడీఏ రవికుమార్, మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ పెన్నేశ్వరి, రాప్తాడు, బీకేఎస్ మండల వ్యవసాయాధికారులు శ్రీవాణి, శ్యామ్సుందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైభవంగా సుంకలా పార్వతీదేవి రథోత్సవం విడపనకల్లు: మండలలోని పాల్తూరులో వెలసిన సుంకలాపార్వతీదేవి రథోత్సవం మంగళవారం వైభవంగా సాగింది. మండల వాసులతో పాటు ఉరవకొండ, బూదగవి, కర్ణాటకలోని రూపనగుడి, శంకరబండ, బళ్లారి, తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసాయి. -
బాలిక దుర్మరణం
రాయదుర్గం టౌన్: మండలంలోని 74 ఉడేగోళం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై చోటుచేసుకున్న ప్రమాదంలో ఓ బాలిక దుర్మరణం పాలైంది. పోలీసులు తెలిపిన మేరకు... కర్ణాటకలోని సండూరు తాలూకా వడ్డేరహళ్లికి చెందిన దాదాపు 25 మంది బొలెరో వాహనంలో బయలుదేరి కుందుర్పి మండలం బెస్తరపల్లిలో సోమవారం జరిగిన బొమ్మలింగేశ్వరస్వామి జాతరలో పాల్గొన్నారు. అదే రోజు తిరుగు ప్రయాణమైన వారు రాత్రి 11 గంటల సమయంలో రాయదుర్గం పట్టణ శివారులోని 74 ఉడేగోళం సమీపంలోకి చేరుకోగానే జాతీయ రహదారిపై అడ్డుగా వచ్చిన కుక్కను డ్రైవర్ గమనించి సడన్ బ్రేక్ వేయడంతో వాహనం చివర నిద్రిస్తున్న సుశీల(15) కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. కింద పడిన వీరమాసెన్న, మురెగప్పకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న సీఐ జయానాయక్, సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను పోలీసు వాహనంలోనే ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బళ్లారికి కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. ప్రమాదంపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
హెంజేరు.. భక్తజన హోరు
‘ఓం నమఃశివాయ’ అన్న పంచాక్షరీ మంత్రం ప్రతిధ్వనించింది. ఓంకార నాదం మార్మోగింది. ‘సిద్ధేశ్వరస్వామికి జై’ అంటూ భక్తకోటి చేసిన నినాదం హోరెత్తింది. శివనామస్మరణ మధ్య హేమావతి గ్రామంలో వెలిసిన హెంజేరు సిద్ధేశ్వరస్వామి బ్రహ్మరథోత్సవం సోమవారం రమణీ యంగా సాగింది. ఉత్సవాల్లో భాగంగా అర్చకులు ఉదయం సుప్రభాతసేవ, రుద్రాభిషేకం, పంచామృతాభిషేకం తదితర పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి మేళతాళాలతో తీసుకువచ్చి రథంపై కొలువుదీర్చారు. ఓంకారనాదం చేస్తూ రథాన్ని ముందుకులాగారు. ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు కర్ణాటక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన జనం రథంపైకి అరటిపండ్లు, బెల్లం, పూలు, మిరియాలు విసిరి మొక్కులు చెల్లించుకున్నారు. కర్ణాటక నుంచి వచ్చిన గురువులు చేసిన ‘వీరగాసే’ నృత్యం ఆకట్టుకుంది. – హేమావతి (అమరాపురం): వైభవంగా సిద్ధేశ్వరస్వామి బ్రహ్మరథోత్సవం -
మహిళలు భద్రంగా ఉండే సమాజాన్ని నిర్మిద్దాం
● కలెక్టర్ వినోద్ కుమార్ అనంతపురం ఎడ్యుకేషన్: మహిళలు భద్రంగా ఉండే సమాజాన్ని నిర్మిద్దామని కలెక్టర్ వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. మహిళలు, బాలికల భద్రత, స్వీయరక్షణ సామర్థ్యాలను పెంపొందించేందుకు సమగ్రశిక్ష ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘అనంత ఆత్మరక్షణ’ కార్యక్రమాన్ని సోమవారం స్థానిక శ్రీకృష్ణదేవరాయ నగరపాలక ఉన్నత పాఠ శాలలో కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వీయరక్షణ ద్వారా విద్యార్థినులు, మహిళలు ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళతారన్నారు. జిల్లాలోని 495 ప్రభుత్వ యాజమాన్య ఉన్నత పాఠశాలల్లో 6–9 తరగతులు చదువుతున్న 45,640 మంది విద్యార్థినులకు ఆత్మరక్షణపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. విద్యార్థినులకే కాకుండా మహిళా ఉపాధ్యాయులు, విద్యార్థినుల తల్లులను కూడా భాగస్వాములను చేయాలని నిర్వాహకులకు సూచించారు. వ్యాయామ ఉపాధ్యాయులతో పాటు పీటీఐలు విధిగా హాజరుకావాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ఆత్మరక్షణ, మానసిక ధైర్యం తదితర అంశాలపై విద్యార్థినులు, యువతులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సమగ్ర శిక్ష ఏపీసీ శైలజ మాట్లాడుతూ విద్యార్థుల పరీక్షల సన్నద్ధతకు ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా సజావుగా కార్యక్రమాలను పూర్తిచేసేలా ఇన్స్ట్రక్టర్లతో ప్రధానోపాధ్యాయులు సహకరించి కార్యక్రమం విజయ వంతం అయ్యేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో ఎంఈఓ వెంకటస్వామి, తహసీల్దార్ హరి కుమార్, సమగ్ర శిక్ష సీఎంఓ గోపాలకృష్ణ, ఏఎంఓ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వేలిముద్రలు తీసుకున్నాడు.. డబ్బివ్వకుండా వెళ్లిపోయాడు!
● సచివాలయ ఉద్యోగి నిర్వాకం తాడిపత్రి రూరల్: పింఛన్దారుల నుంచి వేలిముద్రలు తీసుకున్న ఓ సచివాలయ ఉద్యోగి.. డబ్బు పంచకుండా వెళ్లిపోయాడు. ఈ ఘటన తాడిపత్రి మునిసిపాలిటీలోని నందలపాడు సచివాలయం–1 పరిధిలో జరిగింది. వివరాలు.. నందలపాడు సచివాలయం–1 ఉద్యోగి (ఎడ్యుకేషన్ అసిస్టెంట్) సుధాకర్ ఈనెల 1న పింఛన్ల పంపిణీ చేపట్టాడు. దాదాపు 24 మంది లబ్ధిదారుల నుంచి వేలి ముద్రలు తీసుకొన్నాడు. కానీ వారితో వేలిముద్రలు పడలేదని, తరువాత వస్తానని చెప్పి వెళ్లిపోయాడు. అనంతరం కర్ణాటకలోని బళ్లారికి చేరుకున్నాడు. ఈ విషయంపై తోటి ఉద్యోగులకు కూడా సమాచారం ఇవ్వలేదు. తన వద్ద ఉన్న పింఛన్ డబ్బు, వేలిముద్రల మిషన్ అప్పగించలేదు. రెండు రోజులైనా సుధాకర్ రాకపోవడంతో ఆందోళనకు గురైన పింఛన్దారులు సోమవారం స్థానిక కౌన్సిలర్ విజయ్కుమార్ ఇంటికి వెళ్లి విషయం వివరించారు. ఈ క్రమంలోనే అతను సుధాకర్కు ఫోన్ చేసి సాయంత్రంలోపు డబ్బు పంపిణీ చేయకుంటే పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించగా.. సదరు సచివాలయ ఉద్యోగి హుటాహుటిన వచ్చి డబ్బు పంపిణీ చేయడం గమనార్హం. దీనిపై కమిషనర్ శివరామ కృష్ణ మాట్లాడుతూ విషయం తన దృష్టికి రాలేదన్నారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి, వాస్తవమని తేలితే శాఖా పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
యాప్సోపాలు
అనంతపురం అగ్రికల్చర్: వ్యవసాయ శాఖ చేపట్టిన రైతు రిజిస్ట్రేషన్ల ప్రక్రియను సాంకేతిక సమస్యలు చుట్టుముట్టాయి. వారం రోజులుగా అగ్రీస్టాక్ యాప్ సక్రమంగా పనిచేయడం లేదు. 72 వేల రిజిస్ట్రేషన్ల దగ్గర ఆగిపోయింది. త్వరితగతిన ప్రక్రియను పూర్తి చేయాలంటూ ఉన్నతాధికారులు ఒత్తిడి చేస్తుండటంతో కిందిస్థాయి సిబ్బంది ‘యాప్’సోపాలు పడుతున్నారు. అత్యధికంగా పెద్దవడుగూరు మండలంలో 7,663 మంది రైతుల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. ఆ తర్వాత గుంతకల్లులో 6,997, గుత్తిలో 6,614, తాడిపత్రిలో 5,972, కణేకల్లులో 5,761, విడపనకల్లులో 5,714, రాయదుర్గంలో 5,047 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ మండలాల్లో పరిస్థితి బాగానే ఉన్నా... మిగతా మండలాల్లో సాంకేతిక సమస్య అధికం కావడంతో ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. కుందుర్పి మండలంలో అత్యల్పంగా కేవలం 359 మందివి పూర్తయ్యాయి. శెట్టూరు మండలంలో 382, వజ్రకరూరు–400, కళ్యాణదుర్గం–424, బెళుగుప్ప– 440, కంబదూరు–503, ఆత్మకూరు–510, బ్రహ్మసముద్రం– 537, శింగనమల–540, ఉరవకొండ–558, అనంతపురం–594... ఇలా రిజిస్ట్రేషన్ల కార్యక్రమం మందగించిపోయింది. పరిష్కారం దొరక్క దిక్కులు.. సమస్యలకు పరిష్కారం చూపాల్సిన ఎన్ఐసీ అధికారులు మిన్నకుండిపోతున్నారు. ఈ క్రమంలోనే రిజిస్ట్రీ ద్వారా యూనిక్ నంబర్ల కేటాయింపు వేగవంతం చేయాలంటూ వ్యవసాయశాఖ అధికారులు ఒత్తిడి చేస్తుండటంతో ఆర్ఎస్కే అసిస్టెంట్లు, ఏఈఓలు, ఏఓలు దిక్కులు చూస్తున్న పరిస్థితి నెలకొంది. రైతు పట్టాదారు పాస్పుస్తకం, ఆధార్కార్డు, వాటికి అనుసంధానం అయిన మొబైల్ నంబరు ద్వారా రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత రైతుకు 11 నంబర్లతో కూడిన ఐడీ నంబరు కేటాయిస్తున్నారు. ఇందుకు మూడు సార్లు ఓటీపీ సక్సెస్ కావాలి. చాలా వరకు రెండు ఓటీపీలు సక్సెస్ అవుతున్నా, మూడోది కాక ప్రక్రియ నిలిచిపోతున్నట్లు ఆర్ఎస్కే అసిస్టెంట్లు చెబుతున్నారు. ఇబ్బంది పడుతున్న రైతులు.. విశిష్ట సంఖ్య లేకుంటే ఇన్పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్, పావలావడ్డీ, పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ, యాంత్రీకరణ, రాయితీ విత్తనాలు, పంట ఉత్పత్తుల అమ్మకాలు తదితర ప్రభుత్వ ఫలాలు వర్తించే పరిస్థితి ఉండదని మెలిక పెట్టడంతో రైతులకు ఇబ్బందిగా మారింది. కూటమి ప్రభుత్వం కొర్రీలు వేయడానికి రైతులను భయభ్రాంతులకు గురి చేస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారంలోకి వచ్చిన 9 నెలల కాలంలో రైతులకు నయా పైసా విదిలించ కుండా మోసం చేసిన సీఎం చంద్రబాబు.. వచ్చే సంవత్సరంలో సాధ్యమైనంత ఎక్కువ మంది రైతులకు లబ్ధి చేకూరకుండా రిజిస్ట్రేషన్ల కార్యక్రమానికి తెరతీశారనే ఆరోపణలున్నాయి. సక్రమంగా పనిచేయని అగ్రీస్టాక్ యాప్ 72 వేల దగ్గర ఆగిపోయిన రైతు రిజిస్ట్రేషన్లు దిక్కులు చూస్తున్న సిబ్బంది -
ప్రభుత్వ విధానాలతో ఉపాధి పథకం నిర్వీర్యం
గార్లదిన్నె: కూటమి ప్రభుత్వ విధానాలతో జిల్లాలో ఉపాధి హామీ పథకం నిర్వీర్యమవుతోందని, వ్యవసాయ కూలీల ఆకలి తీర్చాల్పిన ఉపాధి పనులు ప్రస్తుత రోజుల్లో వారి కడుపు కొడుతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రాంభూపాల్ మండిపడ్డారు. గార్లదిన్నె మండలం కోటంకలో చేపట్టిన ఉపాధి పనులను సోమవారం ఆయన పరిశీలించారు. కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... గత ఐదు వారాలుగా పనుల్లో పాలు పంచుకున్న కూలీలకు ఒక్క రూపాయి వేతనం కూడా చెల్లించక పోవడం బాధాకరమన్నారు. అలాగే భూమి గట్టిగా ఉండడంతో రోజుకు రూ.100 కూలి కూడా గిట్టుబాటు కావడం లేదన్నారు. ఇద్దరు మనుషులు రోజుకు రెండు క్యూబిక్ మీటర్ల పని చేస్తే పూర్తి కూలి చెల్లిస్తామంటూ అధికారులు చెబుతుండడం భావ్యం కాదన్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఉపాధి హామీ పథకం నిర్వీర్యమవుతుందన్నారు. కార్యక్రమంలో సీపీఏం మండల నాయకులు నాగార్జునరెడ్డి, రామసుబ్బారెడ్డి, వలి, రవితేజారెడ్డి, ఆదెప్ప పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రాంభూపాల్ -
నీటికుంటలో బాలుడి గల్లంతు
