Nandyala
-
కుంభోత్సవానికి కొబ్బరికాయల సమర్పణ
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబాదేవి అమ్మవారికి వచ్చే నెల 15వ తేదీన కుంభోత్సవం నిర్వహించనున్నా రు. అమ్మవారికి సాత్వికబలి నిర్వహించేందుకు కొబ్బరికాయలు, గుమ్మడికాయలు, నిమ్మకాయలు మొదలైనవి సమర్పిస్తారు. కుంభోత్సవం రోజున సీ్త్ర వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభహారతి సమర్పించడం ప్రధాన ఘట్టం. కాగా ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసిన వెంటనే ప్రతి మంగళవారం, శుక్ర వారం రోజుల్లో అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పించడం అనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో ఆలయ ఉద్యోగి మంగళవారం కొబ్బరికాయలు సమర్పించారు. అమ్మవారి ఆలయ ప్రదక్షిణ మండపంలో కొబ్బరికాయలను రాశిగా పోసి, పసుపు, కుంకుమలతో వాటికి పూజాలు జరిపారు. అనంతరం అమ్మవారికి కొబ్బరికాయలను సమర్పించారు. చౌడేశ్వరిదేవి హుండీ ఆదాయం రూ. 25.93 లక్షలు బనగానపల్లె రూరల్: నందవరం గ్రామంలో వెలసిన శ్రీ చౌడేశ్వరిదేవి ఆలయ హుండీ లెక్కింపు ద్వారా రూ.25.93 లక్షల ఆదాయం లభించింది. గత ఏడాది నవంబర్ నుంచి ఇప్ప టి వరకు భక్తులు సమర్పించిన కానుకలను మంగళవారం లెక్కించారు. రూ.25,93,789 నగదు, 37.25 గ్రాముల బంగారు, కిలోన్నర వెండి వచ్చిందని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కామేశ్వరమ్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్యవేక్షణాధికారి హరిశ్చంద్రారెడ్డి, ఏపీజీబీ బ్యాంకు సిబ్బంది, ఆళ్లగడ్డ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. 660 మంది విద్యార్థులు గైర్హాజరు నంద్యాల(న్యూటౌన్): జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షలకు 660 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. 53 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు జనరల్ విద్యార్థులు 15,110 మందికి గాను 14,563 మంది విద్యార్థులు హాజరు కాగా 547 మంది గైర్హాజరయ్యారు. అలాగే ఒకేషనల్ పరీక్షకు 1,494 మందికి గాను 1,381 మంది హాజరు కాగా 113 మంది గైర్హాజరయ్యారు. మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్గా రంగనాథరావు కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్గా వి.వి.రంగనాథరావు నియమితులయ్యారు. ఈయన నెల్లూరు జిల్లాలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఇటీవలనే ప్రభుత్వం డిప్యూటీ డైరెక్టర్గా పదోన్నతి కల్పించి కర్నూలుకు బదిలీ చేసింది. నంద్యాల లో అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేస్తున్న శ్యామల కర్నూలులో మూడేళ్లకుపైగా పూర్తి అదనపు బాధ్యతలతో జేడీగా పనిచేశారు. జిల్లా విభజన తర్వాత ఎఫ్ఏసీపై ఇక్కడే డీడీగా పనిచేస్తున్నారు. కర్నూలు డీడీ పోస్టు ఖాళీగా ఉండటంతో ఈ స్థానంలో రంగనాథరావును నియమి స్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈయన రెండు, మూడు రోజుల్లో బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతవరకు ఇక్కడ జేడీ, డీడీ హోదాలో పనిచేసిన శ్యామల నంద్యాలలో ఏడీగానే కొనసాగనున్నారు. -
ఎమ్మెల్యే చెబితేనే కమిటీలో స్థానం
● తేల్చి చెప్పిన వాటర్షెడ్ అధికారిణి ● వాగ్వాదానికి దిగిన యాపదిన్నె సర్పంచ్ డోన్: వాటర్షెడ్ పనుల్లో రాజకీయ జోక్యం పెరిగిపోతుంది. కోట్లాది రూపాయల పనులను పారదర్శకంగా చేపట్టేందుకు ఏర్పాటు చేయాల్సిన కమిటీల్లో ఎమ్మెల్యే సూచించిన వారికే ప్రాధాన్యత ఉంటుందని ఏకంగా అధికారులు చెబుతుండటం గమనార్హం. ఈ విషయంలో మంగళవారం డోన్ ఎంపీడీఓ కార్యాలయంలో వాటర్షెడ్ అధికారిణి విజేత, యాపదిన్నె సర్పంచ్ రామిరెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వాటర్ షెడ్ కమిటీలో టీడీపీ కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయాల గురించి తాము అమరావతికి వెళ్లి లిఖితపూర్వకంగా సీఎం చంద్రబాబునాయుడుకు ఫిర్యాదు చేశామన్నారు. పార్టీని నమ్ముకుని తాము అన్నివిధాలా నష్టపోయామని, సర్పంచ్ ఎన్నికల్లో గెలిచి పేరు నిలబెడితే తమను ప్రజల ముందు హేళన చేయడం ఏమిటని ప్రశ్నించారు. దీంతో కొందరు అధికారులు జోక్యం చేసుకొని ఏదైనా ఉంటే ఎమ్మెల్యేతో మాట్లాడుకోవాలని సర్దిచెప్పి పంపడం గమనార్హం. అయితే తన పట్ల అమర్యాదగా మాట్లాడిన సర్పంచ్పై కలెక్టర్, డ్వామా పీడీకి ఫిర్యాదు చేస్తున్నట్లు వాటర్షెడ్ అధికారిణి విజేత తెలిపారు. -
గృహ నిర్మాణాలకు అదనపు సాయం
● ఎస్సీలు, బీసీలకు రూ.50 వేల చొప్పున, ఎస్టీలకు రూ. 75 వేలు ● గృహ నిర్మాణాల ప్రగతిపై సమీక్షంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల: జిల్లాలో అసంపూర్తి ఇళ్ల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గృహ నిర్మాణాల ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, బీసీ, ఎస్టీ, పీవీటీజీలకు గృహాలు మంజూరై నిర్మాణాలు వివిధ దశల్లో ఉంటే వాటిని పూర్తి చేయడానికి అదనపు ఆర్థిక సహాయం అందించేందుకు అనుమతిస్తూ జీఓఆర్టీ నంబర్ 9 ద్వారా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ప్రస్తుత యూనిట్ విలువ రూ.1.80 లక్షలకు అదనంగా ఎస్సీ, బీసీలకు రూ. 50 వేల చొప్పున, ఎస్టీలకు రూ.75 వేలు, పీవీటీజీలకు రూ.లక్ష చొప్పున అదనపు సాయం అందిస్తున్నట్లు తెలిపారు. దీంతో పాటు స్వయం సహాయక సంఘాల సభ్యులు రూ.35 వేల నుంచి రూ.లక్ష వరకు రుణం పొందవచ్చన్నారు. ప్రజా ప్రతినిధులకు కూడా ఈ అంశాన్ని తెలియజేసి విస్తృత ప్రచారం చేయాలని కలెక్టర్ ఎంపీడీఓలను, హౌసింగ్ ఏఈలకు సూచించారు. జిల్లాలో మే నెలాఖరు నాటికి 7,069 గృహాలు పూర్తి చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న 17,347 పొజిషన్ సర్టిఫికెట్ల జారీకి సంబంధించి తహసీల్దార్లతో మాట్లాడి క్లియర్ చేసుకోవాలన్నారు. పీఎం జన్మన్ కింద ఆత్మకూరు, ఆళ్లగడ్డ, నందికొట్కూరు, పాణ్యంలోని చెంచుగూడేలో 527 గృహాలు నిర్మించాల్సి ఉందని అందుకు యూనిట్ విలువ రూ.2.29 లక్షలకు అదనంగా మరో రూ.లక్ష సాయం అందుతుందన్నారు. పూర్తి చేసిన నిర్మాణాలకు సంబంధించిన బిల్లులను ఎప్పటికప్పుడు జనరేట్ చేస్తే చెల్లింపులు జరుగుతాయన్నారు. సమావేశంలో హౌసింగ్ ఈఈ హరిహర గోపాల్, డ్వామా పీడీ వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు. -
నల్లమలలో కార్చిచ్చు
కొత్తపల్లి: ముసలిమడుగు సమీపంలో ఉన్న నల్లమల అడవికి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. సోమవారం రాత్రంతా అడవిలో మంటలు కనిపించడంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళన చెందారు. మంగళవారం ఉదయం కూడా అడవిలో మంటలతో పాటు పొగ ఎగజిమ్ముతూనే ఉంది. గాలి ఏ దిశకు వీస్తుందో అటువైపుగా ఉవ్వెత్తున మంటలు ఎగసి పడుతున్నాయి. బర్రెలు మేపుకునేందుకు గానీ, వంట కట్టెల కోసం గానీ ఎవ్వరిని అటవీలోకి వెళ్లకుండా ఫారెస్ట్ అధికారులు పటిష్ట చర్యలు చేపడుతున్నప్పటికీ మంటలు ఎలా చెలరేగాయోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
యువనేస్తం.. నిలువునా మోసం
ఉద్దేశపూర్వకంగా బకాయిలు పేద విద్యార్థులను దూరం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఫీజు బకాయిలు పెడుతుంది. కార్పొరేట్ విద్యాసంస్థలను ప్రోత్సహించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోంది. వసతి దీవెన, విద్యాదీవెన నిలిపి వేసి డిగ్రీ, ఇంజనీరింగ్, డాక్టర్ చదువుల కలలను నీరుగార్చే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుంది. – ఎంఆర్ నాయక్, ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి, నంద్యాల పేద విద్యార్థులకు అన్యాయం కూటమి ప్రభుత్వం మూడు త్రైమాసికాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో పెట్టి పేద విద్యార్థులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తోంది. ఫీజు కట్టకపోవడంతో కాలేజీల నుంచి విద్యార్థులను పరీక్షలు రాయించకుండా వెళ్లగొడుతున్నారు. దిక్కుతోచని స్థితిలో చదువులు మధ్యలో ఆగిపోతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోంఇ. – నాగరాముడు, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి, నంద్యాల విద్యా వ్యవస్థను నీరుగారుస్తోంది కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను నీరుగారుస్తోంది. మళ్లీ ఐదేళ్లు కష్టాలను చవి చూడాల్సి వస్తోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన విద్యార్థులు ఫీజులు చెల్లించాలంటే ఇబ్బందిగా మారుతుంది. ప్రభుత్వం ఇప్పటి కైనా దిగి వచ్చి విద్యార్థులకు న్యాయం చేయాలి. – రాజు, విద్యార్థి సంఘం అధ్యక్షుడు, నంద్యాలనంద్యాల: గత ఐదేళ్ల పాటు నిశ్చితంగా ఉన్న విద్యారంగం నేడు కూటమి ప్రభుత్వంలో ఒడిదుడుకులకు గురవుతోంది. మళ్లీ గత టీడీపీ పాలనలోని కష్టాలను చవి చూడాల్సి వస్తుందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన పేరుతో విద్యార్థులకు ఆర్థికంగా ఆదుకుంటూ వచ్చింది. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ పథకాలకు పేర్లు మార్చి చేతులెత్తేసింది. ఏటా చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెనపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. పేద మధ్య తరగతి వర్గాలకు చెందిన తల్లిదండ్రులకు రూ. వేలకు వేలు ఫీజు చెల్లించడం ఇబ్బందిగా మారింది. కూటమి ప్రభుత్వం ఫీజు చెల్లింపులో ఎలాంటి స్పష్టత ఇవ్వక పోవడంతో డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చేస్తున్న విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలో దాదాపు 38 వేల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, కాపు, క్రిస్టియన్ సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులకు 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి కూటమి ప్రభుత్వం మూడు విడతలుగా దాదాపు రూ.73 కోట్లు బకాయి పడింది. పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన విద్యార్థుల ఉన్నత విద్యకు ఎలాంటి ఆటంకం కల్పించబోమని, ఎప్పటికప్పుడు ఫీజులను విడుదల చేస్తామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి నా ఫీజు బకాయిలపై దృష్టి సారించడం లేదు. జగనన్న పాలనలో ఇలా.. గతంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ప్రవేశ పెట్టిన సమయంలో బీసీ, ఈబీసీ, మైనార్టీ, కాపు విద్యార్థుల ఇంజినీరింగ్ విద్యకు ఏడాదికి రూ.35వేలు మాత్రమే విడుదలయ్యేవి. కానీ కొన్ని పెద్ద కళాశాలల్లో (గ్రేడ్–1) ఇంజినీరింగ్ ఫీజు ఏడాదికి రూ.60వేల నుంచి రూ. 80వేల వరకు ఉంది. ఆయా కళాశాలల్లో చదువుతున్న సంబంధిత సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులు ప్రభుత్వం విడుదల చేసే రూ.35 వేలను మినహాయించి మిగిలిన ఫీజు వారి తల్లిదండ్రులే చెల్లించాల్సి వచ్చే ది. ఈ ఆర్థిక భారాన్ని కూడా తొలగించేందుకు అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని పెంచాలని నిర్ణయం తీసుకుని అమలు చేశారు. జగనన్న విద్యాదీవెన పేరుతో ఆయా విశ్వవిద్యాలయాలు నిర్ణయించిన ఫీజు మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించేలా చర్యలు తీసుకున్నారు. దీంతో గ్రేడ్–1 కళాశాలల్లో అనేక మంది విద్యార్థులు ఇంజినీరింగ్ తదితర కోర్సులను ఎలాంటి ఆర్థిక భారం లేకుండా పూర్తి చేసి కుటుంబాలకు ఆసరాగా నిలిచారు. ఐదేళ్ల జిల్లాలో జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన కింద రూ.498.50 కోట్లు తల్లుల ఖాతాల్లో జమ చేశారు. బకాయిలు చెల్లించిన జగన్ సర్కార్.. గత టీడీపీ ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలను కూడా వైఎస్సార్సీపీ ప్రభు త్వం 2019–20 విద్యా సంవత్సరంలో విడుదలయ్యా యి. వసతి దీవెన పథకం ద్వారా ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ విద్యార్థులకు రూ.23 వేలు అందించింది. ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో వైద్య రంగానికి పెద్దపీట వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసేందుకు నిర్మాణాలను కూడా ప్రారంభించారు. అందులో భాగంగానే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆదోని, నంద్యాల ప్రాంతాల్లో మెడికల్ కళాశాలల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. నంద్యాలలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రారంభం కాగా, ఆదోనిలో చురుగ్గా జరుగుతున్న మెడికల్ కళాశాల నిర్మాణాలకు కూటమి ప్రభుత్వం మోకాలడ్డువేసింది. కరువు ప్రాంతమైన ఆదోనిలో మెడికల్ కళాశాల నిర్మాణానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో దాదాపు 80 శాతం నిర్మాణాలు కూడా పూర్తయ్యాయి. మిగిలిన 20 శాతం పనులు పూర్తియితే ఈ ఏడాది 150 సీట్లతో కళాశాల ప్రారంభయ్యేది. అయితే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నిర్మాణాలకు బ్రేకులు వేసింది. దీంతో ఆదోని మెడికల్ కళాశాల కలగానే మిగిలిపోయింది. పైపెచ్చు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏర్పాటైన మెడికల్ కళాశాలలను ప్రస్తుత ప్రభుత్వం ప్రైవేటు పరం చేసేందుకు తీసుకున్న నిర్ణయం పట్ల పూర్తి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వైద్య విద్యకు మోకాలడ్డు నారా లోకేష్ నోరు విప్పాలి విద్యాశాఖ మంత్రి నారాలోకేష్ యువగళం పాదయాత్రలో ఫీజురీయింబర్స్మెంట్పై ఇచ్చిన హామీలు ఇంత వరకు నోరు విప్పడం లేదు. పెండింగ్లో నిధులను మంజూరు చేసే విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం తగదు. విద్యారంగాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తే సహించేది లేదు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాడతాం. – సురేష్యాదవ్, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు, నంద్యాలరూ.2,142,16 కోట్లు అమలు చేయకపోతే ఏడాది నష్టం 5,95,045 జిల్లాలోని గృహాల సంఖ్య రూ.178.51 కోట్లు నెలకు రూ.3వేల చొప్పున చెల్లించాల్సిన నిరుద్యోగ భృతినేడు వైఎస్సార్సీపీ యువత పోరు విద్యార్థులకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఈనెల 12వ తేదీన వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో యువత పోరు నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్సీపీ జిల్లా అద్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి తెలిపారు. ఫీజు బకాయిలు వెంటనే చెల్లించకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. విద్యార్థులతో కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టనున్నామన్నారు. కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం విద్యార్థుల సమస్యలపై కలెక్టర్కు వినతి పత్రం అందజేస్తామన్నారు. చంద్రబాబుకు నిరుద్యోగులను మోసం చేయడం ఆనవాయితీగా మారింది. 2014లో కూడా ఇంటికో ఉద్యోగం ఇస్తానని, అప్పట్లో రూ.2వేల నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక హామీని చెత్తబుట్టలో పడేశారు. 2019 ఎన్నిలకు ముందు రాజకీయ లబ్ధి కోసం 2018 అక్టోబర్ నుంచి నెలకు రూ.వెయ్యి కొంతమందికి మాత్రమే నిరుద్యోగ భృతి వేసి చేతులుదులుపుకున్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు ఇస్తానని, ఉద్యోగం ఇచ్చే వరకూ ‘యువనేస్తం’ పేరిట నెలకు రూ.3వేల నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు. ఈ లెక్కన జిల్లాలో నెలకు రూ.178.51 కోట్లు ఇవ్వాలి. ‘కూటమి’ మాటలు నమ్మి ఉద్యోగాలపై ఆశతో కోచింగ్ సెంటర్లకు వెళ్లే విద్యార్థులకు ప్రతి నెలా వేల రూపాయలు ఖర్చవుతోంది. ప్రభుత్వం భృతి ఇవ్వకపోవడంతో వారిపై భారీగా ఆర్థిక భారం పడుతోంది. ఓ వైపు ఉద్యోగాల నోటిఫికేషన్లు లేవు. మరో వైపు భృతి లేకపోవడంతో నిరుద్యోగులు ఆశనిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. -
కర్ణాటక బస్సు బీభత్సం.. నలుగురి మృతి
సాక్షి, కర్నూలు జిల్లా: కర్ణాటక గంగావతి డిపోకు చెందిన కేఎస్ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. గంగావతి నుంచి రాయచూర్కు వెళ్తున్న బస్సు ఆదోని మండలం పాండవగళ్లు గ్రామ సమీపంలో ముందు వెళ్తున్న రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు అక్కడికక్కడ డే మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.మృతి చెందిన వారిలో ఆదోని మండలం కుప్పగళ్లు గ్రామానికి చెందిన భార్యా భర్తలు, కర్ణాటకలోని మాన్వికి చెందిన అక్కా తమ్ముళ్లు ఉన్నారు. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్సీపీ కార్యకర్త మృతి
పత్తికొండ రూరల్/ఆస్పరి: రోడ్డు ప్రమాదంలో పందికోన గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త పందుల బాలరాజు (34) మృతి చెందారు. వైఎస్సార్సీపీ కార్యక్రమాల్లో బాలరాజు చురుగ్గా పాల్గొనేవాడు. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఉన్న అభిమానంతో ముగ్గురు సంతానంలో పెద్దకుమార్తె పేరు షర్మిల, చిన్నకుమారుడి పేరు జగన్ అని పెట్టుకున్నారు. ఆస్పరి మండలం కై రుప్పల సమీపంలో ఆదివారం దేవరకు వెళ్లి తిరుగు ప్రయాణంలో ఆటోలో వస్తూ అదుపుతప్పి ప్రమాదవశాత్తు ట్రాక్టర్ను ఢీకొట్టాడు. చికిత్స నిమిత్తం పత్తికొండ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. బాలరాజు మృతితో భార్య సరోజ, బంధువులు బోరున విలపించారు. మృతి వార్త తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి సోమవారం ప్రభుత్వాసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. -
చాగలమర్రిలో దంపతులపై దాడి
చాగలమర్రి: మండల కేంద్రమైన చాగలమర్రిలోని మంగలి వీధిలో షేక్ బీబీ, మహబూబ్బాషా దంపతులపై అదే కాలనీకి చెందిన వారు దాడి చేశారు. సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకున్న ఈ ఘటనలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళితే..మహబూబ్బాషా ఇంటి ఎదురుగా తాజు, తాహెర్ అనే వ్యక్తులు నివసిస్తారు. ఇళ్ల ముందు వాహనాలు నిలిపే విషయంలో ఇరుకుటుంబాల మధ్య గొడవ ఉంది. ఈ క్రమంలో సోమవారం తాజు, తాహెర్ మరికొంత మంది మహబూబ్బాషా దంపతుల ఇంటిపైకి వెళ్లి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బీబీతో పాటు భర్తను స్థానిక ఓ ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రులపై దాడి విషయం తెలుసుకున్న కుమార్తె అబీదా, బంధువు ఇనాయతుల్లా పరామర్శించేందుకు ప్రొద్దుటూరు నుంచి ఆసుపత్రికి వచ్చారు. నిందితులు మరో పదిమందితో కలిసి అక్కడికి చేరుకొని వారిపై కూడా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఆళ్లగడ్డ రూరల్ సీఐ మురళీధర్రెడ్డి తెలిపారు. ఇదిలా ఉంటే తీవ్రంగా గాయపడిన షేక్ బీబీని వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం ప్రొద్దుటూరుకు తరలించినట్లు కుటుంబీకులు తెలిపారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగం పేరిట మోసం
● ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితుడు కర్నూలు: హైదరాబాద్లో బిందు కన్సల్టెన్సీ పేరిట సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి అశ్విని, సాయికృష్ణ, హిమబిందు కలసి రూ.60 వేలు తీసుకుని మోసం చేశారని కల్లూరు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన రమేష్కుమార్ రెడ్డి ఎస్పీ విక్రాంత్ పాటిల్కు ఫిర్యాదు చేశారు. కర్నూలు టూటౌన్ పక్కనున్న క్యాంపు కార్యాలయంలో సోమవారం ఎస్పీ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. పీజీఆర్ఎస్కు మొత్తం 122 ఫిర్యాదులు రాగా.. వీటన్నింటిపై చట్ట పరిధిలో విచారణ జరిపి బాధితులకు త్వరితగతిన పరిష్కారం చూపుతామని ఎస్పీ హామీ ఇచ్చారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా కూడా పాల్గొని వినతులను స్వీకరించారు. -
టీడీపీ డీలరా.. మజాకా..!
పగిడ్యాల: పేద ప్రజలకు చౌకదుకాణాల ద్వారా ఉచితంగా సరఫరా చేస్తున్న రేషన్ బియ్యం పంపిణీలో డీలర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కార్డుదారుల వేలిముద్రలను తీసుకుని బియ్యం వేయకుండా మోసం చేసిన వైనం పడమర ప్రాతకోట గ్రామం 21వ షాపు పరిధిలో వెలుగు చూసింది. గత జగనన్న ప్రభుత్వం ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ ఇంటింటికి పంపిణీ చేయగా.. కూటమి ప్రభుత్వం అధికార పార్టీ నేతలను డీలర్లు మార్చి పేదల బియ్యాన్ని పక్కదారి పట్టిస్తోంది. ఇందుకు పడమర ప్రాతకోట 21వ షాపు నిర్వాకుడే నిదర్శనం. ఈ షాపు పరిధిలో 709 కార్డులు ఉన్నా యి. ప్రతి నెల ఏఏవై కార్ుడ్సకు 13.30 క్వింటాళ్లు, తెల్లరేషన్కార్డులకు 90.50 క్వింటాళ్లు కాగా క్లోజింగ్ బ్యాలెన్స్ (సీబీ) పోగా ఓపెనింగ్ బ్యాలెన్స్ 55.84 క్వింటాళ్లు సరాఫరా చేస్తున్నామని సివిల్ సప్లయ్ డిప్యూటీ తహసీల్దార్ నివేదిక అందజేశారు. కార్డుదారులకు టోకరా కొట్టేందుకే ఎండీయూ వాహన డ్రైవర్తో బయోమెట్రిక్ మిషన్ ఆన్ చేయించుకుని డీల ర్లే స్వయంగా కార్డుదారుల థంబ్ తీసుకుని బియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘ప్రభుత్వం మాది మేము బియ్యం పంచుకుంటాం.. కేవలం థంబ్ వేయించి పోండి’ అంటూ ఎండీయూ డ్రైవర్లపై డీలర్లు పెత్తనం చెలాయిస్తున్నట్లు సమాచారం. అందుకే ఫిబ్రవరి నెలకు సంబంధించి బియ్యం కోటా తక్కువ వచ్చిందని మార్చి నెలలో రెండు నెలల బియ్యం ఒకేసారి వేస్తానని కార్డుదారుల వేలిముద్రలు తీసుకుని దాదాపు 80 ప్యాకెట్ల బియ్యాన్ని డీలర్ మాయం చేసినట్లు సమాచారం. ఎక్కువగా 20 కేజీలు, 25 కేజీలు, 35 కేజీలు కలిగిన కార్డుదారుల వ్రేలిముద్రలను తీసుకుని బియ్యం వేయనట్లు తెలుస్తోంది. పేదల నోటి కాడి బియ్యాన్ని పక్కదారి పట్టించిన అధికార పార్టీ డీలర్పై రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాల్సిందే. బియ్యం వేయకుండానే వేలిముద్రలు తీసుకున్నాడు పోయిన నెలలో నా కార్డుకు బియ్యం వేసి మా కొడుకుల కార్డులకు బియ్యం వేయలేదు. వేలిముద్రలు తీసుకున్నావ్ కదా అని అడిగితే వచ్చే నెలలో వేస్తానని చెప్పినాడు. ఈనెల బండి ఇంకా రాలేదు. – హజరాంబీ, పడమర ప్రాతకోట 5 కేజీలు, 10 కేజీల కార్డులకు మాత్రమే వేశారు కార్డులో ఒకరు, ఇద్దరు, ముగ్గురు ఉన్న వాళ్లకు మాత్రమే 5 కేజీలు, 10, 15 కేజీల బియ్యం వేశారు. 20, 25, 30 కేజీల ఉన్న వారికి ఇవ్వలేదు. నా కొడు కు తలారి అయినా బియ్యం వేయలేదు. ముస్లిం కాలనీలో చాలా మందికి వేయలేదు. రెండు నెలల బియ్యం వేస్తానని వ్రేలిముద్రలు వేయించుకున్నాడు. – మొల్ల జైబున్బీ,పడమర ప్రాతకోట నా దృష్టికి రాలేదు పడమర ప్రాతకోటలోని 21వ షాపు డీలర్ బియ్యం సరిగా పంపిణీ చేయని విషయం నా దృష్టికి రాలేదు. మార్చి నెల కోటా బియ్యం పంపిణీ జరుగుతోంది. ఆర్ఐతో విచారణ చేయించి రెండు నెలల బియ్యం వేసేలా చర్యలు తీసుకుంటాం. – శివరాముడు, తహసీల్దార్, పగిడ్యాల వినియోగదారుల థంబ్ తీసుకుని రేషన్ ఇవ్వని వైనం ఫిబ్రవరి నెలలో దాదాపు 80 బస్తాల బియ్యం మాయం లబోదిబోమంటున్న కార్డుదారులు -
ఏపీఎస్పీ రెండవ పటాలంలో బదిలీలకు గ్రీన్సిగ్నల్
మేనేజర్, స్టోర్ ఎన్సీఓ పోస్టులకు భారీ పోటీ ప్రతి కంపెనీలో ఒక మేనేజర్, స్టోర్ ఎన్సీఓ ఉంటాడు. ఆయా పోస్టులను దక్కించుకునేందుకు సిబ్బంది పోటీ పడుతున్నారు. నిబంధనల ప్రకారం ఆయా పోస్టుల్లో విధులు నిర్వహించాలంటే అందుకు సంబంధించిన శిక్షణ తప్పనిసరి. గతంలో ఇదే విధులు నిర్వహించిన వారికి మళ్లీ నియమించకూడదనే నిబంధన కూడా ఉంది. అయితే కొందరు రెండోసారి కూడా ఆయా పోస్టుల్లో పనిచేశారు. కర్నూలు: ఏపీఎస్పీ కర్నూలు రెండో పటాలంలో సిబ్బంది బదిలీలకు రంగం సిద్ధమైంది. నూతన కమాండెంట్ బాధ్యతలు చేపట్టిన దీపిక పాటిల్ ఆదేశాల మేరకు బదిలీల జాబితా సిద్ధమైనట్లు సిబ్బందిలో చర్చ జరుగుతోంది. గత నెల 25న కమాండెంట్ సంబంధిత కంపెనీ ఆర్ఐలకు(ఆఫీసర్ కమాండింగ్) బదిలీలకు సంబంధించిన మెమో (ఉత్తర్వులు) ఇచ్చా రు. బెటాలియన్లో తొమ్మిది కంపెనీలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం ఏళ్ల తరబడి బయటి కంపెనీల్లో పనిచేసిన వారిని హెడ్ క్వార్టర్కు బదిలీ చేయాల్సి ఉంది. మొత్తం పటాలంలో దాదాపు 1100 మంది సిబ్బంది ఉన్నారు. టర్న్ ప్రకారం ప్రతి ఒక్కరికీ హెడ్ క్వార్టర్లో విధులు నిర్వహించేలా అవకాశం కల్పించాలి. ఇందుకు అనుగుణంగా కమాండెంట్ చర్యలు చేపట్టడంతో ఫెవికాల్ వీరులు పైరవీలు ముమ్మరం చేసినట్లు చర్చ జరుగుతోంది. ఒకటి రెండు రోజుల్లో బదిలీల జాబితా వెలువడే అవకాశం ఉన్నట్లు తెలు స్తోంది. ఈ నేపథ్యంలో కొంతమంది ఆఫీసర్ కమాండెంట్లు చేతివాటం ప్రదర్శించి బదిలీల జాబితా తయారీలో అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని, జాబితాను సమగ్రంగా పరిశీలించి ఏళ్ల తరబడి బయటి కంపెనీలో పనిచేస్తున్న వారికి కమాండెంట్ న్యాయం చేస్తారనే ఆశాభావం సిబ్బందిలో వ్యక్తమవుతోంది. వీరు ఫెవికాల్ వీరులు ● స్టోర్ ఎన్సీఓగా ఎమ్టీ గ్రూప్లో హెడ్ కానిస్టేబుల్ రంగసామిరెడ్డి 15 ఏళ్లుగా కొనసాగుతున్నారు. దీపిక పాటిల్ కమాండెంట్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సిబ్బంది సమస్యలపై దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా రంగసామిరెడ్డిపై పలువురు సిబ్బంది ఫిర్యాదు చేశారు. దీంతో అతడి స్థానంలో బాల హుసేన్ (హెచ్సీ 817)ను నియమించారు. అవమానంగా భావించిన రంగసామిరెడ్డి ద్వితీయ శ్రేణి అధికారి సహాయంతో సిక్ లీవ్లో వెళ్లారు. ఇందుకు ఓ అధికారికి పి–క్యాప్ స్టిక్ కానుకగా బహుకరించినట్లు సిబ్బందిలో చర్చ జరుగుతోంది. ఈయన ఏఎంటీఓ ద్వారా హెడ్ క్వార్టర్లోనే కొనసాగేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ● సమరసింహారెడ్డి (కళ్యాణ మండపం నిర్వహణ) 20 ఏళ్లుగా హెడ్ క్వార్టర్లోనే కొనసాగుతున్నారు. ● తిరుమల్రెడ్డి 30 ఏళ్లుగా ట్రైనింగ్ గ్రూప్లోనూ, బందె నవాజ్ 20 ఏళ్లుగా బెటాలియన్ హాస్పిటల్లో, హెడ్ కానిస్టేబుల్ మౌలాలి పదేళ్లుగా హాస్పిటల్ విధులు, టైలరింగ్ గ్రూప్లో 15 ఏళ్లుగా జిలానీ బాషాతో పాటు మరో పది మంది దాకా వివిధ గ్రూపుల్లో హెడ్ క్వార్టర్లో విధులు నిర్వహిస్తుండటం వల్ల బయటి కంపెనీల్లో పనిచేసేవారికి అవకాశం దక్కడం లేదని సిబ్బంది వాపోతున్నారు. ● అసిస్టెంట్ కమాండెంట్ల దగ్గర విధులు నిర్వహించే పీఏలు కూడా ఏళ్ల తరబడి హెడ్ క్వార్టర్లోనే కొనసాగుతున్నట్లు సిబ్బందిలో చర్చ జరుగుతోంది. ● కానిస్టేబుల్ కిరణ్ 20 ఏళ్లుగా అసిస్టెంట్ కమాండెంట్ దగ్గర పనిచేస్తున్నారు. ● విశ్వనాథ్ రెడ్డి ట్రెజరీలో ఎనిమిదేళ్లుగా హెడ్ క్వార్టర్లోనే ఉంటున్నారు. ● డీఎస్పీలు ఎస్ఎం బాషా దగ్గర హుసేనయ్య, రమణ దగ్గర రియాజ్, రవికిరణ్ దగ్గర రాజు కొన్నేళ్లుగా సీట్లకు అతుక్కుని విధులు నిర్వహిస్తున్నారు. ● హెడ్ కానిస్టేబుల్ విశ్వనాథ్ రెడ్డి కూడా అసిస్టెంట్ కమాండెంట్, గతంలో కమాండెంట్ దగ్గర విధులు నిర్వహిస్తున్నారు. కానిస్టేబుల్గా విధుల్లో చేరినప్పటి నుంచి హెడ్ క్వార్టర్లోనే కొనసాగుతుండటంతో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. బదిలీలకు రూ.లక్షల్లో వసూలు నచ్చిన చోటుకు పంపేందుకు, ఉన్న చోటనే కొనసాగించేందుకు ఉద్యోగుల నుంచి గతంలో మామూళ్లు వసూలు చేశారని ఫిర్యాదుల నేపథ్యంలో పదవీ విరమణ పొందిన ఓ ఉన్నతాధికారిపై విచారణ జరిగింది. పదవీ విరమణకు ఒక రోజు ముందు బదిలీల పేరుతో ఇద్దరు అధికారులు చక్రం తిప్పి ముడుపులు వసూలు చేశారు. వివిధ హోదాల్లో ఉన్న వంద మందికి స్థానచలనం కల్పించి గత కమాండెంట్ రూ.లక్షల్లో దండుకున్నారు. ఈ తరహా బదిలీలపై సిబ్బంది నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో డీఐజీ రాజకుమారి ఆదేశాల మేరకు 16వ బెటాలియన్ కమాండెంట్ శ్రీనివాస్ గతంలో విచారణ జరిపి ఆ శాఖ ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. అయితే చర్య ప్రశ్నార్థకంగా మారినట్లు తెలుస్తోంది. మార్గదర్శకాలతో మెమో జారీ చేసిన కమాండెంట్ అర్హుల జాబితాను సిద్ధం చేసిన కంపెనీ ఆర్ఐలు -
రాళ్ల ట్రాక్టర్ బోల్తా పడి బాలుడి మృతి