కళ్యాణదుర్గం రూరల్: మండలంలోని నారాయణపురం గ్రామంలో ఈతకు వెళ్లిన ఓ బాలుడు నీటి కుంటలో గల్లంతయ్యాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన మేరకు... నారాయణపురం గ్రామానికి చెందిన దుర్గేష్, ప్రీతి దంపతులకు ఇద్దరు కుమారులు కాగా, పెద్ద కుమారుడు దర్శి అదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవు రోజు కావడంతో స్నేహితులతో కలసి గ్రామ సమీపంలోని నీటి కుంటలో ఈత కొట్టేందుకు వెళ్లాడు. లోతైన ప్రాంతానికి వెళ్లడంతో నీట మునిగాడు. ఘటనతో భయపడిన స్నేహితులు అక్కడి నుంచి పారిపోయారు. సాయంత్రమైన దర్శి ఇంటికి రాకపోవడంతో సోమవారం ఉదయం ఽబాలుడి స్నేహితులను కుటంబసభ్యులు ఆరా తీశారు. దీంతో దర్శి గల్లంతైన విషయం వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేష్ వెంటనే స్పందించి అగ్ని మాపక సిబ్బంది సాయంతో కుంటలో గాలింపు చేపట్టారు. చీకటి పడుతున్నా బాలుడి ఆచూకీ లభ్యం కాలేదు. మంగళవారం ఉదయం తిరిగి గాలింపు చేపట్టనున్నట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. -
చిన్న తప్పు దొర్లినా మీదే బాధ్యత
అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణలో ఏ చిన్న తప్పు దొర్లినా చీఫ్ సూపరింటెండెంట్లు(సీఓ), డిపార్ట్మెంటల్ అధికారులే(డీఓ) బాధ్యత వహించాల్సి ఉంటుందని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) ఎం. ప్రసాద్బాబు స్పష్టం చేశారు. ఈనెల 17 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు సంబంధించి సోమవారం డీఓ, సీఎస్లతో స్థానిక ఎస్ఎస్బీఎన్ కళాశాలలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఈఓ, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందు నాయక్, అనంతపురం డెప్యూటీ డీఈఓ శ్రీనివాసరావు మాట్లాడారు. పరీక్షలు రోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఉంటాయన్నారు. మొత్తం 135 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఇందులో 98 ‘ఏ’ సెంటర్లు, 37 ‘బీ’ సెంటర్లు ఉన్నాయన్నారు. 32,803 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారన్నారు. నిర్దేశిత సమయంలో మాత్రమే ప్రశ్నపత్రాలు ఓపెన్ చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రశ్నపత్రాలు లీక్ కాకుండా చూడాలన్నారు. పరీక్ష సమయంలో బయట వ్యక్తులెవరినీ పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించొద్దన్నారు. ప్రతి కేంద్రంలో గాలి, వెలుతురు, మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయం ఉండేలా చూసుకోవాలన్నారు. అంధులు, ప్రత్యేక అవసరాల విద్యార్థులకు స్క్రైబ్స్ను ఏర్పాటు చేయాలన్నారు. అంధ విద్యార్థులకు జంబ్లింగ్ విధానం పాటించాల్సిన అవసరం లేదన్నారు. ఎస్కార్ట్ సాయంతో ప్రశ్నపత్రాలు స్టోరేజీ పాయింట్ నుంచి పరీక్ష కేంద్రాలకు తరలించాలన్నారు. ప్రశ్నపత్రాలను ఇన్విజిలేటర్కు అందించే ముందు ఆరోజు జరిగే పరీక్షకు చెందినదా, అదేకోడ్కు చెందిన వాటిని అందిస్తున్నామా.. లేదా పరిశీలించుకోవాలన్నారు. పరీక్షల విధుల్లో ఉండే ఉద్యోగులందరూ సమన్వయంతో పని చేసి ఎలాంటి సమస్య ఉత్పన్నంగా కాకుండా ప్రశాంతంగా జరిగేలా చూడాలని కోరారు. సీఓలు, డీఓలకు డీఈఓ ప్రసాద్ బాబు హెచ్చరిక పదో తరగతి పరీక్షల నిర్వహణపై సమీక్ష -
‘పోలీసు స్పందన’కు 72 వినతులు
అనంతపురం: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం చేపట్టిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 72 వినతులు అందాయి. ఎస్పీ పి.జగదీష్ స్వయంగా వినతులు స్వీకరించి, సమస్య తీవ్రతను అడిగి తెలుసుకున్నారు. చట్టపరిధిలోని సమస్యలకు పరిష్కారం చూపాలని సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ డీవీ రమణమూర్తి, మహిళా పీఎస్డీఎస్పీ ఎస్.మహబూబ్ బాషా పాల్గొన్నారు. నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ, ఉపాధి కల్పన అనంతపురం అగ్రికల్చర్: కంప్యూటర్ పరిజ్ఞానంపై నిరుద్యోగ యువతీయువకులకు ఏఎఫ్ ఎకాలజీ సెంటర్ ఆధ్వర్యంలో 60 రోజుల ఉచిత శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. ఈ మేరకు ఆ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ వైవీ మల్లారెడ్డి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 20 నుంచి 35 సంవత్సరాల వయస్సున్న ఇంటర్, డిప్లొమా పాస్, డిగ్రీ, ఇంజనీరింగ్ ఫెయిల్ అయిన వారు అర్హులన్నారు. బేసిక్ కంప్యూటర్ స్కిల్స్, ఎంఎస్ ఆఫీసు, లైఫ్ స్కిల్స్, వర్క్ప్లేస్ ఎథిక్స్, బేసిక్ స్పోకెన్ ఇంగ్లిషు, కస్టమర్ రిలేషన్షిప్ స్కిల్స్ తదితర అంశాలపై శిక్షణ ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు 73969 50345లో సంప్రదించాలని సూచించారు. విద్యార్థులను చితకబాదిన హెచ్ఎం ● ఇంటి వద్ద తల్లిదండ్రుల ఆందోళన కణేకల్లు: స్థానిక లిటిల్ ఏంజిల్స్ స్కూల్ కరస్పాండెంట్ శ్రీనివాసులు సతీమణి, ఆ పాఠశాల హెచ్ఎం భారతి అకారణంగా విద్యార్థులను చితకబాదారు. వివరాలు... సోమవారం మధ్యాహ్నం లంచ్ బ్రేక్ సమయంలో పలువురు విద్యార్థులు క్లాస్ టీచర్ బాబు అనుమతితో బయటికెళ్లి తిరిగొచ్చారు. ఎవరి అనుమతితో వెళ్లారంటూ 8వ తరగతి విద్యార్థి వినయ్కుమార్, ధనుష్, దిలీప్, షాహిల్ను హెచ్ఎం భారతి నిలదీశారు. ఆ సమయంలో వారిచ్చిన సమాధానంతో మరింత ఆగ్రహానికి లోనై చేతికి అందుబాటులో ఉన్న స్టీల్ పైప్ తీసుకుని చితకబాదారు. స్టడీ అవర్స్ తర్వాత ఇంటికెళ్లిన విద్యార్థులు జరిగిన ఘటనను తెలపడంతో సోమవారం రాత్రి స్కూల్ కరస్పాండెంట్ ఇంటి వద్ద బాధిత కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు. అకారణంగా విద్యార్థులను చితకబాదిన స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను డిమాండ్ చేశారు. -
గుడ్డుకింత ఇవ్వాల్సిందే..!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘పాలిచ్చే ఆవును పోగొట్టుకుని తన్నే దున్నపోతును తెచ్చుకున్న’ చందంగా మారింది కాంట్రాక్టర్లు, ఉద్యోగుల పరిస్థితి. చివరకు ప్రభుత్వ పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలకు అందించే కోడిగుడ్లను కూడా కమీషన్ ఇవ్వనిదే సరఫరా చేయడానికి వీల్లేదని ‘తెలుగు’ తమ్ముళ్లు తేల్చి చెప్పడంతో శ్రీ సత్యసాయి జిల్లాలో గుడ్ల సరఫరాదారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు మొదలు రేషన్ డీలర్ల వరకూ పగబట్టి తొలగించిన ‘పచ్చ’ నేతలు.. ఇప్పుడు కోడిగుడ్ల కాంట్రాక్టర్లనూ పీల్చి పిప్పి చేస్తుండటం గమనార్హం. మామూళ్లివ్వకుండా సరఫరా ఎలా? శ్రీ సత్యసాయి జిల్లాలో 32 మండలాలున్నాయి. వీటిలో 21 మండలాలకు ఒకరు, మిగతా మండలాలకు మరొకరు కోడిగుడ్లు సరఫరా చేస్తున్నారు. ఈ ఇద్దరి నుంచి ప్రతి నెలా ఆయా నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు ముక్కుపిండి సుంకం వసూలు చేస్తున్నారు. ముందుగా గుడ్డుకు ఇంత ఇవ్వాలని డిమాండు చేయగా.. కాంట్రాక్టర్లు ససేమిరా అనడంతో ఒక్కో నియోజకవర్గం నుంచి నెలకు రూ.2 లక్షలు ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పినట్లు సమా చారం. ఈ క్రమంలోనే శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన ఓ మంత్రి ఇంకో అడుగు ముందుకు వేసినట్లు తెలిసింది. తాను నియోజకవర్గానికి మంత్రిని కాదని, రాష్ట్రానికి మంత్రిననీ, జిల్లాలో అన్ని నియోజకవర్గాలకు సంబంధించి మామూళ్లు ఇవ్వాలని హుకుం జారీ చేసినట్లు సమాచారం. కదిరిలో ప్రత్యేక చట్టం.. కదిరి నియోజకవర్గంలో ప్రత్యేక చట్టం అమలవుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ టెండరు వేసింది కాంట్రాక్టరైతే సరఫరా చేసేది మాత్రం టీడీపీ నేతలు కావడం గమనార్హం.‘టెండరు నువ్వే వేసినా మేమే సరఫరా చేస్తాం’ అంటూ తెగేసి చెప్పడంతో కాంట్రాక్టరు మిన్నకుండిపోయినట్లు తెలిసింది. మండలానికి ఒకరు.. టీడీపీ నేతల తీరుపై కాంట్రాక్టర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నీ వదిలెళ్లిపోతే మంచిగా ఉంటుందేమోనంటూ నిట్టూరుస్తున్నారు. గుడ్ల సరఫరా అంటే కొనుగోలు, సరఫరా రెండూ కాంట్రాక్టరువే. కానీ సరఫరా చేసే కాంట్రాక్టరును ప్రజాప్రతినిధులు బెదిరించి మండలానికి ఒకరు చొప్పున రవాణా కాంట్రాక్టును ‘పచ్చ’ నేతలకు ఇప్పించారు. గతంలో కాంట్రాక్టరే గుడ్లను కొనుగోలు చేసి ఆయా స్కూళ్లకు, అంగన్ వాడీ సెంటర్లకు సరఫరా చేసేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. సైజు చిన్నబోయింది.. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ సెంటర్లకు సరఫరా చేసే ఒక్కో కోడిగుడ్డు నిబంధనల ప్రకారం సగటున 52 గ్రాముల బరువు ఉండాలి. కానీ శ్రీ సత్యసాయి జిల్లాకు సరఫరా చేస్తున్న కోడిగుడ్లు ఒక్కొక్కటి 48 గ్రాముల బరువే ఉంటున్నాయని తేలింది. బరువు తక్కువున్న గుడ్డు ధర తక్కువ పడుతుందని ఇలా చేస్తున్నట్టు సమాచారం. టీడీపీ నేతలే కోడిగుడ్లు సరఫరా చేస్తున్నారు కాబట్టి కేంద్రాలకు గుడ్లు వస్తున్నాయా లేదా, సైజు ఎంత అనే ప్రశ్నించే సాహసం ఎవరూ చేయడం లేదు. తప్పని పరిస్థితి.. గతంలో కోడిగుడ్లు బళ్లారి, హొస్పేట తదితర చోట్ల కొనుగోలు చేసి జిల్లా స్టాకు పాయింట్లకు మేమే సరఫరా చేసేవాళ్లం. ఇప్పుడు ఎమ్మెల్యేలు టీడీపీ నాయకులకు రవాణా కాంట్రాక్టు ఇవ్వాలని అడిగారు. తప్పనిసరి పరిస్థితిలో ఇచ్చాం. –శరత్, కోడిగుడ్ల కాంట్రాక్టర్, శ్రీ సత్యసాయి జిల్లా కోడి గుడ్ల సరఫరా కాంట్రాక్టర్ల నుంచి టీడీపీ నేతల వసూళ్లు ఒక్కో నియోజకవర్గానికి నెలకు రూ.2 లక్షల సుంకం రవాణా కాంట్రాక్టు కూడా తమకే ఇవ్వాలని పట్టు కమీషన్లు ఎక్కువగా ఇవ్వాలని శ్రీ సత్యసాయి జిల్లా మంత్రి హుకుం ‘పచ్చ’ నేతల నిర్వాకంతో గుడ్డు సైజు తగ్గిందన్న విమర్శలు -
‘కూటమి’ చర్యలతో ప్రాథమిక విద్య కనుమరుగు
అపంతపురం ఎడ్యుకేషన్: పాఠశాలల పునర్వ్యవస్థీకరణ (స్కూల్స్ రీఆర్గనైజేషన్) పేరుతో కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యల కారణంగా ప్రాథమిక విద్య కనుమరుగయ్యే ప్రమాదం నెలకొందని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ (వైఎస్సార్టీఏ) నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం అనంతపురంలోని ఉపాధ్యాయ భవనంలో వైఎస్సార్టీఏ జిల్లా నాయకుల సమావేశం జరిగింది.ఈ సందర్భంగా ఉపాధ్యాయ, విద్యారంగం ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించారు. ముఖ్యంగా మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఏర్పాటు పేరుతో ప్రైమరీ స్కూల్స్ మూతకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా పావులు కదుపుతోందని మండిపడ్డారు. ప్రభుత్వ చర్యలతో ప్రాథమిక విద్య కుంటుపడే ప్రమాదం ఉందని వాపోయారు. అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు సంబంధించి ఆర్థికపరమైన సమస్యలపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. వెంటనే 12వ పీఆర్సీ కమిటీని వేసి, 30 శాతం ఐఆర్ ప్రకటించాలని, ఉపాధ్యాయులకు దక్కాల్సిన పీఎఫ్ లోన్లు. ఏపీజీఎల్ఐ లోన్లు, క్లెయిమ్స్ వెంటనే పరిష్కారించి ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. సమావేశంలో వైఎస్సార్టీఏ అనంతపురం జిల్లా అధ్యక్షుడు ఎస్.నాగిరెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీధర్ గౌడ్, నాయకులు రామకృష్ణ, రాష్ట్ర నాయకులు వెంకటరమణప్ప, గోపాల్, రవీంద్రారెడ్డి, ప్రసాద్, కృష్ణానాయక్ పాల్గొన్నారు. వైఎస్సార్టీఏ నాయకుల ఆందోళన -