పాములపాడు: మండలంలోని చెలిమల గ్రామ సమీపంలో రాళ్ల ట్రాక్టర్ బోల్తా పడిన ప్రమాదంలో ఓ బాలుడు మృతి చెందాడు. లింగాల గ్రామానికి చెందిన మోహన్రావు కుమారుడు జస్వంత్ (17) 9వ తరగతి చదువుతున్నాడు. సోమవారం సాయంత్రం పని మీద పాములపాడుకు వచ్చిన జస్వంత్ తిరుగు ప్రయాణంలో స్వగ్రామానికి వెళ్తున్న రాళ్ల లోడు ట్రాక్టర్ ఎక్కాడు. మార్గమధ్యలో చెలిమిల గ్రామ సమీపంలో ఎద్దుల వంక వాగు వద్ద ప్రమాదవశాత్తూ ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో రాళ్లపై కూర్చున్న బాలుడు జస్వంత్పై రాళ్లుపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో బాలుడు సంగీత రాజు క్షేమంగా బయటపడ్డాడు. ప్రస్తుతం డ్రైవర్ స్వాములు పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకొని ప్రమాద వివరాలు సేకరించారు. అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య కొలిమిగుండ్ల: నందిపాడుకు చెందిన గుండ్ర గుర్రప్ప(48) అప్పుల బాధతో సోమవారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఏఎస్ఐ బాబా ప్రకృద్దీన్ తెలిపారు. గుర్రప్ప నాపరాళ్ల వ్యాపారం చేస్తూ నష్టపోయి ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాడు. కుమారుడు చదువు, కుమార్తె వివాహం కోసం ఫైనాన్స్ సంస్థల వద్ద రూ.9లక్షలు అప్పు చేశాడు. ఇందులో రూ.3 లక్షలు వాయిదాల రూపంలో చెల్లించాడు. మిగిలిన బకాయి చెల్లించే అవకాశం లేక ఆర్థిక సమస్యలతో సతమతమయ్యాడు. దీతో మనస్తాపం చెంది తిమ్మనాయినపేట జంక్షన్ సమీపంలోని పొలంలోకి వెళ్లి శనగ మాత్రలు మింగి అపస్మారక స్థితిలో పడిపోయాడు. స్థానికులు గుర్తించి తాడిపత్రి ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తీసుకెళుతుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. చెట్టుపై నుంచి కిందపడి యువకుడి మృతి ఆదోని అర్బన్: పెద్దకడబూరు మండలం నెమలికల్లు గ్రామానికి చెందిన అల్తాఫ్(26) అనే యువకుడు చెట్టుపై నుంచి కిందపడి సోమవారం మృతిచెందాడు. బంధువులు తెలిపిన వివరాలు మేరకు .. ఉదయం పొలంలోని టెంకాయ చెట్టు ఎక్కి టెంకాయలను తెంపుతుండగా అకస్మాత్తుగా పై నుంచి కింద పడ్డాడు. కిందకు పడిన యువకుడిని వెంటనే స్థానికులు ఆదోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యలోనే అల్తాఫ్ మృతిచెందాడు. మృతుడికి భార్య సునీత, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడు వలస వెళ్లి ఇటీవలే గ్రామానికి చేరుకున్నాడు. కుటుంబ పెద్ద దిక్కును కోల్పోవడంతో రోదనలు మిన్నంటాయి. -
శాసీ్త్రయ పద్ధతులతో పాడిపరిశ్రమ లాభసాటి
కర్నూలు(అగ్రికల్చర్): శాసీ్త్రయ పద్ధతులను అవలంబిస్తే పాడిపరిశ్రమను లాభసాటిగా మార్చుకోవచ్చని ఆర్ఏహెచ్టీసీ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ కె.సుధాకర్రెడ్డి తెలిపారు. కర్నూలు కొండారెడ్డిబురుజు సమీపంలోని బహుళార్ధ పశువైద్యశాల ప్రాంగణంలోని ట్రైనింగ్ సెంటర్లో పాడిరైతులకు 3 రోజుల శిక్షణా కార్యక్రమంలో భాగంగా వాణిజ్య సరళిలో పాడిపశువుల పెంపకం అనే అంశంపై సోమవారం శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పాడి రైతులనుద్దేశించి ఏడీ డాక్టర్ సుధాకర్రెడ్డి మాట్లాడుతూ ప్రధానంగా పాడిపశువుల ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏడాది పొడవునా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఆసక్తి ఉన్న రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ అరుణశ్రీ, సతీష్ తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు అంతంత మాత్రమే కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో వాము ధర ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ రైతులకు అంతంతమాత్రం ధర లభిస్తోంది. సోమవారం మార్కెట్కు 254 మంది రైతులు 802 క్వింటాళ్ల వాము తెచ్చారు. గరిష్ట ధర రూ.28,888 ఉన్నట్లు ప్రకటించినప్పటికి.. దాదాపు 240 మంది రైతులకు అంతంతమాత్రం ధరే లభించింది. సగటు ధర రూ.12,399 పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తోంది. ● ఉల్లి ధరలు పడిపోయాయి. మార్కెట్కు ఉల్లి 2,873 క్వింటాళ్లు వచ్చింది. కనిష్ట ధర రూ.517, గరిష్ట ధర రూ.1537 లభించగా... సగటు ధర రూ.1,187 నమోదైంది. మిర్చికి గరిష్టంగా రూ.12769 లభించింది. సగటు ధర కేవలం రూ.8,720 మాత్రమే నమోదైంది. మార్కెట్కు 1,768 క్వింటాళ్ల కందులు వచ్చాయి. కనిష్ట ధర రూ.3,100, గరిష్ట ధర రూ.7,158 లభించగా.. సగటు ధర రూ.6,909 మాత్రమే పలికింది. ట్రాక్టర్ డ్రైవర్ దుర్మరణం ● బస్సును ఢీకొన్న ట్రాక్టర్ వెల్దుర్తి: ఆర్టీసీ బస్సును ట్రాక్టర్ ఢీకొట్టడంతో ట్రాక్టర్ డ్రైవర్ యశ్వంత్ (23) మృతిచెందారు. ఈ దుర్ఘటన వెల్దుర్తి సమీపంలోని హైవే 44పై సోమవారం చోటుచేసుకుంది. ఉదయం 6గంటల సమయంలో కర్నూలు నుంచి అనంతపురం వైపు ఏపీఎస్ ఆర్టీసీ కర్నూలు డిపో అల్ట్రా డీలక్స్ బస్సు వెళ్తోంది. అదే సమయంలో పసుపుల నుంచి వెల్దుర్తికి సొప్పలోడు కోసమని ట్రాక్టరు వస్తోంది. బస్సును పక్కనుంచి ఢీకొనడంతో ట్రాక్టరు ట్రాలీతో విడిపోయి రహదారిపై బోల్తాపడింది. బస్సు డివైడర్ పైకెక్కి, ముందు టైర్లు పగిలిపోయి ఆగిపోయింది. బస్సు పాక్షికంగా ధ్వంసమైంది. ఈ ఘటనలో పసుపులకు చెందిన ట్రాక్టరు డ్రైవర్ యశ్వంత్ మృతిచెందారు. ట్రాక్టర్ క్లీనర్ అదే గ్రామానికి చెందిన సంజీవ్ గాయపడ్డాడు. బస్సు డ్రైవర్, 39 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. హైవే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు. ట్రాక్టర్ డ్రైవర్ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం వెల్దుర్తి ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అశోక్ తెలిపారు. -
అయినా.. ప్రయోజనం లేదు
గ్రామాల్లో చెత్త సేకరిస్తున్నారు కానీ ప్రయో జనం లేకుండా పోతోంది. ఆ చెత్తను రోడ్ల వెంటనే విడిచి పెడుతున్నారు. కుక్కలు, పందులు వ్యర్థాలను తీసుకొచ్చి ఇళ్ల ముందు పడేస్తున్నాయి. దీంతో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. – చాకలి నాగలక్షమ్మ, మహదేవపురం చెత్త సంపద కేంద్రాలనుపట్టించుకునే వారు లేరు గ్రామాల్లో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడంతో పారిశుద్ధ్యంతో వ్యాధులు ప్రబలుతున్నాయి. కొన్ని గ్రామాల్లో రహదారుల వెంట వెళ్లాలంటే కూడా ఇబ్బందిగా ఉంది. చెత్త సంపద కేంద్రాలు పని చేయడం లేదు. అధికారులు ర్యాలీలు, సదస్సులు నిర్వహించడంతో పాటు సంపద కేంద్రాలను పని చేసేలా చర్యలు తీసుకోవాలి. – గడ్డం చంద్రశేఖర్రెడ్డి, ఆళ్లగడ్డ వినియోగంలోకి తీసుకువస్తాం గ్రీన్ వెహికిల్స్ ద్వారా గ్రామాల్లో చెత్తను ఎప్పటికప్పుడు సేకరించి డంపింగ్కు తరలిస్తున్నాం. మరమ్మతులకు గురైన కేంద్రాలకు త్వరలో వినియోగంలోకి తీసుకు వస్తాం. చెత్తకు నిప్పు పెట్టకుండా అవగాహన కల్పిస్తాం. చెత్త సంపద తయారీ కేంద్రాలతో పంచాయతీలకు ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకుంటాం. – అశ్విన్, ఈవోపీఆర్డీ, ఆళ్లగడ్డ -
‘యువత పోరు’కు తరలిరండి
బనగానపల్లె: వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన జిల్లా కేంద్రమైన నంద్యాలలో చేపడుతున్న యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి, బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రా రెడ్డి కోరారు. బనగానపల్లెలోని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి స్వగృహం వద్ద ఆదివారం యువత పోరుబాట పోస్టర్లను ఆవిష్కరించారు. విలేకరులతో పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, లేదంటే ప్రతి నెలా రూ.3వేల చొప్పున భృతి ఇస్తామని టీడీపీ నేతలు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారన్నారు. ఈ హామీని అమలు చేయాలంటే ఏడాదికి రూ.7,200 కోట్లు ఖర్చు చేయాల్సి ఉన్నా.. గత బడ్జెట్లో కేటాయింపులు లేవన్నారు. ఈ ఏడాది కూడా ఒక పైసా కేటాయించకపోవడం అత్యంత శోచనీయమన్నారు. ఫీజులు కట్టకపోవడంతో కాలేజీల నుంచి పేద విద్యార్థులను బయటకు పంపుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. విద్యార్థులకు ఫీజురీయింబర్స్మెంట్ పథకాన్ని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిందని గుర్తు చేశారు. ● మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ హయాంలో 17 కొత్త మెడికల్ కళాశాలలు ఏర్పాటయ్యాయన్నారు. వీటిలో ఐదు కళాశాలల్లో తరగతులు ప్రారంభం అయ్యాయని, కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేట్పరం చేసేందుకు యత్నిస్తోందన్నారు. నాడు– నేడు పనులు అటకెక్కాయని, విద్యార్థుల చదువులకు అడుగడుగునా ఆటంకాలు చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిట్టగా పేరుపొందారన్నారు. ● ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రా రెడ్డి మాట్లాడుతూ.. విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది గత వైఎస్సార్సీపీ ప్రభుత్వమే అన్నారు. విద్యాదీవెన, వసతిదీవెన పథకాలకే రూ. 18 వేల కోట్ల వరకు ఖర్చు చేసినట్లు గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వసతి దీవెన, విద్యాదీవెన పథకాలు నిలిపివేయడంతో పేదల చదువుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. యువత పోరు కార్యక్రమానికి విద్యార్థులు భారీగా తరలిరావాలన్నారు. ● విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సురేష్ యాదవ్, నియోజకవర్గ అధ్యక్షుడు పూజారి శ్రీనివాసులు, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ జనార్దన్రెడ్డి, వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నాయకుడు అబ్దుల్ఖైర్, నియోజకవర్గ ప్రచార కార్యదర్శి సిద్ధంరెడ్డి రామ్మోహన్రెడ్డి, నాయకులు అంబటి రవికుమార్రెడ్డి, శంకర్రెడ్డి పాల్గొన్నారు. -
నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
నంద్యాల: కలెక్టరేట్లోని సెంటినరీ హాల్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం చేపట్టి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ సమస్యలు ఉన్న వారు వినతులు అందజేయాలన్నారు. జిల్లా కేంద్రంతో పాటు మండల, నియోజకవర్గ, డివిజన్ స్థాయిలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉదయం 9.30 గంటలకు జిల్లా అధికారులందరూ హాజరు కావాలన్నారు. టీబీ డ్యాంలో 25.5 టీఎంసీలు హొళగుంద: కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు సాగు, తాగునీరునందిస్తూ వరదాయినిగా ఉన్న తుంగభద్ర జలాశయంలో ఆదివారం 25.547 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్ఫ్లో జీరో క్యూసెక్కులు కాగా.. 10,041 కూసెక్కుల నీటిని వివిధ కాల్వకు వదులుతున్నారు. ఎల్లెల్సీకి మార్చి నెలాఖరు వరకు నీటిని విడుదల చేస్తామని టీబీ బోర్డు అధికారులు ఇప్పటికే ప్రకటించారు. అయితే డ్యాంలో నీటి నిల్వలు ఆశాజనకంగా ఉండటంతో ఏప్రిల్ 15 వరకు కొనసాగే అవకాశం ఉంది. సీసీఐ కేంద్రాలపై విజి‘లెన్స్’ ఆదోని అర్బన్: పట్టణంలోని సీసీఐ కేంద్రాల్లో శనివారం సాయంత్రం విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఎన్డీబీఎల్, ధారశ్రీ పరిశ్రమల్లో ఏర్పాటు చేసిన సీసీఐ కేంద్రాల్లో దూదిబేళ్లను, జిన్నింగ్ నడిచే విధానాన్ని, రికార్డులను కర్నూలు విజిలెన్స్ ఎస్పీ చౌడేశ్వరి, ఏఓ విశ్వనాథ్ తనిఖీ చేశారు. స్థానిక సీసీఐ అధికారి భరత్ను, మార్కెట్యార్డు సెక్రటరీ రామ్మోహన్రెడ్డిలను వివరాలను అడిగి తెలుసుకున్నారు. నదుల పూడ్చివేతను ఆపాలి కర్నూలు(సెంట్రల్): నగరంలోని హంద్రీ, తుంగభద్ర నదుల పూడ్చివేతను అధికారులు ఆపాలని తుంగభద్ర, హంద్రీ, కేసీ కెనాల్ పరిరక్షణ కమిటీ సభ్యులు కోరారు. ఆదివారం వారు నదుల్లో పూడ్చిన ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ కమిటీ కన్వీనర్ బస్తిపాటి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. నదులను పూడ్చి రోడ్ల విస్తరణ, నగర సుందరీకరణ పనులు చేపట్టడం భావ్యం కాదన్నారు. ఇటీవల తుంగభద్ర, హంద్రీ నదుల్లో పలు చోట్ల మట్టితో నింపేయడం సరికాదన్నారు. నదుల పరిరక్షణ కు పాటు పడాల్సిన అధికారులు దగ్గరుండి మరీ పనులు చేయించడం దారుణమన్నారు. ‘పది’ విద్యార్థులకుఉచిత బస్సు ప్రయాణంకర్నూలు సిటీ: పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులకు ఉచితంగా ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని కల్పించనున్నట్లు డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ కె.సుధారాణి తెలిపారు. ఈ నెల 17 నుంచి 31వ తేదీ వరకు జరుగనున్న పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు బస్సుల్లో హాల్ టికెట్ చూపితే ఉచితంగా ప్రయాణం చేయవచ్చునన్నారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లెవెలుగు బస్సుల్లో నివాస ప్రాంతం నుంచి పరీక్ష కేంద్రాలకు, పరీక్ష కేంద్రాల నుంచి నివాసానికి చేరుకునేందుకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశామని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నిర్దేశించిన సమయానికి కేంద్రాలకు చేరుకునేందుకు పరీక్ష సమయంలో మాత్రమే బస్సు సౌకర్యం ఉంటుందన్నారు. ఒక వేళ ఏ కారణం చేతనైన పరీక్షను రద్దు చేస్తే పరీక్ష నిర్వహించిన రోజు సదుపాయం కల్పించడం జరుగుతుందన్నారు. -
‘స్కానింగ్’ కష్టాలు
● గర్భిణులకు తప్పని తిప్పలు ● నంద్యాల జిల్లా ఆసుపత్రిలో రేడియాలజిస్టులు కరువు ● పట్టించుకోని అధికారులుగోస్పాడు: జిల్లా ఆసుపత్రిలో స్కానింగ్ సెంటరు తలుపులు తెరచుకోవడం లేదు. దీంతో గర్భిణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నంద్యాల జిల్లా ఆసుపత్రికి జిల్లా ప్రజలతో పాటు అత్యవసర పరిస్థితుల్లో సమీప జిల్లాలైన వైఎస్సార్, ప్రకాశం సరిహద్దు ప్రాంతాల నుంచి కూడా రోగులు వస్తుంటారు. ప్రతిరోజు 1,100 నుంచి 1,300 మందితో ఓపీ రద్దీగా కనిపిస్తుంది. ప్రతిరోజు ఇక్కడికి గర్భిణులు, బాలింతలు 70 మందికి పైగా చికిత్స పొందేందుకు వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. వీరితోపాటు అత్యవసర వైద్య సేవలు పొందేందుకు వచ్చే వారికి కూడా కొన్ని సందర్భాలలో వ్యాధి నిర్ధారణకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షలు చేయించాలని అక్కడి వైద్యులు సూచిస్తుంటారు. అయితే గర్భిణులు, బాలింతలుతోపాటు రోగాలతో వచ్చే పేద ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇదీ సమస్య.. జిల్లా ఆసుపత్రిలో ముగ్గురు సీనియర్ రెసిడెంట్లు, ఒకరు అసోసియేట్, ఒక అసిస్టెంటు ప్రొఫెసర్ ఉండాలి. ప్రస్తుతం ఒక్కరూ కూడా పనిచేసేవారు లేరని స్థానిక వైద్యాధికారులు చెబుతున్నారు. గతంలో కొంతకాలం పాటు సీనియర్ రెసిడెంట్ సేవలందించేవారు. ప్రస్తుతం ఎవరూ లేక నెలలు గడుస్తుంది. దీంతో అవసరమైన సందర్భాలలో మాత్రమే తప్పని పరిస్థితులలో స్కానింగ్ పరీక్షలకు రాయాల్సి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ● అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షలను ప్రతిరోజూ వందకు పైగా చేయించాల్సి ఉంది. అయితే స్కానింగ్ కేంద్రంలో రేడియాలజిస్టులు లేదు. దీంతో వైద్యుల సూచన మేరకు పేదవారు ఉసూరుమంటూ పట్టణంలోని ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. వందలాది రూపాయలను ఖర్చుచేస్తూ చేతిలో ఉన్న అరకొర సొమ్మును కాజేసుకొని అవస్థలు పడుతున్నారు. దోపిడీ ఇలా.. ఒక్కో స్కానింగ్కు రూ.700 నుంచి రూ.వెయ్యి వరకు ఖర్చుచేయాల్సి వస్తుంది. ఒక్కో స్కానింగ్ సెంటరులో ఒక్కో విధంగా ప్రజల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. రోజుకు వంద మందికి పైగా స్కానింగ్లకు వెళ్లాల్సి వస్తుండటంతో పట్టణంలోని ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లను రోగులు ఆశ్రయిస్తున్నారు. దీంతో పేదప్రజల అవసరాలను ఆసరా చేసుకున్న కొన్ని స్కానింగ్ సెంటర్లు దోపిడీ చేస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. స్కానింగ్ సెంటర్లలో ఇష్టారాజ్యంగా తీసుకునే ఫీజుల్లో వ్యత్యాసం జరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఉన్నతాధికారులకు నివేదించాం ఆసుపత్రిలో రేడియాలజిస్టుల కొరతగా ఉంది. జిల్లా ఆసుపత్రికి రోగుల సంఖ్య అధికంగానే ఉంటుంది. వ్యాధి నిర్ధారణకు కొన్ని సమయాల్లో తప్పనిసరిగా స్కానింగ్ పరీక్షలు అవసరమవుతుంది. అలాంటి సమయాల్లో పేషెంటుకు స్కానింగు పరీక్ష చేయించుకోవాలని సూచిస్తుంటాం. ఇక్కడ స్కానింగ్ పరికరాలు అందుబాటులో ఉన్నా సిబ్బంది లేక ఇబ్బందిగా ఉంది. ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించాలని కోరాం. – డాక్టర్ జిలానీ, ఇన్చార్జి సూపరింటెండెంట్, జిల్లా ఆసుపత్రి, నంద్యాల -
బహుళ ప్రయోజనాల లక్ష్యంతో నెలకొల్పి న చెత్త సంపద కేంద్రాల్లో నిర్లక్ష్యం పేరుకుపోయింది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం.. గ్రామాలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యం నీరుగారిపోయింది. ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమం ర్యాలీలు, ప్రత
ఆళ్లగడ్డ: కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో చెత్త సంపద తయారీ కేంద్రాలు నిరుపయోగంగా మారాయి. రూ.కోట్లు పెట్టి నిర్మించిన షెడ్లు దిష్టి బొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. జిల్లాలో 28 మండలాల పరిధిలో 488 గ్రామ పంచాయతీలు ఉండగా 363 పంచాయతీల్లో చెత్త నుంచి సంపద తయారీ చేసే కేంద్రాలు నిర్మాణాలు పూర్తయ్యాయి. వీటికి గ్రామీణ ఉపాధిహామీ నిధుల నుంచి సుమారు రూ 33.12 కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించినట్లు సమాచారం. చెత్త సేకరణకు జనాభా ప్రాతిపదికన కార్మికులను నియమించారు. పంచాయతీలకు ట్రాక్టర్లు, ఆటోలు, రిక్షాలను ఏర్పాటు చేశారు. కార్మికులకు నెలకు రూ. 6 వేల వేతనంతో పాటు వాహనాల డీజిల్కు ఖర్చు చేస్తున్నారు. ఇంటింటా రెండు చెత్త బుట్టలు చొప్పున పంపిణీ చేశారు. క్షేత్రస్థాయిలో గ్రామ కార్యదర్శులు, మండల అధికారులు వాటి నిర్వహణ పట్టించుకోక పోవడంతో ఇలా నెలలా కోట్లాది రూపాయలు ఖర్చు అవుతున్నా ఏ ఒక్క కేంద్రంలో కిలో ఎరువు తయారు చేసిన దాఖలాల్లేవు. ఇప్పటికై నా అధికారులు సమన్వయంతో దృష్టి సారిస్తే చెత్తతో సంపద తయారు చేయాలన్న పరమార్థానికి అర్థం.. పంచాయతీలకు ఆదాయం.. ప్రజలకు ఆరోగ్యం చేకూరుతాయని ప్రజలు కోరుకుటున్నారు. ముక్కు మూసుకుని ర్యాలీలు.. గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజా ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. పారిశుద్ధ్య కార్యక్రమాలపై అధికారులు, ప్రజా ప్రతినిధులు నిత్యం పర్యవేక్షించాలి. గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుపడాలని ప్రతి మూడో శనివారం ప్రతి గ్రామంలో విద్యార్థులతో ర్యాలీలు, అనంతరం ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. అయితే అధికారులు, పాలకులు కేవలం ప్రతిజ్ఞకే పరిమితమవుతున్నారు తప్పా.. వారు ర్యాలీ చేసే సమయంలో రహదారుల వెంట చెత్త కుప్పల గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రీన్ అంబాసిడర్లను తొలగించి టీడీపీ కార్యకర్తలను నియమించుకుంది. దీంతో అధికార పార్టీ నేతల నుంచి ఒత్తిడి వస్తుందన్న భయంతో తమ ఎందుకులేనని అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్వచ్ఛ లక్ష్యం.. ఆచరణ శూన్యం పారిశుద్ధ్యం పనులు ప్రతిజ్ఞకే పరిమితం మూలన పడిన చెత్త సంపద కేంద్రాలు గ్రీన్ అంబాసిడర్లకు సక్రమంగా అందని వేతనం పేరుకు పోతున్న చెత్తకుప్పలు -
శేష శైలావాసా.. అహోబిలేశా!
● వైభవోపేతం అహోబిలేశుడి బ్రహ్మోత్సవం ● శేషవాహనంపై దర్శనమిచ్చిన ప్రహ్లాదవరదుడు ● శరభ ప్రభ వాహనంపై ఊరేగిన జ్వాలా నరసింహుడుఆళ్లగడ్డ: ప్రహ్లాదవరదుడు చిన్ని కృష్ణుడయ్యాడు. ఆదిశేషునిని వాహనంగా చేసుకుని నవనీత కృష్ణావతారంలో మాడ వీధుల్లో ఉభయ దేవేరులతో కలసి విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు. నెమలి పింఛం, ప్లిలనగ్రోవితో కృష్ణుడి రూపంలో భక్తులను మంత్రముగ్దులను చేశారు. అహోబిలంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు దిగువ అహోబిలంలో ఆదివారం ఉదయం ఉత్సవమూర్తులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదుడిని యాగశాలలో కొలువుంచి పట్టు వస్త్రాలతో అలంకరించి కొలువుంచారు. అనంతరం వివిధ స్వర్ణాభరణాలు ధరించిన ప్రహ్లాదవరదుడు విశేషంగా ముస్తాబైన ఉభయ దేవేరులతో తొమ్మిది తలల శేషవాహనం అధిష్టించి మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. మధ్యాహ్నం ఉత్సవమూర్తులను యాగశాలలో కొలువుంచి పంచామృతాలతో అభిషేకించి తిరుమంజనం నిర్వహించి అద్దాల మండపంలో కొలువుంచారు. రాత్రి శ్రీ ప్రహ్లాదరవదస్వామి చంద్రప్రభ వాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. ఎగువ అహోబిలంలో.. ఉత్సవాల్లో భాగంగా ఎగువ అహోబిలంలో కొలువైన జ్వాలా నరసింహస్వామి ఆదివారం శరభ వాహనాన్ని అధిష్టించి భక్తులను అనుగ్రహించారు. ఉదయం నిత్య పూజల అనంతరం ఉత్సవ మూర్తులైన జ్వాలా నరసింహస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి ఉత్సవం నిర్వహించారు. మధ్యాహ్నం ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. రాత్రి స్వామి వారు శరభ వాహనంపై కొలువు కాగా గ్రామోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఎగువ అహోబిలంలో పొన్నుచెట్టువాహన సేవ, దిగువ అహోబిలంలో మోహిని అలంకారం, మధ్యాహ్నం అభిషేకం, రాత్రి శరభ వాహన సేవలు ఉంటాయి. -
సర్దుబాటు పేరిట భారం తగదు
రెండు మూడేళ్ల క్రితం వినియోగించిన కరెంటుకు కూడా ఇప్పుడు సర్దుబాటు పేరుతో భారం వేయడం తగదు. మే ము ఫిబ్రవరిలో 96 యూనిట్ల కరెంటు మాత్రమే వా డాము. ఇందుకు చార్జీ రూ.206, ఫిక్స్డ్ చార్జి రూ.10, కస్టమర్ చార్జీ రూ.40 మాత్రమే చెల్లించా ల్సి ఉంది. అయితే రూ.520 బిల్లు ఇచ్చారు. 2022–23 సంవత్సరాల్లో వాడిన ప్రతి యూనిట్కు నిబంధనల ప్రకారం బిల్లు చెల్లించాం. ఇప్పుడు మళ్లీ అదనపు చార్జీలు వసూలు చేయడం దారుణం. – గోవిందరాజులు, రాంపురం, తుగ్గలి మండలం చార్జీలు పెంచమని మోసగించారు కూటమి నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ చార్జీలు పెంచమని చెప్పి ఇప్పుడు మోసం చేస్తున్నారు. మేము 135 యూనిట్ల విద్యుత్ వాడాము. ఇందుకు రూ.477 చార్జి, ఫిక్స్డ్ చార్జి రూ.10, కస్టమర్ చార్జి రూ.40తో కలిపి చెల్లించాల్సి ఉంది. అయితే 2022 బకాయి అని రూ.103, 2023 బకాయి అని రూ.57, తాజా వాడకానికి సంబంధించి రూ.33.50, సర్చార్జి రూ.25, ట్రూ అప్ చార్జి రూ.52 భారం వేశారు. మొత్తం 830 బిల్లు చెల్లించాల్సి వచ్చింది. వాడిన వినియోగానికి ఇది రెట్టింపు. – సగిలే కృష్ణారెడ్డి, లింగాపురం, బండిఆత్మకూరు ● -
మద్దిలేటయ్యకు ఒక్క రోజు ఆదాయం రూ.3.28 లక్షలు
బేతంచెర్ల: ఆర్ఎస్ రంగాపురం శివార్లో వెలసిన ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రంలో కొలువైన శ్రీలక్ష్మీ మద్దిలేటి నరసింహస్వామికి శనివారం రూ.3,28,415 ఆదాయం వచ్చినట్లు ఉప కమిషనర్, ఆలయ ఈఓ రామాంజనేయులు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షకు 461 మంది గైర్హాజరు నంద్యాల(న్యూటౌన్): జిల్లాలోని 53 పరీక్ష కేంద్రాల్లో శనివారం నిర్వహించిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు 461 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఐఈఓ సునిత తెలిపారు. మ్యాథ్స్, జువాలజీ, హిస్టరీ పరీక్షకు 13,862 మందికి గాను 13,401 మంది హాజ రు కాగా 461 మంది గైర్హాజరయ్యారన్నారు. అలాగే ఒకేషనల్ పరీక్షకు 1,497 మందికి గాను 1,383 మంది హాజరు కాగా 114 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. పట్టణంలోని బాలికల మహిళా కళాశాల, బాలికల ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాలను పరిశీలించామన్నారు. విద్యార్థులకు నీటి సమస్య తలెత్తితే చర్యలు తప్పవని హెచ్చరించారు. పొట్టేళ్లు అ‘ధర’ హో.. కోడుమూరు రూరల్: బర్డ్ఫ్లూ నేపథ్యంలో చాలామంది ప్రజలు చికెన్ను వదిలేసి మటన్ వైపు మొగ్గు చూపుతున్నారు. రంజాన్ నెల ప్రారంభం కావడంతో పొట్టేళ్లకు గిరాకీ పెరిగింది. చిన్న సైజు పొట్టేలు ధర కూడా రూ.10వేలకు పైనే పలుకుతోంది. శనివారం కోడుమూరులో జరిగిన సంతలో ఒక్కో పొట్టేలు సైజును బట్టి రూ.10వేల నుంచి రూ.20వేలకు పైగా పలికింది. పొట్టేళ్ల ధరలు భారీగా ఉన్నప్పటికీ ప్రజలు కొనేందుకు ఎగబడ్డారు. -
లోక్ అదాలత్తో సత్వర న్యాయం
నంద్యాల(వ్యవసాయం): లోక్ అదాలత్తో కక్షిదారులకు సత్వర న్యాయం లభిస్తుందని మూడవ అదనపు జిల్లా జడ్జి, లోక్ అదాలత్ చైర్మన్ వాసు, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి రాధారాణి, ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ జడ్జి లక్ష్మి అన్నారు. శనివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని కోర్టు ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లోక్ అదాలత్ కార్యక్రమంలో నంద్యాల పరిధిలో అత్యధిక సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యాయన్నారు. ఎస్టీసీ కేసులు 694, సీసీ కేసులు 66, సివిల్ కేసులు 27, ఎంసీ 2, డీవీసీ 2, ఎన్ఐయాక్ట్ 16, ఎకై ్సజ్ 101, ఎంవీఓపీ 39, అడ్మిషన్ కేసులు 74, ఈపీ 15 కేసులు చొప్పున మొత్తం 1,021 కేసులు పరిష్కారం కావడంతో పాటు పలు కేసుల్లో కక్షిదారులకు రూ.3.76 కోట్ల పరిహారం అందించామన్నారు. చిన్న చిన్న సమస్యలకు న్యాయస్థానాలను ఆశ్రయించకుండా లోక్ అదాలత్కు వెళ్తే సమయం, డబ్బు ఆదా అవుతుందన్నారు. రాజీ కాగల కేసుల పరిష్కారం కోసం న్యాయవాదులు, పోలీసులు ఎంతో కృషి చేస్తున్నట్లు వారు తెలిపారు. కుటుంబ కలహాల వలన భార్యాభర్తలు కోర్టును ఆశ్రయిస్తే పిల్లల భవిష్యత్తు దెబ్బ తింటుందన్నారు. కార్యక్రమంలో ఏజీపీ జగన్మోహన్ రెడ్డి, వివేకానందరెడ్డి, పీపీ శ్రీనివాసులు, రావినూతల దుర్గాప్రసాద్, విజయశేఖర్రెడ్డి, భూపని వెంకటేశ్వర్లు, అడ్డగాళ్ల వెంకటేశ్వర్లు, ఓబుల్ రెడ్డి, చంద్రశేఖర్ తదితర సీనియర్, జూనియర్ లోక్అదాలత్ సిబ్బంది రామచంద్రారెడ్డి, ఉమామహేశ్వరి పాల్గొన్నారు. పది వేల కేసుల పరిష్కారం కర్నూలు (టౌన్): జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో పది వేలకు పైగా కేసులు పరిష్కారం జరిగినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 22 చోట్ల జాతీయ లోక్ అదాలత్ బెంచీలు ఏర్పాటు చేసి కక్షిదారుల కేసులు పరిష్కారం చేసినట్లు చెప్పారు. కర్నూలులో 5 బెంచీలు ఏర్పాటు చేసి న్యాయమూర్తులు జి.భూపాల్ రెడ్డి, లక్ష్మిరాజ్యం, జ్యోత్స్నాదేవి, ఎం.సరోజనమ్మ, విశ్రాంత న్యాయమూర్తి లక్ష్మినరసింహారెడ్డి 4,500 కేసులు పరిష్కారం చేశారన్నారు. నంద్యాలలో 1,021, ఆదోనిలో 432, ఆళ్లగడ్డలో 554, ఆలూరులో 291, ఆత్మకూరులో 319, బనగానపల్లెలో 714, డోన్లో 630, కోవెలకుంట్లలో 402, నందికొట్కూరులో 266, పత్తికొండలో 427, ఎమ్మిగనూరులో458 కేసులు పరిష్కారం చేసినట్లు తెలిపారు. -
హనుమంత వాహనంపై అహోబిలేశుని వైభవం
ఆళ్లగడ్డ: అహోబిలేశుడు శనివారం ఎగువలో శేష, చంద్రప్రభ వాహనాల్లో, దిగువలో శ్రీ యోగానృసింహ గరుడ విమానం, హనుమంత వాహనాలపై ఉభయ దేవేరులతో కలసి మందస్మిత దరహాస వీచికలతో దర్శనమిచ్చారు. భక్తుల గోవింద నామస్మరణతో నల్లమల పులకించి పోయింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు శనివారం ఎగువ అహోబిలంలో శ్రీ జ్వాలా నరసింహస్వామి శేష వాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ జ్వాలా నారసింహ స్వామిఅమ్మవార్లకు నిత్య పూజల్లో భాగంగా తెల్లవారు జామున మేలుకొలుపు వేద మంత్రోచ్ఛారణలతో అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం విశేష పుష్పాలంకరణ గావించిన శేష వాహనంపై ఉభయ దేవేరులతో కొలువైన జ్వాలా నరసింహుడు మంగళ వాయిద్యాలతో మాడ వీధుల్లో వివహరిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మధ్యాహ్నం ఉత్సవమూర్తులకు పంచామృతాభిషేకం నిర్వహించారు. రాత్రి జ్వాలా నారసింహుడు చంద్రప్రభ వాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. దిగువ అహోబిలంలో.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజైన శనివారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదస్వామి శ్రీ యోగానృసింహ గరుడ విమానంపై కొలువై విహరించారు. అంతకు ముందు ఉత్సవ మూర్తులు శ్రీ ప్రహ్లాదవరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను యాగశాలలో కొలువుంచి జలాభిషేకం నిర్వహించారు. అనంతరం నూతన పట్టువస్త్రాలు, వజ్ర, వైడూర్యాలు పొదిగిన బంగారు అభరణాలతో ప్రత్యేకంగా ముస్తాబైన ప్రహ్లాదవరదుడు ఉభయ దేవేరులతో శ్రీ యోగనృసింహ గరుడ విమానం వాహనం అధిరోహించారు. మాడ వీధుల్లో స్వామి అమ్మవార్లు వైభవో పేతంగా ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు. మధ్యాహ్నం పంచామృతాభిషేకం, జలాభిషేకం నిర్వహించి స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించిన అద్దాల మండపంలో కొలువుంచారు. రాత్రి శ్రీ ప్రహ్లాదరవదస్వామి హనుమంతు వాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. అహోబిలంలో నేడు.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎగువ అహోబిలంలో ఆదివారం ఉదయం ఉత్సవం, మధ్యాహ్నం అభిషేకం, రాత్రి శరభ వాహన సేవ, దిగువ అహోబిలంలో ఉదయం శేషవాహన సేవ, మధ్యాహ్నం అభిషేకం, రాత్రి చంద్రప్రభ వాహన సేవ నిర్వహించనున్నారు. -
స్వయంశక్తితో రాణించాలి