ప్రశాంతంగా సీనియర్ ఇంటర్ పరీక్షలు
అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా సోమవారం సీనియర్ ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు లాంగ్వేజ్–2 పరీక్షకు 21,952 మంది విద్యార్థులకు గాను 377 మంది గైర్హాజరయ్యారు. జనరల్ విద్యార్థులు 20,183 మందికి 19,849 మంది హాజరయ్యారు. 334 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థులు 1,769 మందికి 1,726 మంది హాజరు కాగా, 43 మంది గైర్హాజరయ్యారు. ఇంటర్ పరీక్షల నిర్వహణ కమిటీ కన్వీనర్ వెంకటరమణనాయక్ 6 కేంద్రాలు, పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు 4, సిట్టింగ్ స్క్వాడ్ సభ్యులు 10, ఫ్లయింగ్ స్క్వాడ్ సభ్యులు 16, కస్టోడియన్లు 13 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెంకటరమణనాయక్ వెల్లడించారు. ప్రజాభిప్రాయం లేకుండా ముందుకెళ్లొద్దు ● కలెక్టర్ వినోద్కుమార్కు శనగలగూడూరు రైతుల వినతి పుట్లూరు: ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించకుండా బోరుబావులు తవ్వరాదని, అలా కాదని ముందుకెళ్తే కచ్చితంగా అడ్డుకుంటా మని శనగలగూడూరు రైతులు తెలిపారు. ఈ మేరకు సోమవారం గ్రామానికి చెందిన రైతులు కలెక్టర్ వినోద్కుమార్కు వినతి పత్రం అందించారు. రెండేళ్ల క్రితం ఓఎన్జీసీ అధికారులు చమురు, సహజ వాయువుల అన్వేషణ కోసం సర్వే చేపట్టారన్నారు. 2024 అక్టోబర్లో సి. వెంగన్నపల్లి గ్రామంలో సోలార్ లైట్లను ఏర్పాటు చేయడంతో పాటు శనగలగూడూరులో దాదాపు 10 ఎకరాల భూమిని లీజుకు తీసుకున్నారన్నారు. బోరుబావులు తవ్వితే భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో పాటు కాలుష్యం పెరిగే అవకాశం ఉందన్నారు. కనీసం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టకుండా క్షేత్ర స్థాయిలో పనులను ప్రారంభిస్తే భవిష్యత్తులో నష్టం కల్గుతుందని వాపోయారు. ఈ విషయాలపై స్పష్టత ఇవ్వకుండా పనులను చేపట్టరాదన్నారు. కార్యక్రమంలో శనగలగూడూరు రైతులు జయరామిరెడ్డి, నాగిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, గోపాల్రెడ్డి, అమర్, వీరారెడ్డి, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘టీచర్ల సీనియార్టీ’పై అభ్యంతరాల స్వీకరణ ● 10 వరకూ గడువు అనంతపురం ఎడ్యుకేషన్: ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మునిసిపాలిటీ, నగరపాలక సంస్థ పరిధిలోని స్కూళ్లలో పని చేస్తున్న హెచ్ఎంలు, టీచర్ల సాధారణ సీనియార్టీ జాబితాను తయారు చేశారు. ఉపాధ్యాయ సమాచార వ్యవస్థ (టిస్) ఆధారంగా రూపొందించిన జాబితాను జిల్లా విద్యాశాఖ వెబ్సైట్ (బ్లాగ్)లో ఉంచినట్లు డీఈఓ ఎం. ప్రసాద్బాబు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఈనెల 10వ తేదీలోగా ఆధారాలతో జిల్లా సైన్స్ సెంటర్లో అందజేయాలని సూచించారు. టీచరు పూర్తిపేరు, ఐడీ, పదవి తదితర వివరాలు ఉండాలన్నారు. అభ్యంతరం ఎక్కడ ఉందో స్పష్టంగా పేర్కొనాలన్నారు. గడువు ముగిసిన తర్వాత వచ్చే అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోరని, కమిటీ పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. పాల డెయిరీలో తనిఖీలు యాడికి: ఎలాంటి అనుమతులు లేకుండా యాడికిలో నిర్వహిస్తున్న పాల డెయిరీని జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి రామచంద్ర సోమవారం తనిఖీ చేశారు. యాడికి నివాసి అమరనాథరెడ్డి గత కొన్నేళ్లుగా డెయిరీ నిర్వహిస్తూ పాలు, పెరుగు, నెయ్యి విక్రయాలతో జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి రామచంద్ర ఆకస్మిక తనిఖీ చేశారు. పాలు, పెరుగు, నెయ్యి నాణ్యతను పరిశీలించారు. కొన్ని శాంపిల్స్ సేకరించి ప్రయోగశాలకు పంపారు. కాగా, అమరనాథరెడ్డి నిర్వహిస్తున్న పాల డెయిరీకి లైసెన్స్ లేకపోవడంతో వెంటనే అనుమతులు తీసుకోవాలని ఆదేశించారు. డెయిరీలో ఫుడ్ సేఫ్టీ అధికారి తనిఖీలు చేపట్టారనే విషయం తెలియగానే మండల కేంద్రంలోని పలు డెయిరీలతో పాటు హోటళ్లను నిర్వాహకులు మూసి, అజ్ఞాతంలోకి వెళ్లడం గమనార్హం. -
అర్జీలతో పోటెత్తారు
● ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’కు 330 వినతులు ● పరిష్కారం చూపాలని ప్రజల వేడుకోలుఅనంతపురం అర్బన్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అర్జీలు పోటెత్తాయి. వివిధ సమస్యలపై మొత్తం 330 వినతులు అందాయి. కలెక్టర్ వి.వినోద్కుమార్తో పాటు జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, డీఆర్ఓ ఎ.మలోల, డిప్యూటీ కలెక్టర్లు రామ కృష్ణారెడ్డి, ఆనంద్, తిప్పేనాయక్, మల్లికార్జునలు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కార్యక్రమం అనంతరం అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రతివారం సమీక్షిస్తున్నారని, అప్రమత్తంగా ఉంటూ ప్రతి అర్జీని పరిష్కరించాలని ఆదేశించారు. వినతుల్లో కొన్ని... ● సమాచార హక్కు చట్టం ద్వారా తాను కోరిన సమాచారాన్ని దేవదాయశాఖ అధికారులు ఇవ్వడం లేదని పుట్లూరు మండలం చింతకుంట గ్రామానికి చెందిన సూర్యప్రకాశ్ మూర్తి విన్నవించాడు. కార్యాలయానికి ఎందుకు వచ్చావంటూ అధికారులు అసభ్యంగా మాట్లాడుతున్నారని వాపోయాడు. ● నార్పల గ్రామ పొలంలోని తమ 5.15 ఎకరాలను ఆక్రమించారని నార్పల మండలం బొందలవాడ గ్రామానికి చెందిన సుదర్శన్ చెప్పాడు. న్యాయం చేయాలని కోరాడు. ● సర్వే నంబరు 709లో తమకు 7.18 ఎకరాలు భూమి మాత్రమే ఉండాలని, అయితే అంతకంటే ఎక్కువగా ఉందని చెబుతూ ఆ భూమిని రికార్డుల నుంచి తీసివేయాలని పెద్దపప్పూరు మండలం రెడ్డిపల్లికి చెందిన బి.రత్నమ్మ విన్నవించింది. ● కల్లూరు తొమ్మిదో వార్డులోని అంగన్వాడీ సెంటర్ వద్ద మురికినీరు నిలిచి దోమలు స్వైరవిహారం చేస్తున్నాయని మహమ్మద్ రఫీ అనే వ్యక్తి తెలిపాడు. కాలువ నిర్మించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు. కూడేరు మండలం కడదరకుంట గ్రామానికి చెందిన ఈమె పేరు వడ్డే లక్ష్మీదేవి (దివ్యాంగురాలు). సర్వే నంబరు 80–1లో ఉన్న 2.41 ఎకరాల భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి భూమిలో దారి కావాలంటూ మాజీ ప్రజాప్రతినిధి దౌర్జన్యంగా ముళ్ల కంచెను ధ్వంసం చేశాడు. అతనిపై కూడేరు పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. అయినప్పటికీ బెదిరిస్తూనే ఉండటంతో సమస్యను పరిష్కరించి, తనకు న్యాయం చేయాలని ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో కలెక్టర్ను లక్ష్మీదేవి వేడుకున్నారు. కూడేరు మండలం కలగల్లకు చెందిన ఈ దివ్యాంగుని పేరు ఎం.చండ్రాయుడు. సదరం సర్టిఫికెట్ కోసం ఆస్పత్రిలో పరీక్ష చేయించుకుని ఆరు నెలలవుతున్నా మంజూరు కాలేదు. సర్టిఫికెట్ ఇప్పించేలా చూడాలని కలెక్టర్ను కోరాడు. -
జనరల్ సర్జరీ పీజీ ఫలితాల్లో సత్తా
అనంతపురం ఎడ్యుకేషన్: డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన పీజీ మెడికల్ పరీక్షల ఫలితాల్లో ‘అనంత’ వాసి డాక్టర్ విష్ణుశ్రీకర్రెడ్డి 800 మార్కులకు గాను 613 మార్కులు సాధించి రాష్ట్రంలోనే టాపర్గా నిలిచారు. మూడు రోజుల క్రితం ఫలితాలు విడుదలయ్యాయి. డాక్టర్ విష్ణుశ్రీకర్రెడ్డి ప్రస్తుతం కర్నూలు మెడికల్ కళాశాలలో పీజీ జనరల్ సర్జరీ చేస్తున్నారు. ఆయన తండ్రి డి.జనార్దన్రెడ్డి గతంలో అనంతపురం ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్గా పని చేశారు. తల్లి జయశ్రీదేవి గృహిణి. వీరి సొంతూరు కణేకల్లు కాగా ప్రస్తుతం అనంతపురం నగరంలో నివాసం ఉంటున్నారు. ఈ సందర్భంగా విష్ణుశ్రీకర్రెడ్డిని డాక్టర్ లక్ష్మణ ప్రసాద్, డాక్టర్ కొండయ్య, డాక్టర్ రఘువంశీ, డాక్టర్ సింధూర, డాక్టర్ శంకర్ గౌడ్, జయరామ రెడ్డి, రాయదుర్గం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీధర్ తదితరులు అభినందించారు. -
ఉమ్మడి జిల్లాకే తలమానికం గవిమఠం
ఉరవకొండ: తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోనూ దాదాపు 770 ఉపమఠాలు కలిగి ఉమ్మడి జిల్లాకే తలమానికంగా ఉరవకొండలోని గవిమఠం నిలుస్తోంది. రూ.కోట్ల విలువైన స్థిరాస్తులతో నిత్య శివనామస్మరణతో విరాజిల్లుతున్న శైవ క్షేత్రమిది. శైవ ధర్మ ప్రచారంలో భాగంగా గవి మఠం మొదటి పీఠాధిపతులు కరిబసవస్వామి దేశ సంచారం చేస్తూ వివిధ ప్రాంతాల్లో 770 ఉపమఠాలు స్థాపించారు. వీటి పరిధిలో రూ.కోట్లు విలువ చేసే మాన్యాలు, భవనాలు ఉన్నాయి. ఉరవకొండలోని దాదాపు 80 శాతం ప్రభుత్వ భవనాలు గవిమఠం విరాళంగా ఇచ్చిన స్థలాల్లోనే నిర్మించడం గమనార్హం. గవిమఠం స్థలాల్లోనే ప్రభుత్వ ఆస్పత్రి, ప్రభుత్వ కార్యాలయాలు, పురాతన ఎస్కే ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల, ఎస్కేఆర్సీ క్లబ్ నడుస్తున్నాయి. కొన్ని వందల కుటుంబాలు మఠం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలాలను లీజుకు తీసుకుని వివిధ వ్యాపారాలతో జీవనం సాగిస్తున్నాయి. గవిమఠానికి వచ్చే భక్తులకు నిత్య ఉచిత భోజన వసతి కల్పిస్తుంటారు. ప్రస్తుతం గవిమఠం 8వ పీఠాధిపతులుగా జగద్గురు చెన్నబసవరాజేంద్రస్వామి, ఉత్తరాధికారిగా డాక్టర్ కరిబసవరాజేంద్రస్వామి కొనసాగుతున్నారు. నేటి నుంచి బ్రహ్మోత్సవాలు ఉరవకొండ గవిమఠం చంద్రమౌళీశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 4న ప్రారంభం కానున్నాయి. మంగళవారం ఉదయం కంకణధారణతో బ్రహ్మోత్సవాలకు అంకుర్పారణ చేయనున్నారు. 5న నాగభరణ ఉత్సవం, 6న నెమలి వాహనోత్సవం, 7న గవిమఠం 8వ పీఠాధిపతులు జగద్గురు చెన్నబసవరాజేంద్రస్వామి వారి అడ్డపల్లకీ ఉత్సవం, 8న మహా గణారాధన, బసవేశ్వర వాహనోత్సవం, 9న చంద్రమౌళీశ్వరస్వామి బ్రహ్మరథోత్సవం, 10న లంకాదహనం ఉంటాయి. 11న వసంతోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోనూ 770 మఠాలు నేటి నుంచి చంద్రమౌళీశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు అన్ని ఏర్పాట్లు పూర్తి వారం రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని మౌలిక వసతులు కల్పించాం. గవిమఠం పీఠాధిపతుల ఆశీస్సులతో అన్నీ శాఖల అధికారులను సమన్వయం చేసుకుని బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకున్నాం. – కె.రాణి, సహాయ కమిషనర్/మేనేజర్, గవిమఠం, ఉరవకొండ -
ఎరువుల విక్రయాల నిలుపుదల
శింగనమల: ప్రభుత్వ అనుమతులు రసాయనిక మందులు, బయో ఫర్టిలైజర్, ఎరువులు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని ఎరువుల దుకాణాల నిర్వాహకులను గుత్తి ఏడీఏ వెంకట్రాముడు హెచ్చరించారు. శింగనమల మండలం తరిమెల, కల్లుమడి గ్రామాల్లోని భైర వ ఫర్టిలైజర్, నిత్యశ్రీ ఆగ్రో ఏజెన్సీ ఎరువుల దుకాణాలను సోమవారం ఆయన తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. అనుమతులు లేకుండా అమ్మకం సాగిస్తున్న రూ.3,65,309 విలువైన బయో ఫర్టిలైజర్స్ ఎరువులను గుర్తించి, వాటి విక్రయాలను నిలపుదల చేస్తూ నోటీసులు జారీ చేశారు.అనంతరం రైతు సేవా కేంద్రాలను తనిఖీ చేశారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి అన్వేష్కుమార్, రైతు సేవా కేంద్రాల సిబ్బంది నవీన్, ఆదినారాయణ పాల్గొన్నారు. -
ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహించాలి
● కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశం అనంతపురం అర్బన్: ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహించే దిశగా చిత్తశుద్ధితో అన్ని స్థాయిల అధికారులు పనిచేయాలని కలెక్టర్ వి.వినోద్కుమార్ ఆదేశించారు. ప్రకృతి వ్యవసాయంలో ఖరీఫ్ కార్యాచరణ ప్రణాళికపై సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో జిల్లా స్థాయి వర్క్షాప్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఉరవకొండ మండలంలో మూడు గ్రామాలు, గుత్తి మండలంలో మూడు గ్రామాల్లో సమీకృత ఫార్మింగ్ క్లస్టర్లను ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయం డీపీఎం లక్ష్మానాయక్, జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ, ఉద్యాన శాఖ డీడీ నరసింహారావు, డీఆర్డీఏ పీడీ ఈశ్వరయ్య, ఏపీఎంలు, ఏరియా కో–ఆర్డినేటర్లు పాల్గొన్నారు. ఇబ్బంది పడతారు జాగ్రత్త ‘కొందరు జిల్లా అధికారుల పనితీరు సరిగా లేదని తెలిసింది. మార్పు రాకపోతే ఇబ్బంది పడతారు జాగ్రత్త’ అంటూ కలెక్టర్ వి.వినోద్ కుమార్ హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో అధికారులతో ఆయన సమావేశమై మాట్లాడారు. జిల్లాధికారులు వారి కార్యాలయాల్లో సమయానికి అందుబాటులో ఉండాలని ఆదేశించారు. క్షేత్రస్థాయి అధికారులూ సమయపాలన పాటించాలని చెప్పారు. వసతిగృహాల అభివృద్ధికి మినరల్ ఫండ్స్ నుంచి నిధులు ఇస్తామని, మరమ్మతు పనులు ప్రారంభించాలన్నారు. మండల ప్రత్యేక అఽధికారులు వసతి గృహాలను దత్తత తీసుకుని పిల్లలు ఏం చేస్తున్నారు.. ఎలా చదువుతున్నారు.. మౌలిక వసతులు బాగున్నాయా.. తదితర అంశాలను పరిశీలిస్తూ ఉండాలన్నారు. ఈ సమావేశంలో జేసీ శివ్ నారాయణ్ శర్మ, డీఆర్ఓ ఎ.మలోల, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. నీటి ఎద్దడి తలెత్తనీయొద్దు ‘ఈ ఏడాది వేసవి తీవ్రత అధికంగా ఉండే పరిస్థితి కనిపిస్తోంది. తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని పనిచేయాలి’ అని కలెక్టర్ వి.వినోద్కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి ఆర్డబ్ల్యూఎస్, ప్రజారోగ్య శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బోర్వెల్స్ మరమ్మతుతో పాటు ఇతర పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా నీటి రవాణా చేపట్టాలన్నారు. తాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఉంటే ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు 7569049872 నెంబర్కు ఫోన్ చేసి గ్రామం, వివరాలు, సమస్యను తెలిజేస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ మురళీధర్రావు, ప్రజారోగ్యశాఖ ఎస్ఈ ఆదినారాయణ, మునిసిపల్ కమిషనర్లు, ఆర్డబ్ల్యూఎస్ డీఈఈలు, జేఈఈలు పాల్గొన్నారు. బాల్య వివాహాల్లేని జిల్లాగా మారుద్దాం బాల్యవివాహాలు లేని జిల్లాగా అనంతను మారుద్దామంటూ సంబంధిత అధికారులకు కలెక్టర్ వి.వినోద్కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ‘బాల్య వివాహం... చట్టరీత్యా నేరం’ పోస్టర్లను అధికారులతో కలసి ఆయన ఆవిష్కరించి, మాట్లాడారు. బాల్యవివాహాల అడ్డుకట్టకు ప్రత్యేక చర్యలు చేపట్టడంతో పాటు చట్టాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. అలాగే పశువ్యాధి నియంత్రణ పథకం పోస్టర్లను కలెక్టర్, అధికారులు ఆవిష్కరించి, పశువ్యాధి నియంత్రణ లక్ష్యంగా పనిచేయాలని సంబంధిత అధికారులను కలెక్ట్టర్ వినోద్కుమార్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, డీఆర్ఓ ఎ.మలోల పాల్గొన్నారు. వృద్ధురాలి బలవన్మరణం రాయదుర్గం టౌన్: జీవితంపై విరక్తితో ఓ వృద్ధురాలు ఆత్మహత్య చేసుకుంది. సోమవారం ఉదయం రాయదుర్గం పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బళ్లారి రోడ్డులోని పార్వతీనగర్ మదరసా వెనుక వైపు నడకదారిలో పూర్తిగా కాలిన ఓ మహిళ మృతదేహాన్ని సోమవారం తెల్లవారుజామున స్థానికులు గుర్తించారు. సమచారం అందుకున్న డీఎస్పీ రవికుమార్, సీఐ జయానాయక్ అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతురాలిని పార్వతీనగర్కు చెందిన నాగళ్లి శివమ్మ (62)గా గుర్తించారు. ఆమెకు నలుగురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. పార్వతీనగర్లోని చిన్న కుమారుడి ఇంట్లో ఉంటున్న శివమ్మ... చాలా కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. కుటుంబసభ్యులు చికిత్స చేయించినా ఫలితం లేకపోవడంతో జీవితంపై విరక్తి పెంచుకున్న ఆమె సోమవారం వేకువజామున ఇంట్లో ఉన్న టిన్నర్ బాటిల్ తీసుకెళ్లి మదరసా వెనుక ఖాళీ స్థలంలో శరీరంపై పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. పోక్సో కేసులో నిందితుడి అరెస్ట్ బెళుగుప్ప: మండలంలోని గిరిజన తండాకు చెందిన మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఘటనలో నమోదైన పోక్సో కేసులో నిందితుడు తిప్పేస్వామినాయక్ను సోమవారం అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ శివ తెలిపారు. కాగా, నిందితుడు రాయదుర్గం మండలం రాతిబావివంక తండా గ్రామానికి చెందిన వాడు. పెళ్లి పేరుతో బాలికను లోబర్చుకుని అత్యాచారం చేసినట్లుగా బాధితురాలు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. హెచ్చెల్సీ బ్రిడ్జికి రంధ్రం కణేకల్లు: మండలంలోని మాల్యం శివారులో కణేకల్లు–ఉరవకొండ రహదారిలో ఉన్న హెచ్చెల్సీ బ్రిడ్జికి సోమవారం రంధ్రం పడింది. బ్రిడ్జి దిగువన పిల్లర్కు ఏర్పాటు చేసిన రాళ్లు సైతం ఊడిపోయాయి. విషయం తెలుసుకున్న ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఈ బ్రిడ్జి కూలిపోతే కణేకల్లు–ఉరవకొండకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయి. అనంతపురానికి వెళ్లడానికి సైతం ఈ మార్గం అత్యంత ప్రధానమైది. కాగా బ్రిడ్జికి రంధ్రం పడటంతో స్థానికులు రాళ్లు, మట్టి వేసి పూడ్చేశారు. అధికారులు స్పందించి బ్రిడ్జిపై భారీ వాహనాల రాకపోకలను నియంత్రించాలని ప్రజలు డిమాండ్ చేశారు. -
ప్రాణాలు బలిగొన్న మద్యం
గుంతకల్లు టౌన్: అతిగా మద్యం సేవించి ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... పాత గుంతకల్లులోని వడ్డే వీధికి చంఎదిన వడ్డే మస్తాన్ (59) దివ్యాంగుడు. పదిహేనేళ్ల క్రితంభార్య సరోజమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. అప్పటి నుంచి ఒంటరిగా నివసిస్తున్న అతడు మద్యానికి బానిసయ్యాడు. ఈ నెల 1న శనివారం దివ్యాంగుల కోటా కింద పింఛన్ అందుకున్న ఆయన... ఆదివారం తన వాహనంపై కొనకొండ్ల రోడ్డులోని పెట్రోల్ బంక్ వెనుక గల ప్లాట్లల్లో అతిగా మద్యం తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. రెండు రోజుల తర్వాత సోమవారం ఉదయం అటుగా వెళుతున్న వారు గుర్తించి సమాచారం ఇవ్వడంతో పామిడిలో ఉన్న కుమారుడు వడ్డే ఉమేష్ అక్కడకు చేరుకుని పరిశీలించాడు. అప్పటికే మృతిచెందినట్లుగా నిర్ధారించుకుని సమాచారం ఇవ్వడంతో ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు వన్టౌన్ సీఐ మనోహర్ తెలిపారు. -
ఉరవకొండ ప్రభుత్వాస్పత్రి అప్గ్రేడ్కు చర్యలు
● డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ అసిస్టెంట్ కమిషనర్ డాక్టర్ రమేష్ కిషోర్ ఉరవకొండ: స్థానిక ప్రభుత్వాస్పత్రిని 50 పడకల నుంచి వంద పడకలకు ఆప్గ్రేడ్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ అసిస్టెంట్ కమిషనర్ డాక్టర్ రమేష్ కిషోర్ తెలిపారు. డీసీహెచ్ఎస్ పాల్రవికుమార్, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్వీఎస్ చౌదరితో కలసి సోమవారం ఆస్పత్రిలోని అన్ని విభాగాలను ఆయన పరిశీలించారు. పరిశీలనలో బృంద సభ్యులు స్వప్న, సింధూ, సందీప్, పురుషోత్తం, ప్రసన్న తదితరులు ఉన్నారు. -
ఇది పూర్తిగా వంక ప్రాంతం
రాప్తాడు రూరల్: అనంతపురం నగరం చుట్టూ భూములకు విపరీతమైన ధరలు రావడంతో తెలుగుదేశం పార్టీ చోటా నాయకులుగా చెలామణి అవుతున్న కొందరు ప్రభుత్వ భూములపై కన్నేశారు. అధికారం ఉందనే ఽధైర్యంతో రెచ్చిపోతున్నారు. పైసా పెట్టుబడి లేకుండా అప్పనంగా రూ. లక్షలు సంపాదించాలంటే ప్రభుత్వ భూములు కబ్జా చేయడమే మార్గంగా ఎంచుకున్నారు. ఇందులో భాగంగానే 20 ఏళ్ల కిందట ఓపెన్ స్థలాలుగా వదిలిన వాటిని దర్జాగా ఆక్రమించేస్తున్నారు. అనంతపురం రూరల్ మండలం కురుగుంట సమీపంలోని మటన్ మార్కెట్ కాలనీ (ఇందిరమ్మకాలనీ)లో ఆక్రమణే ఇందుకు ఉదాహరణ. నాలుగు రోజుల క్రితం రంగంలోకి తమ్ముళ్లు కురుగుంట పొలం సర్వే నంబర్ 83–11, 12లో దాదాపు 20 ఏళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ అర్బన్ హౌసింగ్ స్కీమ్ కింద 178 పాట్లు మంజూరు చేసింది. ఇందులో గుడి, పార్క్ కోసం వేర్వేరు ప్రాంతాల్లో స్థలాలను వదిలి పెట్టారు. అప్పటి నుంచి ఈ స్థలాలు ఖాళీగానే ఉన్నాయి. ఇక్కడ సెంటు ధర రూ.3 లక్షలకు పైగా పలుకుతోంది. గుడి కోసం వదిలిన దాదాపు 22 సెంట్ల స్థలంపై కన్నేసిన టీడీపీ చోటా నాయకులు వెంటనే రంగంలోకి దిగి బండలు నాటించేస్తున్నారు. సెంటున్నర ప్రకారం 15 ఇళ్ల నిర్మాణాలకు స్కెచ్ వేశారు. బరితెగించి కబ్జా చేస్తుండడం వెనుక కనగానపల్లి మండలానికి చెందిన ఓ టీడీపీ నాయకుడి హస్తమున్నట్లు విశ్వసనీయ సమాచారం. తన వాటాగా లక్షలాది రూపాయలను ఆయన ముందుగానే తీసుకుని అభయం ఇవ్వడంతో చోటా నాయకులు మరింత రెచ్చిపోయారు. వంకను కుదించి.. చదును చేసి.. కురుగుంట పొలం సర్వే నంబర్ 83–11, 12కు సమీపంలోనే సర్వే నంబరు 89లో రెవెన్యూ రికార్డులలోని డైక్లాట్ ప్రకారం తడకలేరు వంక స్థలంగా గుర్తింపు ఉంది. ప్రస్తుతం ఈ వంక స్థలాన్ని సైతం కబ్జా