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న కలెక్టర్, ఎంపీ తదితరులునంద్యాల: మహిళలు స్వయం శక్తితో ఎదిగి సాధికారత దిశగా అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. శనివారం నంద్యాల పట్టణంలోని ఎల్కేఆర్ ఫంక్షన్ హాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంపీ బైరెడ్డి శబరి, కలెక్టర్ రాజకుమారి, జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్, యూనియన్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ నరసింహారావు తదితరులు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పురుషులతో సమానంగా మహిళలకు సమాన హక్కులు, వేతనాలు, ఓటు తదితర అంశాలపై ప్రపంచ పోరాటాల నేపథ్యంలోనే భాగంగా ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామన్నారు. ప్రతి ఇంటి నుండి ఒక పారిశ్రామిక వేత్త వచ్చి దేశ, రాష్ట్ర భవిష్యత్తుకు పునాదులు వేయాలన్నారు. ఎంపీ బైరెడ్డి శబరి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు అత్యున్నత స్థానం కల్పించి వారికి చేయూతనిచ్చేందుకు అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. అంతకు ముందు ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు, మహిళా సంఘాల చేతివృత్తుల వస్తువుల ప్రదర్శనశాలలను కలెక్టర్ ఎంపీ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మహిళలు, విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక, సంప్రదాయ నృత్యాలు ప్రేక్షకులను అలరించాయి. జిల్లా కలెక్టర్ రాజకుమారి -
ముట్టుకుంటే షాక్
● విద్యుత్ వినియోగదారుల నిలువు దోపిడీ ● 2022, 2023, 2025 సంవత్సరాల్లో వాడిన విద్యుత్కు ప్రతి యూనిట్పై 40పైసల వడ్డింపు ● ట్రూ అప్ చార్జీలతో మరో అదనపు భారం ● బిల్లులను చూసి బెంబేలెత్తుతున్న ప్రజలు కర్నూలు(అగ్రికల్చర్): వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు విద్యుత్ చార్జీలపై టీడీపీ, జనసేనలు చేసిన దుష్ప్రచారం అంతాఇంతా కాదు. అడ్డుగోలుగా చార్జీలు పెంచి మోయలేని భారం వేస్తున్నారని ప్రజలను నమ్మించి ఎన్నికల్లో లబ్ధి పొందడం తెలిసిందే. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత వి నియోగదారులపై విద్యుత్ చార్జీల భారం మోపం, చార్జీలు తగ్గిస్తాం తప్ప పెంచబోమనే ప్రచారాన్ని ఊదరగొట్టారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తొమ్మిది నెలల్లోనే విద్యుత్ వినియోగదారులు చుక్కలు చూస్తున్నారు. సామాన్య ప్రజలు మొదలు అన్ని వర్గాల వారిపై మోపిన విద్యుత్ చార్జీల భారం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మొదటి ఏడాదిలోనే విద్యుత్ చార్జీల భారం ఈ స్థాయిలో ఉంటే, రానున్న నాలుగేళ్లలో పరిస్థితి ఊహించుకుంటేనే షాక్ కొడుతోంది. ప్రతి నెలా క్రమం తప్పకుండా విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నా.. ఒక్కరోజు ఆలస్యమైతే చాలు సర్చార్జీ పేరిట జరిమానా విధిస్తున్నారు. మళ్లీ సర్దుబాటు తదితర పేర్లతో 2022, 2023 సంవత్సరాల్లో వినియోగించిన విద్యుత్కు కూడా నేడు చార్జీ వేస్తుండటం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. కూటమి ప్రభుత్వ ‘షాక్’ ఇలా వినియోగదారుడు ఒక నెలలో 125 యూనిట్లు వినియోగిస్తే మొదటి మూడు శ్లాబ్ల ప్రకారం బిల్లు రూ.417 వస్తుంది. దీనికి కస్టమర్ చార్జీ రూ.45, ఫిక్స్డ్ చార్జీ రూ.20, ఈడీ చార్జీ రూ.7.50 వసూలు చేస్తారు. అన్నీ కలిపి 125 యూనిట్లకు చెల్లించాల్సిన బిల్లు రూ.489.5 మాత్రమే. ఇదే 125 యూనిట్లకు కూటమి ప్రభుత్వం వసూలు చేస్తున్న మొత్తం రూ.850. అంటే బిల్లుపై అదనంగా రూ.361 భారం మోపుతోంది. విద్యుత్ వినియోగం పెరిగే కొద్దీ భారం తడిచి మోపెడవుతుంది. భారం ఇలా పడుతోంది.. విద్యుత్ చార్జీల భారం వివిధ రూపాల్లో పడుతోంది. 2022, 2023, 2025 సంవత్సరాలకు సంబంధించి సర్దుబాటు పేరుతో ఎఫ్పీపీసీఏ వసూలు చేస్తున్నారు. ఆయా సంవత్సరాల్లో నెల వారీగా వినియోగించిన యూనిట్లపై 40 పైసల ప్రకారం భారం పడుతోంది. ఎలక్ట్రిసిటీ డ్యూటీ, ట్రూ అప్ చార్జీలు కూడా వసూలు చేస్తున్నారు. ప్రజలను ఈ చార్జీలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సగటున ప్రతినెలా రూ.95కోట్లకు పైనే భారం సంక్షేమ పథకాల ఊసే లేకపోవడం వల్ల ప్రజల్లో నగదు సర్క్యులేషన్ గణనీయంగా తగ్గిపోయింది. మళ్లీ పేదరికం పురుడుపోసుకుంటోంది. ఇప్పటికే ఎన్నికల హామీలను పక్కనపెట్టిన ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ చార్జీల పేరిట అదనపు భారం మోపుతోంది. ఉమ్మడి జిల్లాలో 15.85 లక్షల గృహ విద్యుత్ కలెక్షన్లు ఉన్నాయి. ఈ లెక్కన ఒక్కో కనెక్షన్కు సగటున రూ.600 అదనపు భారం లెక్కకట్టినా ప్రతి నెలా రూ.95కోట్లకు పైనే ముక్కుపిండి వసూలు చేస్తుండటం గమనార్హం. రూ.542 అదనపు బిల్లు ఫిబ్రవరి నెలలో 145 యూనిట్లు వినియోగించాం. విద్యుత్ చార్జీ రూ.537 వచ్చింది. ఫిక్స్డ్ చార్జీ రూ.50, కస్టమర్ చార్జీ రూ.50 వేశారు. మామూలుగా అయితే రూ.637 బిల్లు చెల్లించాల్సి ఉంది. అయితే 2022 సంవత్సరం ఫిబ్రవరి నెలకు సంబంధించి ఎఫ్పీపీసీఏ రూ.307.07, 2023 సంవత్సరం ఫిబ్రవరి నెల ఎఫ్పీపీసీఏ రూ.166.20, 2025 సంవత్సరం ఫిబ్రవరి నెల ఎఫ్పీపీసీఏ రూ.59.60, ఎలక్ట్రిసిటీ డ్యూటీ రూ.8.70 ప్రకారం అదనపు భారం పడింది. మొత్తంగా వచ్చిన బిల్లు రూ.1,179. – బి.నాగలక్ష్మి, కర్నూలు -
అహోబిలంలో బీ – ట్యాక్స్ మీ ఘనత
ఆళ్లగడ్డ: ఎక్కడి నుంచో ఓ వ్యక్తిని ఇక్కడికి తీసుకొచ్చి బీ– ట్యాక్స్ వసూలు చేస్తున్న ఘనత మీదంటూ ఎమ్మెల్యే అఖిలప్రియపై ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి మండిపడ్డారు. అహోబిలం క్షేత్రం ఎవరి హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందో బహిరంగ చర్చకు సిద్ధమా.. అని సవాల్ విసిరారు. శనివారం ఆయన అహోబిలం చేరుకుని బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అహోబిల క్షేత్రం ఏమాత్రం అభివృద్ధి చెందలేదని, అంతా తమ టీడీపీ పాలనలోనే జరిగిందని ఎమ్మెల్యే మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఆమె మంత్రిగా ఉన్న సమయంలో క్షేత్రంలో కనీసం ఒక్క రోడ్డు అయినా వేశారా అని ప్రశ్నించారు. ఆళ్లగడ్డ నుంచి అహోబిలం వరకు బీటీ రోడ్డు, మాడ వీధుల్లో సీసీ రోడ్లు అన్ని తమ ప్రభుత్వంలో వేసినవే అని గుర్తు చేశారు. సొంత పార్టీ కార్యకర్తలను సైతం రాబంధుల్లా పీక్కు తింటుండటంతో చెప్పుకోలేక సిగ్గుతో తలదించుకుంటున్నారన్నారు. నాడు తిరుమల లడ్డూపై రాద్దాంతం చేసి నేడు అహోబిలేశుడికి వారం రోజుల పాటు నైవేద్యం దూరం చేసిన చరిత్ర వారేదన్నారు. చివరకు బ్రహ్మోత్సవాల సందర్భంగా పందిళ్లు వేసే వారితో కూడా కమీషన్లు నొక్కడం అందరికీ తెలుసునన్నారు. మాన్యం భూముల వేలం పాట నిధులు ఏడాదైనా దేవస్థానానికి ఎందుకు చెల్లించ లేదన్నారు. టోల్గేట్ను ఎంతకు అమ్ముకున్నారు.. ఆ డబ్బులు ఎవరు తింటున్నారో స్థానికులు ఆలోచన చేయాలన్నారు. టీడీపీ నేతల అక్రమాలను వెలుగులోకి తెస్తున్న విలేకరులను బెదిరించాలని చూడటం సరికాదన్నారు. విలేకరులను భయపెట్టాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. అహోబిలేశుని పార్వేట పల్లకీ ఎలా వెళ్లాలి అన్నది కూడా మీరు నిర్ణయిస్తారా అని ప్రశ్నించారు. అనాదిగా వస్తున్న ఆచారాలను సైతం పాటించకపోవడం విడ్డూరమన్నారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ నాయకులు భూమా కిషోర్రెడ్డి, గంధం రాఘవరెడ్డి, వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు నాసారి వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. మంత్రిగా ఉండి ఒక్క రోడ్డు కూడా వేయలేక పోయావు వారం రోజులు దేవుడికి నైవేద్యం దూరం చేసినది మీరు కాదా? ఎమ్మెల్యే అఖిలప్రియపై మండిపడిన మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి -
గవర్నర్ను కలసిన ఆర్యూ వీసీ
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ వి.వి.బసరావు శుక్రవారం రాజ్భవన్లో రాష్ట్ర గవర్నర్, వర్సిటీ చాన్సలర్ ఎస్.అబ్దుల్ నజీర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్యూ అభివృద్ధికి రాజ్భవన్ సహాయ సహకారాలు ఉంటాయని గవర్నర్ హామీ ఇచ్చినట్లు వీసీ పేర్కొన్నారు. వర్సిటీలో విద్యా ప్రమాణాలు మెరుగు పరచడంపై దృష్టి సారించాలని సూచించారన్నారు. విద్యా రంగంలో ఉమ్మడి జిల్లాను ఉన్నత స్థానంలో నిలిపేందుకు కృషి చేయాల్సిందిగా సూచించారని పేర్కొన్నారు. ముగిసిన వాదనలు కర్నూలు(టౌన్): సినీ నటుడు పోసాని కృష్ణమురళీకి సంబంధించి బెయిల్ పిటిషన్ వాదనలు శుక్రవారం ఆదోని కోర్టులో ముగిసాయి. కర్నూలు జిల్లా జైలులో రిమాండ్లో ఉన్న పోసానికి బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తరపు న్యాయవాదులు సువర్ణ రెడ్డి వేసిన పిటిషన్పై కోర్టులో వాదనలు జరిగాయి. ప్రాసిక్యూషన్ తరపున ఆదోని సీనియర్ ఏపీపీ వాదించారు. సుదీర్ఘంగా రెండు గంటల పాటు ఇరువురి వాదనలు సాగాయి. బెయిల్ పిటిషన్కు సంబంధించి కోర్టు తీర్పును రిజర్వు చేసింది. అలాగే పోలీసు కస్టడీకి సంబంధించి సోమవారం ఉత్తర్వులు జారీ చేస్తామని మొదటి అదనపు జ్యుడీషిషల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ అపర్ణా వెల్లడించారు. ఉచిత శిక్షణ దరఖాస్తుల ఆహ్వానం నంద్యాల(అర్బన్): డీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఆన్లైన్ ద్వారా ఉచిత శిక్షణ ఇచ్చేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి లక్ష్మిదేవి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీసీ, ఈబీసీ కేటగిరిలకు చెందిన అభ్యర్థులు ఈనెల 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. టెట్ అర్హత సాధించిన అభ్యర్థులు సొంత జిల్లాలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. జిల్లా నంద్యాలలో దరఖాస్తులు పొందిన వారు స్థానిక బొమ్మలసత్రం వద్ద ఉన్న ఓల్డ్ బీఎస్ఎన్ఎల్ క్వార్టర్స్ సీ బ్లాక్లో అందజేయాలన్నారు. అక్రమణను అడ్డుకున్న మహిళలు సంజామల: పేరుసోముల గ్రామంలో టీడీపీ నాయకులు ఆక్రమణను స్థానిక మహిళలు అడ్డుకున్నారు. శ్మశాన వాటిక రస్తా ఆక్రమణకు గురవుతుందని దాదాపు రెండు నెలల నుంచి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కొందరు తహసీల్దార్, కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేసినా చర్యలు తీసుకోలేదు. శ్మశాన వాటిక స్థలంలో శుక్రవారం ప్రహరీ నిర్మిస్తున్నారని తెలుసుకున్న మహిళలు అక్కడికి చేరుకుని కూల్చివేశారు. అనంతరం ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు కంబగిరి ఆధ్వర్యంలో మహిళలు తహసీల్దార్ అనిల్ కుమార్కు వినతి పత్రాన్ని అందించారు. ఆక్రమణదారుల నుంచి శ్మశాన వాటిక స్థలాన్ని రక్షించాలని కోరారు. -
ప్రేమ‘జంట’గా.. హృదయం బరువెక్కగా!
బొమ్మలసత్రం: బేతంచర్ల మండలం బుగ్గానిపల్లె తండాకు చెందిన రాజేష్నాయుడు, మాధురిబాయి ఎదురెదురు ఇళ్లలో నివాసం ఉంటున్నారు. ఇద్దరూ ఒకే ప్రైవేటు కళాశాలలో బీటెక్ చదువుతున్నారు. వీరిద్దరూ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. మూడు రోజుల క్రితం ఇద్దరూ కనిపించకుండా పోయా రు. దీంతో ఇరువురి కుటుంబ సభ్యులు ఆరా తీస్తే విషయం బయటపడింది. మాధురిబాయి తండ్రి ఓ ప్రభుత్వ ఉద్యోగి. ఆయన విన్నపం మేరకు త్రీటౌన్ పోలీసులు బుధవారం రాత్రి ప్రేమ జంటను స్టేషన్కు రప్పించారు. అయితే ఇరువురూ ఇష్టపూర్వకంగా వెళ్లినట్లు రాత పూర్వకంగా అంగీకరించారు. గురువారం ఉదయం తిరిగి ఇరువురి తరపు బంధువులు స్టేషన్లో పంచాయితీ పెట్టినా ఫలితం లేకపోయింది. ఈ విషయమై శుక్రవారం ఉదయం గ్రామంలో యువకుడి ఇంటి ముందు తమ కుమార్తెను మోసం చేసి పెళ్లిచేసుకున్నాడని యువతి కుటుంబ సభ్యులు గగ్గోలు పెట్టారు. సమాచారం తెలుసుకున్న సీఐ వెంకటేశ్వరరావు సిబ్బందితో అక్కడికి చేరుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పారు. టూటౌన్ పోలీస్టేషన్లో మూడో రోజు.. ఇదిలా ఉండగా గ్రామం నుంచి పంచాయితీ కోసం వచ్చిన ఇరువురి కుటుంబాలను పోలీసులు టూటౌన్కు రప్పించారు. అక్కడ సీఐ ఇస్మాయిల్, త్రీటౌన్ సీఐ కంబగిరిరాముడు కలిసి ప్రేమ జంటను పెద్దల ఎదుట నిలబెట్టారు. యువతి తను ప్రేమించిన యువకుడితోనే వెళ్లిపోతానని తెగేసి చెప్పడంతో యువతి తండ్రి కన్నీళ్లు పెట్టుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. బీటెక్ విద్యార్థుల ప్రేమ ‘పంచాయితీ’ మూడు రోజులుగా పోలీసుస్టేషన్ చుట్టూ ఇరు కుటుంబాలు అమ్మాయికి నచ్చజెప్పేందుకు తండ్రి కన్నీటి పర్యంతం అబ్బాయితోనే ఉంటానని తేల్చిచెప్పిన యువతి బరువెక్కిన హృదయంతో వెనుతిరిగిన తండ్రి మూడు రోజులుగా ఆ తండ్రి వేదన వర్ణనాతీతం. కంటికి రెప్పలా చూసుకున్న కుమార్తె నిన్న మొన్న పరిచయమైన ప్రేమకునితోనే ఉంటానని చెప్పడం ఆ హృదయాన్ని కలచివేసింది. కాళ్లావేళ్లా పడినా.. వాళ్లతో వీళ్లతో చెప్పించినా.. కుమార్తె మనసు కరగకపోవడంతో ఆ తల్లిదండ్రుల మనసు గాయపడింది. ప్రేమించడం తప్పుకాదు.. పెళ్లి చేసుకోవడం నేరం అంతకన్నా కాదు. కానీ పెద్దలను ఒప్పించి చేసుకున్నప్పుడే ఆ ప్రేమకు పరిపూర్ణత చేకూరుతుంది. ఇటీవల కాలంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఎన్నో జంటలు చిన్న చిన్న వివాదాలతో ప్రాణాలు తీసుకునే వరకు వెళ్లడం చూస్తే.. ఏ తల్లిదండ్రులకై నా ప్రేమ పెళ్లి గుండెను బరువెక్కించక మానదు. తెలిసీ తెలియని వయస్సులో ప్రేమలో పడటం.. జీవితంలో స్థిరపడకుండానే పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకోవడం తమ విజయంగా భావించడం యువతకు పరిపాటిగా మా రింది. ఏ తల్లిదండ్రులైనా తమ కుమార్తె సంతోషాన్నే కోరుకుంటారు. ఆడ..పిల్ల అయినప్పటికీ ఆ గజ్జెల సవ్వడితో మురిసిపోతారు. ఇలాంటి అమ్మానాన్నలు.. ప్రేమ వాకిట్లో కానివాళ్లుగా మారిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. -
ఆరేళ్ల కుమార్తెతో తండ్రి అదృశ్యం
కోవెలకుంట్ల: పట్టణంలోని ఆటో నగర్లో నివా సం ఉంటున్న ఓ వ్యక్తి తన ఆరేళ్ల కుమార్తెతో సహా అదృశ్యమయ్యాడు. శుక్రవారం ఎస్ఐ మల్లికార్జునరెడ్డి అందించిన సమాచారం మేరకు.. ఉయ్యాలవాడకు చెందిన ఉసేన్బాబుకు వైఎస్సార్ జిల్లా మైలవరం మండలం పొన్నంపల్లెకు చెందిన దస్తగిరమ్మతో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఆరేళ్ల కుమార్తె ధాత్రి ఉంది. కొన్ని సంవత్సరాల నుంచి ఉసేన్బాబు కోవెలకుంట్లలో స్థిరపడి దుర్గా ఫొటో స్టూడియోలో పనిచేస్తుండగా భార్య వ్యవసాయ పనులకు వెళుతూ కుటుంబాన్ని పో షించుకుంటున్నారు. ఈ నెల 3వ తేదీన ఉదయం దస్తగిరిమ్మ కూలీ పనికి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చే సరికి భర్త, కుమార్తె కన్పించలేదు. చుట్టుపక్కల, బంధువుల ఇళ్ల వద్ద విచారించినా ఆచూకీ లభ్యం కాలేదు. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో ఆందోళనతో పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
సంక్షేమానికి ‘కూటమి’ ఎగనామం
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి కర్నూలు(టౌన్): ‘సూపర్సిక్స్’ పేరిట మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ఎగనామం పెట్టిందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి విమర్శించారు. ‘సూపర్సిక్స్’ హామీల అమలుపై క్యాలెండర్ విడుదల చేసే దమ్ముందా అని ప్రశ్నించారు. కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్లోని తన చాంబర్లో శుక్రవారం విలేకరులతో ఎస్వీ మోహన్ రెడ్డి మాట్లాడారు. బడ్జెట్ ప్రసంగం అంతా అంకెల గారడీ తప్ప ఏమీ లేదన్నారు. ఉచిత ఆర్టీసీ బస్సు విషయంలోనూ చంద్రబాబు సర్కార్ మొండిచెయ్యి చూపిందన్నారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలంటే బడ్జెట్లో రూ.79 వేల కోట్లు కేటాయించాల్సి ఉందని, అయితే మొదటి బడ్జెట్లో రూ.7,282 కోట్లు, ఈ ఏడాది రూ.16,200 కోట్లు కేటాయించిందన్నారు. అసెంబ్లీలో గవర్నర్తో అబద్ధాలు చెప్పించడం చంద్రబాబు సర్కార్కే దక్కుతుందన్నారు. ఇంగ్లిషులో 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని గవర్నర్ బడ్జెట్ ప్రసంగంలో చదివితే తెలుగులో మాత్రం ఉద్యోగాల కల్పన చేస్తున్నట్లు ఉందన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిని విమర్శించే అర్హత కూటమి ప్రభుత్వానికి లేదన్నారు. మూడు ఆత్మలు ఘోషిస్తున్నాయి రాష్ట్రంలో టీడీపీ పాలనతో మూడు ఆత్మలు ఘోషిస్తున్నాయని, ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ తెలుసుకోవాలని ఎస్వీ మోహన్రెడ్డి అన్నారు. వెన్నుపోటుకు బలైన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్, హరికృష్ణ, నారా రామ్మూర్తి నాయుడుల ఆత్మలు ఘోషిస్తున్నాయన్నారు. ప్రశ్నించే వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను వేధించడం, భయభ్రాంతులకు గురిచేయడం నిజం కాదా అని ప్రశ్నించారు. గ్రామాల్లో తిరిగే కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేలను మహిళలు, రైతులు చొక్కా పట్టుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. -
ఉపాధి చూపండి.. సారా మానుకుంటాం!
కర్నూలు : ‘‘ఉపాధి చూపండి.. సారా తయారీ మా నుకుంటాం’’ అంటూ కర్నూలు బంగారుపేటలో నివాసముంటున్న నీలిషికారీల మహిళలు ఎకై ్సజ్ అధికారులను నిలదీశారు. ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన నవోదయం 2.0 పేరుతో బంగారుపేటలో అవగాహన సదస్సు నిర్వహించేందుకు ఎకై ్సజ్ అధికారులు ఏర్పాట్లు చేశారు. నోడల్ డిప్యూటీ కమిషనర్ పి.శ్రీదేవి, అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సుధీర్ బాబు, అసిస్టెంట్ సూపరింటెండెంట్లు రాజశేఖర్ గౌడ్, రామకృష్ణారెడ్డి తదితరులు శుక్రవారం కార్యక్రమానికి హాజరయ్యా రు. ఈ సందర్భంగా సభలో డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి మాట్లాడుతుండగా.. నీలిషికారీ మహిళలు ఒక్కసారిగా లేచి తాము ఎదుర్కొంటున్న సమస్యలు చెప్పుకొచ్చారు. ‘‘కొన్నేళ్ల నుంచి నీలి షికారీలుగా జీవనం సాగిస్తున్నాం.. ఎస్టీలుగా గుర్తించాలని కోరుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. చాలా మందికి ఆధార్ కార్డులు లేవు. కులం సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం లేదు’’ అని చెప్పారు. ‘ఉపాధి చూపండి.. సారా మానుకుంటాం’ అంటూ మహిళలు నిలదీయడంతో సదస్సులో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. నీలిషికారీ మహిళల నుంచి చుక్కెదురు కావడంతో సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి ప్రత్యామ్నాయ ఉపాధి చూపిస్తామంటూ అధికారులు హామీ ఇచ్చారు. దీంతో నీలిషికారీ మహిళలు శాంతించారు. నాటుసారాతో అనర్థాలను అధికారులు వివరించి.. సారా తయారీని మానుకుంటామంటూ మహిళల చేత ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సీఐలు చంద్రహాస్, రాజేంద్రప్రసాద్, జయరాం నాయుడు, మెప్మా, ఐసీడీఎస్ తదితర ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. బంగారుపేటలో ఎకై ్సజ్ అధికారులను నిలదీసిన షికారీలు -
సార్.. బూటకపు హామీలు నమ్మి మోసపోయాం
డోన్: గత ఎన్నికల సమయంలో కూటమి నాయకుల బూటకపు వాగ్దానాలు నమ్మి మోసపోయామని పలువురు మహిళలు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డితో వాపోయారు. స్థానిక పాతపేట శ్రీరాముల దేవాలయం సమీపంలో నివసిస్తున్న వంట మాస్టర్ కుమ్మరి నాగరాజు ఇటీవల మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులను శుక్రవారం రాత్రి మాజీ మంత్రి బుగ్గన పరామర్శించారు. వైఎస్సార్సీపీతో పాటు తాను ఎల్లవేళలా అండగా ఉంటానని మృతుని కుటుంబ సభ్యులకు ఆయన హామీ ఇచ్చారు. అనంతరం తిరిగి బయలుదేరుతున్న మాజీ మంత్రితో కొందరు మహిళలు తమ గోడును వెల్లబోసుకున్నారు. కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా తమను వంచించిందన్నారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని చెప్పి మోసం చేసిందన్నారు. తొమ్మిది నెలలు గడిచినా ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం, ప్రతి ఆడ పిల్లకు ప్రతినెలా రూ.1,500, అన్నదాత సుఖీభవా ఇవ్వలేదని బుగ్గన దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబును నమ్మి ఇప్పుడు ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి బుగ్గన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసం ప్రజలకు అర్థమైందని, 2029 ఎన్నికల్లో తిరిగి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని, అప్పటి వరకు ఓపిక పట్టాలని మహిళలకు భరోసా కల్పించారు. ఆయన వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ జాకీర్ హుస్సేన్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కురుకుందు హరి, వలంటీర్ విభాగం జిల్లా అధ్యక్షుడు పోస్టు ప్రసాద్, యువజన విభాగం అధ్యక్షుడు ఆర్ఈ రాజవర్దన్, కౌన్సిలర్లు కటికె వేణు, కురుకుందు పద్మావతి, కో ఆప్షన్ సభ్యులు కుమ్మరి రాజు తదితరులు ఉన్నారు. మాజీ మంత్రి బుగ్గనతో వాపోయిన మహిళలు -
మహిళలు సర్వశక్తిమంతులు
నంద్యాల: జన్మతః సీ్త్రలు శక్తివంతులు, సమర్థవంతులని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. శుక్రవారం కలెక్టర్ చాంబర్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని జిల్లా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విలేకర్లతో ఆమె మాట్లాడుతూ మహిళలు ఉన్నతమైన వ్యక్తిత్వంతో పాటు ఆత్మాభిమానం కలిగి ఉంటారన్నారు. మహిళలు సర్వశక్తివంతులని కుటుంబ బాధ్యతలతో పాటు ఉద్యోగంలో వున్నా, వ్యాపార, రాజకీయ ఇతర రంగాల్లో స్థిరపడాలన్నా, ఆయా రంగాల్లో ఉత్తమ విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. నిర్దేశించిన ఏ చిన్న పనైనా ప్రణాళిక బద్ధంగా నిర్వహించి వంద శాతం విజయం సాధించగలిగే సత్తా వారిలో ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ప్రతి సీ్త్ర ఏదైనా రంగంలో పట్టు సాధించాలంటే సంబంధిత అంశంపై లోతైన విశ్లేషణ ఉండడంతో పాటు పది మందికి స్ఫూర్తినిచ్చే విధంగా ప్రశ్నించే తత్వం కలిగి ఉండాలన్నారు. సమాజంలో స్థిరపడిన మహిళ పారిశ్రామికవేతలు వారు ఎదగడమే కాకుండా పదిమందికి ఉపాధి కల్పించే రీతిలో ఉండాలన్నారు. తమ పిల్లలను ఆడ, మగ తారతమ్యం లేకుండా సమాన స్థాయిలో పెంచి ఉత్తమ పౌరులుగా దేశ, రాష్ట్ర భవిష్యత్తులో చక్కటి భాగస్వామ్యం పంచేలా పెంచాలన్నారు. లింగ వ్యవస్థతపై చట్టాలు ఉన్నప్పటికీ నిరాశ్రయులైన అనాథ పిల్లలకి సమగ్ర శిశు సంరక్షణ కేంద్రాలు ఉన్నాయన్నారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి -
వేలాది మందికి ప్రాణదానం
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ప్లాస్టిక్ సర్జరీ హెచ్ఓడీగా పనిచేస్తున్న డాక్టర్ ఎం. మంజులాబాయి 30 ఏళ్ల తన సర్వీసులో వేలాది మందికి ప్రాణదానం చేశారు. ఎంతో మందికి అందమైన రూపాన్ని ఇచ్చారు. విజయ ప్రస్థానం డాక్టర్ మాటల్లోనే.. ‘‘ మానాన్నతో పాటే పదో తరగతి పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించా. మెరిట్ స్కాలర్షిప్లతో ఇంటర్లోనూ మంచి మార్కులు సాధించా. 1986–92వరకు తిరుపతిలోని స్విమ్స్లో ఎంబీబీఎస్, 1995 నుంచి 98వరకు కర్నూలు మెడికల్ కాలేజిలో జనరల్ సర్జరీ పీజీ పూర్తి చేశా. గోనెగండ్ల పీహెచ్సీలో కొన్ని వందల మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించాను. కొంత కాలానికే కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల జనరల్ సర్జరీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్గా అవకాశం రావడంతో చేరాను. ప్లాస్టిక్ సర్జరీ కోర్సు 2003 నుంచి 2006 వరకు ఉస్మానియా మెడికల్ కాలేజీలో పూర్తి చేశాను. వేలాది మందికి శస్త్రచికిత్సలు చేసి ప్రాణం పోశా. పేదలకు వైద్య సేవలు అందించడం చాలా ఆనందంగా ఉంది. – కర్నూలు(హాస్పిటల్) -
నీటి ఎద్దడి నివారణకు చర్యలు
మిడుతూరు: గ్రామీణ ప్రాంతాల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు చేపట్టాలని జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి సూచించారు. శుక్రవారం మిడుతూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును ఆయన పరిశీలించి, ట్యాంక్ సామర్థ్యం, నీటి సరఫరా తదితర వివరాలు తెలుసుకున్నారు. నీటిని క్లోరినేషన్ చేయడంతోపాటు అన్ని గ్రామాల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేశారు. 15వ ఆర్థిక సంఘం, మండల పరిషత్ నిధులతో చేపట్టిన పనులను త్వరలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయన వెంట డిప్యూటీ ఇంజినీర్ శ్రీనివాసరెడ్డి, ఎంపీడీఓ దశరథరామ య్య, ఏఈ విశ్వనాథం, ఈఓఆర్డీ సంజన్న, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. చెత్త నుంచి సంపద సృష్టిద్దాం నంద్యాల(అర్బన్): స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్రలో భాగంగా చెత్త నుంచి సంపద సృష్టిద్దామని డీపీఓ షేక్ జమీవుల్లా తెలిపారు. చెత్త నుంచి సంపద తయారీపై నంద్యాల మండలం పాండురంగాపురం గ్రామంలో శుక్రవారం మండల గ్రామాల సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన డీపీఓ మాట్లాడుతూ ప్రతి రోజూ ఇంటి నుంచి వచ్చే తడి, పొడి చెత్తల ద్వారా ఎరువు, వర్మీకంపోస్టును తయారు చేసి స్థానిక రైతులకు అందే విధంగా చూడాలన్నారు. కేజీ రూ.10 చొప్పున గ్రామంలోని రైతులకు అందజేసి పంట దిగుబడులకు సాయం అందించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సుగుణశ్రీ, ఈఓఆర్డీ జ్యోతి, తదితరులు పాల్గొన్నారు. పురుగు మందులు, ఎరువులదుకాణాల్లో తనిఖీలు నంద్యాల(అర్బన్): జిల్లా కేంద్రంలోని నంద్యాల పట్టణంలో ఎరువులు, పురుగు మందుల దుకాణాల్లో శుక్రవారం వ్యవసాయాధికారులు తనిఖీ చేశారు. ఆత్మకూరు, నంద్యాల సహాయ వ్యవసాయ సంచాలకులు ఆంజనేయులు, రాజశేఖర్ల ఆధ్వర్యంలో విశ్వనాథ ఆగ్రో ఏజెన్సీస్, వైఎన్ రెడ్డి ఏజెన్సీస్, వెంకట సునిల్ ట్రేడర్స్ దుకాణాల్లో బయో ఉత్పత్తులను పరిశీలించారు. అనుమతి పత్రాలు, స్టాక్ రిజిస్టర్, బిల్ బుక్స్, రసీదులు సరిగా లేకపోవడంతో రూ.21.76 లక్షల విలువైన బయో ఉత్పత్తుల అమ్మకాలను నిలుపుదల చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనుమతి పొందిన బయో ఉత్పత్తులనే దుకాణదారులు విక్రయించాలన్నారు. వీరి వెంట ఏఓ ప్రసాదరావు ఉన్నారు. -
నైతిక విలువలు నేర్పాలి
‘తల్లిదండ్రులు పిల్లలకు నైతిక విలువలను తెలియజేయాలి. వారి ఉన్నత స్థితికి తోడ్పాటు పడాలి’ అని ప్రిన్సిపల్ సీనియర్ జడ్జి బెజవాడ రాధారాణి అన్నారు. తన తండ్రి ఎంతో ప్రోత్సహించారని తెలిపారు. వివరాలు జడ్జి మాటల్లోనే..‘‘ మా ఇంట్లో నాన్నగారు నన్ను లాయర్గా చదువుకోవాలని ప్రోత్సహించారు. ఆయన కోరిక ప్రకారం లా చదివి పాసయ్యాను. పెళ్లి చేసుకున్న తరువాత భర్త సహకారంతో ఐదు సంవత్సరాల్లో జడ్జి అయ్యాను. ప్రతి ఒక్కరూ సమాజానికి మంచి చేసే విధంగా ఎదగాలి.. సమయాన్ని వృథా చేసుకోకుండా దేశానికి ఉపయోగపడే విధంగా పాటుపడాలి. న్యాయవ్యవస్థలో ఎక్కువగా మహిళలు జడ్జిలుగా రాణిస్తున్నారు.’’ – నంద్యాల(వ్యవసాయం) -
347 మంది విద్యార్థులు గైర్హాజరు
నంద్యాల(న్యూటౌన్): జిల్లాలో శుక్రవారం జరిగిన ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం మ్యాథ్స్, బోట ని, సివిక్స్ పరీక్షకు 347 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. 53 పరీక్ష కేంద్రాల్లో 12,534 మంది విద్యార్థులకు గాను 12,187 మంది హాజరయ్యారు. ఒకేషనల్ పరీక్షకు 1,052 మందికి గాను 1,003 మంది హాజరు కాగా 49 మంది గైర్హాజరయ్యారు. విద్యార్థులకు పరీక్ష కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించామని డీఐఈఓ సునీత తెలిపారు. ఎలాంటి సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్తగా అన్ని చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. మాస్ కాపీయింగ్కు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. పరీక్ష కేంద్రాలను తరచుగా ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ పరిశీలిస్తున్నట్లు తెలిపారు. -
వ్యవసాయం.. ‘లక్ష్మి’ కటాక్షం
ప్రకృతి వ్యవసాయంలో గూడూరుకు చెందిన మహిళ రైతు జి. లక్ష్మీదేవి అద్భుతంగా రాణిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో గణనీయమైన నికరాదాయాన్ని పొందుతున్నారు. వివరాలు ఆమె మాటల్లోనే.. ‘‘ మాకు 10 ఎకరాల భూమి ఉంది. ఇందులో నాలుగు ఎకరాల్లో ఐదేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం. ఏటీఎం నమూనాలో ఒక ఎకరాలో అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నాం. పెట్టుబడి కోసం రూ.15 వేలు ఖర్చు చేయగా.. రూ.లక్షకుపైగా ఆదాయం వచ్చింది. మిగిలిన మూడు ఎకరాల్లో వివిధ పంటలు వేస్తున్నాం. మా పంటల సాగును ప్రత్యేక బృందాలు వచ్చి అధ్యయనం చేశాయి. పంటలను పరిశీలించి జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి కూడా అభినందించారు.’’ – కర్నూలు(అగ్రికల్చర్) -
మనోధైర్యమే ఆయుధంగా..
విధి వక్రీకరించినా ఆమె మనోధైర్యం వీడలేదు. నంద్యాల ఆర్టీసీ డిపోలో కండక్టర్ ఉద్యోగం చేస్తూ భాగ్యలక్ష్మి స్వయం కృషితో పిల్లలను తీర్చిదిద్దారు. ఆమెకు 1991లో వివాహం కాగా.. ఐదు సంవత్సరాలకే భర్త వెంకటేశ్వరప్రసాద్ అనారోగ్యంతో మృతి చెందాడు. కారుణ్య నియామకం కింద భర్త ఉద్యోగం పొందిన భాగ్యలక్ష్మి.. ఇద్దరు పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ వచ్చారు. భాగ్యలక్ష్మి పెద్ద కుమారుడు సాయిశ్రీధర్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ కాగా, చిన్న కుమారుడు సాయి హర్ష మెడికల్ పీజీలో సీటు సాధించి రేడియాజిస్ట్గా పని చేస్తున్నారు. కుమారులను ఉన్నత చదువులు చదివించి ఉద్యోగాలు వచ్చేలా కృషి చేసిన భాగ్యలక్ష్మి మహిళలకు ఆదర్శంగా నిలిచారు. – నంద్యాల(వ్యవసాయం) -
ప్రతికూల పరిస్థితులతో పోరాడి...
ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా జిల్లా ఎకై ్సజ్ నోడల్ డిప్యూటీ కమిషనర్ పోతుల శ్రీదేవి అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. వివరాలు ఆమె మాటల్లోనే.. ‘‘ మాది మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లా పార్వతీపురం. నాన్న పోతుల నరసయ్య పోలీసు శాఖలో ఇన్స్పెక్టర్గా పనిచేశారు. అమ్మ పోతుల శాంతమ్మ. 1998లో నాకు 16 ఏళ్ల వయస్సులో నాన్న మరణించారు. నేను పెద్ద కుమార్తెను. నాకు ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. నాన్న నాకు ఎప్పుడూ స్ఫూర్తినిచ్చేవారు. భయాన్ని ఎదుర్కొని.. వైఫల్యాన్ని విజయానికి మెట్టుగా మల్చుకోవాలని సూచించారు. నాన్న మరణం తర్వాత కారుణ్య నియామకం కింద ఉద్యోగం వచ్చినప్పటికీ అమ్మ ఆ ఉద్యోగాన్ని తిరస్కరించారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి కోచింగ్ లేకుండానే నేను గ్రూప్–1లో ర్యాంకు సాధించాను. మొదట పార్వతీపురం జిల్లాలో ని జియ్యమ్మవలసలో విధులు నిర్వహించి ఉత్తమ ఎంపీడీఓ అవార్డు అందుకున్నా. విధులు నిర్వహిస్తూనే గ్రూప్–1లో ర్యాంకు సాధించి ఎకై ్సజ్ శాఖలో అసిస్టెంట్ సూపరింటెండెంట్గా ఎంపికయ్యాను. నా విజయానికి తండ్రి నరసయ్య, భర్త నరేంద్ర కుమార్ రాజు కారణం. మాకు ఇద్దరు పిల్లలు సంతానం. నువేశ్ నంద 8వ తరగతి, దిమాహి 4వ తరగతి చదువుతున్నారు. 2011లో మహబూబ్ నగర్లో విధులు నిర్వహించేటప్పుడు బెస్ట్ ఏఈఎస్ అవార్డు అందుకున్నాను.’’ – కర్నూలు భర్త ప్రోత్సాహంతోనే డీఎఫ్ఓగా.. కర్నూలు జిల్లా అటవీ శాఖ అధికారి పి.శ్యామల జన్మస్థలం అనంతపురం జిల్లా కల్యాణదుర్గం. తల్లిదండ్రులు శకుంతల, తిమ్మరాయప్ప. వీరి మొదటి కుమార్తె అయిన శ్యామల ఎస్కే యూనివర్సిటీలో బాటనీలో పీజీ పూర్తి చేసి గోల్డ్మెడల్ సాధించారు. ఈమె 2004లో అటవీ శాఖలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్ట్కు ఎంపికై అనంతపురంలోనే ఉద్యోగంలో చేరారు. 2006లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్గా ఎంపికయ్యారు. 2023 మార్చి నుంచి కర్నూలు డీఎఫ్ఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ‘భర్త ప్రోత్సాహంతో నేను ఈ స్థాయికి వచ్చాను. కుటుంబంలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భావన ఉండకూడదు. మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం చాలా అవసరం’ అని డీఎఫ్ఓ శ్యామల పేర్కొన్నారు. – కర్నూలు కల్చరల్ -
శ్రమనే నమ్ముకుని...
శ్రమనే ఆమె నమ్ముకున్నారు. కుటుంబానికి అండగా ఉండేందుకు వివాహానికి దూరంగా ఉన్నారు. ధైర్యంగా తన పనులు నిర్వహిస్తూ ఖైరూన్బీ అందరికీ ఆదర్శంగా నిలిచారు. దేవనకొండ మండలం కప్పట్రాళ్ల గ్రామానికి చెందిన రంజాన్, భక్షోబీ దంపతులకు నలుగురు సంతానం. ఇందులో ఇద్దరు కుమారులు కాగా.. ఖైరూన్బీ, బిస్మిలా కుమార్తెలు. ఖైరూన్బీ వివాహం చేసుకోకుండా కుటుంబానికి అండగా నిలిచారు. తల్లిదండ్రులతో పాటు పొలం పనులకు వెళ్లేవారు. వ్యవసాయ పనులు లేని సమయంలో టైర్లకు పంక్చర్లు వేయడం నేర్చుకున్నారు. కప్పట్రాళ్ల బస్టాండు సమీపంలో పంక్చర్ల షాపును సైతం ఏర్పాటు చేసుకున్నారు. సైకిల్ టైర్లతోపాటు టాక్టర్లు, జేసీబీ టైర్లకు పంక్చర్లు వేస్తున్నారు. వచ్చిన మొత్తాన్ని కుటుంబానికి ఇస్తున్నారు. – ఆలూరు -
హదీస్ వెలుగు :
యుద్ధంలో ప్రత్యర్థుల ఆయుధాల నుంచి కాపాడేందుకు కవచం ఉపయోగపడినట్లు పాపాల నుంచి మనిషిని రంజాన్ ఉపవాస దీక్ష కాపాడుతుంది. – పవిత్ర ఖురాన్ ఇఫ్తార్ సహెర్ కర్నూలు సాశ్రీశ్రీ 6:32 ఉశ్రీశ్రీ 5:09 ఆదోని సాశ్రీశ్రీ 6:31 ఉశ్రీశ్రీ 5:10 నంద్యాల సాశ్రీశ్రీ 6:29 ఉశ్రీశ్రీ 5:09 ఆత్మకూరు సాశ్రీశ్రీ 6:28 ఉశ్రీశ్రీ 5:03 బనగానపల్లె సాశ్రీశ్రీ 6:31 ఉశ్రీశ్రీ 5:05 -
జగమేలు నాయకా.. జగదానంద కారకా
ఆళ్లగడ్డ: అహోబిలేశుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు శుక్రవారం దిగువ అహోబిలంలో ప్రహ్లాదవరద స్వామి హంస వాహనంపై కొలువై భక్తులను కనువిందు చేశారు. వేకువ జామునే నిత్యపూజల అనంతరం ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకాలంకరణలో ఉన్న హంస వాహనాన్ని అధిష్టించిన ప్రహ్లాదవరదుడు మాడ వీధుల్లో విహరించారు. అహో బిల మఠం చేరుకున్న హంసవాహానదీశుడైన అహోబిలేశునికి మఠం పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ ప్రత్యేక పూజలు చేపట్టారు. మధ్యాహ్నం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదస్వాములను యాగశాలలో కొలువుంచి పట్టు పీతాంబరాలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. రాత్రి సూర్యప్రభ వాహనంపై కొలువైన ప్రహ్లాదవరదుడు భక్తులను కునువిందు చేశారు. భక్త హనుమంత .. తనువు పులకింత ఎగువ అహోబిల క్షేత్రంలో కొలువైన జ్వాలా నరసింహుడు హనుమంత వాహనంపై వివహరించారు. త్రేతాయుగం నాటి శ్రీరాముడిని తానేనంటూ భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శుక్రవారం రాత్రి అనన్య భక్తుడైన హనుమంతు వాహన సేవలో స్వామివారు కోదండరామ అలంకరణలో భక్తులను కటాక్షించారు. కృతయుగంలో వేంకటేశ్వరుడిగా, త్రేతాయుగంలో శ్రీరాముడిగా, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా, కలియుగంలో అహోబిలేశుడిగా స్వామి అవతరించారనే సందేశాన్ని చాటుతూ మాడవీధుల్లో హనుమంత వాహనసేవ.. రామరాజ్య వైభవాన్ని సాక్షాత్కరింపజేసింది. హంస, సూర్యప్రభ వాహనాలపై దర్శనమిచ్చిన ప్రహ్లాదవరదుడు -
వైకల్యాన్ని అధిగమించి...
చదువుకు, ఉద్యోగానికి వైకల్యం అడ్డురాదని ఆమె నిరూపించారు. రెండు కాళ్లు లేకపోయినా ఆత్మవిశ్వాసంతో బీఎస్సీ, బీఈడీ పూర్తి చేశారు. సచివాలయ మహిళా పోలీస్ ఉద్యోగం సాధించి.. సేవలు అందిస్తున్నారు. సంజామల మండలం వెంకటసుబ్బయ్య, మహేశ్వరి దంపతుల కుమార్తె సువర్ణ విజయ గాథ ఆమె మాటల్లోనే... ‘‘మా తండ్రి విద్యుత్ సబ్స్టేషన్లో లైన్మెన్గా పనిచేస్తూ నాతోపాటు తమ్ముడు సురేష్, చెల్లెలు సుమిత్రను ఉన్నత చదువులు చదివించారు. ప్రస్తుతం లైన్మెన్గా రిటైర్డ్ అయి కొంత పొలాన్ని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. పుట్టిన ఏడాదికే పోలియో సోకి నా రెండు కాళ్లు చచ్చుబడ్డాయి. అప్పటి నుంచి రెండు కర్రల సాయంతో నడక సాగిస్తున్నాను. కాళ్లు లేకపోయినా మనోధైర్యంతో బీఎస్సీ, బీఈడీ పూర్తి చేశాను. 2019లో గ్రామ సచివాలయాల్లో మహిళా పోలీసుగా ఉద్యోగం సాధించాను. ప్రస్తుతం సంజామల మండలంలోని ముక్కమల్ల గ్రామ సచివాలయంలో విధులు నిర్వర్తిస్తున్నాను’’. – కోవెలకుంట్ల ● విభిన్న రంగాల్లో రాణిస్తున్న మహిళలు ● ఇతరుల ఎదుగుదలలోనూ సహకారం ● నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవంలాలన..పాలన.. ఓర్పు.. నేర్పు.. పట్టుదల.. క్రమశిక్షణ.. వీరత్వం.. ధీరత్వం.. సహనం.. సౌశీల్యం.. వీటి ప్రతి రూపమే మహిళ.. ప్రాచీన కాలం నుంచి నేటి డిజిటల్ ఆధునిక కాలం వరకు సీ్త్ర లేకపోతే పురుషునికి ఎదుగుదల ఉండదని నిరూపితమైతూనే ఉంది. ప్రస్తుతం సీ్త్ర చైతన్యాన్ని శక్తి సామర్థ్యాలను గమనించిన పురుషులు ఆమె ఎదుగుదలను అంగీకరిస్తూ ప్రోత్సహిస్తున్నాడన్నది అక్షర సత్యం. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాలో పలు రంగాల్లో రాణిస్తున్న మహిళామణుల విజయ గాథలు ఇవీ.. -
సాయం.. ‘తులసీ’ వ్రతం
‘‘ సమాజంలోని అన్ని విషయాలపై అవగాహన పెంచుకోవాలి.. అవసరమైన సందర్భాల్లో సహాయ సహకారాలు అందించాలి.. ఇందుకు మహిళలు ముందుండాలి’’ అని అంటున్నారు ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కే తులసీదేవి. తమది ఉన్నత కుటుంబమైనా, కొన్ని పరిస్థితులతో బాల్యంలో పలు కష్టాలను చవిచూడాల్సి వచ్చిందని, అమ్మ నేర్పిన క్రమశిక్షణ, చదువుపై ఆమెకున్న శ్రద్ధ, పట్టుదలే తమను ఇంతవాళ్లను చేశాయని ఆమె పేర్కొన్నారు. ‘‘ అమ్మ, నాన్న ప్రాథమిక విద్యతోనే చదువు ఆపేసినా, నన్ను, అన్నను ఉన్నత విద్యావంతులను చేశారు. నాకున్న ఇద్దరు సంతానాన్ని అమ్మ వద్దే ఉంచి చదివించాం. బాబు నిఖిల్, పాప ప్రీతి ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. మా వారు కే మల్లికార్జునరెడ్డి హైదరాబాద్లో ఓ మల్టీనేషనల్ కంపెనీలో జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నారు. ఉద్యోగంలో నిజాయితీ ముఖ్యం.’’ అని ఆమె అన్నారు. – కర్నూలు(అర్బన్) -
సర్పంచ్ అయినా..
రవణమ్మ ..ఒక గ్రామ పంచాయతీకి సర్పంచ్ అయినా హంగు, ఆర్భాటం లేకుండా వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నారు. నంద్యాల మండలం బిల్లలాపురం గ్రామ పంచాయతీ జనరల్ మహిళకు రిజర్వేషన్ అయ్యింది. దీంతో 2021 ఫిబ్రవరి 9వ తేదీన సర్పంచ్ ఎన్నికల్లో సంకల రవణమ్మ గెలుపొందారు. సర్పంచ్ అయినా సరే వ్యవసాయ పనులు చేయడంలో తనకు ఇబ్బందులు లేవని ఆమె తెలిపారు. సర్పంచ్ మాటల్లోనే వివరాలు..‘ నాకు చిన్నప్పటి నుంచి వ్యవసాయం అంటే ఎంతో ఇష్టం. నేను గ్రామ సర్పంచ్ అయినా సరే నేను నమ్ముకున్న వృత్తిని ఎప్పుడూ వదిలి పెట్టలేదు. గ్రామంలో పారిశుధ్ధ్యం, తాగునీటి వసతి, వీధి దీపాల ఏర్పాటు.. తదితర పనులు చేపడుతూ ప్రజల మన్ననలు పొందుతుండటం ఆనందంగా ఉంది.’’ – నంద్యాల(అర్బన్) -
No Headline
అలుపెరగని అమ్మపురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. తమ అమేయ శక్తితో అద్భుతాలను సృష్టిస్తున్నారు. కుటుంబానికి అండగా ఉంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కర్నూలు బుధవారపేటకు చెందిన కాతున్బీ తొమ్మిది పదుల వయస్సుల్లోనూ బీపీ, షుగర్ వంటి ఏ రోగాలు లేకుండా ఆరోగ్యంగా ఉన్నారు. ఈమెకు ఐదుగురు కుమార్తెలు, ఆరుగురు కుమారులు ఉన్నా.. ఇంటి పని చేస్తున్నారు. గొడ్డలితో కట్టెలను కొడుతూ ఔరా అనిపిస్తున్నారు. కర్నూలు పూలబజార్లో 80 ఏళ్ల వయస్సు కలిగిన నాగమ్మ.. పెరుగు అమ్మకాలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కర్నూలు నగరంలోని నంద్యాల చెక్పోస్టు సమీపంలో 60 సంవత్సరాల వయస్సు ఉన్న ఐలమ్మ.. చెప్పులు కుడుతూ కుటుంబానికి అండగా ఉన్నారు. కర్నూలు సి.క్యాంప్ సమీపంలో రోళ్లు మలుస్తూ సౌమ్య అనే మహిళ.. కర్నూలు నగరం మద్దూర్నగర్లో చేపల వ్యాపారం చేస్తున్న వరలక్ష్మి.. వీరే కాదు ఇంకా ఎంతో మంది వివిధ పనులు చేస్తూ ప్రతి ఒక్కరిలో జీవనోత్సహాన్ని నింపుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు 12న ఫీజు పోరును విజయవంతం చేద్దాం.. ఈనెల 12వ తేదీన వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించే ఫీజు పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని కాటసాని పిలుపు నిచ్చారు. నంద్యాల జిల్లా ఉదయానంద హోటల్ నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు విద్యార్థులతో కలసి ర్యాలీ ఉంటుందన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందిస్తామన్నారు. ర్యాలీకి జిల్లాలోని నియోజకవర్గాల నుంచి విద్యార్థులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీగా తరలిరావాలన్నారు. అలాగే 12న వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఉదయం కల్లూరు అర్బన్ శరీన్నగర్లోని దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహం దగ్గర పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తామన్నారు. -
మోసపోయామని రాష్ట్ర ప్రజలకు అర్థమైంది
● వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి కల్లూరు: చంద్రబాబు నాయుడు ఆచరణ సాధ్యం కాని హామీలతో మోసపోయామని ప్రజలకు అర్థమైందని, రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తన స్వగృహంలో బడ్జెట్ కేటాయింపులపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బండారాన్ని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్ష్యాలతో సహా బయటపెట్టారన్నారు. ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన రెండు బడ్జెట్లలో సూపర్ సిక్స్ పథకాలైన తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు, ఆడ బిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్ మొదలగు పథకాల అమలు ఊసే లేదన్నారు. పక్షపాతానికి, రాగద్వేషాలకు అతీతంగా పాలన చేస్తానని ప్రమాణం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు వైఎస్సార్సీపీ వాళ్లకు ఏమీ ఇవ్వొద్దని బహిరంగగానే చెప్పడం వివక్ష పాలనకు నిదర్శనమన్నారు. ప్రజా బలంతో సీఎం అయిన వ్యక్తి వైఎస్ జగన్.. ప్రజా బలంతో సీఎం అయిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని కాటసాని అన్నారు. ప్రజా సమస్యలపై గళం విప్పేందుకు వైఎస్సార్సీపీని ప్రధాన ప్రతిక్షంగా గుర్తించాలని జగన్ డిమాండ్ చేస్తున్నారన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అర్హత కల్గిన రైతులందరికి పార్టీలు, కులాలు, మతాలు, రాజకీయాలు, వర్గాలకు అతీతంగా రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించామన్నారు. ఎన్నికల్లో గెలవడం కోసం చంద్రబాబు రైతులకు అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి రూ. 20వేలు అందిస్తామన్నారు. అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతున్న ఇంత వరకు ఒక్క రైతుకు సహాయం అందలేదన్నారు. 12న ఫీజు పోరును విజయవంతం చేద్దాం.. ఈనెల 12వ తేదీన వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించే ఫీజు పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని కాటసాని పిలుపు నిచ్చారు. నంద్యాల జిల్లా ఉదయానంద హోటల్ నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు విద్యార్థులతో కలసి ర్యాలీ ఉంటుందన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందిస్తామన్నారు. ర్యాలీకి జిల్లాలోని నియోజకవర్గాల నుంచి విద్యార్థులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీగా తరలిరావాలన్నారు. అలాగే 12న వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఉదయం కల్లూరు అర్బన్ శరీన్నగర్లోని దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహం దగ్గర పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తామన్నారు. -
ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభం
నంద్యాల(న్యూటౌన్): కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య నంద్యాల పట్టణంలోని బాలికల జూనియర్ కళాశాలలో శుక్రవారం ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభమైంది. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి సంస్కృతం సబ్జెక్టు పేపరుతో స్పాట్ వాల్యుయేషన్ను ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 2,06,280 జవాబు పత్రాల మూల్యాంకనం జిల్లాలో చేపట్టనున్నారు. జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారి క్యాంప్ ఆఫీసర్గా వ్యవహరించనున్నారు. జవాబు పత్రాల మూల్యాంకనం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ నిర్వహిస్తారు. ఒక అసిస్టెంట్ ఎగ్జామినర్ (ఏఈ) రోజుకు 30 జవాబు పత్రాలు మూల్యాంకనం చేయాల్సి ఉంటుంది. ప్రతి ఐదుగురు ఏఈలకు ఒక చీఫ్ ఎగ్జామినర్ (సీఈ) ఉంటారు. ఏఈ మూల్యాంకనం చేసే జవాబు పత్రాలను సీఈ పరిశీలిస్తారు. ఏఈలు, సీఈ కలిపి ఉండే బోర్డుకు ఒక స్క్రూటినైజర్ ఉంటారు. ఏఈలు అన్ని ప్రశ్నల జవాబులు మూల్యాంకనం చేశారా, లేదా, మార్కుల టోటల్.. తదితర విషయాలను వారు పరిశీలిస్తూంటారు. సబ్జెక్టు నిపుణులు కూడా ఏఈలు మూల్యాంకనం చేసే పేపర్లను పరిశీలించి, తేడాలుంటే సూచనలిస్తారు. మూల్యాంకానికి అసరమైన సిబ్బందిని నియమించారు. ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేని విధంగా మూల్యాంకనం చేపడుతున్నామని ఇంటర్ జిల్లా విద్యాధికారిణి సునీత తెలిపారు. ఈనెల 20వ తేదీన ఇంటర్ పరీక్షలు ముగుస్తాయన్నారు. -
ప్రకృతి వ్యవసాయంలో రాణించాలి
నంద్యాల: జిల్లాలోని రైతులందరూ ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేసి అందులో రాణించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. గురువారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో రైతు సాధికారిక సంస్థ – ప్రజాభాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై రైతు సంఘాల సభ్యులు, రైతులను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులతో సారవంతమైన భూమి నిస్తారమై పోవడమే కాకుండా మనిషి ఆరోగ్యం కూడా దెబ్బతినే సందర్భాలు అనేకం ఉన్నాయన్నారు. ఆహారపు అలవాట్లు సరిగ్గా పాటించకపోతే భవిష్యత్లో భావితరాల వారు తీవ్ర అనారోగ్య ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ప్రకృతి వ్యవసాయంలో శ్రమ అధికంగా ఉన్నప్పటికీ తక్కువ పెట్టుబడితో నాణ్యమైన పంటలు పండించుకునే అవకాశం ఉంటుందన్నారు. రైతులందరూ ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరించే స్థాయికి రావాలని సూచించారు. రానున్న రోజుల్లో నాణ్యమైన ఉత్పత్తులతో పాటు బ్రాండింగ్ ఇవ్వగలిగే స్థాయికి జిల్లా రైతులు చేరుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలోని 1633 అంగన్వాడీ కేంద్రాలు, 86 సంక్షేమ వసతి గృహాల ఆవరణలో కిచెన్ గార్డులు ఏర్పాటు చేసి ఆకుకూరలు పెంచి ఆహార పదార్థాల్లో వినియోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంతకు ముందు ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరిస్తున్న రైతులు బాల మద్దిలేటి, పగడం వెంకటేశ్వర్లు, మార్తమ్మ మాట్లా డుతూ ప్రకతి వ్యవసాయంలో దేశవాళి వరి విత్తనా ల్లో ఎన్నో పోషక విలువలు ఉన్నాయన్నారు. పిల్లాయి సాంబ, పొంగారు పొంగారు రైస్, మైసూర్ మల్లిక చిట్టి, చిట్టి ముత్యాలు, కాలనమ్మ, శివుని సాంబ తదితర పదిరకాల దేశవాళి విత్తనాల గురించి రైతులకు వివరించారు. అంతకుముందు ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను కలెక్టర్ పరిశీలించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ, ఉద్యానవన శాఖ అధికారి నాగరాజు, జిల్లా పట్టు పరిశ్రమల అధికారి పరమేశ్వరి, కేవీకే శాస్త్రవేత్త బాలరాజు, డీఆర్డీఏ పీడీ శ్రీధర్రెడ్డి, వ్యవసాయ, అనుబంధ రంగాల అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి -
అమ్మా.. బతికే ఉన్నా!
ఆడ బిడ్డనో.. మరో ఇతర కారణాలో తెలియదు కానీ శిశువు పుట్టిన క్షణమే ఆ తల్లి బంధాన్ని తెచ్చుకోవడంతో అనాథగా లోకానికి పరిచయమైంది. ఆ శిశువు అనారోగ్యం బారిన పడటం, వైద్యులు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పసికందును చూసి అందరూ అయ్యో పాపం అంటున్నారు. శిరివెళ్ల మండలం జీనేపల్లెలో గత నెల 16వ తేదీన ఎస్సీ కాలనీలోని చర్చి సమీపంలో ఉన్న ఖాళీ ప్రదేశంలో నవజాత ఆడ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసిన సంఘటన పాఠకులకు విదితమే. అదే రోజు స్థానికుల సమాచారంతో ఐసీడీఎస్ సిబ్బంది శిశువును హక్కున చేర్చుకొని వైద్య పరీక్షల నిమిత్తం నంద్యాల ఆసుపత్రికి తరలించారు. అయితే శిశువు ఆసుపత్రిలో నాలుగు రోజుల పాటు బాగానే ఉన్నా.. తర్వాత తల వాపు రావడంతో గమనించిన వైద్యులు సిటీ స్కాన్, ఇతర పరీక్షలు చేశా రు. అయితే తలలో రక్తం గడ్డ కట్టినట్లు గుర్తించి స్థానిక ఆసుపత్రి వైద్యుల ఆధ్వర్యంలో వారం రోజు ల క్రితం ఆపరేషన్ చేశారు. అయితే ప్రస్తుతం శిశువు అక్కడే వైద్య చికి త్స పొందుతూ ప్రస్తుతానికి ఆరోగ్యకరంగా ఉన్నట్లు ఆసుపత్రి వైద్య వర్గాలు చెబుతున్నాయి. కన్న వారు ఉన్నా కూడా అనాథలా శిశువు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండం చూసిన సిబ్బంది, రోగుల సహాయకులు అయ్యో పాపం అంటూ నిట్టూర్చుతున్నారు. చిన్నారి రోదన చూసి కంటతడి పెడుతున్నారు. కన్న తల్లి ఎక్కడుందోనని చర్చించు కుంటున్నారు. ఆసుపత్రి ఇన్చార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ జిలానీ మాట్లాడుతూ గుర్తుతెలి యని శిశువును ఐసీడీఎస్ సిబ్బంది ఆధ్వర్యంలో ఆసుపత్రిలో చేర్చి ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నామని, చిన్న పిల్లల ఐసీయూలో చికిత్స పొందుతుందని తెలిపారు. – గోస్పాడు ఆసుపత్రిలో అనాథ శిశువు ఆక్రందన -
గురుకులాల ప్రవేశ పరీక్ష దరఖాస్తుకు గడువు పెంపు
కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని డా.బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల/ కళాశాలల్లో 5వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 13వ తేదీ వరకు గడువును పొడిగించినట్లు ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీదేవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారన్నారు. ఇన్స్పైర్ అవార్డులకు 9 ప్రాజెక్టులు ఎంపిక ... 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రకటించిన ఇన్స్పైర్ అవార్డులకు జిల్లాలోని డా.బీఆర్ అంబేద్కర్ గురుకుల విద్యార్థులు రూపొందించిన 9 ప్రాజెక్టులు ఎంపిక అయ్యాయని డీసీఓ డా.ఐ శ్రీదేవి తెలిపారు. అలాగే టీసీఎస్ నిర్వహించిన గ్లోబల్ ఇన్నోవేటర్ ఆఫ్ ద ఇయర్ (జీఓఐటీ) కాంపిటీషన్స్లో 373 ప్రాజెక్టుల్లో ఫైనల్కు మూడు ఎంపిక అయ్యాయన్నారు. ఇందులో కర్నూలు జిల్లాలోని దిన్నెదేవరపాడు గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు ఉండటం హర్షణీయమన్నారు. ఈ విద్యార్థులు ఈ నెల 25వ తేదీన వర్చువల్ ప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. -
హదీస్ వెలుగు :
అల్లాహ్ అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు. చేసిన పాపాల నుంచి ముక్తి కోసం, కరుణ కోసం నిత్యం దువా చేస్తూ ఉండండి. – పవిత్ర ఖురాన్ ఇఫ్తార్ సహెర్ కర్నూలు సాశ్రీశ్రీ 6:32 ఉశ్రీశ్రీ 5:10 ఆదోని సాశ్రీశ్రీ 6:31 ఉశ్రీశ్రీ 5:11 నంద్యాల సాశ్రీశ్రీ 6:28 ఉశ్రీశ్రీ 5:10 ఆత్మకూరు సాశ్రీశ్రీ 6:28 ఉశ్రీశ్రీ 5:04 బనగానపల్లె సాశ్రీశ్రీ 6:30 ఉశ్రీశ్రీ 5:06 -
ఉపాధ్యాయ పోస్టులు మిగులు దశకు చేరేలా..
మండల ప్రజా పరిషత్పాఠశాలలో బోధిస్తున్న ఉపాధ్యాయుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి కిలోమీటరు లోపు పరిధిలో ఒక మోడరన్ స్కూల్ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. నంద్యాల, డోన్, ఆత్మకూరు డివిజన్ల పరిధిలోని ఆర్డీఓల పర్యవేక్షణలో తహసీల్దార్, ఎంఈఓల బృందం ఇప్పటికే విలీనం చేయబోయే పాఠశాలలను గుర్తించి నివేదికను రూపొందించింది. తొలి దశలో 25 మంది విద్యార్థుల కంటే తక్కువ ఉన్న పాఠశాలలను గుర్తిస్తున్నారు. తక్కువ మంది విద్యార్థులు ఉన్న 3, 4, 5 తరగతుల విద్యార్థులందరిని సమీప పాఠశాలల్లో విలీనం చేస్తారు. తద్వారా ఒక గ్రామంలో మోడరన్ ప్రైమరీ స్కూల్గా పిలిచే ఒకే పాఠశాల ఉంటుంది. ఆ గ్రామంలో లేదా కిలోమీటరు పరిధి లోపు ఉన్న గ్రామాల్లోని పాఠశాలలు సమీపంలో ఏర్పాటు చేయ బోయే మోడరన్ స్కూళ్లలో విలీనం చేస్తారు. దీనివల్ల ఉపాధ్యాయ పోస్టులు ప్రతి మండలంలోను మిగులు దశకు చేరుకునే అవకాశం ఉంది. ఆ ప్రభావం పరోక్షంగా డీఎస్సీపై పడి ఉపాధ్యాయుల భర్తీ సంఖ్య గణనీయంగా తగ్గే ప్రమాదం ఏర్పడింది. ప్రభుత్వ కుట్ర ప్రభుత్వ యూపీ పాఠశాలల ను ఎత్తివేసేందుకు రంగం సిద్ధం చేసింది. కొన్నింటిని విలీనం చేసి మరి కొన్నింటిని మూసివేత దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల విద్యార్థులు ఉన్నత పాఠశాల విద్యకు దూరమవుతారు. యూపీ పాఠశాలలను నిర్వీర్యం చేయడ మే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. కార్పొరేట్ పాఠశాలలకు వత్తాసు పలికేందుకే ప్రభుత్వ కుట్రలో భాగంగానే యూపీ పాఠశాలలను ఎత్తి వేసే ప్రయత్నం ఇది. దీన్ని వ్యతిరేకిస్తాం. – ఎంఆర్నాయక్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, నంద్యాల ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడమే లక్ష్యం ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసి నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా విద్యా శాఖ నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ ఏడాది అన్ని గ్రామాల్లోను మోడరన్, ఫౌండేషన్ స్కూల్స్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆ దిశగా జిల్లా విద్యాశాఖ ప్రణాళికలను సిద్ధం చేసింది. – జనార్ధన్రెడ్డి, డీఈఓ, నంద్యాల యూపీ పాఠశాలలను రద్దు చేయడం తగదు నంద్యాల జిల్లాలో ఉన్న యూపీ పాఠశాలలను రద్దు చేయడం తగదు. పాఠశాల నుంచి జిల్లా పరిషత్ హైసూల్లోకి వెళ్లాలంటే 10 కి.మీ దూరం వెళ్లాల్సిందే. దీని వల్ల హైస్కూల్ విద్యకు విద్యార్థులు దూరమవుతారు. ప్రభుత్వం పునరాలోచన చేయాలి. మా గ్రామంలో డ్రాప్ అవుట్ను నివారించాలంటే ప్రాథకోన్నత పాఠశాలలను కొనసాగించాల్సిందే. – దూదేకుల కాశీం, విద్యార్థి తండ్రి, కానాల గ్రామం, నంద్యాల మండలం -
‘పది’లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి
పగిడ్యాల: పదో తరగతి వార్షిక పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్రెడ్డి ఉపాధ్యాయులను ఆదేశించారు. గురువారం ఆయన ఆదర్శ పాఠశాల, స్థానిక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులతో డీఈఓ మాట్లాడుతూ పబ్లిక్ పరీక్షలకు ఇంకా పది రోజులు సమయం ఉందన్నారు. ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు. ఉపాధ్యాయుల సూచనలు, సల హాలు తప్పనిసరిగా పాటించి ఉన్నత శిఖరాలను చేరుకోవాలన్నారు. డీ– గ్రేడ్ విద్యార్థులను ఉపాధ్యాయులు దత్తత (అడాప్ట్) తీసుకుని కనీసం ఉత్తీర్ణత అయ్యేలా చూడాలన్నారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం స్టడీ అవర్లను తప్పనిసరిగా నిర్వహించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ఆయన వెంట ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ సుజన, జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధుసూదన్రావు తదితరులు ఉన్నారు. 568 మంది విద్యార్థులు గైర్హాజరు నంద్యాల(న్యూటౌన్): జిల్లాలో ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. గురువారం జరిగిన మ్యాథ్స్, బోటనీ, సివిక్స్ ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షకు జనరల్ విద్యార్థులు 15,583 మందికి గాను 15,015 మంది హాజరు కాగా 568 మంది గైర్హాజరయ్యారు. అలాగే ఒకేషనల్ విద్యార్థులు 1,529 మందికి గాను 1,418 మంది హాజరు కాగా 111 మంది గైర్హాజరయ్యారు. జిల్లాలో అన్ని కేంద్రాల్లో ఫ్లయింగ్ స్క్వాడ్ల పర్యవేక్షణలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నట్లు డీఐఈఓ సునీత తెలిపారు. దరఖాస్తుల ఆహ్వానం నంద్యాల(అర్బన్): టైలరింగ్లో ఉచిత శిక్షణకు సంబంధించి జిల్లాలోని బీసీ, ఈబీసీ, కమ్మ, రెడ్డి, క్షత్రియ, వైశ్య, బ్రాహ్మణ, కాపు(బలిజ) కులాల మహిళల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల సేవా సహకార సంఘం కార్యనిర్వాహణ సంచాలకులు జాకీర్హుసేన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ అనంతరం కుట్టుమిషన్ ఇవ్వబడుతుందని చెప్పారు. 18 నుంచి 50ఏళ్లలోపు మహిళలు సచివాలయాలు, మండల, మున్సిపల్ కార్యాలయాల ద్వారా https:apobmms.apcfss.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. లబ్ధిదారులు దరఖాస్తు చేసుకునేందుకు ఆధార్, రేషన్కార్డు, మొబైల్ నెంబరు కావాల్సి ఉంటుందని, మరింత సమాచారానికి సెల్ : 9908132030ను సంప్రదించవచ్చని చెప్పారు. ఆత్మకూరులో భగభగ ● 40.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు ఆత్మకూరు: ఆత్మకూరు పట్టణంలో గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లాలోనే అత్యధికంగా 40.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మార్చి మొదటి వారంలోనే భాను డు ఉగ్రరూపం దాల్చుతుండగా ఇక ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజ లు భయాందోళన చెందుతున్నారు. ప్రజలు ఎండ వేడిమికి గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు. మార్చి ప్రారంభంలో ఈ తరహా ఎండలు ఎప్పుడూ చూడలేదని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు. -
దేవతలారా రారండి!