చేసి పేదలకు అమ్మకానికి పెట్టారు. వర్షాకాలం వస్తే ఈ వంక ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఉపరితల ప్రాంతాల నుంచి వచ్చే వరద ప్రవాహాన్ని తట్టుకోలేక సమీప కాలనీలన్నీ మునిగిపోయిన సందర్భాలూ చాలా ఉన్నాయి. ఇలాంటి వంకను సైతం ఆక్రమించి ఆనకట్టలా మట్టితో నిర్మించి దాని పక్కనే ఇళ్ల స్థలాల కోసం బండలు నాటుతున్నారు. ‘డబ్బు కొట్టు–స్థలం పట్టు’ అన్న చందంగా పేదల నుంచి డబ్బు వసూళ్లు చేస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించకపోతే భవిష్యత్తులో పండమేరు వాగులో కాలనీలకు కాలనీలు మునిగిపోయిన ఘటన ఇక్కడ కూడా పునరావృతం అయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అది ప్రజాప్రయోజనాల స్థలం మటన్ మార్కెట్ సమీపంలో ఇందిరమ్మ అర్బన్ హౌసింగ్ స్కీమ్ కింద ఏర్పాటైన కాలనీలో ప్రజాప్రయోజనాల కోసం కొంత స్థలాన్ని వదిలారు. గుడి కోసం వదిలిన స్థలంలో కొందరు బండలు నాటుతున్న సమాచారం నా దృష్టికి వచ్చింది. వెళ్లి వారితో మాట్లాడా. పనులు నిలబెట్టాలని చెప్పాం. తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లి సర్వే చేయించి ప్రభు త్వ స్థలమంతా హద్దులు నాటి బోర్డులు ఏర్పాటు చేస్తాం. – చరణ్, పంచాయతీ కార్యదర్శి, కురుగుంటసర్వే నంబరు 89 అనేది పూర్తి వంక ప్రాంతం. ఈ ప్రాంతాన్ని చదును చేసి బండలు నాటుతున్నట్లుగా తెలియడంతో అక్కడికెళ్లి పనులు అడ్డుకున్నాం. ఎవరైనా మొండిగా బండలు నాటించాలని చూస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తాం. ఈ విషయాన్ని తహసీల్దార్ దృష్టికీ తీసుకెళ్లాను. – రామకృష్ణ, వీఆర్వో -
సెంట్రల్ వర్సిటీలో ఫీజులు నియంత్రించాలి
బుక్కరాయసముద్రం: రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా అనంతపురంలో ఏర్పాటైన సెంట్రల్ యూనివర్సిటీలో ఫీజుల నియంత్రించాలని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ డిమాండ్ చేశారు. సిద్దరాంపురం రోడ్డు సమీపంలో ఉన్న ఆర్డీటీ బధిరుల పాఠశాలలో అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీ 3వ మహాసభ ఆదివారం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎస్ఎఫ్ఐ మాజీ కార్యదర్శి జార్జ్ హాజరై, మాట్లాడారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు అవుతున్నా ఇప్పటికీ సెంట్రల్ యూనివర్సిటీలో పూర్తిస్థాయి తరగతి గదులు, అమ్మాయిల వసతి భవనాలు ఏర్పాటు కాలేదన్నారు. వర్సిటీలో విద్యార్థినులకు రక్షణ కరువైందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా అనంతపురం సెంట్రల్ యూనివర్సిటిలో ఫీజులు పెంచాడం దుర్మార్గమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి సంఘం ఎన్నిక.. సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ గేయానంద్ సమక్షంలో 21 మందితో కమిటీను ఎన్నుకున్నారు. యూనియన్ అధ్యక్షుడిగా అన్నా అననున్, కార్యదర్శిగా సూర్యవంశీ కృష్ణతో పాటు 21 మందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు పరమేష్, కార్యదర్శి ఓతూర్, జిల్లా బాలికల విభాగం కన్వీనర్ రజిత, ఉపాధ్యక్షుడు గిరి, నాయకులు భీమేష్, సోము, సాయి, జీనత్, వంశీ, తదితరులు పాల్గొన్నారు. -
ప్రశ్నపత్రాల లీకేజీలో 14 మంది నిందితులు!
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం దూరవిద్య విభాగానికి సంబంధించిన ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం మరో దఫా తెరమీదకు వచ్చింది. ఈ కేసు విచారణ సీఐడీ కోర్టుకు రావడంతో ప్రస్తుతం చర్చనీయాంశమైంది. వివరాలు... 2011, నవంబర్లో ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా ఎస్కేయూ దూరవిద్య విభాగంలో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, పరీక్షలు నిర్వహించారు. అప్పట్లో దూరవిద్య విభాగం డైరెక్టర్గా ప్రొఫెసర్ పసల సుధాకర్ ఉండేవారు. 32 వేల మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తు చేసుకోగా, మొత్తం 56 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే ప్రకాశం జిల్లా పొదిలి పొరుగున ఉన్న అధ్యయన కేంద్రం నిర్వాహకులు పరీక్ష కేంద్రం కావాలని అప్పట్లో పట్టుబట్టారు. ఈ అభ్యర్థనను దూరవిద్యా కేంద్రం అధికారులు తిరస్కరిస్తూ పొదిలి కేంద్రంలో పరీక్షలు జరిగేలా ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే 2011, నవంబర్ 23న జరగాల్సిన పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రం అదే నెల 22న బయటకు వచ్చింది. కొన్ని ప్రశ్న పత్రాలు ముందు రోజే తీసి ఉద్ధేశ్యపూర్వకంగా లీక్ చేశారు. ఇలా మొత్తం 21 ప్రశ్న పత్రాలు లీక్ అయ్యాయి. వీటిని లీక్ చేసిన వారు నేరుగా వీసీ కార్యాలయానికి ఫ్యాక్స్ చేయడం గమనార్హం. అప్పటికే 2011, నవంబర్ 11న నూతన వీసీగా బాధ్యతలు స్వీకరించిన ఆచార్య రామకృష్ణారెడ్డి ఈ అంశాన్ని ప్రతిష్టాత్మకంగా స్వీకరించారు. అప్పటి రిజిస్ట్రార్ రవీంద్ర ఫిర్యాదు మేరకు ఇటుకలపల్లి పీఎస్లోనూ కేసు నమోదైంది. అనంతరం ఈ కేసు దర్యాప్తును సీబీసీఐడీకి అప్పగించారు. విచారణ పూర్తి కావడంతో సీఐడీ కోర్టులో చార్జీషీట్ దాఖలైంది. ప్రస్తుతం సీఐడీ కోర్టులో ఈ కేసు విచారణ సాగుతోంది. మొత్తం 14 మందిని నిందితులుగా పేర్కొన్నారు. 42 మంది సాక్షులను చేర్చారు. కాగా, దూరవిద్య విభాగంలో పనిచేస్తున్న సింహభాగం అధికారులు ఉద్యోగ విరమణ పొందారు. అప్పటి డైరెక్టర్ ప్రొఫెసర్ పి.సుధాకర్ దివంగతులయ్యారు. ఎస్కేయూ దూరవిద్య విభాగానికి సంబంధించి 2011లో ప్రశ్నపత్రాల లీకేజీ సీఐడీ కోర్టులో కేసు విచారణ ప్రారంభం 42 మంది సాక్షులను విచారించనున్న న్యాయస్థానం -
ఐక్యతతోనే సమస్యల పరిష్కారం
ధర్మవరం: ప్రభుత్వ ఉద్యోగులంతా ఐకమత్యంతో ఉన్నప్పుడే సమస్యలు పరిష్కారమవుతాయని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి రమేష్కుమార్, జిల్లా అధ్యక్షుడు భాస్కర్రెడ్డి తెలిపారు. పట్టణంలోని సీఎన్బీ గార్డెన్స్లో ఆదివారం ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రథమ కౌన్సిల్ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వాలకు, ప్రజలకు అనుకూలంగా విధులను బాధ్యతగా నిర్వర్తిస్తున్నామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ ఉద్యోగులు ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు. పీఆర్సీపై ప్రభుత్వం తక్షణం జుడీషియల్ పే కమిషన్ ఏర్పాటు చేయాలని, ఇప్పటికే ఆలస్యమైన దృష్ట్యా ఐఆర్ వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. సరెండర్ లీవులు, జీపీఎఫ్ లోన్ల ఆర్థిక ప్రయోజనాలను తక్షణమే చెల్లించాలన్నారు. ఇప్పటికే మూడు డీఏలు పెండింగ్లో ఉన్నాయన్నారు. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్న ఎఫ్ఆర్సీ, పదోన్నతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలిపారు. మూడు దశాబ్ధాలుగా ఉన్న ఉపాధ్యాయుల ఏకీకృత సమస్యను తక్షణమే పరిష్కార మార్గం చూపాలని కోరారు. పదవీ విరమణ వయస్సు మినిమం టైం స్కేల్ ఉద్యోగులకు వర్తింపచేయాలన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల పక్షాన నిలబడే ఏకై క సంఘం ప్రభుత్వ ఉద్యోగుల సంఘమన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రామంజనేయులు యాదవ్, సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పఠాన్ బాజీ, గ్రామ సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ రజాక్, ఆర్టీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేదార్నాథ్, ఐక్యవేదిక కోచైర్మన్ కరణం హరికృష్ణ, ఏపీజీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లక్ష్మీపతి, పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆత్మరెడ్డి, ఎంటీఎస్, ఎన్ఎంఆర్ రాష్ట్ర అధ్యక్షుడు సురేష్, వివిధ జిల్లాల నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ -
బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో రాయదుర్గానికి చోటు
రాయదుర్గంటౌన్: నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో రాయదుర్గానికి చోటు దక్కింది. శ్రీకళారాధన భరతనాట్య డ్యాన్స్ అకాడమీ 12వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం చిందనూరు కళ్యాణమంటపం వేదికగా సామూహిక లలితా సహస్ర నామ పారాయణం నిర్వహించారు. దాదాపు 200 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ మొత్తం ప్రక్రియను చైన్నె నుంచి విచ్చేసిన నోబెల్ బుక్ ఆఫ్ రికార్డు ప్రతినిధులు ప్రదీప్, హేమంత్ నాగరాజు రికార్డు చేశారు. 32 నిమిషాల 47 సెకన్లలో లలితా సహస్ర పారాయణాన్ని పఠించడం అంతర్జాతీయస్థాయిలో మొదటి సారి కావడం విశేషం. ఆధ్యాత్మిక గురువు, విప్రమలై లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ గౌరవాధ్యక్షుడు రామ్మూర్తిస్వామిజీ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమానికి డ్యాన్స్ అకాడమీ టీచర్ జ్యోతి నగేష్, శ్వేతాపద్మని నేతృత్వం వహించారు. కో–ఆర్డినేటర్గా ఆల్ ఇండియా రేడియో అనౌన్సర్ లంకా ప్రసాద్ వ్యవహరించారు. కార్యక్రమం అనంతరం నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సర్టిఫికెట్ను నిర్వాహకులకు ప్రతినిధులు అందజేశారు. ముఖ్య అతిథులుగా మెట్టు యశోదమ్మ, వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌని ఉపేంద్రరెడ్డి హాజరయ్యారు. -
మానసిక వైద్యం గ్రామీణులకూ అందాలి
అనంతపురం మెడికల్: గ్రామీణ ప్రాంత ప్రజలకూ మానసిక వైద్యం అందేలా చూడాలని, ఆ దిశగా యువ వైద్యులు అడుగు వేయాలని మానసిక వైద్యుల సంఘం జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ సవితా మల్హోత్రా పేర్కొన్నారు. రెండ్రోజులుగా అనంతపురం నగర శివారులోని ఓ కన్వెన్షన్ హాల్లో జరుగుతున్న జాతీయ స్థాయి మానసిక వైద్యుల నిరంతర వైద్య విద్యా సదస్సు ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా డాక్టర్ సవితా మల్హోత్రా మాట్లాడుతూ... చిన్నపాటి దగ్గు, జ్వరానికే గ్రామాల నుంచి ప్రజలు ఆస్పత్రులకు రావాలంటే సమయం తీసుకునే పరిస్థితి నెలకొని ఉందన్నారు. ఇలాంటి తరుణంలో మానసిక జబ్బుల తీవ్రతను వారు గుర్తించలేకపోతున్నారన్నారు. మానసిక జబ్బులపై గ్రామీణులను చైతన్య పరచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అనంతరం సదస్సుకు పెద్ద ఎత్తున వైద్యులు హాజరుకావడానికి కృషి చేసిన జిల్లా సైకియాట్రిక్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ యండ్లూరి ప్రభాకర్ను ఆమె అభినందించారు. యండ్లూరి ప్రభాకర్తో పాటు సీనియర్ వైద్యులను సన్మానించారు. కార్యక్రమానికి విశిష్ట అతిథిగా పి.శైలజ హాజరు కాగా, మానసిక వైద్య నిపుణులు డాక్టర్ టీపీ సుధాకర్, డాక్టర్ రమణరావు, డాక్టర్ జగదీష్, డాక్టర్ రఘురాం, డాక్టర్ వికాస్ మీనన్, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ లోకేశ్వరరెడ్డి, డాక్టర్ శరత్చంద్ర, డాక్టర్ రాధికారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. మానసిక వైద్యుల సంఘం జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ సవితా మల్హోత్రా -
సిలిండర్ డెలివరీపై అదనంగా వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో నార్పలలోని భారత్ గ్యాస్ ఏజెన్సీలో ఇన్చార్జ్ డీఎస్ఓ జగన్మోహన్ ఫిబ్రవరి 22న విచారణ నిర్వహించారు. ఆయన 17 మంది లబ్ధిదారులకు ఫోన్ చేయగా..నలుగురు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మిగిలిన 13 మందిలో
అనంతపురం అర్బన్: వంటగ్యాస్ వినియోగదారుల నుంచి డెలివరీబాయ్స్ అదనపు రుసుము వసూలు చేస్తున్నారు. సిలిండర్ నికర ధరపై అదనంగా డబ్బు వసూలు చేయరాదు. డెలివరీ బాయ్స్ మాత్రం ఇవన్నీ పట్టించుకోవడం లేదు. కంపెనీల నుంచి తగిన పైకం వస్తున్నప్పటికీ వినియోగదారుల నుంచి అక్రమంగా సరాసరి రూ.30 దాకా వసూలు చేస్తూనే ఉన్నారు. ఈ మొత్తం చూసేందుకు చిన్నదిగానే కనిపిస్తుంది. కానీ జిల్లావ్యాప్తంగా రోజువారీగా డెలివరీ అవుతున్న సిలిండర్లపై అదనపు వసూలు మొత్తం చూస్తే ఔరా అనక తప్పదు. జిల్లా వ్యాప్తంగా 50 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. వీటి పరిధిలో 7,65,246 గృహావసర వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. రోజువారీగా దాదాపు 12 వేల సిలిండర్లు డెలివరీ అవుతున్నాయి. ఒక్కొక్క సిలిండర్ నుంచి అదనంగా రూ.30 చొప్పున రోజుకు 3.60 లక్షలుగా నెలసరి రూ.1.08 కోట్లు అదనపు సొమ్ము వసూలు జరగుతోందంటే ‘కనెక్షన్ల’ డెలివరీలో వారి ‘కలెక్షన్’ ఎంత ‘స్ట్రాంగ్’ అనేది స్పష్టమవుతోంది. అదనపు బాదుడే బాదుడు.. గృహావసర వంట గ్యాస్ సిలిండర్ ధర ప్రస్తుతం రూ.870 ఉంది. అయితే సిలిండర్ఽ నికర ధరతో సంబంధం లేకుండా బిల్లుపై వినియోగదారుల నుంచి డెలివరీ బాయ్స్ రూ.30 అదనంగా వసూలు చేస్తున్నారు. కొందరి వద్ద నుంచి రూ.50 వరకు వసూలు చేస్తున్న సందర్భాలూ లేకపోలేదు. డెలివరీ బాయ్స్ అడిగినంత ఇవ్వకపోతే వినియోగదారులకు తిప్పలు తప్పడం లేదు. సిలిండర్ మంజూరైనా డెలివరీ చేయరు. ‘డోర్ లాక్’ అని చెప్పి ఏజెన్సీకి సిలిండర్ను వెనక్కిచ్చేస్తారు. ఇలా చేయడం వల్ల సిలిండర్ బుకింగ్ రద్దవుతుంది. దీంతో మరోమారు వినియోగదారు బుక్ చేయాలి. ఇలా రెండు మూడు దఫాలు ఇబ్బందికి గురిచేస్తారు. దీంతో ఈ తిప్పలు పడలేక వినియోగదారులు తప్పని పరిస్థితిలో సిలిండర్పై వారు అడిగిన అదనపు మొత్తాన్ని సమర్పించుకోవాల్సి వస్తోంది. గ్యాస్ డెలివరీ బాయ్స్ నిర్వాకం సిలిండర్పై ఆదనంగా రూ.30 వసూలు జిల్లాలో రోజూ 12 వేల సిలిండర్ల డెలివరీ ప్రతి నెలా అదనపు వసూళ్లు రూ.1.08 కోట్లు అదనంగా వసూలు చేస్తే చర్యలు నిబంధనల ప్రకారం సిలిండర్ నికర ధరపై అదనంగా వసూలు చేయకూడదు. ఇప్పటికే ఈ విషయంపై ఏజెన్సీల నిర్వాహకులకు స్పష్టమైన ఆదేశాలిచ్చాం. అధికారులను ఏజెన్సీలకు పంపించి తనిఖీ చేయిస్తున్నాం. అదనంగా వసూలు చేస్తున్న బాయ్స్పైన, సంబంధిత ఏజెన్సీపైనా చర్యలు తీసుకుంటాం. సిలిండర్ డెలివరీ క్రమంలో బాయ్స్ అదనంగా డబ్బులు వసూలుపై వినియోదారులు ఫిర్యాదు చేయాలి. – శివ్ నారాయణ్ శర్మ, జాయింట్ కలెక్టర్ -
పారదర్శకతకు పాతరేనా?
స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకోవడానికి యువత సబ్సిడీ రుణాల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. వివిధ కార్పొరేషన్ల కింద లోన్లు పొందడం కోసం వేల సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకతకు పాతరేసి సిఫార్సులు ఉన్నవారికే లోన్లు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. కూటమి పార్టీల నాయకులు పప్పుబెల్లాలు మాదిరి తలా ఇన్ని యూనిట్లు అని పంచుకుని.. అనుయాయులకు కట్టబెట్టేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.రాయదుర్గం: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసి అలసిపోయిన యువత కనీసం స్వయం ఉపాధి రంగంలోనైనా స్థిరపడదామనుకుంటున్నారు. ఇందుకు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తుండగా వివిధ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలకు నోటిఫికేషన్ వెలువడింది. రూ.75 వేల నుంచి రూ.2 లక్షల వరకు రాయితీ వర్తించేలా ఆయా కార్పొరేషన్లు ప్రకటించాయి. అంతే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తాయి.మొత్తం 2,297 యూనిట్లకు 22,943 దరఖాస్తులు ఆన్లైన్లో వచ్చాయి. ఇందులో బీసీ కార్పొరేషన్ ద్వారా 1,728 యూనిట్లకు 19,098, ఈబీసీ కింద 102 యూనిట్లకు 399, ఇక ఈడబ్ల్యూఎస్ పరిధిలో కమ్మ సామాజిక వర్గం వారికి 58 యూనిట్లకు 431, రెడ్డి సామాజిక వర్గం వారికి 29 యూనిట్లకు 339, వైశ్యుల్లో 21 యూనిట్లకు 338, బ్రాహ్మణుల్లో 14 యూనిట్లకు 81, క్షత్రియుల్లో 1 యూనిట్కు 0, కాపుల్లో 344 యూనిట్లకు 2,257 చొప్పున దరఖాస్తులు అందాయి. కులం, ఆదాయం, నేటివిటీ ధ్రువీకరణ పత్రాలు పొందడం నుంచి ఆన్లైన్ దరఖాస్తు వరకు ఒక్కో అభ్యర్థి రూ.500 నుంచి రూ.600 వెచ్చించారు.పైరవీలకే ప్రాధాన్యం!సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మండల స్థాయిలో ఎంపీడీఓ, బ్యాంకర్లు, మున్సిపాలిటీల్లో కమిషనర్, బ్యాంకర్ల సమక్షంలో ఫిబ్రవరి నెలలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇందులో షాడో ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్న కొందరు కూటమి నేతలు సబ్సిడీ రుణాల మంజూరులో చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. తమ అనుయాయులకే ఆ రుణాలు ఇప్పించేందుకు పైరవీలు సాగిస్తున్నారు.స్వల్ప యూనిట్లతో న్యాయం జరిగేదెలా..?యువతకు స్వయం ఉపాధి కల్పిస్తున్నామంటున్న కూటమి సర్కార్.. అందుకు తగినట్టుగా కృషి చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండలాల వారీగా జనాభాకు అనుగుణంగా రాయితీ రుణాలు కేటాయిస్తున్నట్టు ప్రకటించినా ఊరికి ఒక్కటి కూడా దక్కడం లేదు. జిల్లాలో ఏ మండలం, పట్టణం తీసుకున్నా 45 – 50 లోపే యూనిట్లు కేటాయించారు. దీన్నిబట్టిచూస్తే పదుల్లో యూనిట్లకు వేలల్లో దరఖాస్తులు వచ్చాయి. యూనిట్లు పెంచితే తప్ప అర్హులకు న్యాయం చేయలేని పరిస్థితి. -
విద్యుత్ శాఖలో డిప్యుటేషన్ల లీల
● శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం విద్యుత్ డివిజన్ పరిధిలోని చెన్నేకొత్తపల్లి సెక్షన్లో పని చేస్తున్న సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ సూర్యనారాయణ డిప్యుటేషన్పై అనంతపురం నగరంలోని బళ్లారి రోడ్డులో ఉన్న డీ5 సెక్షన్లో నాలుగు నెలలుగా పనిచేస్తున్నారు. ఇందుకు గాను అప్పట్లో అనంతపురం విద్యుత్ సర్కిల్లో పనిచేసిన ఓ ఎస్ఈని అన్ని విధాలుగా సంతృప్తి పరిచి ప్రసన్నం చేసుకున్నట్లుగా ఆరోపణలున్నాయి. ఈ కారణంగానే నిబంధనలకు విరుద్ధంగా ఆయనకు ఆగమేఘాలపై అనంతపురం జిల్లాకు డిప్యుటేషన్ ఆర్డర్ ఇచ్చేసినట్లుగా సొంత శాఖలోని ఉద్యోగులే చెబుతున్నారు. ఫలితంగా చెన్నేకొత్తపల్లి సెక్షన్లో ఎస్ఎల్ఐ కొరత వేధిస్తూ ఉంది. ● గుత్తి విద్యుత్ డివిజన్ పరిధిలో పనిచేస్తున్న ఓ లైన్మెన్, కళ్యాణదుర్గం డివిజన్లో పనిచేస్తున్న ఓ లైన్ ఇన్స్పెక్టర్, పుట్టపర్తిలో పనిచేస్తున్న ఓ ఫోర్మెన్ డిప్యుటేషన్పై నగరంలోకి వచ్చి దాదాపు 6 ఏళ్లు గడుస్తోంది. ఏటా ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకుంటూ అనంతపురం నగరంలోని వివిధ సెక్షన్లలో వారు కొనసాగుతుండడం గమనార్హం. అనంతపురం టౌన్: విద్యుత్ శాఖ అధికార యంత్రాంగం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. ఉద్యోగులకు అనాధికారికంగా డిప్యుటేషన్లు ఇస్తూ వారికి అనుకూలంగా ఉన్న ఉద్యోగులను నగరంలోకి తీసుకువచ్చేస్తున్నారు. ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాలను విద్యుత్ ఉద్యోగుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకున్న జిల్లా వ్యాప్తంగా 50మందికి పైగా క్షేత్రస్థాయి ఉద్యోగులు.. నిబంధనలకు విరుద్దంగా డిప్యుటేషన్పై అనంతపురంలోని వివిధ సెక్షన్లలో కొనసాగుతున్నారు. వీటితోపాటు సర్కిల్ కార్యాలయంలోనూ పదుల సంఖ్యలో ఉద్యోగులను అంతర్ జిల్లాల డిప్యుటేషన్లపై అనంతపురానికి రప్పించుకున్నారంటే ఉన్నతాధికారులు ఏ స్థాయిలో పైరవీలు సాగించారో అర్థమవుతోంది. వేధిస్తున్న ఉద్యోగుల కొరత.. విద్యుత్ శాఖలో అక్రమ డిప్యుటేషన్ల కారణంగా రూరల్ ప్రాంతాల్లో క్షేత్రస్థాయి విద్యుత్ ఉద్యోగుల కొరత తీవ్రంగా ఉంది. ప్రస్తుతం వేసవి కాలం ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సమస్యలు అధికంగా వేసవిలోనే ఉత్పన్నమవుతుంటాయి. ఇంతటి కీలకమైన సమయంలోనూ అధికారులు అక్కడ పోస్టులను భర్తీ చేయకుండా అనధికారికంగా డిప్యుటేషన్లను ఇచ్చేస్తూ ఉద్యోగులు కోరుకున్న ప్రాంతాలకు పంపించేస్తున్నారు. అనంతపురం నగర పరిధిలో ఆరు విద్యుత్ సెక్షన్లు ఉన్నాయి. వీటన్నింటిలోనూ దాదాపు 25 మందికి పైగా లైన్ ఇన్స్పెక్టర్లు, లైన్మెన్లు, ఫోరుమెన్లు, జూనియర్ లైన్మెన్లు డిప్యుటేషన్పై కొనసాగుతుండడం గమనార్హం. అక్రమ డిప్యుటేషన్ల అంశంలో ఉన్నతాధికారుల తీరుపై కొందరు ఉద్యోగులు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. రద్దు చేస్తాం విద్యుత్ శాఖలో డిప్యుటేషన్ అనే విధానమే లేదు. అయితే దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న ఉద్యోగులకు వైద్యుల సూచన మేరకు డిప్యుటేషన్ ఇచ్చేందుకు అవకాశం ఉంది. డిప్యుటేషన్లపై పదుల సంఖ్యలో నగరంలో తిష్ట వేసిన ఉద్యోగులపై విచారణ చేపట్టి వారి డిప్యుటేషన్లను రద్దు చేస్తాం. వారిని పాత స్థానాల్లోకి వెళ్లేలా రెండు మూడు రోజుల్లో చర్యలు తీసుకుంటాం. – శేషాద్రి శేఖర్, విద్యుత్శాఖ ఎస్ఈ, అనంతపురం కొన్నేళ్లుగా నగరంలోనే తిష్ట 50 మందికి పైగా ఉద్యోగులు వివిధ సెక్షన్లలో పాగా రూరల్ ప్రాంతాలను వేధిస్తున్న ఉద్యోగుల కొరత -
చంద్రబాబు నిజ స్వరూపం ఇదే