నేడు అహోబిలంలో.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఎగువ అహోబిలంలో ఉదయం ఉత్సవం, మధ్యాహ్నం అభిషేకం, రాత్రి హనుమంత వాహన సేవలు నిర్వహించనున్నారు. దిగువ అహోబిలంలో ప్రహ్లాదవరదస్వామి ఉదయం హంస వాహనం, రాత్రి సూర్యప్రభ వాహనాలపై విహరిస్తారు.ఆళ్లగడ్డ: దిగువ అహోబిల క్షేత్రంలో ప్రహ్లాదవరదుడి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు గురువారం ఉదయం అహోబిలం మఠం పీఠాధిపతి శ్రీరంగ రాజ యతీంద్ర మహాదేశికన్ ఆధ్వర్యంలో ధ్వజారోహణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు సకల దేవతామూర్తులను ఆహ్వానిస్తూ గరుత్మంతుని చిత్రపటావిష్కరణ చేశారు. అంతకుముందు గరుత్మంతుని చిత్రపటాన్ని, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరద స్వాముల ఉత్సవమూర్తులను, అహోబిలం మఠంలో కొలువైన మొదటి జియర్ శ్రీ ఆదివన్ శఠగోపన్ ఉత్సవ విగ్రహాన్ని వేర్వేరు పల్లకీల్లో మంగళవాయిద్యాల మధ్య ఊరేగింపుగా గాలి గోపురం ఎదురుగా ఉన్న ధ్వజ స్తంభం వద్దకు చేర్చారు. ఆ తర్వాత ప్రహ్లాదవరదుని బ్రహ్మోత్సవాలకు సకల దేవతామూర్తులు తరలిరావాలని ఆహ్వానిస్తూ ధ్వజారోహణ చేసి మంత్ర పూర్వకంగా పిలుపునిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టమైన ప్రహ్లాదవరదుడి కల్యాణ మహోత్సవం ఈనెల 23వ తేదీన నిర్వహించనున్నారు. ఈ మహోత్సవానికి ముక్కోటి దేవతలు కదలి వచ్చి, విందారగించి స్వామి అమ్మవార్లను ఆశీర్వదిస్తారని తద్వార లోక కల్యాణం నిర్వహించినట్లు అవుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రహ్లాదవరదుడుసింహవాహనంపై కొలువై మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తజనులను కనువిందు చేశారు. వైభవంగా భేరీ పూజ.. బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో భాగంగా సాయంత్రం ఉత్సవమూర్తులైన శ్రీ ప్రహ్లాదవరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను దేవాలయ ప్రాంగణంలో కొలువుంచి తిరుమంజనం అనంతరం ఉత్సవమూ ర్తులను ప్రత్యేక మండపంలో కొలువుంచి శాస్త్రోక్తంగా భేరీ పూజ నిర్వహించారు. భేరి పూజల్లో భాగంగా మృదంగాలను అర్చకులే శృతి, లయ బద్ధంగా వాయించి కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. ప్రధానార్చకులు వేణుగోపాలణ్, మణియార్ సౌమ్యానారాయణ్ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ప్రభవించిన జ్వాలా నరసింహుడు.. అహోబిలం బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు గురువారం ఎగువ అహోబిలంలో జ్వాలా నరసింహ స్వామి ఉదయం హంస వాహనంపై, రాత్రి సూర్య ప్రభ వాహనంపై కొలువై భక్తులను అనుగ్రహించారు. నిత్య పూజలు అనంతరం ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ జ్వాలా నరసింహులను యాగశాలలో కొలువుంచి పట్టువస్త్రాలతో అలంకరించారు. ఆ రత్వాత వివిధ పుష్పాలంకరణ గావించిన హంస వాహనంపై కొలువుంచి మాడ వీధుల్లో వైభవోపేతంగా గ్రామోత్సవం నిర్వహించారు. మధ్యాహ్నం ఉత్సవమూర్తులను పంచామృతాలతో అభిషేకించి ప్రతేకంగా అలంకరించిన మండపంలో భక్తుల దర్శనార్థం కొలువుంచారు. రాత్రి స్వామి వారు సూర్యప్రభ వాహనాన్ని అధిష్టించి భక్తులను కనువిందు చేశారు. దిగువ అహోబిలంలో బ్రహ్మోత్సవ వైభవం సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజపటావిష్కరణ సింహ వాహనంపై ఊరేగిన ప్రహ్లాదవరదుడు ఎగువ అహోబిలంలో హంస వాహనంపై దర్శనమిచ్చిన జ్వాలా నరసింహుడు -
హదీస్ వెలుగు :
‘రంజాన్ ఉపావాస దీక్ష మనిషిలోని అహాన్ని తొలగించి.. ఆధ్యాత్మికత, మంచి నడవడికను నేర్పుతుంది. వీటిని తప్పనిసరిగా పాటించి అల్లాహ్ అనుగ్రహం పొందండి.’ – పవిత్ర ఖురాన్ ఇఫ్తార్ సహెర్ కర్నూలు సాశ్రీశ్రీ 6:31 ఉశ్రీశ్రీ 5:10 ఆదోని సాశ్రీశ్రీ 6:30 ఉశ్రీశ్రీ 5:12 నంద్యాల సాశ్రీశ్రీ 6:28 ఉశ్రీశ్రీ 5:10 ఆత్మకూరు సాశ్రీశ్రీ 6:27 ఉశ్రీశ్రీ 5:05 బనగానపల్లె సాశ్రీశ్రీ 6:30 ఉశ్రీశ్రీ 5:07 -
అహోబిలం.. బ్రహ్మోత్సవ వైభవం
● సింహవాహనంపై దర్శనమిచ్చిన జ్వాలా నరసింహస్వామిసింహవాహనంపై ఊరేగుతున్న జ్వాలా నరసింహ స్వామిఆళ్లగడ్డ: శ్రీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు నాంది పులుకుతూ దిగువ అహోబిలంలో అంకురార్పణ కార్యక్రమాన్ని బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పది రోజుల పాటు ఎటువంటి ఆటంకాలు లేకుండా క్రతువులు జరగాలని శాస్త్రోక్తంగా విశ్వక్సేనుడికి అహోబిల మఠం పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్, వేదపండితులు, అర్చకులు ఆరాధన చేశారు. అనంతరం తిరుమంజనం, స్వస్తివచనంతో పాటు ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా ముస్తాబుచేసి ప్రత్యేక పూజలు నిర్వహించి బ్రహ్మోత్సవాలకు సిద్ధం చేశారు. వైష్ణవ ఆచారం ప్రకారం రాత్రివేళ వేదమంత్ర పఠనాలతో మృత్యుంగ్రహణం పర్వాన్ని చేపట్టారు. అనంతరం ఈశాన్యంలోని పుట్టమన్ను తెచ్చి నవధాన్యాలను నాటి బ్రహ్మోత్సవాలకు నాంది పలికారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం తెల్లవారు జామున దిగువ అహోబిలంలో ధ్వజారోహణ కార్యక్రమం జరగనుంది. అనంతరం భేరీ పూజ, రాత్రి సింహ వాహన సేవలు కొనసాగుతాయి. ఎగువ అహోబిలంలో.. బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం ధ్వజారోహణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ గరుత్మంతుని చిత్రపటావిష్కరణ చేశారు. బుధవారం రాత్రి జ్వాలా నరసింహస్వామి సింహవాహనంపై అధిష్టించి భక్తులకు దర్శనమిచ్చారు. సింహహనంపై కొలువైన స్వామికి అంగరంగ వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. -
రెగ్యులర్ సీఈగా కబీర్ బాషా
కర్నూలు (సిటీ): జలవనరుల శాఖలో మరోసారి అడ్హక్ పదోన్నతులు కల్పించారు. కర్నూలు ప్రాజెక్ట్స్ ఇన్చార్జ్ సీఈగా పనిచేస్తున్న షేక్ కబీర్ బాషాకు పదోన్నతి కల్పించి రెగ్యులర్ సీఈగా నియమించారు. ఈయన ఎస్ఆర్బీసీ సర్కిల్–1 పర్యవేక్షక ఇంజినీర్గా పనిచేస్తూనే 2022 జులై 4వ తేదీ నుంచి ఇన్చార్జ్ సీఈగా పనిచేస్తున్నారు. హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం పర్యవేక్షక ఇంజినీర్గా పనిచేస్తున్న ఎంఎల్వీ వరప్రసాద్ను తెలుగుగంగ తిరుపతి చీఫ్ ఇంజినీర్గా నియమించారు. 8న జాతీయ లోక్ అదాలత్ కర్నూలు(సెంట్రల్): కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని వివిధ కోర్టుల్లో పెండింగ్లోని కేసుల పరిష్కారానికి ఈనెల 8న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.కబర్థి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జస్టిస్ పి.లీలా వెంకట శేషాద్రి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జాతీయ లోక్ అదాలత్లో న్యాయ స్థానాల్లో పెండింగ్ ఉండి రాజీ పడేందుకు సిద్ధంగా ఉన్న సివిల్, క్రిమినల్, ప్రీలిటిగేషన్ కేసులను పరిష్కరించుకోవాలని బాధితులకు సూచించారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. క్యాన్సర్ చికిత్సకు లీనాక్ మిషన్ ప్రారంభంకర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఆవరణలో ఉన్న స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో క్యాన్సర్ చికిత్సలో భాగమైన లీనాక్ మిషన్ను బుధవారం మెడికల్ కాలేజి ప్రిన్సిపల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్టేట్ క్యాన్సర్ హాస్పిటల్లో 80 శాతం వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఇప్పటికే ఓపీ సేవలు, ఇన్పేషెంట్ సేవలు అందుబాటులోకి వచ్చాయని, మరికొన్ని ఆపరేషన్ థియేటర్ పరికరాలు రావాల్సి ఉందన్నారు. అవి వచ్చిన వెంటనే త్వరలో ఆపరేషన్ థియేటర్ సేవలు కూడా ప్రజలకు అందుబాటులోకి వస్తాయన్నారు. కార్యక్రమంలో హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ సీఎస్కే ప్రకాష్, సీఎస్ఆర్ఎంఓ డాక్టర్ హేమనళిని పాల్గొన్నారు. మహానందిలో మోగనున్న కల్యాణ వీణ మహానంది: ప్రముఖ క్షేత్రమైన మహానందిలో గురు, శుక్రవారాల్లో అధికంగా వివాహాలు జరగనున్నాయి. ఈ నెలలో 16వ తేదీ వరకు మంచి ముహూర్తాలు ఉండటంతో వివాహాలు చేసుకునేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో మహానందిలో గురువారంతో పాటు ఈ నెల 15,16వ తేదీల్లో వివాహాలు జరగనున్నట్లు అర్చకులు, నిర్వాహకులు తెలిపారు. గురువారం ఒక్కరోజే సుమారు 15 పైగా వివాహాలు జరగనున్నాయి. ఇప్పటికే ఆలయ ప్రాంగణంలోని టీటీడీ కల్యాణమండపంతో పాటు నాగనంది, టీటీడీ వసతి గృహాలు, ప్రైవేటు కల్యాణమండపాలు బుక్ చేసుకున్నారు. యువకుడి దుర్మరణం ఆత్మకూరురూరల్: రోడ్డు ప్రమాదంలో సతీష్(25) అనే యువకుడు మృతి చెందాడు. ఈ దుర్ఘటన ఆత్మకూరు పట్టణంలోని పాత ఫారెస్ట్ ఠాణా సమీపంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఆత్మకూరు పట్టణంలోని గొల్లపేటకు చెందిన సతీష్ తన ద్విచక్రవాహనంపై కేజీ రోడ్డులోని ఠాణా వద్ద వెళ్తున్నాడు. ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేసే ప్రయత్నం చేయగా అదే సమయంలో ఒక బొలేరో వాహనం కూడా బస్సును ఓవర్టేక్ చేయబోయింది. దీంతో బస్సు – బొలేరో వాహనం మధ్యలో ఇరుక్కు పోయిన సతీష్ అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
అప్పు కట్టలేదని రైతు బైకు స్వాధీనం
కర్నూలు(అగ్రికల్చర్)/చిప్పగిరి: పంటలు పండక, ప్రకృతి సహకరించక.. సరైన గిట్టుబాటు ధర లభించక రైతుల జీవనం దినదిన గండంగా సాగుతోంది. కూటమి ప్రభుత్వం రైతులను ఏమాత్రం ఆదుకోకపోగా, వ్యవసాయాన్ని కష్టతరం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు అండగా నిలవాల్సిన బ్యాంకులు సైతం రుణాల రికవరీ పేరిట ఆస్తులను జప్తు చేసేందుకు సిద్ధపడటం విమర్శలకు తావిస్తోంది. జిల్లా సహకార కేంద్రబ్యాంకు రుణాల రికవరీపై ప్రత్యేక దృష్టి సారించింది. బుధవారం ఐదు ప్రత్యేక బృందాలు ఆలూరు, పత్తికొండ, డోన్ ప్రాంతాల్లో రుణాలు రికవరీకి రైతుల ఇళ్లకు వెళ్లారు. ఆరేడేళ్ల క్రితం డీసీసీబీ నుంచి రుణాలు తీసుకొని ఇంతవరకు ఒక్క కంతు కూడా చెల్లించకపోవడంతో వడ్డీ, అపరాధవడ్డీలతో అప్పు పేరుకుపోయిందని, వెంటనే చెల్లించాలని కోరారు. ఆలూరు బ్రాంచ్ పరిధిలోని చిప్పగిరి మండలం కుందనగుర్తి గ్రామానికి చెందిన ఓ రైతు 2016లో రూ.1.08 లక్షల అప్పు తీసుకోగా ఇప్పుడు వడ్డీతో కలిసి రూ.3 లక్షలు దాటింది. డీసీసీబీ జనరల్ మేనేజర్ పి.రామాంజనేయులు ఆధ్వర్యంలో టీమ్ రికవరీకి వెళ్లగా రైతు తన ఆర్థిక పరిస్థితి బాగోలేదని వాపోయాడు. దీంతో అధికారులు రైతుకు చెందిన బైక్ను స్వాధీనం చేసుకుని సంబంధిత సొసైటీకి అప్పగించారు. కూటమి ప్రభుత్వంలో రైతుల దయనీయ స్థితికి ఆ ఘటన అద్దం పడుతోంది. -
సంక్షేమ పథకాలను ప్రజలందరికీ అందజేయాల్సిన గ్రామ, వార్డు సచివాలయాలను బలహీన పరిచేందుకు ‘కూటమి’ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా సమీపంలో ఉన్న రెండు, మూడు సచివాలయాలను ఒకే క్లస్టర్ కిందకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. గ్రూపింగ్ పేరుతో
● సమీప సచివాలయాల గ్రూపింగ్కు రంగం సిద్ధం ● రెండు రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు ● ఉద్యోగులను రెండు కేటగిరీలుగా విభజన ● మొదటి దశలో టెక్నికల్ ఫంక్షనీర్స్పై దృష్టి ● అనంతరం మల్టీపర్పస్ ఫంక్షనీర్స్కు కదలిక ● ప్రభుత్వ చర్యతో తిరిగి ప్రారంభం కానున్న రాజకీయ ఒత్తిళ్లు మళ్లీ అవే కష్టాలు గ్రామ/ వార్డు వ్యవస్థ ఆవిర్భావానికి ముందు మూడు, నాలుగు గ్రామాలకు ఒక్క పంచాయతీ కార్యదర్శి మాత్రమే ఉండేవారు. వ్యవసాయ అసిస్టెంట్లు ఎక్కడో ఉండేవారో తెలియని పరిస్థితి. అవసరాలకు అనుగుణంగా సర్వేయర్లు లేకపోవడంతో కూడా పలు మండలాల్లో ఇన్చార్జ్ సర్వేయర్లతో ప్రజలు ఇబ్బంది పడేవారు. ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న సచివాలయాల క్లస్టర్ల విధానంతో పాత రోజులు పునరావృతం అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గ్రూపింగ్లో భాగంగా తీసుకోబోయే నిర్ణయాలతో ఆయా సచివాలయాల్లోని కీలకమైన ఉద్యోగులు రెండు, మూడు గ్రామాలకు ఒకరు ప్రకారం పనిచేయాల్సిన పరిస్థితులు మళ్లీ రానున్నాయి. గ్రామాల్లో సర్వేయర్ల సమస్య తీవ్రంగా వేధించే అవకాశం కూడా లేకపోలేదు. కర్నూలు(అర్బన్): ఎవరి సిఫార్సులు లేకుండా, రాజకీయాలకు అతీతంగా ప్రజలందరికీ ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అందించేందుకు గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చారు. అప్పట్లో ఈ వ్యవస్థను పరిశీలించి వివిధ రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ఉన్నతాధికారులు మెచ్చుకున్నారు. అయితే రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఆదర్శ వ్యవస్థను ప్రజలకు దూరం చేసే కుట్ర చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి. అందులో భాగంగానే సచివాలయాల గ్రూపింగ్ పేరుతో సమీపంలో ఉన్న రెండు, మూడు సచివాలయాలను ఒకే క్లస్టర్ కిందకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆయా గ్రామ/వార్డు సచివాలయాల్లోని ఉద్యోగులను సర్దుబాటు చేసేందుకు అనుగుణంగా చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోనే గ్రామ/వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను టెక్నికల్ ఫంక్షనీర్స్, మల్టీపర్పస్ ఫంక్షనీర్స్గా రెండు విభాగాలుగా విభజించారు. ప్రస్తుతం ప్రతి సచివాలయంలో అన్ని విభాగాలకు సంబంధించిన ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన క్లస్టర్ ప్రక్రియ పూర్తి అయితే ముందుగా టెక్నికల్ ఫంక్షనీర్స్గా గుర్తించిన ఉద్యోగులు ఒక్కొక్కరు రెండు లేక మూడు సచివాలయాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఆయా కేటగిరిలకు చెందిన మిగిలిన ఉద్యోగులను ఖాళీగా ఉన్న ప్రాంతాలకు లేదా ఇతర శాఖలకు బదలాయించే అవకాశాలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. టెక్నికల్ ఫంక్షనీర్స్ ప్రక్రియ పూర్తి అయిన అనంతరం ఆయా సచివాలయాల పరిధిలోని జనాభాను అనుసరించి మల్టీపర్పస్ ఫంక్షనీర్స్పై దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయి. ఫంక్షనీర్స్ ఎవరంటే.. ● వీఆర్ఓ, సర్వే అసిస్టెంట్, ఏఎన్ఎం, అగ్రికల్చర్/హార్టికల్చర్ అసిస్టెంట్, పశుసంవర్ధశాఖ అసిస్టెంట్, ఇంజినీరింగ్ అసిస్టెంట్, ఎనర్జీ అసిస్టెంట్లను ప్రభుత్వం టెక్నికల్ ఫంక్షనీర్స్గా గుర్తించింది. ● మల్టీ పర్పస్ ఫంక్షనీర్స్గా పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్, మహిళా పోలీస్ను గుర్తించారు. మొదటి దశలో టెక్నికల్ ఫంక్షనీర్స్పై దృష్టి సచివాలయాల గ్రూపింగ్ పూర్తి అయిన వెంటనే టెక్నికల్ ఫంక్షనీర్స్ను కదలించే చర్యలు ప్రారంభం కానున్నాయి. ఒక సచివాలయంలో ప్రస్తుతం పనిచేస్తున్న ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇక నుంచి సమీపంలోని రెండు, మూడు సచివాలయాల్లో కూడా సేవలు అందించాల్సి ఉంటుంది. క్లస్టర్ పరిధిలోకి వచ్చిన రెండు, మూడు సచివాలయాల్లోని ఇంజినీరింగ్ అసిస్టెంట్లను జిల్లాలో ఎక్కడైనా ఆ పోస్టులు ఖాళీగా ఉంటే అక్కడికి బదిలీ చేయవచ్చు. ప్రభుత్వ ఇంజినీరింగ్ విభాగాల్లోనైనా వీరి సేవలను ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయి. టెక్నికల్ ఫంక్షనీర్స్ ప్రక్రియ పూర్తి అయిన అనంతరం ఇదే విధానాన్ని మల్టీపర్పస్ ఫంక్షనీర్స్గా గుర్తించి ఉద్యోగులకు కూడా వర్తింప చేయనున్నారు. రాజకీయ ఒత్తిళ్లు ప్రారంభం ప్రభుత్వం తీసుకున్న సచివాలయాల గ్రూపింగ్ విధానంలో రాజకీయ ఒత్తిళ్లు ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. తమకు ఇష్టం లేని వారిని సుదూర ప్రాంతాలకు, ఇతర ఇంజినీరింగ్ విభాగాలకు పంపించాలని టీడీపీ నేతలు.. సంబంధిత అధికారులపై ఒత్తిడి చేసే ప్రమాదం ఉంటుంది. ఉద్యోగుల బదిలీల్లో భాగంగా గత నాలుగు నెలల క్రితం ఇతర ప్రభుత్వ శాఖల్లో నిర్వహించిన విధంగానే సచివాలయ ఉద్యోగులను బదిలీ చేశారు. తిరిగి ఇప్పుడు సచివాలయాల గ్రూపింగ్ పేరుతో ఉద్యోగులను ఇబ్బంది పెడితే రాజకీయ నాయకులకు మరోసారి అవకాశం కల్పించినట్టవుతుందనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. కోడుమూరు మండలం పులకుర్తి గ్రామ సచివాలయంగత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అన్ని ప్రభుత్వ శాఖల్లో జీరో వేకెన్సీకి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చారు. ఆయా శాఖల్లో ఖాళీ అయిన ఉద్యోగాల భర్తీకి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నారు. గ్రామ/ వార్టు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 1,969 పోస్టుల భర్తీకి మూడో విడత నోటిఫికేషన్ జారీ చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆ ప్రక్రియకు అప్పట్లో బ్రేకులు పడ్డాయి. ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేపడుతున్న హేతుబద్దీకరణ పూర్తయితే కొత్త పోస్టుల భర్తీ లేనట్టే అని స్పష్టమవుతోంది. రెండు రోజుల్లో గ్రూపింగ్ పూర్తి చేయాలని ఆదేశాలు ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి గ్రామ/వార్డు సచివాలయాల గ్రూపింగ్ను రెండు రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ద్వారా జిల్లాలోని అందరు ఎంపీడీఓలకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. ఎలా గ్రూపింగ్ చేయాలి, వాటి మార్గదర్శకాలకు సంబంధించిన సూచనలను ఎంపీడీఓలకు తెలియజేశాం. గ్రూపింగ్ పూర్తి అయితే సచివాలయాలు అక్కడే ఉంటాయి, కాకపోతే ఉద్యోగులకు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. సమీపంలోని రెండు లేదా మూడు సచివాలయాలను ఒక క్లస్టర్ కిందకు తీసుకువస్తాం. – జీ నాసరరెడ్డి, జెడ్పీ సీఈఓ, జీఎస్డబ్ల్యూఎస్ జిల్లా నోడల్ అధికారి సచివాలయ ఉద్యోగుల వివరాలు జిల్లా సచివాలయాలు మంజూరైన పోస్టులు విధులు నిర్వహిస్తున్న వారు ఖాళీలు కర్నూలు 672 5,738 4,256 1,482 నంద్యాల 516 4,297 3,810 487 మొత్తం: 1,188 10,035 8,066 1,969 -
ఊరూరా ‘బెల్టు’ కిక్కు!
1. మద్యం మత్తులో రోడ్డుపై పడిపోయిన యువకుడు 2. ఒక హోటల్లో డైనింగ్ టేబుల్పై కనిపించిన మద్యం3. డోన్ కొండపేటలో ఒక ఇంటి వద్ద మద్యం మత్తులో పడిపోయిన వ్యక్తి ● నిర్వాహకులు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ● పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం ● మత్తులో చిత్తవుతున్న సామాన్య ప్రజలు మా దృష్టికి రాలేదు మా సర్కిల్ పరిధిలో మద్యం బెల్టుషాపులు లేవు. వాటిని ఏర్పాటు చేస్తే ప్రజలు మాకు సమాచారం అందివ్వాలి. బెల్టుషాపుల ఏర్పాటుకు డిపాజిట్లు వసూలు చేస్తున్నట్లు మా దృష్టికి రాలేదు. అక్రమ మద్యం, నాటుసారా విక్రయందారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. – వరలక్ష్మి, ఎకై ్సజ్ సీఐ, డోన్ డోన్: ప్రభుత్వ మద్యాన్ని బెల్టుషాపుల్లో విక్రయించే వారి బెల్టు తీస్తానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటిస్తే.. అందుకు విరుద్ధంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలే గ్రామానికి మూడు, నాలుగు బెల్టుషాపులను ఏర్పాటు చేస్తున్నారు. సామాన్య ప్రజలను మద్యం మత్తులో ముంచెత్తడమే లక్ష్యంగా అమ్మకాలు పెంచారు. టీడీపీ ఎమ్మెల్యేగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న డోన్ నియోజకవర్గంలో ఊరూరా బెల్టుషాపులను ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలే ఏర్పాటు చేశారు. ఒక్కొక్కషాపును ఏర్పాటు చేసేందుకు రూ.25 వేల నుంచి రూ.50వేల వరకు డిపాజిట్ల కింద బెల్టుషాపుల యజమానుల ద్వారా సేకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. డోన్ నియోజకవర్గంలో ఆరు జనరల్ మద్యం దుకాణాలు ఉన్నాయి. అలాగే గౌడ కులస్తులకు రెండు మద్యం షాపులు కేటాయించారు. బేతంచెర్లలో ఏడు, ప్యాపిలిలో 3 మద్యం దుకాణాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులను ఇచ్చింది. అప్పుల కింద తాగుబోతుల ఆస్తులు డోన్ నియోజకవర్గంలో 178 గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలోనూ రెండుకు తక్కువ కాకుండా బెల్టుషాపులను టీడీపీ నాయకులు ఏర్పాటు చేసుకున్నారు. వీటి మూలంగా అనేక గ్రామాల్లో వ్యసనపరులు ఎక్కువయ్యారు. మద్యంతో ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా వారి కుటుంబాలు అప్పుల పాలై వీధిన పడుతున్నాయి. పలువురు బెల్టుషాపుల యజమానులు తాగుబోతులకు సంబంధించిన ఆస్తులను కూడా అప్పుల కింద రాయించుకుంటున్నట్లు తెలుస్తోంది. యథేచ్ఛగా అక్రమ మద్యం విక్రయం ఒక వైపు బెల్టుషాపులు యథేచ్ఛగా నిర్వహిస్తుండగా.. మరో వైపు అక్రమ మద్యం(కర్ణాటక టెట్రా ప్యాకెట్లు) విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. వలసల, సీతమ్మ తండా, అలేబాద్ తండా, చనుగొండ్ల తదితర గ్రామాలలో నాటుసారా పెద్దఎత్తున తయారవుతున్నట్లు తెలుస్తోంది. ఎక్కడ పడితే అక్కడ మద్యం లభిస్తుండటంతో మద్యం బాబులు తాగి రోడ్లపై పడిపోతున్నారు. తాగుబోతులు మద్యం మానేలా గత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే టీడీపీ నాయకులు నాసిరకం మద్యాన్ని విక్రయిస్తున్నారని గగ్గోలు పెట్టారు. వారు అధికారంలోకి వచ్చాక పేద, మధ్య తరగతి ప్రజలను మద్యానికి బానిసలుగా చేస్తున్నారు. సామాన్యుల ఆరోగ్యాన్ని హరిస్తున్నారు. 123 -
టీడీపీ నేత గోడౌన్లో అక్రమ బియ్యం పట్టివేత
● 256 సంచుల బియ్యం సీజ్ ఆళ్లగడ్డ: పట్టణ శివారులోని టీడీపీ నేత గోడౌన్లో అక్రమంగా నిలువ ఉంచిన రేషన్ బియ్యాన్ని పోలీసులు, పౌరసరఫరాల శాఖ అధికారులు సీజ్ చేశారు. అదేవిధంగా ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు, బియ్యం డాన్గా పేరొందిన శివకుమార్పై కేసు నమోదు చేసిన ఘటన మంగళవారం నియోజవర్గంలో చర్చనీయాంశమైంది. పట్టణ శివారులోని చిన్నకందుకూరు గ్రామ రహదారిలో ఓ గోడౌన్ను టీడీపీ నేత బాడుగకు తీసుకుని నియోజకవర్గ వ్యాప్తంగా సేకరించిన రేషన్ బియ్యం నిలువ ఉంచి ఇతర రాష్ట్రాలకు తరలిస్తుంటారని సమాచారం. ఈ క్రమంలో బుధవారం గోడౌన్లో పెద్ద ఎత్తున రేషన్ బియ్యం అక్రమంగా నిలువ ఉంచారని పోలీసులకు సమాచారం అందడంతో డీఎస్పీ ప్రమోద్ ఆదేశాల మేరకు పట్టణ ఎస్ఐ నగీన నంద్యాల పౌరసరఫరాల అధికారులకు సమాచారం ఇచ్చి గోడౌన్పై దాడులు నిర్వహించారు. దాడుల్లో 256 సంచుల రేషన్ బియ్యం నిలువ ఉంచినట్లు గుర్తించి రేషన్ బియ్యం, గోడౌన్ సీజ్ చేశారు. నిల్వ చేసిన వ్యక్తి పట్టణానికి చెందిన శివకుమార్ అని నిర్ధారణ కావడంతో అతనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నగీన తెలిపారు. -
బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
ఆళ్లగడ్డ: అహోబిలంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు మంగళవారం రాత్రి మఠం పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్రమహా దేశికన్ పర్యవేక్షణలో శాస్త్రోక్తంగా శ్రీకారం చుట్టారు. ఎగువ అహోబిలంలోని శ్రీ జ్వాలా నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో పండితులు, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విష్వక్సేనుడికి తల పాగా చుట్టి పల్లకీలో కొలువుంచి ఆలయం వెలుపలకు తోడ్కొని వచ్చారు. ఈ బ్రహ్మోత్సవాలకు పర్యవేక్షుకుడిగా విష్వక్సేనుడు వ్యవహరిస్తారు. అనంతరం పుట్టమన్ను తెచ్చి అంకుర హోమం నిర్వహించి సోమకుంభ స్థాపన చేశారు. బ్రహ్మోత్సోవాల్లో భాగంగా బుధవారం ఎగువ అహోబిలంలో ధ్వజారోహణ కార్యక్రమం, దిగువ అహోబలంలో బ్రహ్మోత్సవ వేడుకలకు అంకురార్పణ పూజలు చేపట్టనున్నారు. -
అదనపు మొత్తాన్ని అందజేయాలి
ఇళ్లు నిర్మించుకుంటున్న ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన అదనపు మొత్తాన్ని వెంటనే చెల్లించాలి. ఎస్సీ లబ్ధిదారులకు రూ. 50వేలు, ఎస్టీ లబ్ధిదారులకు రూ. 75 వేల చొప్పున అందాల్సి ఉంది. ఇప్పటి వరకు ప్రభుత్వం అదనపు మొత్తం ఇవ్వకపోవడంతో లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో నిలిచిపోయాయి. – శ్రీనివాసనాయక్, ఎస్టీ సంఘ రాష్ట్ర నాయకుడు, కోవెలకుంట్ల ఇసుక, సిమెంట్ సరఫరా చేయాలి ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి గతంలో ఉచితంగా 20 టన్నుల ఇసుక, రాయితీపై కడ్డీలు, సిమెంట్, ఇతర సామగ్రి సరఫరా అయ్యేవి. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక రాయితీపై కేవలం కడ్డీలు మాత్రమే ఇస్తున్నారు. మిగిలిన సామాగ్రి అందకపోడంతో బయట కొనుగొలు చేయాల్సి వస్తోంది. మార్కెట్లో వీటి ధర అధికంగా ఉండటంతో ప్రజలకు భారం పడుతోంది. – సుధాకర్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు, కోవెలకుంట్ల -
‘కొలువు’దీరిన ఆనందం
రుద్రవరం/బేతంచెర్ల: కన్న బిడ్డలు ఉన్నత ఉద్యోగాలు సాధిస్తే ఆ తల్లిదండ్రులకు పట్టరాని ఆనందం సొంతమవుతుంది. ఎస్ఐ ఉద్యోగాలకు ఎంపికై శిక్షణ పూర్తి చేసుకుని బిడ్డలు ఇంటికి చేరుకోవడంతో సంతోషాలు వెల్లివెరిస్తున్నాయి. జిల్లాకు చెందిన ఇద్దరు ఎస్ఐలుగా నియమితులయ్యారు. రుద్రవరం మండలం ముత్తలూరు గ్రామానికి చెందిన అంకిరెడ్డి, లక్ష్మీదేవి దంపతులది వ్యవసాయ కుటుంబం. వీరి కుమారుడు రేనాటి శివనాగిరెడ్డి కర్నూలు సిల్వర్ జూబ్లీ కళాశాలలో డ్రిగీ పూర్తి చేశారు. అక్కడే ఎన్సీసీ శిక్షణ పొందారు. ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నంలో భాగంగా ఎస్ఐ కొలువు సాధించారు. అనంతపురం పోలీసు ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పూర్తి చేసుకుని మంగళవారం ఇంటికి చేరుకున్నారు. ఖాకీ యూనిఫాం ధరించి తల్లికి సెల్యూట్ చేసి తన టోపీని ఆమె నెత్తిన పెట్టి ఆశీర్వాదం పొందారు. ఎస్ఐగా తిరిగి వచ్చిన బిడ్డను చూసి ఆ తల్లి మురిసిపోయింది. హారతి ఇచ్చి ఇంట్లోకి స్వాగతించింది. శివనాగిరెడ్డిని ఎస్ఐగా వైఎస్సార్ జిల్లాకు కేటాయించారు. గ్రామస్తులు, కుటుంబీకులు, బంధువులు అతనిని అభినందించారు. -
కల సాకారమైన వేళ..
బేతంచెర్ల పట్టణం దుర్గాపేట కాలనీకి చెందిన ఆటోడ్రైవర్ శేషాద్రి, నాగలక్ష్మి దంపతుల మూడవ కుమార్తె నిర్మల ఎస్ఐ ట్రైనింగ్ ఇంటికి చేరుకోవడంతో ఆ ఇంట సంతోషం వెల్లివిరిస్తోంది. నిర్మల వెల్దుర్తిలోని బాల యోగి గురుకుల పాఠశాలలో 10వ తరగతి వరకు, కోవెలకుంట్ల ఏపీ రెసిడెన్షియల్ కళాశాలలో ఇంటర్మీడియెట్, విజయవాడలో బీటెక్ పూర్తి చేశారు. తల్లిదండ్రుల ఆకాంక్షల మేరకు ఉద్యోగ ప్రయత్నంలో భాగంగా గ్రూప్–1, గ్రూప్–2 కోచింగ్ తీసుకుంటూ ఎస్ఐ ప్రవేశ పరీక్ష రాసి సివిల్ ఎస్ఐగా ఎంపికయ్యారు. అనంతరం అనంతపురం పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పూర్తి చేసుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో ఆమె పోస్టింగ్ పొందారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆమెను అభినందించారు. ‘పేదరికం చదువుకు అడ్డుకాదని, పట్టుదలతో లక్ష్యానికి చేరుకోవచ్చు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఎస్ఐ ఉద్యోగం సాధించాను. పేదలకు మెరుగైన సేవలు అందిస్తా’నని ఎస్ఐ నిర్మల అన్నారు. -
రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పేదల సొంతింటి కలను దూరం చేస్తోంది. మూడు విడతలుగా పక్కాగృహాల బిల్లులు చెల్లించడం నిలిపివేసింది. రాయితీపై సిమెంట్, చౌకట్లు, కిటికీలు అందించడం మరిచిపోయింది. ఉచితంగా ఇసుక అందనంత దూరంలో ఉండిపోయింది. గృహ నిర్మాణం భారం తప్ప ఏమీ మిగల
● అందని ఉచిత ఇసుక ● నిలిచిన చౌకట్లు, కిటికీల సరఫరా ● రాయితీ సిమెంట్కు మంగళం ● గతంలో కేటాయించిన ఇళ్ల నిర్మాణాలకు అడ్డంకులు ● ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు అమలుకాని బిల్లు పెంపు ● కొత్తగా గృహాల మంజూరును పట్టించుకోని ‘కూటమి’ ప్రభుత్వం కోవెలకుంట్ల: పేదలకు గృహ కల సాకారం చేయాలన్న ఉద్దేశ్యంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించింది. లబ్ధిదారులకు అన్ని విధాలా అండగా నిలిచింది. జిల్లాలోని 29 మండలాల పరిధిలో 323 జగనన్న కాలనీలను ఏర్పాటు చేయించింది. సొంత స్థలం ఉన్న లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకునేందుకు 56,523 పక్కాగృహాలు కేటాయించింది. గత ఏడాది మార్చి నాటికి ఆయా మండలాల్లో 30,713 పక్కాగృహాలు పూర్తి కాగా 15వేల ఇళ్లు బేస్మెంట్, మిగిలిన ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత ఇసుక, సిమెంట్, ఇతర ఇంటి సామగ్రి సరఫరా కాకపోవడంతో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు అమలు కాని బిల్లు పెంపు ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి సిమెంట్, ఇసుక, ఇంటి నిర్మాణ సామగ్రి సరఫరా నిలిచిపోయింది. కొత్తగా పక్కాగృహాల మంజూరైన లబ్ధిదారులకు రూ. 2.50 లక్షల బిల్లులు చెల్లిస్తామని ప్రకటించగా జిల్లాలో వేలాది మంది పేద ప్రజలు ఇళ్ల మంజూరు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గతంలో మంజూరై వివిధ దశల్లో ఉన్న ఇళ్లకు గత ప్రభుత్వం మంజూరు చేసిన బిల్లులు చెల్లిస్తున్నారు. వీరిలో ఎస్టీ లబ్ధిదారులకు రూ. 75 వేలు, ఎస్సీ లబ్ధిదారులకు రూ. 50 వేలు అదనంగా చెల్లిస్తామని జీఓ విడుదల చేసింది. పెంచిన మొత్తాన్ని ఇప్పటి వరకు విడుదల చేయకపోవడంతో లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని ఇసుక, సిమెంట్, ఇంటి సామగ్రి సరఫరా చేయడంతోపాటు కొత్తగా పక్కాగృహాలు మంజూరు చేసి పేదలకు సొంతింటి కల నెరవేర్చాలని కోరుతున్నారు. కుట్రలు ఇలా.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు ఇళ్లస్థలాలు, పక్కాగృహాలు మంజూరు చేయలేదు. పైగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం జగనన్న కాలనీల్లో మంజూరు చేసిన ఇళ్ల స్థలాలను ఆక్రమించుకునేందుకు టీడీపీ నాయకులు కుట్ర పన్నుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇంటి స్థలాలు మంజూరై ఇళ్ల నిర్మాణం ప్రారంభించని వాటిని రద్దు చేసేందుకు గత నెల 25వ తేదీన ప్రభుత్వం ప్రత్యేక జీఓ విడుదల చేసింది. ఇందుకోసం ఇటీవల 16 కాలమ్స్ కూడిన యాప్ విడుదల చేసింది. ఈ యాప్లో లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్ల స్థలాల వివరాలు పొందుపరిచి ఉన్నాయి. ఆయా కాలనీల్లో ఇప్పటికే కొందరు లబ్ధిదారులు నిర్మాణాలు పూర్తి చేసి ఆ ఇళ్లలో నివాసం ఉంటున్నారు. మరికొన్ని ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. కొన్ని ఇళ్లు బేస్మెంట్, ఇంకొన్ని ఖాళీ స్థలాలుగా ఉన్నాయి. సర్వే ఆధారంగా వీటిని ఏం చేస్తారన్నది లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. ఆయా కాలనీల్లో ఖాళీ స్థలాలను ఆక్రమించుకునే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నేటి దుస్థితి ఇదీ.. ● నిరుపేదలను గుర్తించి ఇంటి స్థలంతో పాటు మూడు విడతల్లో రూ.1.80 లక్షల బిల్లులు అందజేశారు. ● ఉచితంగా 20 టన్నుల ఇసుక, రాయితీపై సిమెంట్, కడ్డీలు, గృహ నిర్మాణ సామగ్రి ఇచ్చారు. ● బేస్మేట్ వేసుకునేందుకు చేతిలో డబ్బులులేని లబ్ధిదారులకు వైఎస్సార్ క్రాంతి పథం ద్వారా హౌస్లోన్ పర్పస్(హెచ్ఎల్పీ) ద్వారా రూ. 35వేలు మంజూరు చేశారు. ● వివిధ దశల్లో ఉన్న ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు ఆర్థిక వెసలుబాటు కల్పించారు. ఒక్కో లబ్ధిదారురాలికి రూ. 20 వేలు అడ్వాన్స్ రూపేణా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ● ఇంటి నిర్మాణం ఎక్కడ ఆగిందో తెలుసుకుని పూర్తి చేసేందుకు డీఆర్డీఏ, మెప్మా ద్వారా అదనంగా రూ. 50వేలు, అది చాలకపోతే లక్ష రూపాయల వరకు రుణాన్ని అందించారు. ● జిల్లాలో 56 వేల పక్కాగృహాలు మంజూరు కాగా 35 వేల మంది లబ్ధిదారులు పొదుపు సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. వీరందరికీ అప్పటి ప్రభుత్వం మూడు విడతల్లో ఇచ్చే రూ. 1.80 లక్షలతోపాటు అదనపు రుణం అందజేసింది. తీసుకున్న రుణంలో రూ. 35 వేల వరకు పావలా వడ్డీ వర్తింప జేసింది. ● ఎస్సీ, ఎస్టీ స్వయం సహాయక సంఘాలకు(ఉన్నతి) వడ్డీ లేకుండా అదనపు రుణం అందించారు. ● జగనన్న కాలనీలతోపాటు సొంత స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు మూడు విడతల్లో బిల్లు అందజేశారు. ● బేస్మెంట్ దశలో సిమెంట్, స్టీల్తో కలుపుకుని రూ. 70వేలు, లింటల్లెవల్లో రూ. 54వేలు, రూఫ్ లెవల్లో రూ. 25వేలతోపాటు, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద రూ. 30 వేల చొప్పున లబ్ధిదారుల ఖాతాల్లో బిల్లు మొత్తం జమ చేశారు. ● ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఒక్కో లబ్ధిదారురాలికి ఉచితంగా 20 టన్నుల ఇసుక, రాయితీపై కిటికీలు, చౌకట్లు, బాత్రూం డోర్ ఫ్రేమ్లు, ఎలక్ట్రికల్ సామాగ్రిని అందజేశారు. వైఎస్సార్సీపీ హయాంలో సాయం ఇలా.. -
వేతనాలు ఎగ్గొట్టి.. కూలీల కడుపుకొట్టి!
కర్నూలు(అగ్రికల్చర్): అడిగిన వారందరికీ ఉపాధి కల్పిస్తామని చెబుతున్న అధికారులు వేతనాల చెల్లింపుల విషయంలో నోరు మెదపని పరిస్థితి. జిల్లా నీటి యాజమాన్య సంస్థ అధికారుల మాటలు నమ్మి రెక్కలు ముక్కలు చేసుకున్న కూలీలు ప్రస్తుతం ఆకలితో అలమటిస్తున్నారు. రోజులు, వారాలు.. నెలలు గడుస్తున్నా వేతనాలు దక్కకపోవడంతో కూలీలు దిక్కుతోచని స్థితిలో వలస బాట పడుతున్నారు. జనవరి 13 తర్వాత నుంచి ఎలాంటి చెల్లింపులు చేయకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ కారణంగా మహాశివరాత్రి, తిరుణాలను కూడా చేసుకోలేకపోయినట్లు ఉపాధి కూలీలు ఆవేదన చెందుతున్నారు. కర్నూలు జిల్లాలోని పత్తికొండ, తుగ్గలి, మద్దికెర, పెద్దకడుబూరు, హాలహర్వి, ఆలూరు, ఆదోని, కోసిగి, దేవనకొండ, హొళగొంద, ఆస్పరి, నంద్యాల జిల్లాలోని డోన్, ప్యాపిలి, ఆదోని తదితర మండలాలకు ఉపాధి పనులే ఆధారం. జనవరి రెండవ వారం నుంచి ఇప్పటి వరకు ఉపాధి కూలీలకు ఒక్క రూపాయి వేతనం కూడా చెల్లించిన దాఖలాలు లేవు. కర్నూలు జిల్లాలో ఉపాధి కూలీలకు దాదాపు రూ.25 కోట్లు, నంద్యాల జిల్లాలో రూ.21 కోట్ల మేర బకాయిలు ఉండటం గమనార్హం. ఉమ్మడి జిల్లాలో లేబర్ కాంపోనెంటు కింద రూ.84 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. కర్నూలు జిల్లాలో పశ్చిమ ప్రాంతానికి సంబంధించిన బకాయిలే దాదాపు 75 శాతం ఉన్నట్లు తెలుస్తోంది. నంద్యాల జిల్లాలో డోన్ నియోజక వర్గంలో వ్యవసాయ కూలీలు, చిన్న, సన్నకారు రైతులకు ఉపాధి పనులే ఆధారం. వ్యవసాయ పనులు లేని సమయంలో వారాల తరబడి వేతనాలు లేకపోవడంతో బతుకు భారమై కూలీలు వలస బాట పడుతున్నారు. పడిపోతున్న కూలీల హాజరు ప్రస్తుతం రోజుకు కర్నూలు జిల్లాలో లక్ష మందికి పని దినాలు కల్పించాలనేది లక్ష్యం. కానీ రోజుకు 50వేల మంది కూడా ఉపాధి పనులకు హాజరు కాని పరిస్థితి. దొంగ మస్టర్లు వేస్తుండటం వల్ల ఈ సంఖ్య కనిపిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నంద్యాల జిల్లాలో హాజరు మరింత దయనీయంగా మారింది. జనవరి నుంచి ఉపాధి పనులకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కూలీలకు వారం వారం వేతనాలు చెల్లిస్తేనే హాజరు కూడా మెరుగవుతుంది. బకాయిలు భారీగా ఉండటంతో వేతనాలు ఇవ్వని ఉపాధి పనులు మాకొద్దు అనే పరిస్థితి ఏర్పడింది. మెటీరియల్ పనులకు పేమెంట్లు బంద్ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత టీడీపీ కార్యకర్తల కోసం ఉపాధి నిధులతో సీసీ రోడ్లు, పశువుల షెడ్లు నిర్మిస్తోంది. కర్నూలు జిల్లాలో సీసీ రోడ్లు 900 మంజూరు కాగా 825 పూర్తయ్యాయి. పశువుల షెడ్లు 950 మంజూరు కాగా 630 పూర్తి చేశారు. జనవరి 13 నుంచి మెటీరియల్ పనులకు కూడా పేమెంట్లు నిలిచిపోయాయి. మెటీరియల్ కింద కర్నూలు జిల్లాలో రూ.46 కోట్లు, నంద్యాల జిల్లాలో రూ.38 కోట్ల బకాయి ఉంది. ఉపాధి కూలీల వేతనాలకు కేంద్రం ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు విడుదల చేస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను ఉపాధి కూలీలకు చెల్లించకుండా ఇతర అవసరాలకు మళ్లించడం వల్లే బకాయిలు పేరుకుపోయినట్లు తెలుస్తోంది. మార్చి మొదటి వారంలో నిధుల విడుదల జిల్లాలో లేబర్ కాంపోనెంటు కింద దాదాపు రూ.25 కోట్లు, మెటీరియల్ కింద రూ.46 కోట్లు చెల్లించాల్సి ఉంది. మార్చి నెల మొదటి వారంలో ఉపాధి కూలీల బ్యాంకు ఖాతాలకు వేతనాలు జమ అయ్యే అవకాశం ఉంది. వేతనాల విషయంలో కూలీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – వెంకటరమణయ్య, ప్రాజెక్టు డైరెక్టర్, డ్వామా, కర్నూలు ఉపాధి బకాయిలు రూ.130 కోట్లు జనవరి 13 నుంచి నిలిచిపోయిన చెల్లింపులు మెటీరియల్ పనులకు నిలిచిపోయిన పేమెంట్లు ఆందోళన చెందుతున్న కూలీలు ఉపాధి పనులకు తగ్గిన హాజరు విధిలేని పరిస్థితుల్లో వలసబాట -
623 మంది విద్యార్థులు గైర్హాజర్
నంద్యాల(న్యూటౌన్): జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం ఇంగ్లిషు పరీక్షకు 623 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. 53 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 16,535 మందికి గాను 15,912 మంది విద్యార్థులు హాజరు కాగా 623 మంది విద్యా ర్థులు గైర్హాజరయ్యారు. ఫ్లయింగ్స్క్వాడ్ పర్యవేక్షణలో పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని డీఐఈఓ సునీత తెలిపారు. మహానందీశ్వరుడికి రూ. 41.14 లక్షల ఆదాయం మహానంది: మహానంది క్షేత్రంలో నిర్వహించిన బహిరంగ వేలాలు, సీల్డు టెండర్ల ద్వారా మహానందీశ్వరస్వామికి రూ. 41.14 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి తెలిపారు. మహానందిలోని పోచా బ్రహ్మానందరెడ్డి డార్మెటరీ భవనంలో పచ్చికొబ్బరి చిప్పల సేకరణ, సంప్రదాయ దుస్తుల విక్రయం, హోటళ్ల నిర్వహణ, మాన్యం భూమి కౌలుకు వేలాలు జరిగాయి. వీటన్నింటి ద్వారా ఏడాదికి రూ. 41.14 లక్షలు మేరకు ఆదాయం వచ్చినట్లు వివరించారు. కీలకమైన టోల్గేట్ల నిర్వహణ, పాదరక్షలను భద్రపరచుకునేందుకు లైసెన్స్ హక్కుల వేలాలు వాయిదా పడ్డాయి. జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం వద్దు నంద్యాల: జనన, మరణ ధ్రువ పత్రాల జారీలో జాప్యం లేకుండా నిర్ణీత కాల వ్యవధిలోగా అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ చాంబర్లో జనన, మరణ పత్రాల జారీపై ఇంటర్ డిపార్ట్మెంట్ కమిటీ సమావేశం నిర్వహించారు.బిడ్డ పుట్టిన తర్వాత 21 రోజుల వ్యవధిలోపు డెలివరీ అయిన ఆసుపత్రిలోనే మెడి కల్ ఆఫీసర్ నుంచి పుట్టిన తేదీ ధ్రువ పత్రా న్ని అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పంచాయతీ సెక్రటరీలతో హోమ్ డెలివరీలు, రిజిస్ట్రేషన్ నమోదులపై సమగ్ర సర్వే నిర్వహించి నమోదు చేయాలన్నారు. డీఎంహెఓ డాక్టర్ వెంకటరమణ, డీసీహెచ్ఎస్ జఫరుల్లా, కమిషనర్ నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అతిసార మృతుల కుటుంబాలను ఆదుకోవాలి
● మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఆత్మకూరురూరల్: అతిసార మృతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే, శ్రీశైలం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ శిల్పా చక్రపాణిరెడ్డి డిమాండ్ చేశారు. ఆత్మకూరు పట్టణంలో ఇటీవల అతిసార వ్యాధి ప్రబలిన నీలి తొట్ల వీధిలో ఆయన పర్యటించారు. అతిసారంతో మృతి చెందిన ముగ్గురు వ్యక్తుల కుటుంబాలను, బాధితులను పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. అతిసారతో మృతి చెందిన రహంతుల్లా, బషిరూన్, నాయక్ కుటుంబాలకు రూ.25 లక్షలు, తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి రూ.10 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు. పట్టణంలో అతిసారంతో ముగ్గురు మరణిస్తే ఇప్పటి వరకు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి రాకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇసుక, రేషన్ బియ్యం అక్రమ దందా, మద్యం దుకాణదారులు, రియల్టర్ల నుంచి కమీషన్లు వసూళ్లలో బిజీగా ఉన్నట్లు కనిపిస్తుందని విమర్శించారు. శిల్పా వెంట వైఎస్సార్సీపీ నాయకులు సయ్యద్ మీర్, రాజమోహన్ రెడ్డి, ముస్తఫా, అంజాద్ అలి, వెంకటస్వామి, సురేష్, రహిమాన్, కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు. అధికారులు పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తే సహించం ప్రభుత్వ అధికారులు అధికార పార్టీ కార్యకర్తల్లా వ్యవహరించడం తగదని.. పరిస్థితి ఇలాగే ఉంటే మీ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని మాజీ ఎమ్మెల్యే, శిల్పా చక్రపాణి రెడ్డి మున్సిపల్ కమిషనర్ రమేష్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలుషిత నీటి వల్ల అనారోగ్యం పాలై మరణించిన వారి కుటుంబాలను పరామర్శించడానికి వచ్చిన శిల్పా అక్కడే వైద్య శిబిరంలో కూర్చున్న కమిషనర్ రమేష్పై ప్రశ్నల వర్షం కురిపించారు. కాలువలోని మురికి నీరు మున్సిపాలిటీ కుళాయిలలోకి వస్తోందని ప్రజలంతా చెబుతుంటే మినరల్ వాటర్ ప్లాంట్లపై చర్యలు ఏంటన్నారు. వైఎస్సార్సీపీ సానుభూతి పరుల వాటర్ ప్లాంట్ల విషయంలో కావాలనే వేధింపులకు పాల్పడుతున్నారన్నారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడే ఎవరినీ ఉపేక్షించాల్సిన అవసరం లేదని, అలాగని పార్టీల ముసుగులో అన్యాయం చేస్తే ఊరుకోబోమన్నారు. -
వైద్య మిత్ర.. ఉద్యోగ భద్రత మిథ్య
ప్రభుత్వ పథకాలకూ దూరం.. ఆరోగ్యమిత్రలకు అరకొర జీతమిస్తూ ప్రభుత్వ పథకాలనుసైతం నిలిపివేసిన పరిస్థితి ఉంది. సీఎఫ్ఎంఎస్లో వేతనాలే ఇవ్వడం ప్రారంభించినప్పటి నుంచి ఆరోగ్యమిత్ర కుటుంబాలను ప్రభుత్వ పథకాలకు అనర్హులుగా ప్రకటించింది. దీంతో వీరి కుటుంబాలలో పెద్దలకు సామాజిక పింఛన్లు, ఇతర ఏ ఒక్క పథకానికి అర్హత లేదు. పెరుగుతున్న నిత్యావసర ధరలు, పిల్లల చదువులు, కుటుంబపోషణ భారంగా మారుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. గోస్పాడు: కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్) పథకాన్ని బీమా పరిధిలోకి తీసుకె ళ్లేందుకు రంగం సిద్ధం చేస్తుండటంతో వైద్యమిత్రలు ఆందోళన చెందుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ విభాగంలో పనిచేసే ఉద్యోగులను ఆప్కాస్ (ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్సింగ్ సర్వీస్) కిందకు చేర్చారు. వారికి సీఎఫ్ఎంఎస్ ఐడీ ద్వారా ప్రతి నెల విధిగా వేతనం ఇవ్వడంతోపాటు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించారు. అప్పట్లోనే డిగ్రీ పూర్తి చేసిన వారిని విధుల్లోకి తీసుకొని ఆరోగ్యశ్రీ సేవల్లో నియమించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవను బీమా పరిధిలోకి తీసుకెళ్లే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తుండటంతో వారంతా ఆందోళకు గురవుతున్నారు. జిల్లాలో 101 ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యశాలల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుతున్నాయి. వాటిలో 49 పీహెచ్సీలు, 11 సీహెచ్సీలు, రెండు ఏరియా ఆసుపత్రులు, ఒక జిల్లా ఆసుపత్రి, 38 ప్రైవేటు నెట్వర్క్, ఇతర ఆసుపత్రులలో 67 మంది వైద్యమిత్రలు పనిచేస్తున్నారు. వీరిలో 90 శాతం మంది సుమారు 17 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఎక్కువ మంది డిగ్రీతోపాటు పీజీలు చేసిన వారున్నారు. వైద్యమిత్రలతో పాటు జిల్లాలో టీమ్ లీడర్లు ఆరుగురు, ఆఫీస్ అసోసియేట్గా ఒకరు పనిచేస్తున్నారు. తమను బీమా సంస్థల పరిధిలోకి తీసుకొస్తే తమ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిపోతుందని వైద్య మిత్రలు, ఇతర సిబ్బంది వాపోతున్నారు. 17 ఏళ్లుగా సేవలందిస్తూ.. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద చేరిన రోగులు తిరిగి క్షేమంగా ఇంటికి చేరుకునే వరకు వైద్యమిత్రలు పర్యవేక్షిస్తుంటారు. వైద్య శాలలకు వచ్చిన పేద ప్రజలకు వారికి అవసరమైన సమాచారాన్ని అందిస్తూ వారికి సేవలందిస్తున్నారు. వీరితోపాటు ఉద్యోగుల హెల్త్కార్డులు, జర్నలిస్ట్ హెల్త్కార్డులు, ఆరోగ్య రక్ష స్కీమ్కు సంబంధించి సేవలందిస్తున్నారు. ఇలా అన్ని విభాగాల్లో దాదాపు 17 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల వయస్సు ప్రస్తుతం చాలా మందికి 50 సంవత్సరాలు దాటింది. ఆరోగ్యశ్రీ ప్రైవేట్ చేతుల్లోకి వెళ్తే ఎవరిని ఉంచుతారో, ఎవరిని తొలగిస్తారోనని ఆందోళనగా ఉంది. అయితే ఈ వయసులో వేరే ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో కాలంగా విధులు నిర్వహిస్తున్న వైద్యమిత్రలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రభుత్వ ఉద్యోగాల్లో నోటిఫికేషన్ ఇచ్చిన సమయంలో వెయిటేజీ ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని వైద్యమిత్రలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఆందోళనలో.. ఎన్టీఆర్ వైద్యసేవా ట్రస్ట్ తరఫున అందించే ఆరోగ్య సేవలను బీమా (ఇన్సూరెన్స్) పరిధిలోకి తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తోందని ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగ భద్రతతో పాటు అనేక సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన భరోసా కోసం ఎదురుచూస్తున్నారు. తమను ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంచుతారా.. తొలగిస్తారనే అయోమయంలో ఉద్యోగులు ఉన్నారు. భవిష్యత్తులో తమ ఉద్యోగాలకు భద్రత ఉంటుందన్న ఆశతో వారు ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఒకవేళ ప్రైవేటుకు అప్పగిస్తే ఎన్నో ఏళ్లుగా విధులు చేస్తున్న సర్వీస్ మొత్తం ఎందుకూ పనికిరాకుండా పోతుందనే ఆందోళన వారిని వేధిస్తోంది. ఆరోగ్యశ్రీని బీమా కంపెనీలకు అప్పగించే యోచనలో ప్రభుత్వం జిల్లాలో 101 ఆసుపత్రుల్లో 67 మంది వైద్య మిత్రలు ఆందోళన చెందుతున్న ఉద్యోగులు -
కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించాలి
డిగ్రీలు, పీజీలు చదువుకొని 17 ఏళ్లుగా వైద్యమిత్రలుగా పనిచేస్తున్నాం. ఆప్కాస్ రద్దు చేసే పక్షంలో తమను ట్రస్టు పరిధిలో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించి భద్రత కల్పించాలి. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు అర్హులుగా గుర్తించాలి. ఎక్కడ విధులు నిర్వహించే వారిని బదిలీ చేయకుండా అక్కడే కొనసాగించాలి. – మనోహర్, వైద్యమిత్రల జిల్లా సంఘం అధ్యక్షుడు, నంద్యాల ఉద్యోగ భద్రత కల్పించాలి మా న్యాయపరమైన సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలి. ఎంతో కాలంగా ప్రభుత్వాలతో పాటు పథకాల పేరులో అనేక సార్లు మార్పులు చోటు చేసుకున్నా మాలాంటి జీవితాల్లో మాత్రం ఎటువంటి మార్పు లేదు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వడంతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలి. – నాగరాజు, వైద్యమిత్రల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, డోన్ -
పీ4 సర్వే నేటి సాయంత్రంలోగా పూర్తి చేయాలి
కర్నూలు(అర్బన్): జిల్లాలో చేపట్టిన పీ4 (పబ్లిక్, ప్రైవేటు, పీపుల్స్, పార్టనర్షిప్ ) సర్వేను ఈ నెల 4 సాయంత్రంలోగా పూర్తి చేయాలని జిల్లా పరిషత్ సీఈఓ జి.నాసరరెడ్డి కోరారు. ఆయన సోమవారం జెడ్పీలోని తన చాంబర్ నుంచి జిల్లాలోని ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్లతో గూగుల్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇచ్చిన లక్ష్యాల మేరకు ఆధార్ వెరిఫికేషన్ను తప్పకుండా పూర్తి చేయాలన్నారు. గ్రామ సచివాలయాలను జనాభా ఆధారంగా రెండు, మూడు సచివాలయాలను కలిపి క్లస్టర్ చేసేందుకు ప్రభుత్వ ఆదేశాలను త్వరగా పూర్తి చేయాలన్నారు. గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బంది రోజు వారీ హాజరును తప్పక వేయాలని, లేనిపక్షంలో షోకాజ్ నోటీసులు జారీ చేయాలన్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్లను త్వరగా పూర్తి చేసి, వర్మీ తయారీపై దృష్టి సారించాలన్నారు. -
జలాధివాసం వీడుతున్న సంగమేశ్వరుడు
కొత్తపల్లి: ప్రాచీన సంగమేశ్వర ఆలయం జలాధివాసం వీడుతోంది. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 885 అడుగుల నుంచి 847 అడుగులకు చేరుకోవడంతో సప్తనది సంగమ ప్రాంతంలో కృష్ణాజలాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో సోమవారం సంగమేశ్వరాలయంలోని గోపురాలు పూర్తిగా బయటపడ్డాయి. మరి కొద్ది రోజుల్లో సంగమేశ్వరుడు కృష్ణమ్మను వీడి భక్తుల చేత పూజలందుకోనున్నారు. ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు నంద్యాల(న్యూటౌన్): జిల్లాలో ఇంటర్ మీడియె ట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు డీఐఈఓ సునీత తెలిపారు. సోమవారం నిర్వహించిన తెలుగు, సంస్కృతం, హిందీ పేపర్–2 పరీక్షలకు 12,182 మందికి గాను 11,875 మంది హాజరు కాగా 307 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్లు తనిఖీ చేసినట్లు తెలిపారు. ‘పది’ విద్యార్థులు హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోండి నంద్యాల(న్యూటౌన్): ఈనెల 17వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు అన్ని గుర్తింపు పొందిన పాఠశాలల లాగిన్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చునని డీఈఓ జనార్దన్రెడ్డి సోమవా రం తెలిపారు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. అభ్యర్థులు వాట్సాప్ 9552300009 నెంబరులో విద్యాసేవలు ఎంపిక చేసుకుని ఎస్ఎస్సీ హాల్టికెట్లు పొందవచ్చన్నారు. వెబ్సైట్లో ఫిర్యాదుల పరిష్కార ప్రొఫార్మాలు కర్నూలు(హాస్పిటల్): అభ్యర్థుల ఫిర్యాదుల పరిష్కార ప్రొఫార్మాలను కర్నూలు, నంద్యాల జిల్లా ల వెబ్సైట్లు https://kurnool.ap.gov.in, https: //nandyal.ap.gov.in, కర్నూలు మెడికల్ కాలేజి వెబ్సైట్ https:// kurnoolmedicalcollege. ac.inలలో అప్లోడ్ చేసినట్లు కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ సోమ వారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి కర్నూ లు జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీ, జనరల్ హాస్పిటల్, గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీలకు సంబంధించిన ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు 2023 నవంబర్ 21న జారీ చేసిన నోటిఫికేషన్కు సంబంధించి 11 కేటగిరిల అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు. కేసీకి నీటి విడుదల బంద్ కర్నూలు సిటీ: సుంకేసుల బ్యారేజీ నుంచి కర్నూలు–కడప కెనాల్కు నీటి విడుదల పూర్తి స్థాయిలో నిలిచిపోయింది. అలాగే ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి సైతం నీటి విడుదల నిలిపివేశారు. మల్యాల నుంచి 675 క్యుసెక్కుల నీరు మాత్రమే కేసీకి పంపింగ్ చేస్తున్నారు. నంద్యాల, ఆళ్లగడ్డ సబ్ డివిజన్ ప్రాంతంలోని సాగులో ఉన్న ఆయకట్టుకు వచ్చే నెల వరకు నీరిస్తేనే పంటలు చేతికొచ్చే అవకాశం ఉంది. వైఎస్సార్ జిల్లా రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఉపాధ్యాయుల సీనియారిటీపై అభ్యంతరాల స్వీకరణ కర్నూలు సిటీ: ఉపాధ్యాయుల సాధారణ సీనియారిటీ జాబితాలు డీఈఓ వెబ్సైట్లో ఉన్నాయని, అభ్యంతరాలు ఉంటే తగిన ఆధారాలతో తెలపాలని డీఈఓ ఎస్.శ్యామూల్ పాల్ సోమ వారం ఒక ప్రకటనలో తెలిపారు. టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆధారంగా తయారు చేసిన జాబితాను వైబ్సైట్తో పాటు నోటీసు బోర్డులో కూడా అందుబాటులో ఉంచామన్నారు. జెడ్పీ, మండల, మునిసిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని ఉపాధ్యాయులు అభ్యంతరాలు ఈనెల 10వ తేదీలోపు డీఈఓ ఆఫీస్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల లో అందజేయాలని తెలిపారు. అభ్యంతరాలు ఉంటే ఆర్జేడీ కడప కార్యాలయంలో అందజేయాలని పేర్కొన్నారు. -
ప్రజా అర్జీల పరిష్కారానికి చొరవ చూపండి
నంద్యాల: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, డీఆర్ఓ రామునాయక్ వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్లో రీ ఓపెన్ అయిన దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. సరైన రీతిలో ఎండార్స్ చేయకపోవడంతో పదేపదే దరఖాస్తులు వస్తున్నాయన్నారు. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న భూ సమస్యలకు రెవెన్యూ అధికారుల సమన్వయంతో పరిష్కరించాలన్నారు. 196 మంది తమ సమస్యలపై వినతులు అందజేశారన్నారు. వినతుల్లో కొన్ని.. ● తన భర్త ప్రమాదవశాత్తూ రోడ్డు ప్రమాదంలో మరణించాడని, మూడేళ్ల కుమారుడు ఉన్నాడని జీవనాధారం కోసం వితంతు పెన్షన్ మంజూరు చేయాలని దొర్నిపాడు మండలం గుండుపాపల గ్రామానికి చెందిన రజినీ జిల్లా కలెక్టర్కు వినతి అందజేశారు. ● నందికొట్కూరు మండలం మద్దిగట్ల గ్రామ పొలిమేరలో సర్వే నంబర్ 58లో తనకు 3.50 ఎకరాల భూ మి ఉందని, పూర్వపు పెద్దల నుంచి సాగు చేసుకుంటున్నామని, ఆన్లైన్లో నమోదు చేసి పట్టాదారు పా సుపుస్తకం మంజూరు చేయాలని ఏబీఎం పాలెంకు చె ందిన రాజేంద్ర ప్రసాద్ కలెక్టర్కు విన్నవించుకున్నారు. ● పోలియో వలన రెండు కాళ్లు చచ్చుబడి నడవలేకపోతున్నానని, తనకు వీల్ చైర్ను మంజూరు చేయాలని పగిడ్యాల మండలం ఎన్.ఘణపురం గ్రామానికి చెందిన శివలీల కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. -
శాస్త్రోక్తంగా సెల్వర్ కుత్తు ఉత్సవం
ఆళ్లగడ్డ: అహోబిలేశుడి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎగువ అహోబిలం క్షేత్రంలో సెల్వార్ కుత్తు ఉత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. మంగళవారం నుంచి అహోబిలేశుడి వివాహ మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం నిత్య పూజల అనంతరం ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీ జ్వాలా నరసింహస్వామి ఉత్సవమూర్తిని పల్లకీలో కొలువుంచి దేవాలయం ఎదురుగా ఉన్న ధ్వజ స్తంభం వద్దకు తోడ్కొని వచ్చారు. వేద పండితులు వేద మంత్రోచ్ఛారణలతో సెల్వర్ కుత్తు ఉత్సవం నిర్వహించారు. -
మూగజీవాలు విలవిల
సోమవారం మధ్యాహ్నం నిర్మానుష్యంగా డోన్ ఆర్టీసీ బస్టాండ్ చెట్ల నీడన సేదతీరుతున్న గొర్రెలు, మేకలు కౌతాళం: మండలంలో వారం రోజులుగా పెరుగుతున్న ఎండ తీవ్రతకు ప్రజలతో పాటు మూగజీవాలు అల్లాడిపోతున్నాయి. మండలంలో ఎండల తీవ్రత 35డిగ్రీలకు తగ్గకుండా నమోదవుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. ఎండల తీవ్రత నానాటికీ పెరిగిపోతుండటంతో మండల పరిదిలోని ఉరుకుంద గ్రామ శివారులో గొర్రెలు, మేకలు చెట్ల కింద సేదతీరడం కనిపించింది. రానున్న రోజుల్లో తీవ్రతకు ఈ దృశ్యం అద్దం పట్టింది. ఈ వేసవి నిప్పుల కొలిమే! ● మార్చి నుంచి మే వరకు అధిక ఉష్ణోగ్రతలు ● గత ఏడాది అత్యధికంగా 47 డిగ్రీలు నమోదు ● ఈ సారి 48 డిగ్రీలకు చేరుకునే అవకాశం ● వేసవి తీవ్రత పెరుగుతున్నా కనిపించని ఉపశమన చర్యలు ● జాడలేని చలువ పందిళ్లు, చలివేంద్రాలుఈ నెల 1 నుంచి నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు తేదీ కర్నూలు నంద్యాల గరిష్టం–కనిష్టం గరిష్టం–కనిష్టం 1వ తేదీ 36.8-20.0 36.4-18.6 2వ తేదీ 37.0-23.1 37.0-20.0 3వ తేదీ 39.5-22.0 38.5-23.6 ఈత.. కేరింత దొర్నిపాడు: రోజురోజుకూ వేసవి ముదురుతోంది. పగటి ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలకు పైగా నమోదు అవుతుండంతో జనాలు భానుడి సెగకు తట్టుకోలేక పోతున్నారు. ఈ నేపథ్యంలో చిన్నారులు వేసవి తాపం తాళలేక క్రిష్టిపాడు గ్రామంలోని కుందూనదిలో ఈతకు వెళ్లి కేరింతలు కొట్టడం కనిపించింది.వడదెబ్బ నుంచి కాపాడుకోవచ్చు ఇలా..కర్నూలు(అగ్రికల్చర్): గత ఏడాది ఉమ్మడి కర్నూలు జిల్లాలో రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఈ సారి కూడా భానుడి భగభగలు గత ఏడాది కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత రెండు, మూడేళ్లతో పోలిస్తే ఈ సారి సూర్య ప్రతాపం పెరుగనుంది. ఏప్రిల్ మొదటి వారంలో నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతలు మార్చి నెలలోనే కనిపిస్తుండటంతో ఉమ్మడి జిల్లా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గత ఏడాది అత్యధికంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దేశంలోనే ఇది అత్యధిక ఉష్ణోగ్రత. రాష్ట్రంలో సాధారణంగా అత్యధిక ఉష్ణోగ్రతలు రెంటచింతలలో నమోదవుతాయి. అలాంటిది అక్కడి కంటే ఇక్కడ రెండు, మూడు డిగ్రీలు ఎక్కువ నమోదు అవుతుండటం గమనార్హం. మార్చి నెల చివరికి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకు, ఏప్రిల్ నెలలో 45 డిగ్రీలకు, మే నెలలో 47/48 డిగ్రీలకు చేరుతాయని వాతావరణ శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. గత ఏడాది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండల తీవ్రత ఉన్నా సాయంత్రానికి అకాల వర్షాలు పడటం, గాలుల వల్ల కాస్త ఉపశమనం లభించింది. ఈ సారి అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పెరుగుతున్న వడగాలులు గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటే వాతావరణం చల్లగా ఉంటుంది. ఫిబ్రవరి నెలతో పోలిస్తే గాలిలో తేమ తగ్గింది. ఈ కారణంగా వడగాలులు మొదలయ్యాయి. భూగర్భ జలాలను ఎక్కువగా వినియోగిస్తుండటం వల్ల భూమిలో నీటి నిల్వలు రోజురోజుకు ఇంకిపోతున్నాయి. అక్టోబర్ నుంచి వర్షాలు లేవు. ఇందువల్ల భూమిలో తేమ లేక ఎండల తీవ్రతకు పెరిగి నేల నుంచి వేడి సెగలు పుట్టుకొస్తున్నాయి. అడవులు తరిగిపోతుండటం, పచ్చదనం కనుమరుగు అవుతుండటం కూడా ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమవుతోంది. జిల్లా విస్తీర్ణంలో అడవులు 33 శాతం ఉండాల్సి ఉండగా.. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 16 శాతం మాత్రమే అడువులు ఉన్నట్లు తెలుస్తోంది. వాహనాల సంఖ్య పెరిగి వాయు కాలుష్యం అధికమవడం కూడా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సాధారణంగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటితే వేడి గాలులు మొదలవుతాయి. దీనినే హీట్వేవ్గా వ్యవహరిస్తారు. ఇప్పుడు 38 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. అప్పుడే వడగాలులు మొదలు కావడం ఆందోళన కలిగించే విషయం. పెరిగిన విద్యుత్ వినియోగం ఎండల తీవ్రతతో విద్యుత్ వినియోగం కూడా గణనీయంగా పెరుగుతోంది. ఏసీలకు తోడు కూలర్లు, ఫ్యాన్ల వినియోగం అధికమైంది. ఉమ్మడి జిల్లాలో ఫిబ్రవరి 1న 15లక్షల మిలియన్ యూనిట్ల వినియోగం ఉండగా.. ఈ నెల 1న వినియోగం 16.02 లక్షల మిలియన్ యూనిట్లకు చేరుకుంది. రికార్డు స్థాయిలో లక్ష మిలియన్ యూనిట్లకుపైగా వినియోగం పెరగడం గమనార్హం. రానున్న రోజుల్లో ఎండలు, వడగాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండటంతో విద్యుత్ వినియోగం 20 లక్షల మిలియన్ యూనిట్లకు పైగా పెరిగే అవకాశం ఉందని విద్యుత్ అధికారులు అంచనా. వడదెబ్బ లక్షణాలు: తలనొప్పి, తలతిరగడం, తీవ్రమైన జ్వరం, మత్తునిద్ర, ఫిట్స్, పాక్షిక లేదా పూర్తి అపస్మారక స్థితి. ఉపాధి, పొలం పనులకు వెళ్లే వాళ్లు సాధ్యమైనంత వరకు ఉదయం 11 గంటల్లోపు ఇంటికి చేరుకోవాలి. ఎండలో బయటికి వెళ్లాల్సి వస్తే గొడుగు తీసుకెళ్ల్లాలి. కనీసం తలపైన టోపి లేదా టువాలను కప్పుకోవాలి. కళ్ల రక్షణకు సన్ గ్లాసెస్ ఉపయోగించాలి. దాహం వేయకపోయినా తరచూ చల్లని నీరు ఎక్కువగా తీసుకోవాలి. కొద్దిగా ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోజు, కొబ్బరి నీళ్లు వీలైనంత వరకు తాగుతుండాలి. వేసవిలో తెల్లని వస్త్రాలు ధరించడం ఉత్తమం. మధ్యాహ్నం 11 నుంచి 4 గంటల మధ్య శారీరక శ్రమతో కూడిన పనులు చేయరాదు. బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు బయట తిరగరాదు. 48 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం మార్చి నుంచి మే నెల చివరి వరకు ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. సాధారణం కంటే 3–4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.ఈ సారి ఏప్రిల్, మే నెలల్లో ఉష్ణోగ్రత 47–48 డిగ్రీల వరకు చేరుకోవచ్చు. గాలిలో తేమ శాతం తగ్గుతున్నందున వడగాలుల ప్రభావం ఉంటుంది. – నారాయణ స్వామి, సీనియర్ వాతావరణ శాస్త్రవేత్త ఉపశమన చర్యలు శూన్యం 2024 వేసవి వరకు ముందస్తుగానే ఉపశమన చర్యలు తీసుకోవడం కనిపించింది. కలెక్టరేట్లోకి వెళ్లే ప్రాంతంలో ఇరువైపులు, కలెక్టరేట్ బస్టాపు, రాజ్విహార్, బళ్లారి చౌరస్తా, సి.క్యాంపు సెంటర్, ట్రాఫిక్ సిగ్నల్ పడే ప్రాంతాల్లో చలువ పందిళ్లు ఏర్పాటు చేసేవాళ్లు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేయడం చూశాం. పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీలు, గ్రామాల్లో పంచాయతీలు ఉపశమన చర్యలు తీసుకోవాల్సి ఉన్నా ఆ దిశగా ఇప్పటి వరకు చర్యలు కరువయ్యాయి. ఉపాధి పనులు జరిగే ప్రాంతాల్లోనూ నీడ సదుపాయం కల్పిస్తున్న దాఖలాల్లేవు. -
మహా శివరాత్రి ఆదాయం రూ. 58.36 లక్షలు
మహానంది: మహానంది క్షేత్రంలో ఆరు రోజుల పాటు జరిగిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా రూ. 58,36,566 ఆదాయం లభించినట్లు ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గత ఏడాది శివరాత్రి బ్రహ్మోత్సవాల ద్వారా రూ. 56,80,726 ఆదాయం లభించిందని, ఈ ఏడాది అదనంగా రూ. 1,55,750 వచ్చిందన్నారు. ప్రధాన విభాగాల ద్వారా పరిశీలిస్తే ప్రత్యేక దర్శనాల ద్వారా రూ. 21.30 లక్షలు, తాత్కాలిక దుకాణాల ద్వారా రూ. 13.25 లక్షలు, లడ్డూ ప్రసాదాల ద్వారా రూ. 14.03 లక్షలు, పులిహోర రూ. 5.45 లక్షలు, ఇతర విభాగాల ద్వారా మరికొంత ఆ దాయం వచ్చిందన్నారు. దేవస్థానానికి ఆదాయం కంటే భక్తుల సౌకర్యాలే ప్రాధాన్యతగా పని చేశామన్నా రు. సమావేశంలో సహాయ కార్యనిర్వహణాధికారి ఎరమల మధు, ఆలయ ప్రధాన అర్చకులు మామిళ్లపల్లి అర్జునశర్మ, ఉప ప్రధాన అర్చకులు వనిపెంట జనార్ధనశర్మ, ముఖ్య అర్చకులు రాఘవశర్మ, వేదపండితులు నాగేశ్వరశర్మ, శాంతారాంభట్ పాల్గొన్నారు. -
సర్కారు నిర్లక్ష్యం.. కాటేస్తున్న అతిసారం