అనంతపురం ఎడ్యుకేషన్: ‘పేదలపై సీఎం చంద్రబాబుకు ఉన్న వైఖరి మరోసారి బయటపడింది. ఆయన నిజస్వరూపం ఇదే’ అంటూ రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భయం, పక్షపాతం లేకుండా, రాగద్వేషాలకు అతీతంగా ప్రజలందరికీ న్యాయం చేస్తానని శాసనసభ్యుడిగా ప్రమాణం చేసిన చంద్రబాబు... ఈ రోజు వైఎస్సార్సీపీ సానుభూతిపరులు, కార్యకర్తలకు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కాని ఎలాంటి పనులు చేయబోమంటూ తెగేసి చెపుతుండడం దుర్మార్గమన్నారు. ఇప్పటి వరకూ ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఎంతోకొంత జవాబుదారీతనంతో వ్యవహరిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ప్రయత్నాలు చేశారన్నారు. అయితే ప్రజలతో కాకుండా జనసేన, బీజేపీ, ఈవీఎంఓలతో పొత్తు పెట్టుకుని గెలిచిన చంద్రబాబుకు ప్రజలంటే లెక్కలేని తనమని, అందుకే ప్రజలను ధిక్కరించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ భృతి అందక 9 నెలలుగా నిరుద్యోగులు నానా పాట్లు పడుతున్నా ప్రభుత్వంలో కనీస స్పందన కూడా లేదన్నారు. 18 ఏళ్లు నిండిన అక్కచెల్లెమ్మలకు ప్రతినెలా రూ.1,500 ఇస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పాపాన పోలేదన్నారు. డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు రూ. 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని, 50 ఏళ్లు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పింఛన్లు ఇస్తామని చెప్పి బడ్జెట్లో రూపాయి కూడా కేటాయించలేదన్నారు. కులం, మతం, పార్టీలను ఏనాడూ జగనన్న చూడలేదన్నారు. కేవలం పేదరికం ప్రామాణికంగా చేసుకుని అందరికీ సంక్షేమ ఫలాలు అందజేశారన్నారు. జగన్ అప్పులు చేస్తున్నారని, రాష్ట్రాన్ని మరో శ్రీలంకగా మారుస్తున్నారంటూ నాడు మొసలి కన్నీరు కార్చిన చంద్రబాబు ప్రస్తుతం చేస్తున్నదేమిటో చెప్పాలన్నారు. 2023–24లో జగనన్న రూ.79 వేల కోట్లు అప్పులు తెస్తే.. 2024–25కు గాను రూ.98వేల కోట్ల అప్పులు తీసుకురావాలని చెప్పి రూ.1.31 లక్షల కోట్ల అప్పులను చంద్రబాబు తీసుకువచ్చారని తెలిపారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.1.14 లక్షల కోట్లు అప్పులు తీసుకురావాలని చెప్పి రూ.1.50 లక్షల కోట్లు తెస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజల నెత్తిన అప్పుల భారం మోపి సంక్షేమ పథకాలకు ఎగనామం పెడుతున్నారని ధ్వజమెత్తారు. తల్లికి వందనం పథకానికి రూ. 12 వేల కోట్లు అవసరం కాగా రూ. 9,400 కోట్లు బడ్జెట్లో కేటాయించారని, అన్నదాత సుఖీభవకు రూ. 12 వేల కోట్లు అవసరం కాగా రూ. 6,300 కోట్లు మాత్రమే కేటాయించారు. అరకొర నిధుల కేటాయింపులు చూస్తుంటే సగానికి పైగా లబ్ధిదారులను మోసం చేసే కుట్ర బహిర్గతమవుతోందన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలెవరూ కూటమి ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూడడం లేదన్నారు. తామంతా జగనన్న వెంటే ఉంటామని, జనంతోనే ఉంటామని, కాదూకూడదని జైల్లో పెట్టినా సంతోషంగా అక్కడే ఉంటామన్నారు. ఈ నిరంకుశ పాలనకు త్వరలో చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. సమావేశంలో మీనుగ నాగరాజు, ఆత్మకూరు వైస్ ఎంపీపీ విజయ్కుమార్, నవీన్ పాల్గొన్నారు. పేదల సంక్షేమానికి ఎగనామం పెట్టనున్నారు వైఎస్సార్సీపీ శ్రేణులే లక్ష్యంగా కుట్ర ఇందులో భాగంగానే ప్రజలను ఽధిక్కరించి మాట్లాడుతున్నారు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి -
బీజేపీ నేతల బాహాబాహీ
ఉరవకొండ: జిల్లా బీజేపీ నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అందరి సమక్షంలోనే నువ్వేంత అంటే నువ్వేంత అంటూ ఒకరిపై ఒకరు మాటల యుద్దానికి దిగారు. ఒకానొక దశలో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసి కొట్టుకునే స్థాయికి వెళ్లింది. వివరాలు.. పీఎం విశ్వకర్మ కింద ఎంపికై న లబ్ధిదారులకు ఉరవకొండలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఏర్పాటు చేశారు. శిక్షణా కేంద్రం పర్యవేక్షణ బాధ్యతలను బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు కట్టుబడి సురేష్ తీసుకోగా, తనిఖీ చేయడానికి ఆదివారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్తో పాటు ముఖ్యనేతలూ వచ్చారు. ఈ సందర్భంగా వారికి శిక్షణలో తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను లబ్ధిదారులు వివరించారు. దీనిపై రాజేష్ మాట్లాడుతూ.. కనీస వసతులు కల్పించలేదని, నాణ్యమైన భోజనం కూడా అందించకపోతే ఎలా అంటూ నిర్వాహకులను నిలదీశారు. అక్కడే ఉన్న సురేష్ వెంటనే వాగ్వాదానికి దిగడంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. ఒకరినొకరు కొట్టుకునే పరిస్థితి నెలకొనడంతో కొందరు బీజేపీ నేతలు కల్పించుకుని ఇరువర్గాలను పక్కకు తీసుకెళ్లారు. ఘటనపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నట్లు రాజేష్ తెలిపారు. -
పారదర్శకతకు పాతరేనా?
రాయదుర్గం: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసి అలసిపోయిన యువత కనీసం స్వయం ఉపాధి రంగంలోనైనా స్థిరపడదామనుకుంటున్నారు. ఇందుకు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తుండగా వివిధ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలకు నోటిఫికేషన్ వెలువడింది. రూ.75 వేల నుంచి రూ.2 లక్షల వరకు రాయితీ వర్తించేలా ఆయా కార్పొరేషన్లు ప్రకటించాయి. అంతే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తాయి. మొత్తం 2,297 యూనిట్లకు 22,943 దరఖాస్తులు ఆన్లైన్లో వచ్చాయి. ఇందులో బీసీ కార్పొరేషన్ ద్వారా 1,728 యూనిట్లకు 19,098, ఈబీసీ కింద 102 యూనిట్లకు 399, ఇక ఈడబ్ల్యూఎస్ పరిధిలో కమ్మ సామాజిక వర్గం వారికి 58 యూనిట్లకు 431, రెడ్డి సామాజిక వర్గం వారికి 29 యూనిట్లకు 339, వైశ్యుల్లో 21 యూనిట్లకు 338, బ్రాహ్మణుల్లో 14 యూనిట్లకు 81, క్షత్రియుల్లో 1 యూనిట్కు 0, కాపుల్లో 344 యూనిట్లకు 2,257 చొప్పున దరఖాస్తులు అందాయి. కులం, ఆదాయం, నేటివిటీ ధ్రువీకరణ పత్రాలు పొందడం నుంచి ఆన్లైన్ దరఖాస్తు వరకు ఒక్కో అభ్యర్థి రూ.500 నుంచి రూ.600 వెచ్చించారు. పైరవీలకే ప్రాధాన్యం! సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మండల స్థాయిలో ఎంపీడీఓ, బ్యాంకర్లు, మున్సిపాలిటీల్లో కమిషనర్, బ్యాంకర్ల సమక్షంలో ఫిబ్రవరి నెలలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇందులో షాడో ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్న కొందరు కూటమి నేతలు సబ్సిడీ రుణాల మంజూరులో చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. తమ అనుయాయులకే ఆ రుణాలు ఇప్పించేందుకు పైరవీలు సాగిస్తున్నారు. స్వల్ప యూనిట్లతో న్యాయం జరిగేదెలా..? యువతకు స్వయం ఉపాధి కల్పిస్తున్నామంటున్న కూటమి సర్కార్.. అందుకు తగినట్టుగా కృషి చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండలాల వారీగా జనాభాకు అనుగుణంగా రాయితీ రుణాలు కేటాయిస్తున్నట్టు ప్రకటించినా ఊరికి ఒక్కటి కూడా దక్కడం లేదు. జిల్లాలో ఏ మండలం, పట్టణం తీసుకున్నా 45 – 50 లోపే యూనిట్లు కేటాయించారు. దీన్నిబట్టిచూస్తే పదుల్లో యూనిట్లకు వేలల్లో దరఖాస్తులు వచ్చాయి. యూనిట్లు పెంచితే తప్ప అర్హులకు న్యాయం చేయలేని పరిస్థితి.స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకోవడానికి యువత సబ్సిడీ రుణాల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. వివిధ కార్పొరేషన్ల కింద లోన్లు పొందడం కోసం వేల సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకతకు పాతరేసి సిఫార్సులు ఉన్నవారికే లోన్లు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. కూటమి పార్టీల నాయకులు పప్పుబెల్లాలు మాదిరి తలా ఇన్ని యూనిట్లు అని పంచుకుని.. అనుయాయులకు కట్టబెట్టేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. చక్రం తిప్పుతున్న కూటమి నేతలు సిఫార్సులకే కార్పొరేషన్ సబ్సిడీ రుణాలు! వేయికళ్లతో ఎదురుచూస్తున్న దరఖాస్తుదారులు -
జూదరుల అరెస్ట్
తాడిపత్రి రూరల్: మండలంలోని చుక్కలూరు సమీపంలో పేకాట ఆడుతున్న 10 మందిని అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.60 వేలు నగదు, 10 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ శివగంగాధరరెడ్డి తెలిపారు. అందిన సమాచారం మేరకు పట్టణ, రూరల్ ఎస్ఐలు గౌస్, ధరణీబాబులు సిబ్బందితో కలసి ఆదివారం తనిఖీలు చేపట్టి జూదరులను అరెస్ట్ చేసినట్లు వివరించారు. పట్టపగలే ఎలుగుబంటి సంచారం రాయదుర్గం టౌన్: స్థానిక గ్యాస్ గోదాము ప్రాంతంలోని కురాకుల గుట్ట వద్ద పట్టపగలే ఎలుగుబంటి సంచారంతో కాలనీ వాసులు బెంబేలెత్తిపోయారు. ఆదివారం సాయంత్రం ఓ ఎలుగుబంటి కురాకులగుట్ట వైపు నుంచి జాతీయ రహదారి బ్రిడ్జిని దాటింది. రోడ్డుపై వెళుతున్న ఎలుగుబంటిని కొందరు తమ సెల్ఫోన్లలో వీడియో తీసి వైరల్ చేశారు. రెండు రోజులుగా ఈ ప్రాంతంలో ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు కాలనీవాసులు చెబుతున్నారు. ఇప్పటికై నా అటవీశాఖ అధికారులు స్పందించి ఎలుగుబంటిని బంధించాలని స్థానికులు కోరుతున్నారు. తొలి పూజలందుకున్న పోతలయ్య స్వామి కనగానపల్లి: మండలంలోని దాదులూరు గ్రామంలో పోతలయ్య స్వామి జాతర ఆదివారం భక్తుల కోలాహలం మధ్య ప్రారంభమైంది. తొలి రోజు వేకువజామునే గంతిమర్రి, కలికివాండ్లపల్లి గ్రామాల నుంచి భక్తులు ఎలవగంపలో స్వామి ఆభరణాలు, పూలను ఊరేగింపుగా తీసుకు వచ్చారు. ఆలయంలో విశేష పూజల అనంతరం మూలవిరాట్ను ఆభరణాలతో అలంకరించారు. అలాగే చెన్నకేశవస్వామి ఆలయంలోనూ ప్రత్యేక పూజలు చేసి స్వామి కాపులు దాసంగాలు (పంక్తి భోజనాలు) నిర్వహించారు. నేడు జ్యోతుల మహోత్సవం: జాతరలో భాగంగా సోమవారం పోతలయ్య స్వామికి జ్యోతుల మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ కమిటీ సభ్యులు ఆదివారం తెలిపారు. కీలకమైన గావుల మహోత్సవాన్ని మంగళవారం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. -
అరటి నాణ్యతపై ఆరా
అనంతపురం అగ్రికల్చర్/ రాప్తాడు/ తాడిపత్రి రూరల్: అరటి నాణ్యత పరిశీలనకు ఆదివారం జిల్లాకు వచ్చిన ఇంగ్లండ్కు చెందిన ఫెయిర్ట్రాసా ఆర్గనైజేషన్ కంపెనీ ఫౌండర్ కమ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పాత్రిక్ స్ట్రబై వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. ఉద్యానశాఖ కమిషనరేట్ జేడీ డాక్టర్ దేవమునిరెడ్డి, జిల్లా డీడీ బీఎంవీ నరసింహారావు తదితరులతో కలిసి మొదట రాప్తాడు మండలం రామినేపల్లి వద్ద ఉన్న ఎలైట్ టిష్యూ కల్చర్ బనానా ల్యాబ్ను సందర్శించారు. అందులో ఉత్పత్తి అవుతున్న నాణ్యమైన రోగ రహితమైన టిష్యూకల్చర్ అరటి మొక్కల గురించి ల్యాబ్ ఎండీ రాఘవేంద్రను అడిగి తెలుసుకున్నారు. తర్వాత పుట్లూరు మండలం కడవకల్లు గ్రామంలో ఎస్కే బనానా కంపెనీ ఆధ్వర్యంలో తోటల నుంచి అరటి గెలలు సేకరిస్తున్న విధానం గురించి ఆరా తీశారు. అక్కడి నుంచి తాడిపత్రి మండలం చుక్కలూరులో కోల్డ్స్టోరేజీని సందర్శించారు, అక్కడే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి ఇంగ్లండ్ ప్రతినిధితో మాట్లాడారు. అరటి నాణ్యత, ఉత్పత్తి గురించి వివరించారు. కార్యక్రమంలో ఉద్యానశాఖ అధికారులు రత్నకుమార్, శైలజ, ఉమాదేవి, ఎస్కే బనానా కంపెనీ ప్రతినిధి నరసింహారెడ్డి, గ్రీన్ట్రాఫిక్ కంపెనీ ప్రతినిధి రామోజీ, నోవా కంపెనీ ప్రతినిధి ప్రసాదరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నీటికుంటలో పడి చిన్నారి మృతి