సాక్షి, నంద్యాల: కూటమి ప్రభుత్వంలో ప్రజల సంక్షేమం దేవుడెరుగు.. కనీసం తాగేందుకు సురక్షిత నీరు అందని పరిస్థితి నెలకొంది. కలుషిత జలం ప్రజల ప్రాణాలను హరిస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. జిల్లాలో ప్రతి నెల ఏదో ఒక ప్రాంతంలో డయేరియా పంజా విసురుతున్నా చర్యలు చేపట్టడంలో విఫలమవుతూనే ఉంది. 9 నెలల పాలనలో అతిసారంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంతో తరచూ తాగునీరు కలుషితమై అతిసారం ప్రబలి ప్రజలు మృత్యువాత పడుతున్నారు. జిల్లాలో శిథిలావస్థకు చేరిన మంచినీటి పైప్లైన్ మార్పుపై దృష్టి సారించడం లేదు. ఎప్పుడో దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన పైప్లైన్ల ద్వారా ఇప్పటికీ కుళాయిలకు నీటి సరఫరా అవుతోంది. కొన్ని చోట్ల డ్రైనేజీ కాల్వలో మంచినీటి పైప్లైన్లు వెళ్లాయి. వీటి ద్వారా తరచూ నీరు కలుషితమై ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు. అతిసారం ప్రబలిన చోట అధికారులు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి మమ అనిపిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. తాజాగా ఆత్మకూరులో అతిసారం బారిన పడిన మృతి చెందిన వారి సంఖ్య మూడుకు చేరింది. ఆయా కాలనీలకు నీటిని సరఫరా చేసే జీఎల్ఎస్ఆర్ ట్యాంకులు, పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయి. పైపులు పాచిపట్టి కనిపిస్తున్నాయి. ట్యాంకులను శుభ్రం చేయాలని కొద్ది నెలలుగా స్థానికులు కోరినా అధికారులు పట్టించుకోలేదు. రెండు వారాలుగా దుర్వాసన, బురద ఉన్న నీరు వస్తుందని చెప్పినా వినలేదు. ఇంతలోనే కలుషిత నీటిని తాగి సుమారు పది మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో బషిరూన్, రహంతుల్లా, రామచంద్రనాయక్ మృతి చెందారు. అధికారులు సకాలంలో స్పందించి చర్యలు తీసుకొని ఉంటే ముగ్గురు బతికేవాళ్లని మృతుల బంధువులు చెబుతున్నారు. పరిహాసమవుతున్న పరిహారం హామీలు డయేరియాతో చనిపోయిన మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించేందుకు ఈ ప్రభుత్వానికి మనుసు రావడం లేదు. జూపాడుబంగ్లా మండలం చాబోలు గ్రామంలో డయేరియాతో నడిపి నాగన్న చనిపోయిన సమయంలో ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే గిత్తా జయసూర్య మృతుని కుటుంబాన్ని విడివిడిగా పరామర్శించి ఆదుకుంటామని, ప్రభుత్వం నుంచి సాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత అటువైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. పాములపాడు మండలం వేంపెంట గ్రామంలో డయేరియాతో రామలక్ష్మిదేవి మరణించినప్పుడు ఎమ్మెల్యే జయసూర్య బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తూ ప్రభుత్వం నుంచి రూ.5లక్షలు పరిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చి మరిచిపోయారు. గతేడాది సెప్టెంబర్లో ఆళ్లగడ్డలో ఆరుగురు చనిపోతే కలెక్టర్తో పాటు స్థానిక ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పట్టించుకోలేదు. అసలు ఆళ్లగడ్డలో అతిసారనే లేదని, చనిపోయిన వారంతా వివిధ అనారోగ్య సమస్యలతో మరణించారని ప్రకటించి చేతులు దులుపుకున్నారు. ఆత్మకూరు పట్టణంలో అతిసారంతో ముగ్గురు మృతి చెందినా స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి ఇప్పటి వరకు కన్నెత్తి చూడలేదు. పేదల ప్రాణాలు పోతున్నా పాలకులు పట్టించుకోకపోవడంతో జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డయేరియాతోనేమా నాన్న చనిపోయాడు వారం రోజుల నుంచి మా ఇంట్లో ఐదుగురం వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నాం. మేమంతా త్వరగానే కోలుకున్నాం. మా నాన్న రామచంద్రనాయక్కు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో స్థానికంగా ఓ క్లినిక్లో చూపించాం. అయినా తగ్గకపోవడంతో 27వ తేదీ కర్నూలు పెద్దాసుపత్రికి తీసుకెళ్లాం. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు. డయేరియాతోనే చని పోయాడు. మా నాన్నకు బీపీ, షుగర్ కూడా లేవు. గత కొద్దిరోజుల నుంచి నీళ్లు, సరిగ్గా రావడం లేదని చెబుతూనే ఉన్నాం. అయినా అధికారులు పట్టించుకోలేదు. – వెంకటేశ్వరనాయక్, గొల్లపేట, ఆత్మకూరు అతిసార బాధితులతో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ రాజకుమారి 9 నెలల కూటమి పాలనలో అతిసారంతో 11 మంది మృతి ప్రజల ప్రాణాలు పోతున్నా పాఠాలు నేర్వని ప్రభుత్వం ఆత్మకూరు పట్టణంలో మూడుకు చేరిన మృతుల సంఖ్య ఆత్మకూరు: మంచినీరు కలుషితం కాకుండా శిథిలమైన పైప్లైన్లను తొలగించి కొత్తవి ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. ఆత్మకూరు పట్టణంలోని నీలితొట్ల వీధి, గొల్లపేటలో ఆదివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ పర్యటించారు. అతిసార వ్యాధితో షేక్బషీరిన్, రహంతుల్లా, రామచంద్రనాయక్ ఇటీవల మృతిచెందగా వారి ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వపరంగా అన్ని సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. అతిసారం అనుమానంతో అన్ని పరీక్షలు నిర్వహించామని, మంచినీరులో ఎక్కడా కలుషితమైనట్లు నివేదికలు లేవన్నారు. ఆత్మకూరు పట్టణంలో ఎన్నో ఏళ్ల క్రితం ఎనిమిది అడుగుల లోతులో మంచినీటి పైపులైన్లను ఏర్పాటు చేశారని, వాటిని పూర్తిగా తొలగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆత్మకూరులో రెండు మినరల్ వాటర్ ప్లాంట్లను సీజ్ చేశామన్నారు. అన్ని మినరల్ వాటర్ ప్లాంట్లతో పాటు పట్టణంలోని ఇతర ప్రయివేట్ యజమానులకు సంబంధించిన వాటర్ క్యాన్లను, నీటి సరఫరా చేసే బోర్లలోని నీటిని పరీక్షలకు పంపుతున్నట్లు చెప్పారు. ఇటీవల ఓ కంపెనీకి చెందిన చికెన్ నిర్వాహకులు ఉచితంగా గుడ్లు, చికెన్ పంపిణీ చేశారని, దాని ద్వారా ఏమైనా వ్యాధి సోకిందా అనే విషయంపై పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అన్ని హోటళ్లు, చికెన్ సెంటర్లను పరిశీలించి చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ రత్నరాధికను ఆదేశించారు. పకడ్బందీగా పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. పట్టణంలో నీలితొట్లె వీధి, గొల్లపేట వీధిలో ప్రజలకు ట్యాంకర్ల ద్వారా మంచినీటిని అందించాలన్నారు. అనంతరం ఆత్మకూరు సీహెచ్ఓ కేంద్రాన్ని పరిశీలించి బాధితుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ వెంట డీఎంహెచ్ఓ వెంకటరమణ, అడిషనల్ డీఎంహెచ్ఓ కాంతారావునాయక్, ఆర్డీఓ నాగజ్యోతి, తహసీల్దార్ రత్నరాధిక, మున్సిపల్ కమిషనర్ రమేష్బాబు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ఫక్కీరయ్య, డీసీహెచ్ఎస్ జబీవుల్లా, డాక్టర్లు షాదియాబేగం, రాయుడు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి -
నియోజకవర్గాల వారీగా ముఠాలు
● ఒక్క కర్నూలులోనే 25కు పైగా గ్యాంగులు ● పట్టుకోసం రెండు వర్గాల మధ్య ఆధిపత్యపోరు ● ఎక్కడికక్కడ ఎమ్మెల్యేల పేరు చెప్పుకొని అక్రమ రవాణా ● కళ్లెదుటే సాగుతున్నా నోరు మెదపని అధికారులు ● పోలీసులకు పెద్ద ఎత్తున మామూళ్లు● ఆదోని పట్టణంలో కోసిగికి చెందిన రాఘవేంద్ర, గోవిందమ్మల నుంచి 5.27 క్వింటాళ్ల బియ్యం, రవాణా వాహనం సీజ్ సీజ్. ● కర్నూలు రూరల్ మండలం పంచలింగాల సమీపంలో లారీని సీజ్ చేసి 135 బస్తాల బియ్యం స్వాధీనం. లారీ ఓనర్ ప్రైమ్ సీలోరియాతో పాటు మద్దిలేటి అనే వ్యక్తిపై క్రిమినల్ కేసు. ● పత్తికొండ మండలం హోసూరులో 52 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం. అరుణాక్షి, రామకృష్ణలపై క్రిమినల్, 6ఏ కేసులు. ● తుగ్గలి మండలం రాంపల్లి వద్ద లారీ, ఓ కారును సీజ్ చేసి 1100 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం. అనంతపురం జిల్లాకు చెందిన డి.శంకర్, శివప్రసాద్, తుగ్గలి మండలం రాంపల్లికి చెందిన భాస్కరరెడ్డి, డోన్ మండలం చింతలపేటకు చెందిన వడ్డే సురేష్లపై కేసు. ● కల్లూరు చెన్నమ్మ సర్కిల్వద్ద 30 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం. కె.మహేశ్, జయప్రకాష్నాయుడు, ఇర్ఫాన్పై కేసు. ● మంత్రాలయం మండలం మాధవరం చెక్పోస్టు వద్ద కర్ణాటకకు తరలిస్తున్న 80 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం. ● ఆదోని పట్టణం ఢణాపురం రోడ్డులో 3.20 క్వింటాళ్ల బియ్యం సీజ్ చేసి షేక్ షబ్బీర్పై కేసు నమోదు. మరో కేసులో 3.51 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం. వాహనాన్ని సీజ్ చేసి అబ్దుల్ రహిమాన్ అనే వ్యక్తిపై కేసు. కర్నూలు(సెంట్రల్): పేదల బియ్యం అక్రమార్కుల పాలిట వరంగా మారింది. ఏ స్థాయిలో దందా చేసుకుంటే అంతటి ఆదాయాన్ని సమకూర్చి పెడుతోంది. గతంలో ఎన్నడూలేని విధంగా రేషన్ బియ్యం కోసం మాఫియాలు పుట్టుకొచ్చాయి. నియోజకవర్గాల వారీగా టీడీపీ ప్రజాప్రతినిధుల అనుచరులు ముఠాలుగా ఏర్పడి సొమ్ము చేసుకుంటున్నారు. రాత్రికి రాత్రి రేషన్ బియ్యాన్ని జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు. ఇందులో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, పోలీసు, ఇతర అధికారులందరికీ మామూళ్లు ముడుతున్నట్లు చర్చ జరుగుతోంది. జిల్లాలో నెలకు దాదాపు రూ.100 కోట్లకుపైగా బియ్యం అక్రమ రవాణా వ్యాపారం సాగుతున్నట్లు తెలుస్తోంది. చాలా చోట్లా నేరుగా ఎండీయూ ఆపరేటర్లే బియ్యాన్ని రూ.10 నుంచి రూ.15 వరకు కొనుగోలు చేస్తున్నారు. కొన్ని చోట్ల డీలర్లు, ఎండీయూ ఆపరేటర్లు కలసి అక్రమాలకు పాల్పడుతున్నారు. మరికొన్ని చోట్ల వినియోగదారుల నుంచే నేరుగా తక్కువ ధరకు కొనుగోలు చేసే గ్యాంగులు ఉండటం గమనార్హం. కర్నూలులో బరితెగించిన రెండు ముఠాలు అక్రమ బియ్యం దందా జిల్లా అంతటా సగం ఉంటే.. మిగిలిన సగం జిల్లా కేంద్రంలో నడుస్తోంది. ఇక్కడ ఏకంగా 170 చౌకధరల దుకాణాల పరిధిలో 1,100 టన్నుల బియ్యం కేటాయింపులు ఉంటున్నాయి. దీంతో ఇక్కడ పట్టుకోసం టీజీ, గౌరుల పేర్లు చెప్పుకొని వ్యాపారం చేసే వారు బరితెగించారు. కర్నూలులో 25 గ్యాంగుల వరకు పనిచేస్తున్నాయి. వీరంతా ఇద్దరు వ్యాపారులకు ఇన్నాళ్లూ బియ్యం ఇచ్చేవారు. అయితే కొత్తగా వెలుగోడు కేంద్రంగా ఓ వ్యక్తి చక్రం తిప్పుతున్నాడు. గౌరు అనుచరుడినంటూ చెప్పుకొని అప్పటికే ఉన్న వారిద్దరిని కూడా తనకే బియ్యం అమ్మాలంటూ హుకుం జారీ చేశాడు. అమ్మకుంటే అంతు చూస్తానని హెచ్చరించినట్లు సమాచారం. ఒకానొక సమయంలో దాడులు కూడా చేసినట్లు తెలుస్తోంది. అయితే చివరకు పోలీసులు కలుగజేసుకొని కర్నూలులో వ్యాపారం చేస్తున్న బాషా, శరణయ్యలను వెలుగోడు వ్యక్తికి సహకరించాలని, లేదంటే ఇబ్బందులు పడతారని హెచ్చరించి రాజీ చేసినట్లు చర్చ జరరుగుతోంది. అయినప్పటికీ రెండు వర్గాల మధ్య వార్ నడుస్తోందని, ఎప్పుడు ఏమి జరుగుతుందోననే ఆందోళన నెలకొంది. మిన్నకుండిపోయిన నిఘా వ్యవస్థలు జిల్లాలో ప్రతి నెలా బియ్యం దందా రూ.100 కోట్ల వరకు జరుగతున్నా పౌరసరఫరా, పోలీసు, విజిలెన్స్ నిఘాలకు మాత్రం దొరకని పరిస్థితి. బహిరంగంగా తెలిసినా ఎవరూ తమకు తెలియనట్లుగా వ్యవహరిస్తున్నారు. పైగా అక్రమ బియ్యం ఎక్కడైనా ఉంటే తమకు చెబితే పట్టుకుంటామని పౌరసరఫరాల అధికారులు చెబుతుండడం గమనార్హం. మరోవైపు విజిలెన్స్ ఇన్ఫ్మార్మర్లను సైతం పచ్చ మూకలు కనిపెట్టినట్లు తెలుస్తోంది. వారిని దారికి తెచ్చుకోవడం, లేదంటే భయపెట్టే వరకు వెళ్లడంతో ఆ వ్యవస్థ కూడా దిక్కుతోచని స్థితిలో ఉంటోంది. ఇక పోలీసులు చాలా చోట్ల వారికి అన్నీ తెలిసినా ఏమీ అనకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ బియ్యం దందాలో పోలీసులకు పెద్ద ఎత్తున మామూళ్లు అందుతున్నట్లు బహిరంగంగానే చర్చ జరుగుతోంది. ఇటీవల నమోదైన కొన్ని 6ఏ, క్రిమినల్ కేసులు నియోజకవర్గాల వారీగా ‘పచ్చ’ ముఠాలు కర్నూలులో దాదాపు 25 గ్యాంగులు బియ్యం దందాలో ఉన్నాయి. బుధవారపేటకు చెందిన వ్యక్తి, పాతబస్తీకి చెందిన మరో వ్యక్తి ఆయా గ్యాంగుల నుంచి బియ్యాన్ని సేకరిస్తున్నారు. వీరికి పట్టణం నడిబొడ్డున బుధవారపేట, శరీన్నగర్, వీకర్ సెక్షన్కాలనీ, పంచలింగాలలో గోదాములు ఉన్నాయి. అక్కడి నుంచి బియ్యాన్ని జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు. కాగా, వీరిద్దరూ ఓ మంత్రికి అనుచరులు. శ్రీశైలం నియోజకవర్గంలోని వెలుగోడుకు చెందిన ఓ వ్యాపారి ఓ ఎమ్మెల్యే భర్త ఆశీస్సులతో శ్రీశైలం, నందికొట్కూరు, పాణ్యం, కర్నూలులలో బియ్యం సిండికేట్కు తెరలేపారు. డోన్, కోడుమూరు, పత్తికొండలో అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరుడు వెల్దుర్తి కేంద్రంగా బియ్యం అక్రమ రవాణా చేస్తున్నాడు. గతంలో ఆయన ఉమ్మడి జిల్లాలోని చాలా నియోజకవర్గాల్లో వ్యాపారం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆదోనిలో ఓ బీజేపీ నాయకుడు తన కింద 10మందితో బియ్యం దందాను నడిపి కర్ణాటకలోని శిరుగుప్పు, రాయచూరు, బళ్లారి వరకు విస్తరించారు. ఆలూరు నియోజకవర్గంలో బియ్యం అక్రమ రవాణా వ్యాపారాన్ని గుంతకల్కు చెందిన వ్యక్తులు నడిపిస్తున్నారు. మంత్రాలయం, ఎమ్మిగనూరులో కొంత భాగం వెల్దుర్తి కేంద్రంగా పనిచేసే వ్యాపారి, మిగిలిన భాగాలను కొందరు టీడీపీ నాయకులు కర్ణాటక వ్యాపారులతో కలిసి నిర్వహిస్తున్నట్లు సమాచారం. -
ఘనంగా గురు వైభవోత్సవాలు
మంత్రాలయం: ప్రహ్లాదరాయల వరదుడు.. యతి వరేణ్యుడు శ్రీరాఘవేంద్ర స్వామి గురు భక్తి వైభవోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. రెండో రోజు ఆదివారం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు నేతృత్వంలో వేకువ జామున సుప్రభాత సేవతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. పూజా మందిరంలో పీఠాధిపతి చేపట్టిన మూల, జయ, దిగ్విజయ రాముల సంస్థాన పూజలు విశేషంగా ఆకట్టుకున్నాయి. వేద మంత్రోచ్ఛారణలు, భక్తి కీర్తనలు, మంగళవాయిద్యాల మధ్య అర్చన, అభిషేకాది పూజలు, దివిటీ సేవలు నిర్వహించారు. అనంతరం రాఘవేంద్రుల మూల బృందావనానికి పంచామృతాభిషేకం గావించి పుష్పాలంకరణ చేపట్టి హారతులు పట్టారు. వేడుకల సందర్భంగా యోగీంద్ర మంటపంలో కేంద్ర రైల్వే సహాయక మంత్రి సోమన్న రాఘవేంద్ర అనుగ్రహ ప్రశస్థి అవార్డు అందుకున్నారు. అదే మంటపంలో చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. బెంగళూరుకు చెందిన విదూషి నారాయణ కర్ణాటక సంగీత విభావరి, బెంగళూరుకు చెందిన కడప హనుమేష్ ఆచార్ వీణానాద ప్రదర్శన అలరించాయి. ఉత్సవాల్లో ఏఏవో మాధవశెట్టి, సలహాదారు శ్రీనివాసరావు, మేనేజర్ వెంకటేష్జోషి, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, మేనేజర్–సి సురేష్ కోనాపూర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆధ్యాత్మిక భావం అలవర్చుకోవాలి
ఆళ్లగడ్డ: సమాజంలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావం అలవర్చుకోవాలని అహోబిలం మఠం పీఠాధిపతి శ్రీ రంగరాజ యతీంద్ర మహాదేశికన్ స్వామీజీ అన్నారు. అహోబిలం క్షేత్రంలో ఇస్కాన్ ఇండియా యూత్ కౌన్సిల్ (ఐఐవైసీ) సమావేశాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఆదివారం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పీఠాధిపతి ప్రసంగిస్తూ.. నేటి యువత ఆధ్యాత్మిక భావనలు కలిగి ఉండి రేపటి తరానికి ఆదర్శంగా నిలవాలన్నారు. అహోబిలం క్షేత్రం చరిత్ర, ప్రాశస్త్యం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మఠం ప్రతినిధి శ్రీకార్యం, ప్రధానార్చకులు వేణుగోపాలన్ పాల్గొన్నారు. -
నేడు ప్రజా ఫిర్యాదులపరిష్కార వేదిక కార్యక్రమం
నంద్యాల: కలెక్టరేట్లోని సెంటినరీ హాల్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పబ్లిక్ గ్రివెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్ (పీజీఆర్ఎస్) ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తామన్నారు. ఉదయం 9.30 గంటలకు జిల్లాధికారులందరూ హాజరు కావాలన్నారు. జిల్లా కేంద్రంతో పాటు మండల, నియోజకవర్గ, డివిజన్ స్థాయిలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థులకు సంస్కారం అవసరం● జిల్లా జడ్జి జి.కబర్దికర్నూలు కల్చరల్: విద్యార్థులకు చదువే కాదు సంస్కారం కూడా అవసరమని జిల్లా జడ్జి జి.కబర్ది అన్నారు. ఆదివారం ఓల్డ్సిటీ చిదంబరావు వీధిలోని స్వామి వివేకానంద సంస్కృత పాఠశాలలో అన్నపూర్ణమ్మ విద్యార్థి వసతి గృహం వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ.. విద్యార్థులకు చదువు, సంస్కారం అందించడం అభినందనీయమన్నా రు. హైదరాబాద్ ఆర్ఎస్ఎస్ క్షేత్ర సేవా ప్రముఖ్ ఎక్కా చంద్రశేఖర్ ముఖ్య వక్తగా హాజరై సందేశమిచ్చారు. పారిశ్రామికవేత్త శేరి బాలనాగరాజు, ఆర్ఎస్ఎస్ విభాగ్ కార్యసభ్యులు సుబ్బ లక్ష్మయ్య, వసతి గృహం అధ్యక్షులు బి.చిరంజీవిరెడ్డి, కార్యదర్శి కె.బాలాజీరావు మాట్లాడారు. మోతాదుకు మించిపురుగు మందులు వాడొద్దు కర్నూలు(అగ్రికల్చర్): మోతాదుకు మించి పురుగు మందులు పిచికారీ చేయకుండా రైతులకు అవగాహన కల్పించాలని ఇన్పుట్ డీలర్లను ఆత్మ డిప్యూటీ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీలత సూచించారు. కలెక్టరేట్లోని వ్యవసాయ శాఖ సమావేశ మందిరంలో ఆదివారం ఇన్పుట్ డీలర్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆత్మ డీపీడీ మాట్లాడుతూ.. పురుగుమందులు ఎక్కువ గా వాడుతుండటంతో ఆహార పంటలు, కూరగాయల్లో వాటి అవశేషాలు ఉంటున్నట్లు స్పష్టమవుతోందన్నారు. విశ్రాంత జేడీఏ, దేశీ శిక్షణ కార్య క్రమం సమన్వయకర్త జయచంద్ర పాల్గొన్నారు. ‘ఎకై ్సజ్’ సంఘం అధ్యక్షుడిగా రాజేంద్రప్రసాద్ కర్నూలు: ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఎగ్జిక్యూటీవ్ అధికారుల సంఘం అధ్యక్షుడిగా కర్నూలుగా ఈఎస్టీఎఫ్ ఇన్స్పెక్టర్ రాజేంద్రప్రసాద్ ఎన్నికయ్యారు. ఆదివారం కర్నూలు ఎకై ్సజ్ కార్యాలయం ఆవరణలో జిల్లా డీపీఈఓ మచ్చా సుధీర్బాబు అధ్యక్షతన ఎన్నిక లు జరిగాయి. అసోసియేట్ ప్రెసిడెంట్గా సోమశేఖర్ (డోన్ ఎస్ఐ), ఉపాధ్యక్షులుగా భార్గవ్రెడ్డి (కోసిగి ఎస్ఐ), ప్రధాన కార్యదర్శిగా సందీప్ (కోవెలకుంట్ల ఎస్ఐ), ఆర్గనైజింగ్ కార్యదర్శిగా రమేష్రెడ్డి (ఎమ్మిగనూరు సీఐ), సహాయ కార్య దర్శిగా రహెనాబేగం (కర్నూలు ఎస్ఐ), కోశాధికారిగా దుర్గా నవీన్బాబు (కర్నూలు ఎస్ఐ), కార్యవర్గ సభ్యులుగా ఇన్స్పెక్టర్లు శ్రీధర్, రమాదేవి, శేషాచలం, సబ్ ఇన్స్పెక్టర్లు ప్రవీణ్కుమార్ నాయక్, ఇంద్ర కిరణ్ తేజ ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి సుధీర్బాబు తెలిపారు. -
ఆత్మకూరులో డయేరియా కలకలం.. ముగ్గురి మృతి
సాక్షి, నంద్యాల జిల్లా: ఆత్మకూరు పట్టణంలో డయేరియా కలకలం రేపుతోంది. కలుషిత నీరు తాగి ఆత్మకూరు పట్టణంలో మరో వ్యక్తి మృతి చెందాడు. ఇప్పటికే ఆత్మకూరు నీలితొట్టి వీధిలో కలుషిత నీరు తాగిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు.శనివారం రామచంద్రనాయక్ అనే వ్యక్తి కలుషిత నీరు తాగడంతో వాంతులు, విరే చనాలు కావడంతో కర్నూలు ఆసుపత్రికి బంధువులు తరలించారు. కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ కోలుకోలేక అతడు చెందాడు. కలుషిత నీరు ఘటనలో ఇప్పటికి ముగ్గురు బలి కాగా, మరికొంతమంది బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. -
కనిపించని ‘భరోసా’
కొలిమిగుండ్ల ఎస్సీ కాలనీ వీధిలో పింఛన్ల కోసం నిల్చున్న లబ్ధిదారులు కొలిమిగుండ్ల: ఎన్టీఆర్ భరోసా పింఛన్లు నామమాత్రంగా పంపిణీ చేస్తున్నారు. సిగ్నల్ సమస్య, ఇతర కారణాలతో వీధులు, రచ్చబండల వద్ద కూర్చొని పింఛన్ అందిస్తున్నారు. శనివారం ఉదయం ఏడు గంటల నుంచే పింఛన్లు పంపిణీ చేయాలని ఆదేశాలిచ్చారు. అలాగే ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ వాయిస్ రికార్డ్ వినిపించాలని ఉత్తర్వులు ఇచ్చారు. చాలా గ్రామాల్లో వీధుల్లోనే పింఛన్లు పంపిణీ చేశారు. అవ్వాతాతలు, దివ్యాంగులు తీవ్ర కష్టాలు ఎదుర్కొన్నారు. -
శ్రీశైలం.. పుష్పశోభితం
అశ్వవాహనంపై ఆలయ ప్రదక్షిణ చేస్తున్న ఆదిదంపతులు (ఇన్సెట్) ఉత్సవమూర్తులుశ్రీశైలంటెంపుల్: ఇలకై లాసమైన శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో ఫిబ్రవరి 19వ తేదీ నుంచి ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శనివారం ముగిశాయి. అక్కమహాదేవి అలంకార మండపంలో శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు అశ్వవాహనసేవ నిర్వహించారు. అనంతరం ఆలయ ఉత్సవం జరిపారు. డప్పువాయిద్యాలు, జానపద కళాకారుల నృత్యప్రదర్శనలు అకట్టుకున్నాయి. పలు రకాల సుగంధ పుష్పాలతో స్వామిఅమ్మవార్లకు పుష్పోత్సవం చేశారు. అనంతరం ఉత్సవమూర్తులకు అద్దాల మండపంలో (శయమందిరం)లో శయనోత్సవం నిర్వహించి.. చివరిగా స్వామిఅమ్మవార్లకు ఏకాంతసేవ జరిపారు. ఆయా పూజా కార్యక్రమాల్లో దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ముగిసిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు -
రమణీయం.. తెప్పోత్సవం
మహానంది: శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వర స్వామికి శనివారం రాత్రి రుద్రగుండం కోనేరులో తెప్పోత్సవం నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో ఉత్సవాన్ని భక్తులు తిలకరించారు. దాతలు ఏజీఎన్ జ్యువెలర్స్ అధినేత అవ్వారు గౌరీనాథ్, సరస్వతి, అవ్వారు గౌతం, పవిత్ర దంపతులను సన్మానించి ప్రసాదాలు అందించారు. ఇదిలా ఉండగా.. క్షేత్రంలో ఎనిమిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు శనివారం మహాపూర్ణాహుతితో ముగిశాయి. ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని, నాగేశ్వరశర్మ, శాంతారాంభట్, హనుమంతుశర్మ, ముఖ్య అర్చకులు రాజమాణిక్యశర్మ, మణికంఠశర్మ, రుత్వికుల బృందం ఆధ్వర్యంలో స్థానిక యాగశాలలో ఉదయం నుంచి మహాపూర్ణాహుతి పూజలు శాస్త్రోక్తంగా చేపట్టారు. యాగఫల సమర్పణ, మహానందీశుడి దంపతులకు కంకణ విసర్జన, చండీశ్వరుడు, త్రిశూలుడికి త్రిశూల స్నానం పూజలను స్థానిక రుద్రగుండం కోనేరులో చేపట్టారు. పెళ్లిపెద్దలైన శ్రీ పార్వతీ సమేత బ్రహ్మనందీశ్వరస్వామి వారి దంపతులతో పాటు మహానందీశ్వరుడి దంపతులను ప్రదక్షిణ గావించి తిరిగి అలంకార మండపానికి చేర్చారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా ధ్వజావరోహణ చేశారు. అలంకార మండపం వద్ద నాకబలి పూజలు జరిపారు. ఆలయ ఏఈఓ ఎరమల మధు, ఆలయ, కార్యాలయ సూపరింటెండెంట్లు అంబటి శశిధర్రెడ్డి, దేవిక, కల్యా ణోత్సవ దాత కుర్రా వెంకయ్య చౌదరి సతీమణి కు ర్రా జయలక్ష్మీ, ఎస్ఐ రామమోహన్రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు చిన్నా, శ్రీనివాసులు పాల్గొన్నారు. మహానందిలో శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి -
ఇంటి దగ్గరే పింఛన్ల పంపిణీ ఎక్కడా కనిపించలేదు. లబ్ధిదారుల ఇంటి నుంచి 300 మీటర్ల దూరంలో పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చినా పింఛన్ అందలేదు. అన్ని చోట్లా అవ్వతాతల, దివ్యాంగుల అవస్థలే దర్శనమిచ్చాయి. ప్రచారంలో భాగంగా 20 సెకండ్ల నిడివి కలిగిన ఆడియోను వి
తుగ్గలి మండలం ఆర్ కొట్టాలలో వీధిలోనే పింఛన్లు పంపిణీ చేస్తున్న దృశ్యంవీధి చివరన ఎదురుచూపు● ఉమ్మడి కర్నూలు జిల్లాలో అస్తవ్యస్తంగా పింఛన్ల పంపిణీ ● సచివాలయాలకు వెళ్లి నిరీక్షించినా అందని ‘భరోసా’ ● సర్వర్ సమస్యతో పింఛన్ల పంపిణీ ప్రక్రియలో జాప్యం ● రచ్చబండల దగ్గర, చెట్ల కింద తప్పని ఎదురుచూపులు ● తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న అవ్వతాతలు, దివ్యాంగులు సి.బెళగల్: మండలంలో పింఛన్ పొందేందుకు లబ్ధిదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. శనివారం ఉదయం ఏడు గంటల అనంతరం కొంతమంది అధికారులు పింఛన్ను అందజేశారు. అయితే కొంతమంది అధికారులు గ్రామాలకు ఆలస్యంగా చేరుకోవడంతో లబ్ధిదారులకు ఎదురు చూపులు తప్పలేదు. అవ్వాతాతలు వీధి చివరలోని అరుగులను ఆశ్రయించారు. అధికారులు సైతం ఒకే చోట కూర్చుని అక్కడికే లబ్ధిదారులను పిలుపించుకుని పింఛన్ పంపిణీ చేశారు. మండల కేంద్రం సి.బెళగల్లో పాల కెనరా బ్యాంక్ దగ్గరున్న దుకాణం దగ్గర, తెలుగు వీధిలోని మసీద్ దగ్గర, కొంతమంది వీధి చివరన అరుగుల మీద కూర్చుని పంపిణీ చేశారు.కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో శనివారం మార్చి నెల పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. చాలా గ్రామాల్లో రచ్చబండలు, వీధుల్లోకి రప్పించి పంపిణీ చేయడం చూసి అవ్వతాతలు నోరెళ్లబెట్టారు. పడిగాపులు కాసి అతి కష్టం మీద పింఛన్లు తీసుకున్నారు. పలువురు సచివాలయ ఉద్యోగులు కొందరు ఉదయం ఏడు గంటలకే పింఛన్ లబ్ధిదారుల ఇంటి దగ్గరకే వెళ్లినా సర్వర్ సమస్య వచ్చింది. దీంతో అందరినీ ఒకేచోట పిలిపించి పంపిణీ చేపట్టారు. దివ్యాంగులు, వృద్ధులు అతి కష్టం మీద పింఛన్లు ఎక్కడ పంపిణీ చేస్తున్నారో తెలుసుకొని వెళ్లాల్సి వచ్చింది. జిల్లా కలెక్టర్ రంజిత్బాషా మంత్రాలయంలో, మంత్రి టీజీ భరత్ కర్నూలు నగరంలో పింఛన్లు పంపిణీ చేశారు. డీఆర్డీఏ పీడీ వైపీ రమణారెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలో 2,38,798 పింఛన్లు ఉండగా 2,25,767 పంపిణీ చేశారు. నంద్యాల జిల్లాలో 2,15,031 పింఛన్లు ఉండగా 2,00,936 పంపిణీ చేశారు. అంతా అస్తవ్యస్తం పింఛన్ల పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. కల్లూరు, కోడుమూరు, సి.బెళగల్, కర్నూలు, ఆదోని తదితర ప్రాంతాల్లో ఇంటిదగ్గర పింఛన్ల పంపిణీ కేవలం నామమాత్రానికే పరిమితం అయింది. ఎక్కువ మంది సచివాలయాలకే వెళ్లి పింఛన్లు తెచ్చుకున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వలంటీర్లు లబ్ధిదారులకు ఇంటి వద్దకే వెళ్లి పింఛన్ ఇచ్చేవారు. అవ్వాతాతలు, దివ్యాంగులు, వ్యాధిగ్రస్తులు సంతోషం వ్యక్తం చేసేవారు. పింఛన్ల పంపిణీ వారం రోజుల పాటు కొనసాగేది. దూర ప్రాంతాల్లో ఉండేవారికి, ఆసుపత్రుల్లో చికిత్స పొందేవారికి వలంటీర్లు పింఛన్ ఇచ్చేవారు. కూటమి ప్రభుత్వంలో ఈ పరిస్థితులు లేవు. రచ్చబండల దగ్గర, చెట్లకింద, వీధుల్లో పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. దీంతో అవ్వతాతలకు, దివ్యాంగులకు తిప్పలు తప్పడం లేదు. తుగ్గలి: పింఛన్ లబ్ధిదారులకు ఈ నెల కూడా కష్టాలు తప్పలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నెలనెలా లబ్ధిదారుల ఇంటి వద్దకే వలంటీర్లు వెళ్లి పింఛన్ అందించేవారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి గ్రామాల్లో ఎక్కడపడితే అక్కడ పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. తుగ్గలి మండలంలోని ఆర్ కొట్టాల గ్రామంలో శనివారం మూడు చోట్ల పింఛన్లు పంపిణీ చేశారు. ఆయా ప్రాంతాల్లో వృద్ధులు, దివ్యాంగులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వ హంగామే! పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ వీడియోను లబ్ధిదారులకు చూపడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. వేలాది మంది దివ్యాంగులు, వృద్ధులు వచ్చినా వారికి వెంటనే పింఛన్లు ఇవ్వలేదు. అవ్వతాతలు చాలా సమయం వేచి ఉండాల్సి వచ్చింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని చాలా మండలాల్లో ఇంటి దగ్గర పింఛన్ల పంపిణీ నామమాత్రంగా సాగింది. -
ఇంటర్ పరీక్షలు ప్రారంభం
● మొదటి రోజు 595 మంది విద్యార్థుల గైర్హాజరు నంద్యాల(న్యూటౌన్): ఇంటర్మీడియెట్ పరీక్షలు శనివారం ప్రారంభం అయ్యాయి. తొలిరోజు మొదటి సంవత్సరం సెకండ్ లాంగ్వేజ్(తెలుగు) పేపర్–1, సంస్కృతం పరీక్షలకు నంద్యాల జిల్లాలో 595 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీవీఈఓ సునీత తెలిపారు. జిల్లాలోని 53 పరీక్షా కేంద్రాల్లో 16,174 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 15,579 మంది హాజరయ్యారన్నారు. డీవీఈఓతో పాటు మూడు ఫ్లయింగ్ స్క్వాడ్లు, రెండు టీంలు సిట్టింగ్ స్క్వాడ్లు.. పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా చూశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు.మాల్ ప్రాక్టీస్కు పాల్పడితే చర్యలు తీసుకుంటామని డీవీఈఓ హెచ్చరించారు. ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య పంజగుట్ట: ఉద్యోగం రావడంలేదని మనస్థాపంతో బీటెక్ పూర్తిచేసిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పంజగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నంద్యాల జిల్లా శ్రీశైలానికి చెందిన నూకరాజు (29) బీటెక్ పూర్తిచేశాడు. నగరంలోని అమీర్పేటలో ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేశాడు. ఇటీవల ఓ సంస్థలో ఇంటర్వ్యూకు వెళ్లిన నూకరాజు తప్పకుండా ఉద్యోగం వస్తుందనే నమ్మకంతో తోటి రూమ్మేట్కు పార్టీ కూడా ఇచ్చాడు. అయితే ఆ ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి లోనయ్యాడు. శుక్రవారం నూకరాజు రూమ్మేట్ మణికంఠ ఉదయం 8 గంటలకు తాను ఆఫీస్కు వెళ్తున్నానని చెప్పి వెళ్లిపోయాడు. మణికంఠ రాత్రి 7.30 ప్రాంతంలో వచ్చి చూడగా గది లోపలనుంచి గడియ పెట్టి ఉంది. ఎంత పిలిచినా తలుపు తీయకపోవడంతో కిటికీలో నుంచి చూశాడు. ఫ్యాన్కు వేలాడుతున్నట్లు కనిపించడంతో వెంటనే సిబ్బందికి చెప్పి తలుపులు తెరిచి చూడగా నూకరాజు అప్పటికే మృతిచెందినట్లు గుర్తించారు. నేడు ఏకలవ్య మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష కర్నూలు(అర్బన్): గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతి ప్రవేశాలకు ఎంట్రెన్స్ టెస్ట్ ఈ నెల 2న నిర్వహిస్తున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారిణి కె.తులసీదేవి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తామన్నారు. పరీక్షకు జిల్లాకు చెందిన 41 మంది బాల బాలికలు దరఖాస్తు చేసుకున్నారని, వీరందరికి స్థానిక బి.క్యాంప్లోని గిరిజన సంక్షేమ శాఖ బాలికల రెసిడెన్షియల్ స్కూల్లో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు. -
ఆధ్యాత్మిక ‘నెల’వంక
నేటి ఇఫ్తార్: 6.31 రేపటి సహెరీ: 5.13సాశ్రీశ్రీఉశ్రీశ్రీకర్నూలు కల్చరల్: ముస్లింల పవిత్ర మాసం రంజాన్. దీంతో నెల రోజుల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో, నియమ నిష్టలతో వారు పర్వదినాన్ని జరుపుకుంటారు. మానవాళికి మార్గదర్శనం చేసే ఖురాన్ సైతం ఈనెలలోనే అవతరించింది. ఎన్నో విశేషాలు కలిగిన ఈ మాసం శనివారం ఆకాశంలో నెలవంక కనిపించడంతో ప్రారంభమైంది. ‘చాంద్ దిఖ్ గయా’ అంటూ ఒకరి నొకరు ముబారక్ చెప్పుకున్నారు. తర్వాత కొద్దిసేపటికే కర్నూలులో అవుట్ పేలడంతో రాత్రి మొదటి తరావీహ్ నమాజు చేసుకున్నారు. నేటి నుంచి నెల రోజుల పాటు ఉపవాసాలు (రోజా) పాటించనున్నారు. నెలవంక కనిపించడంతో రంజాన్ మాసం ప్రారంభమైనట్లు హిలాల్ కమిటీ ప్రకటించింది. మాసమంతా ఆధ్యాత్మిక చింతన ‘రంజాన్ మాసం’ ప్రతి ముస్లిం అల్లాహ్ నుంచి వరా లు అందుకునే సౌభాగ్యం కల్పించే నెల. కఠోర దీక్ష, చిత్తశుద్ధితో అల్లాహ్ను ప్రార్థించిన వారికి చక్కటి జీవిత గమ్యాన్ని నిర్దేశిస్తుంది. అందుకే ఈ పవిత్ర మాసంలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనతో గడుపుతారు. ఉపవాసాలు ఉండడంతో పాటు రోజుకు ఐదు పూటలు నమాజు చదువుతారు. రోజూ ఖురాన్ పఠనం లేదా శ్రవణం చేస్తారు. ఇలా చేయడం ద్వారా మానసిక ప్రశాంతతోపాటు పరిహారం లభిస్తుందని ముస్లిం మత పెద్దలు చెబుతారు. ఉచిత సహెరీకి ఏర్పాట్లు ఉపవాస దీక్షల సందర్భంగా పలు స్వచ్ఛంద సంస్థలు సహెరీ ఏర్పాట్లు చేశారు. కర్నూలు నగరంలోని లాల్ మసీదు వద్ద ఉన్న ఖూబ్సూరత్ మసీదులో, పెద్దమార్కెట్ వద్ద ఉన్న నూరానీ మసీదులో, ఖడక్పురలో ఉన్న డాక్టర్ మియా హత్తి (ఏనుగు) బీడీ ఫ్యాక్టరీలో, కొత్తపేటలో ఉన్న హజరత్ మౌలా మిష్కిన్ మసీదులో, కొత్తపేటలోని ఖా దుమియా మసీదులో, సి.క్యాంప్ సెంటర్లోని మామూర్ మసీదులో, అబ్బాస్ నగర్లోని యూ నిఖ్ స్కూల్ వద్ద ఉన్న అబ్బాస్ మసీదులో సహెరీ ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు.ఫొటో: డి. హుస్సేన్ నేటి నుంచి రంజాన్ ఉపవాసాలు షురూ నెల రోజులు దైవ చింతనలో గడపనున్న ముస్లింలు ఉచిత సహెరీ ఏర్పాట్లు చేసిన స్వచ్ఛంద సంస్థలు -
జిల్లా అభివృద్ధికి ఒక్క ప్రకటనా లేదు
● కర్నూలు, నంద్యాల జిల్లాల అభివృద్ధికి ప్రభుత్వం పైసా కూడా ప్రత్యేకంగా కేటాయింపులు చేయలేదు. ● ఓర్వకల్లు ఇండస్ట్రియల్హబ్కు పరిశ్రమలు వస్తున్నాయని ఇటీవల భరత్ ప్రకటించారు. ● అయితే ఒక్క పరిశ్రమపై కూడా బడ్జెట్లో ప్రస్తావన చేయలేదు. ● రూ.150కోట్లతో కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ శాశ్వత భవనాలు, కర్నూలు నగరానికి ఔటర్, ఇన్నర్ రింగ్రోడ్డు, డోన్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్మైన్స్, శ్రీశైలంలో టైగర్పార్క్, ఆలూరులో జింకలపార్క్, ఆదోని, ఎమ్మిగనూరులో ఇంటిగ్రేటెడ్ టైక్స్టైల్ అప్పెరల్ పార్క్ ఏర్పాటు చేస్తామని ఎన్నికల ముందు ప్రకటించారు. ● కర్నూలులో మైనార్టీ స్టడీ సర్కిల్ ఏర్పాటు, కర్నూలులోని సర్వజన వైద్యశాలను ‘రాయలసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్సెస్’ స్థాయిగా అభివృద్ధి చేస్తామన్నారు. ● నంద్యాలను ‘సీడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా’గా అభివృద్ధిచేసి, నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన సంస్థను డీమ్డ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ● బడ్జెట్లో వీటికి సంబంధించి ఎలాంటి ప్రస్తావన లేదు. నిధులు కేటాయించని పరిస్థితి. -
ఇంటి దగ్గర పింఛన్ కష్టమే!