తాడిపత్రి రూరల్: మండలంలోని చుక్కలూరు సమీపంలోని నల్లబండల యూనిట్కు చెందిన నీటి కుంటలో పడి మూడేళ్ల చిన్నారి మృతిచెందాడు. వివరాలు... పామిడికి చెందిన గంగారాజు, తన కుటుంబసభ్యులతో కలసి బండల పాలీసు యూనిట్లో పనిచేస్తున్న చెల్లెలు ఇంటికి ఇటీవల వచ్చాడు. ఈ నేపథ్యంలో యూనిట్ వద్ద ఇన్ఫిల్స్ట్రేషన్ గుంత వద్ద అడుకుంటున్న గంగరాజు కుమారుడు గౌతమ్నందా (3) ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. ఆలస్యంగా విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు గుంతలో పడిన చిన్నారిని వెలికి తీసి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు నిర్ధారించారు. -
నేడు కలెక్టరేట్లోనే గ్రీవెన్స్
అనంతపురం అర్బన్: ప్రజాసమస్యల పరిష్కార వేదిక (ఫిర్యాదుల స్వీకరణ) కార్యక్రమం సోమవారం కలెక్టరేట్లోనే నిర్వహించనున్నట్లు కలెక్టర్ వి.వినోద్కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ముందుగా ప్రకటించిన విధంగా రాప్తాడు నియోజకవర్గ కేంద్రంలో రద్దు చేశామని పేర్కొన్నారు. ఎప్పటిలాగానే కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో కార్యక్రమం ఉంటుందని, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. ఆరోపణల అధికారికి అందలం? ● గుత్తి డీవైఈఓ సీటులో కూర్చోబెట్టేందుకు పావులు అనంతపురం ఎడ్యుకేషన్: విద్యాశాఖలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారికి అందలం ఎక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 28న గుత్తి డీవైఈఓ రిటైరయ్యారు. పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని ఆ పోస్టులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. విద్యాశాఖలో కీలకమైన పోస్టులో పని చేసిన ఆయన పూర్వపు డీఈఓ వరలక్ష్మి ఇక్కడ జాయిన్కాకముందే ఆమె పేరుతో ప్రశ్నపత్రాల ముద్రణ పేరిట నిధులు డ్రా చేశారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. దీనిపై రాష్ట్ర అధికారులు దృష్టి సారించారు. ప్రాథమిక విద్య ఆర్జేడీ ప్రత్యేక బృందంతో విచారణ జరిపించారు. విచారణ అనంతరం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆయనను ఆ సీటు నుంచి తప్పించారు. సదరు అధికారి హయాంలోనే అలసత్వం కారణంగా నేషనల్ అసెస్మెంట్ సర్వే నిర్వహణ నిధులు దాదాపు రూ. 20 లక్షలకు పైగా వెనక్కుపోయాయి. వేళకు బిల్లులు పెట్టకపోవడం, సంబంధిత అధికారులతో అఫ్రూవల్ చేయించడంలో అలసత్వమే కొంప ముంచింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఈ నిధులు డ్రా చేసుకున్నారు. ఇక్కడ మాత్రం వెనక్కుపోయిన నిధులు నేటికీ రాలేదు. పావులు కదుపుతున్న అధికారి.. అవినీతి ఆరోపణలతో పాటు విధుల పట్ల తీవ్ర అలసత్వం ప్రదర్శించే సదరు అధికారిని గుత్తి డీవైఈఓ పోస్టులో కూర్చోబెట్టేందుకు విద్యాశాఖలోని ఓ అధికారి పావులు కదుపుతున్నారు. సీనియార్టీ వరుసలో ముందుగా ఉన్నారనే కారణంగా ఆయనను కీలకమైన డీవైఈఓ పోస్టులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారికి వంత పాడుతున్న వైనాన్ని చూసి డీఈఓ కార్యాలయ సిబ్బంది, పలువురు ఎంఈఓలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఇప్పటికే కొందరు ఉపాధ్యాయ సంఘాల నాయకులు విద్యాశాఖ కమిషనర్, ఆర్జేడీ దృష్టికి తీసుకెళ్లారు. మరి ఉన్నతాధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. పట్టు చీరల డిజైనర్కు రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానంధర్మవరం: రాష్ట్రపతి భవన్ నుంచి ధర్మవరం పట్టుచీరల డిజైనర్ జుజారు నాగరాజుకు ఆహ్వానం అందింది. కేంద్ర ప్రభుత్వం చేనేతకు ప్రోత్సాహం కల్పించేందుకు అమృత్ మహోత్సవంలో భాగంగా ధర్మవరం పట్టుచీరల ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు నాగరాజు తెలిపారు. రాష్ట్రపతి భవన్లో నిర్వహించే ఎక్స్పోలో పాల్గొనాలని తనను ఆహ్వానించారన్నారు. -
దూసుకొచ్చిన మృత్యువు
‘నాన్నా.. అమ్మ ఎప్పుడొస్తుంది? నాకు లడ్డూ తెస్తోందా?’ అంటూ సరస్వతి రెండేళ్ల కుమార్తె జ్యోత్స్న అమాయకపు మాటలు విన్న ప్రతి ఒక్కరి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. మర్తాడు నుంచి ఒడిబియ్యం పోసుకుని తోబుట్టువులతో కలిసి రాయంపల్లిలోని మెట్టినింటికి వస్తున్న సరస్వతి రోడ్డు ప్రమాదంలో తన నాలుగు నెలల కూతురుతో పాటు మృతి చెందింది. వంటమాస్టర్ అయిన సతీష్ కాన్పు కోసం భార్య సరస్వతిని పుట్టింటికి పంపి.. పెద్ద కుమార్తె జ్యోత్స్నను తానే చూసుకునేవాడు. ఈ క్రమంలో ఆదివారం కుమార్తెను బంధువుల వద్ద ఉంచి కర్ణాటకలోని చేళ్లగురికిలో వంట పనికి వెళ్లాడు. ఇంటికి తిరిగొచ్చిన తర్వాత ‘ఈరోజు మీ అమ్మ, బుజ్జి పాప వస్తారు. నీకు లడ్డూ కూడా తెస్తారు’ అని కుమార్తెతో చెప్పాడు. అంతలోనే భార్య, చిన్నకుమార్తె మృతి చెందారన్న వార్తతో ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. తన రెండేళ్ల కుమార్తె ‘నాన్నా.. అమ్మ ఎక్కడ? నాకు లడ్డూ కావాలి’ అంటూ అమాయకంగా అడగడంతో ఏం సమాధానం చెప్పాలో తెలియక సతీష్ కన్నీరు మున్నీరుగా విలపించాడు. కూడేరు/ఉరవకొండ/గార్లదిన్నె: గార్లదిన్నె మండలం మర్తాడుకు చెందిన జంగం పార్వతమ్మ, బసవరాజు (లేట్) దంపతులకు లీలావతి(45), పుష్పావతి, యోగేశ్వరి(40), సరస్వతి(37) సంతానం. పెద్ద కుమార్తె లీలావతికి కళ్యాణదుర్గం మండలం అప్పిలేపల్లికి చెందిన శ్రీకంఠంతో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు అచ్యుత్ కుమార్ ఉన్నాడు. మణికంఠ అనంతపురం శివారులోని వడియం పేట ఆంజనేయస్వామి ఆలయంలో అర్చకుడిగా పని చేస్తూ అక్కడే జీవనం సాగిస్తున్నారు. రెండో కుమార్తె కుషావతికి వివాహమై మర్తాడులోనే ఉంటున్నారు. మూడో కుమార్తె యోగేశ్వరికి కళ్యాణదుర్గం మండలం పూలంపల్లికి చెందిన రుద్రేశ్వర్తో వివాహమైంది. వీరికి ఒక కూతురు ఉంది. యోగేశ్వరి ఇటీవల పుట్టింటికి వచ్చింది. ఇక చిన్న కుమార్తె సరస్వతికి ఉరవకొండ మండలం రాయంపల్లికి చెందిన సతీష్తో వివాహమైంది. ఈమె రెండో కాన్పు కోసం పుట్టింటికి వచ్చింది. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సరస్వతికి ఆదివారం మధ్యాహ్నం పుట్టింట్లో ఒడిబియ్యం పెట్టిన అనంతరం అత్తారింటిలో వదిలి పెట్టేందుకు అక్కలు లీలావతి, యోగేశ్వరి, లీలావతి కుమారుడు అచ్యుత్కుమార్తో కలిసి ఆటోలో మర్తాడు నుంచి కోటంక మీదుగా రాయంపల్లికి బయల్దేరారు. ఇదిలా ఉండగా.. కళ్యాణదుర్గం, అనంతపురానికి చెందిన తరుణ్, యశ్వంత్, రంజిత్, మరో ఇద్దరు యువతులు పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని కారులో అనంతపురం వస్తున్నారు. కూడేరు మండలం బ్రాహ్మణపల్లి – కమ్మూరు మధ్య మలుపు వద్ద కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఆటోను వేగంగా ఢీకొంది. దీంతో ఆటో, కారు ముందు భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. ఆటోలో ఉన్న సరస్వతి తలకు, ముఖానికి బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. యోగేశ్వరి, లీలావతి, చంటి పాప, అచ్యుత్ కుమార్తో పాటు ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. కారులో ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో అందులోని వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. 108కి సమాచారం ఇచ్చినా.. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు 108కు సమాచారం ఇచ్చినా అంబులెన్స్ సకాలంలో రాలేదు. కొద్దిసేపటి తర్వాత సీఐ రాజు తన సిబ్బందితో సంఘటన స్థలికి చేరుకుని క్షతగాత్రులను ప్రైవేటు వాహనాల్లో అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కొద్దిసేపటి తర్వాత చంటి పాప, లీలావతి, యోగేశ్వరి మృతి చెందారు. అచ్యుత్ కుమార్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానికంగా ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మరణవార్త తెలియగానే ఆ ముగ్గురి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి వద్దకు చేరుకుని.. భగవంతుడా ఎంత పని చేశావవయ్యా అంటూ కన్నీరు మున్నీరయ్యారు. పెద్ద కుమార్తె జ్యోత్స్న రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం మృతుల్లో ముగ్గురు అక్కాచెల్లెళ్లు, ఒక చంటిపాప ఒడి బియ్యంతో మెట్టినింటికి వెళుతుండగా ఘటన ప్రసవమైన నాలుగు నెలల తర్వాత పుట్టింట్లో ఒడిబియ్యం పెట్టించుకున్న ఆమె.. అక్కలను తోడుగా తీసుకుని అత్తారింటికి ఆటోలో బయల్దేరింది. చంటిబిడ్డను ముద్దాడుకుంటూ.. కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా వెళుతున్న సమయంలో రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. కూడేరు మండలం బ్రాహ్మణపల్లి – కమ్మూరు మధ్య ఆదివారం ఆటోను కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు, నాలుగు నెలల చంటి పాప దుర్మరణం చెందారు. ఈ ఘటనతో మూడు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. -
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు దుర్మరణం
సాక్షి,అనంతపురం: పుట్టింట్లో ఒడి బియ్యం పెట్టుకుని తిరిగి అత్తారింటికి వెళ్తుండగా ముగ్గురు అక్కాచెల్లెళ్లను,వారి సంతానాన్ని మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబళించింది. అనంతపురం జిల్లా మండలం కమ్మూరు వద్ద ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కా చెల్లెళ్లు, మూడు నెలల కూతురుతో సహా మొత్తం నలుగురు దుర్మరణం పాలయ్యారు. రాయంపల్లికి చెందిన సరస్వతి తన అక్కా చెల్లెళ్లతో కలిసి అనంతపురం వద్ద ఉన్న మార్తాడు గ్రామంలో పుట్టింట్లో ఒడి బియ్యం పెట్టుకుని తిరిగి అత్తారింటికి ప్రయాణమైంది. తిరుగు ప్రయాణంలో బళ్లారి వైపు నుండి అనంతపురంకు వెళ్తున్న కారు.. ఎదురుగా ఉన్న ఆటోను డీకొట్టింది. ఈ ప్రమాదంలో సర్వసతితో పాటు ఆమె మూడునెలల కుమార్తె విద్య శ్రీ అక్కడికక్కడే కన్నుమూశారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.ఘోర రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నీలమ్మ, యోగేశ్వరి మృతి చెందారు. మృతులు ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన అక్క చెల్లెళ్లు కావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.