● 300 మీటర్ల దూరంలో పంపిణీ కర్నూలు(అగ్రికల్చర్): ఇంటి దగ్గర పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం సడలించింది. లబ్ధిదారుల ఇళ్లను జియో ట్యాగింగ్ చేయగా.. ఇంటి నుంచి 300 మీటర్ల( మూడు పర్లాంగులు) దూరంలో పింఛన్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంది. 300 మీటర్ల కంటే ఎక్కువ దూరంలో పంపిణీ చేస్తుంటే కారణాలను యాప్లో నమోదు చేయాల్సి ఉంది. ఈ కార్యక్రమాన్ని మార్చి 1న చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో పైలెట్గా ప్రారంభించనున్నారు. జిల్లాలో ఇంతవరకు ఒక్క సచివాలయంలో కూడా 100 శాతం ఇంటిదగ్గర పింఛన్లు పంపిణీ చేయలేదు. గ్రామ, వార్డు సచివాలయాలు, రచ్చబండల దగ్గరే పంపిణీ సాగుతోంది. మార్చి నెలకు సంబంధించి ఉమ్మడి కర్నూలు జిల్లాలో 4,53,829 పింఛన్లకు రూ.195.28 కోట్లు మంజూరు అయ్యాయి. -
గిరిజనులు నన్నారి సాగులో రాణించాలి
ఆత్మకూరు: చెంచు గిరిజనులు నన్నారి సాగులో రాణించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా సూచించారు. బైర్లూటీ చెంచుగూడెంలో చెంచు గిరిజనులతో శుక్రవారం కలెక్టర్ సమావేశమ య్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజనులు నల్లమల అటవీ పరిధిలో నన్నారి సాగుచేసి ఆర్థికంగా ఎదగాలని కోరారు. నన్నారి సాగుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహం అందిస్తున్నాయన్నారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో అవగాహన, శిక్షణ ఇస్తుందన్నారు. మొక్కల పెంపకం, మార్కెట్ అవకాశాలు కూడా కల్పిస్తుందన్నారు. చెంచులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం గిరిజనులతో పంట సాగు విధానం, నన్నారి తయారీ తదితర వివరాలను ఆమె గిరిజనులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, శ్రీశైలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి ఇంటర్ పరీక్షలు నంద్యాల(న్యూటౌన్): ఇంటర్ మీడియెట్ వార్షిక పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నా యి. జిల్లాలో పరీక్షల నిర్వహణకు ఇంటర్ బోర్డు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. మార్చి 1వ తేదీ నుంచి మొదటి సంవత్సరం విద్యార్థులు, 3వ తేదీ నుంచి ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు రాయనున్నారు. మార్చి 20వ తేదీ వరకూ కొనసాగుతాయి. జిల్లాకు చేరిన మూడు సెట్ల ప్రశ్నపత్రాలను ఆయా పోలీస్ స్టేషన్లలో భద్రపరిచారు. మొత్తం 53 కేంద్రాలు ఏర్పాటు చేశారు. జనరల్, ఒకేషనల్ కలిపి మొత్తం 28,742 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో మొదటి సంవత్సరం విద్యార్థులు 15,731 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 13,011 మంది ఉన్నారు. ప్రతి రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఎవరైనా లీక్ చేస్తే కచ్చితంగా దొరికిపోతారు. ప్రతి కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. పరీక్షల సమయంలో ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేసుకునేందుకు ఇంటర్ బోర్డ్ డీఐఈఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నంబర్ 9441235307కు ఫోన్ చేయవచ్చునని డీఐఈఓ సునిత తెలిపారు. నేడు ప్రధాని వెబ్నార్ కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయం, గ్రామీణ శ్రేయస్సుపై శనివారం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ వెబ్నార్ నిర్వహించనున్నారని లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ (ఎల్డీఎం) ఎస్ఆర్ రామచంద్రరావు శుక్రవారం ఒకప్రకటనలో తెలిపారు. కర్నూలులోని ఉద్యానభవన్లో శనివారం ఉద యం 10 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు వెబ్నార్ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. రైతులతో ప్రధాని ముఖాముఖి అవుతారని తెలిపారు. కిసాన్ క్రెడిట్ కార్డు(కేసీసీ) ద్వారా పంపిణీ చేసే వ్యవసాయ రుణ రాయితీ రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పెంచుతూ కేంద్ర ప్రభు త్వం ఆదేశాలు ఇచ్చిందని పేర్కొన్నారు. వెబ్నార్లో నాబార్డు డీడీఎం సుబ్బారెడ్డి, అధికారులు, రైతులు పాల్గొంటారని తెలిపారు. -
బడ్జెట్ అమలుపై అనుమానాలు
గవర్నర్ ప్రసంగంలో సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రస్తావించకపోవటంపై బడ్జెట్ అమలుపై ప్రజలకు అనుమానాలు వస్తున్నాయి. అన్నదాత సుఖీభవ కింద రూ.6,300 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. రాష్ట్రంలో 55 లక్షల మంది రైతులు ఉంటే 45 లక్షల మంది రైతులకు రూ. 20 వేల ప్రకారం ఇవ్వలేని పరిస్థితి ఉంది. కేంద్రం ఇచ్చే నిధులతో కూడా సర్దుబాటు చేయలేరు. ఇప్పటికే ఉద్యోగులకు చెల్లించాల్సిన డీవోలు పెండింగ్లో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోంది. – కాటసాని రాంభూపాల్రెడ్డి, వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు -
‘మహా’నందమాయె!
మహానంది: హర హర మహాదేవ... శంభో శంకరా...శ్రీ మహానందీశ్వరస్వామికీ జై... శ్రీ కామేశ్వరీదేవి మాతాకీ జై.... అంటూ శివనామస్మరణ మిన్నంటగా మహానందీశ్వరుడి రథోత్సవం శుక్రవారం మహానందంగా సాగింది. ముందుగా రథం వద్ద వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని, ప్రధాన అర్చకులు మామిళ్లపల్లి అర్జునశర్మ, పండితులు, రుత్వికుల ఆధ్వర్యంలో రథాంగ పూజ, కూష్మాండబలి, బ్రహ్మ, ఇతర దేవతల ఆవహానాది పూజలు శాస్త్రోక్తంగా చేపట్టారు. సంప్రదాయంలో భాగంగా తిమ్మాపురం గ్రామానికి చెందిన వీరయ్య ఆచారి, కుటుంబ సభ్యులు కుంభాహుతిని (నైవేద్యం) సంప్రదాయంగా తీసుకొచ్చి రథానికి సమర్పి ంచారు. అనంతరం నంద్యాల ప్రిన్సిపల్ సీనియర్ సివి ల్ జడ్జి బి.రాధారాణి, న్యాయమూర్తి వాసు, ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ రామాంజనేయులు తదితరులు రథోత్సవాన్ని ప్రారంభించారు. రథోత్సవంలో నంద్యాల ఏఎస్పీ మందా జావళి ఆల్ఫోన్స్, ఏఈఓ మధు, ఆలయ సూపరింటెండెంట్లు అంబటి శశిధర్రెడ్డి, దేవిక, సీఐ శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు. -
పూర్తిస్థాయి బడ్జెట్లోనూ సూపర్ సిక్స్కు ఎగనామం
● ఊసేలేని యువనేస్తం, మహాశక్తి, ఉచితబస్సు ● ఈ ఆర్థిక సంవత్సరానికి తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ లేనట్లే.. ● గుంటూరు, ప్రకాశం జిల్లాలో మిర్చి క్లస్టర్ యూనిట్ ● ఉమ్మడి కర్నూలు జిల్లాకు మొండిచేయి ● హంద్రీ–నీవా కాలువ వెడల్పు చేయకుండా లైనింగ్పైనే ప్రకటన ● మాటలకే పరిమితమైన ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ ● ఉమ్మడి కర్నూలు జిల్లా అభివృద్ధికి పైసా విదల్చని వైనం -
బ్రహ్మోత్సవ యాగ క్రతువులకు పూర్ణాహుతి
శ్రీశైలంటెంపుల్: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నవాహ్నిక దీక్షతో ఫిబ్రవరి 19వ తేదీ నుంచి నిర్వహించిన శ్రీశైల మల్లన్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవ యాగాలకు శుక్రవారం పూర్ణాహుతి నిర్వహించారు. యాగశాలలో వేదపండితులు ఉత్సవ ముగింపు క్రతువులకు శాస్త్రోక్తంగా జరిపారు. నారికేళాలు, పలు సుగంధ ద్రవ్యాలు, ముత్యం, పగడం, నూతన వస్త్రాలు వంటి పూజాద్రవ్యాలను హోమగుండంలోకి ఆహుతిగా సమర్పించారు. చండీశ్వరుడికి సరస్వి పుష్కరిణి వద్ద ఆగమశాస్త్రబద్ధంగా స్నానాదికాలు జరిపారు. చివరిగా త్రిశూల స్నానం నిర్వహించారు. సాయంత్రం ఉత్సవాల ముగింపు సూచికంగా ధ్వజ పతాకావరోహణ చేశారు. స్వామి వారి నిత్యకల్యాణ మండపంలో సదస్యం–నాగవల్లి కార్యక్రమాలు నిర్వహించారు. నాగవల్లి కార్యక్రమంలో మహాశివరాత్రి రోజున కల్యాణోత్సవం జరిపించిన భ్రమరాంబాదేవికి ఆగమశాస్త్రం సంప్రదాయం మేరకు మెట్టెలు, నల్లపూసలు సమర్పించారు. కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దంపతులు, ప్రధానార్చకులు వీరయ్యస్వామి, అమ్మవారి ఆలయ ప్రధాన అర్చకులు మార్కండేయశాస్త్రి, ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. చివరి రోజు శనివారం సాయంత్రం భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామివారికి అశ్వవాహనసేవ, ఊరేగింపు, అనంతరం ఉత్సవమూర్తులకు పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంతసేవ నిర్వహిస్తారు. -
‘ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నాం. సూపర్ సిక్స్ అమలు చేసి తీరుతాం..’ అని బడ్జెట్ ప్రసంగంలో గొప్పగా చెప్పిన ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కేటాయింపుల్లో మాత్రం చేతులెత్తేశారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో సూపర్ సిక్స్కు పైస
ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో శుక్రవారం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్రభుత్వం కొలువుదీరి తొమ్మిది మాసాలు పూర్తయినా ప్రధాన హామీ ‘సూపర్ సిక్స్’ అమలుపై మీనమేషాలు లెక్కించించింది. ఈ బడ్జెట్లోనైనా వాటిని అమలు చేస్తారని ఆశిస్తే నిరాశే మిగిలింది. తల్లికివందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత గ్యాస్ సిలిండర్లకు అరకొర నిధులు కేటాయించగా.. తక్కిన యువనేస్తం, మహాశక్తి, ఉచిత బస్సు హామీలను అటకెక్కించింది. ఒకటి నుంచి ఇంటర్మీడియట్ వరకూ ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అందరికీ రూ.15వేల చొప్పున తల్లికి వందనం జమ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం బడ్జెట్లో రూ.9,407 కోట్లు మాత్రమే కేటాయించింది. ఈ నిధులను చూస్తే ఇంటికి ఒక్కరికి మాత్రమే నిధులు విడుదల చేస్తారని, అది కూడా అర్హులైన లబ్ధిదారులను భారీగా తగ్గిస్తారని స్పష్టమవుతోంది. ఇక అన్నదాత సుఖీభవ కింద కేవలం ఉమ్మడి కర్నూలు జిల్లాకే రూ.1061 కోట్లు అవసరం. కానీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రూ.6,300 కోట్లు మాత్రమే కేటాయించడం చూస్తే అమలు ఏస్థాయిలో ఉంటుందో అర్థమవుతుంది. ఉద్యోగుల ఆశలపై నీళ్లు ‘కూటమి ప్రభుత్వం’ తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతుండటంతో ప్రభుత్వ ఉద్యోగులు పీఆర్సీ, పెండింగ్ బకాయిలు, డీఏలపై ప్రకటన ఉంటుందని భావించారు. 2024లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పీఆర్సీ కమిషన్ వేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కమిషనర్ రాజీనామా చేశారు. ఇప్పటి వరకూ కమిషన్ ఏర్పాటు కాలేదు. బడ్జెట్లో వీటిపై కీలక ప్రకటనలు చేస్తారని ఆశించిన ఉద్యోగులకు నిరాశే మిగిలింది. -
నేటి నుంచి గురు వైభవోత్సవాలు
మంత్రాలయం: శ్రీరాఘవేంద్రుల గురు వైభవోత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు శ్రీగురుని పట్టాభిషేకం, 6వ తేదీన జయంతోత్సవాలు ప్రత్యేకంగా నిర్వహిస్తారు.హంద్రీ–నీవాకు రూ.3243.59కోట్లు కేటాయించారు. ఇందులో వెయ్యికోట్లు విద్యుత్ బకాయిలు. ఇక మిగి లేది రూ.2243.59 కోట్లు. గత బడ్జెట్లో రూ.1586.14కోట్లు కేటాయించారు. అంటే రూ.657.45కోట్లు అదనంగా కేటాయించారు. కానీ కర్నూలు నుంచి అనంతపురం జిల్లా వరకూ హంద్రీనీవా కాలువ వెడల్పు, ‘అనంత’ నుంచి లైనింగ్ పనులు చేస్తామని కేశవ్ ప్రకటించారు. ఈ నిధులు చూస్తే ప్రకటన మినహా పనులు పట్టాలెక్కే పరిస్థితి లేదని స్పష్టమవుతోంది. పైగా వైఎస్సార్ హయాంలో 3,850 క్యూసెక్కుల సామర్థ్యంతో కాలువ నిర్మించారు. దాన్ని 6,300 క్యూసెక్కులకు పెంచుతూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే చంద్రబాబు ప్రభుత్వం తిరిగి దాన్ని 3,850 క్యూసెక్కులకే కుదించింది. కాలువ యథాతథంగా ఉండనుండగా ప్రభుత్వం మాత్రం మల్యాల నుంచి జీడిపల్లి వరకు కాలువను వెడల్పు చేసి, జీడిపల్లి నుంచి కుప్పం వరకు లైనింగ్ చేస్తామని ప్రకటించింది. మరి కాలువను ఎక్క డ వెడల్పు చేస్తారో మంత్రికే తెలియాలి. ఎల్ఎల్సీకి రూ.32కోట్లు, గురురాఘవేంద్ర ప్రాజెక్టుకు రూ.34.06కోట్లు, గాజులదిన్నెకు రూ.11.97కోట్లు కేటాయించారు. -
డ్రిప్పై తప్పుడు ప్రకటనలు
యువనేస్తం, మహాశక్తి, ఉచిత బస్సు అమలు చేయకపోవడంతో ఉమ్మడి జిల్లాలో ఏడాదికి రూ.7,179.09 కోట్లు లబ్ధిదారులకు నష్టం వాటిల్లింది. ఈ బడ్జెట్లో వీటి ప్రస్తావన లేకపోవడంతో రెండేళ్లకు రూ.14,358.18కోట్లు కోల్పోయినట్లే. నిజాని ప్రతి ఇంటికీ ఉద్యోగం కల్పిస్తామని, ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, అప్పటి వరకు ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3వేల భృతి చెల్లిస్తామన్నారు. ఈ లెక్కన అధికారం చేపట్టిన రోజు నుంచి ఉద్యోగం కల్పించే వరకూ భృతి చెల్లించాల్సి ఉన్నా మంగళం పాడేశారు. డ్రిప్ ఇరిగేషన్ను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, దాన్ని తాము పునరుద్ధరిస్తున్నామని మంత్రి ప్రకటించారు. అయితే గత ప్రభుత్వం రెండు బడ్జెట్లలో ఉమ్మడి జిల్లాలో ఏటా 27,500 ఎకరాలకు డ్రిప్ మంజూరు చేసింది. ప్రస్తుత ప్రభుత్వం ఈ దఫా బడ్జెట్లో 14వేల హెక్టార్లకే డ్రిప్ను ప్రతిపాదించింది. గుంటూరు, ప్రకాశం జిల్లాలో మిర్చి క్లస్టర్ యూనిట్ ఏర్పాటు చేస్తామని మంత్రి ప్రకటించారు. ఈ రెండూ పొరుగు జిల్లాలు. గుంటూరులో అతిపెద్ద మిర్చి మార్కెట్ ఇప్పటికే ఉంది. అయినప్పటికీ ఆ ప్రాంతంలోనే రెండు క్లస్టర్ యూనిట్లు ఏర్పాటుకు సిద్ధమైన ప్రభుత్వం కర్నూలును విస్మరించింది. ఉమ్మడి గుంటూరులో 1,07,053 ఎకరాలు, ప్రకాశం జిల్లాలో 55,799 ఎకరాల్లో మాత్రమే మిర్చి సాగవుతుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 1,17,867 ఎకరాల్లో మిర్చి సాగవుతోంది. అనంతపురంలోనూ 35,443 ఎకరాల్లో పంట సాగు చేస్తున్నారు. కనీసం కర్నూలులో క్లస్టర్యూనిట్ ఏర్పాటు చేసి ఉంటే రాయలసీమకు ఎంతో ఉపయోగకరం. అలాంటిది కేశవ్ సీమ వాసిగా ఈ ప్రాంతాన్నే విస్మరించడం పట్ల రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. -
పరీక్ష కేంద్రాల సమీపంలో జిరాక్స్ కేంద్రాలు మూసివేయాలి
కర్నూలు(అర్బన్): ఇంటర్ పరీక్ష కేంద్రాల సమీపంలో ఉన్న ఇంటర్నెట్, జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలని కార్మికశాఖ ఉప కమిషనర్ కే వెంకటేశ్వర్లు ఆదేశించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారని పేర్కొన్నారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతున్నందున, ఆ సమయంలో పరీక్ష కేంద్రాల సమీపంలోని జిరాక్స్, నెట్ కేంద్రాలను మూసి వేయాలని తెలిపారు. అలా చేయని కేంద్రాలపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ఆశల దీపం ఆరిపోయింది!
● నీటి తొట్టిలో పడి బాలుడి మృతిరుద్రవరం: ఏడాది వయస్సు ఉన్న బాలుడు ఆడుకుంటూ నీటి తొట్టిలో పడి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని రెడ్డిపల్లెలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. చిన్నరాయుడు, నీరజ దంపతులకు ఇద్దరు కుమారులు. రెండో కుమారుడైన సూర్యకు ఏడాది వయస్సు ఉంటుంది. దంపతులిద్దరూ పిల్లలను ఇంటి వద్ద వదిలి గ్రామ సమీపంలో ఉన్న పొలంలో పనికి వెళ్లారు. మధ్యాహ్న సమయంలో ఇద్దరు చిన్నారులు ఇంటి పక్కన పిల్లలతో ఆడుకుంటున్నారు. ఆ క్రమంలో ప్రమాదవశాత్తు సూర్య ఇంటి ప్రాంగణంలో నీటి తొట్టిలో పడిపోయాడు. కొద్ది సేపటికి అటుగా వెళ్తున్న గ్రామస్తులు నీటి తొట్టిలో బాలుడి ఉండటాన్ని గుర్తించి బయటకు తీయగా అప్పటికే మృతిచెందాడు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు ఇంటికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. బాలుడి మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది. -
సబ్ జైలు తనిఖీ
నంద్యాల(వ్యవసాయం): పట్టణంలోని సబ్జైలును గురువారం కర్నూలు జిల్లా లీగల్సెల్ అఽథారిటీ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి, నంద్యాల ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ లక్ష్మి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు జైలు పరిసరాలను పరిశీలించడంతో పాటు ఖైదీల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు. సత్ప్రవర్తనతో మెలగాలని ఖైదీలకు సూచించారు. ఉచిత న్యాయ సహాయం కోసం దరఖాస్తు చేసుకోవచ్చున న్నారు. ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే ప్రత్యేక వైద్యుడిని ఏర్పాటు చేసుకోవచ్చునన్నారు. అనంతరం రికార్డులను పరిశీలించి జైలు సూపరింటెండెంట్ గురుప్రసాదరెడ్డికి పలు సూచనలు చేశారు. త్వరలో ముచ్చుమర్రి నుంచి మల్యాలకు నీటి సరఫరా పగిడ్యాల: ముచ్చుమర్రి ఎత్తిపోతల పంప్హౌస్ నుంచి త్వరలో కృష్ణా జలాలను హంద్రీనీవా సుజల స్రవంతి అప్రోచ్ కాలువ ద్వారా మల్యాల ఎత్తిపోతల పంప్హౌస్కు నీటి సరఫరా చేస్తామని జలవనరుల శాఖ డీఈ శకుంతల తెలిపారు. నెహ్రూనగర్ సమీపాన ఉండే అప్రోచ్ చానెల్ కాలువ గట్లను ఆమె గురువా రం పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మార్చి మొదటి వారం నుంచి మల్యాలకు నీటి సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేస్తు న్నామని, అందులో భాగంగా కాల్వ గట్లను పరిశీలించామన్నారు. కాల్వ వెంట మట్టి తవ్వకాలు జరగడంతో లస్కర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలువ వెంట నీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా చూసుకోవాలని లస్కర్లను ఆదేశించారు. ఆమె వెంట ఏఈ హరిప్రసాద్ సిబ్బంది ఉన్నారు. వేసవిలో తాగునీటి సమస్య రానీయొద్దు బనగానపల్లె రూరల్: వేసవి సమీపిస్తుండటంతో గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి అన్నారు. గురువారం బనగానపల్లె మండలం టంగుటూరు గ్రామంలో యాగంటిపల్లె మంచినీటి పథకం, సీపీడబ్ల్యూ స్కీంలను ఆర్డబ్ల్యూఎస్ డీఈఈ మధుసూదన్, ఏఈ సాయికృష్ణ, ఎంపీడీఓ వెంకటరమణతో కలిసి పరిశీలించారు. స్టోరేజ్ ట్యాంకుల్లో తగినంత నీటిని ఉంచుకోవాలన్నారు. అంతకు ముందు బనగానపల్లె ఎంపీడీఓ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎంపీడీఓకు సూచించారు. పుష్ప పల్లకీలో మహానందీశ్వరుడి విహారం మహానంది: మహానందీశ్వరస్వామి గురువారం రాత్రి పుష్ప పల్లకీలో భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో కల్యాణోత్సవం అనంతరం శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి దంపతులు పుష్పపల్లకీలో విహరించారు. ప్రత్యేక అలంకరణలోని ఉత్సవ మూర్తుల కు వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని, ఉప ప్రధాన అర్చకు లు వనిపెంట జనార్ధనశర్మ, పండితులు మహామంగళ హారతు లు నిర్వహించిన అనంతరం పుష్పపల్లకీని గ్రా మంలో ఊరేగించారు. భక్తులు, స్థానికులు స్వామి, అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమాల్లో ఏఈఓ వై.మధు, సూపరింటెండెంట్లు అంబటి శశిధర్రెడ్డి, దేవిక, ఇన్స్పెక్టర్లు శ్రీశైలం చిన్నా, శ్రీనివాసులు, ఉత్సవ కమిటీ సిబ్బంది నాగమల్లయ్య, లక్ష్మయ్య, సిబ్బంది పాల్గొన్నారు. -
వచ్చాడయ్యో స్వామి..!
ఆళ్లగడ్డ: తమ వివాహ మహోత్సవానికి భక్తులను ఆహ్వానించేందుకు పార్వేటగా కొండ దిగిన జ్వాలా నారసింహస్వామి, ప్రహ్లాదవరదుడు తిరిగి అహోబిలం క్షేత్రం చేరుకున్నారు. 33 గ్రామాల్లో పల్లకీలో విహరిస్తూ పార్వేట ముగించుకుని క్షేత్రం చేరుకున్న స్వామి వార్లకు వేద పండితులు, భక్తులు ఘన స్వాగతం పలికారు. పొలిమేర వరకు వేదపండితులు ఎదురేగి మంగళ వాయిద్యాలతో గోవింద నామస్మరణ చేసుకుంటూ ఉత్సవమూర్తులను ఆలయ సన్నిధికి చేర్చారు. స్వామి రాకతో క్షేత్రంలో పండుగ వాతావరణం నెలకొంది. పార్వేటగా గ్రామాల్లో సంచరిస్తూ అలసి పోయిన స్వామి వార్ల ఉత్సవమూర్తులకు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా నవకళశ స్థాపన (108 కలశాలు)తో పంచామృతాభిషేకం నిర్వహించారు. వేద పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రాయశ్చిత్య, లఘు సంప్రోక్షణ హోమం నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను నూతన పట్టు పీతాంబరాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ పూజలు ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాలన్, మణియార్ సౌమ్యానారయణ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. దిగువ అహోబిలంలో పూజల అనంతరం జ్వాలా నరసింహస్వామిని పల్లకీలో ఎగువ అహోబిలానికి చేర్చి పూజలు చేపట్టారు. పార్వేట ముగించుకుని కొండకు చేరిన అహోబిలేశులు ప్రాయశ్చిత్య హోమం, లఘు సంప్రోక్షణ -
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ!
కర్నూలు కల్చరల్: ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు జరగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉండటంతో కేంద్రాలకు గంట ముందుగానే చేరుకోవాలి. నిర్దేశించిన సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లు, వసతుల కల్పన తదితర విషయాలను ఆర్ఐఓ గురవ్య శెట్టి గురువారం విలేకరులకు వివరించారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీటి వసతి, వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. విద్యార్థులందరూ బెంచీలపై కూర్చొని పరీక్షలు రాసేందుకు బెంచీలు ఏర్పాటు చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా 69 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయన్నారు. మొదటి సంవత్సరం 23, 098 మంది, ద్వితీయ సంవత్సరం 22, 227 మంది మొత్తం 45,325 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. కర్నూలు జిల్లాలో చిప్పగిరి, కోసిగి, పత్తికొండ, దేవనకొండ, కృష్ణగిరి, గోనెగండ్ల, ఆలూరు జూనియర్ కళాశాలల్లోని 7 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. వీటిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. హాల్ టికెట్పై కాలేజ్ ప్రిన్సిపాల్ సంతకం లేకపోయినా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి ఇస్తారు. ఏమైనా సమస్యలు ఉంటే కంట్రోల్ రూం ఫోన్ 08518 222047 నంబర్ను సంప్రదించవచ్చు. విలేకరుల సమావేశంలో స్పెషల్ ఆఫీసర్ జి.లాలెప్ప, డీఈసీ మెంబర్లు కె.నాగభూషణ్ రెడ్డి, యు.పద్మావతి, జీఎస్ సురేష్ చంద్ర, డిస్ట్రిక్ట్ బల్క్ ఇన్చార్జ్ కె. రమాదేవి పాల్గొన్నారు. రేపటి నుంచి ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు -
రైతులను వేరు చేస్తూ.. అంకెలతో మాయ చేస్తూ !
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగంలో అమలు చేసే సంక్షేమ పథకాలు అందాలన్నా.. పంట రుణాలు తీసుకోవాలన్నా.. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పరిహారం పొందాలన్నా.. ఇక నుంచి రైతులకు భూ ఆధార్ నంబర్ తప్పనిసరి కానుంది. అయితే కేవలం వారసత్వంగా కొనసాగుతున్న పట్టా భూమిరైతులకు మాత్రమే ఇస్తూ డీ పట్టా, అటవీ భూములు, కౌలు రైతులను పరిగణలోకి తీసుకోకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. సంక్షేమ పథకాలు అందకపోతే తమ పరిస్థితి ఏమిటని అధికారులను ప్రశ్నిస్తున్నారు.జూపాడుబంగ్లా: ప్రతి వ్యక్తికి ఆధార్ నెంబర్ ఉన్నట్లు గా ఇకపై ప్రతి రైతుకు గుర్తింపు నంబర్ ఉండాలనే కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో రైతు సేవా కేంద్రాల్లో రైతుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా 1,90,291 మంది రైతులుండగా వారిలో ఇప్పటి దాకా 1,27,165 మంది రైతులకు 11 అంకెలతో కూడిన గుర్తింపు నంబర్లు కేటాయించినట్లు తెలుస్తోంది. యూనిక్ ఐడీ ఉన్న రైతులకు ఖరీఫ్, రబీ సీజన్లలో పొందే రాయితీ విత్తనాలు, ఎరువులు, పంటరుణాలు, పంటలబీమా, రాయితీ వ్యవసాయ పరికరాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. రైతు ఐడీ నంబర్ను యూనిఫైడ్ ల్యాండ్ ఏపీఐ, ఆధార్ అథంటికేషన్, పీఎం కిసాన్ వంటి పథకాలకు అనుసంధానం చేస్తారు. అలాగే ఐడీ నెంబర్ కలిగిన రైతులు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా బ్యాంకుల నుంచి పంట రుణాలు, పండించిన పంటలకు మద్దతు ధర పొందవచ్చు. అయితే డీ పట్టా భూములు పొంది వ్యవసాయం చేసుకుంటున్న రైతులు యూనిక్ ఐడీ నంబర్కు దూరమవుతున్నారు. డీ పట్టా, కౌలు రైతులు, అటవీ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్లో అవకాశం లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. సొంతంగా పట్టా భూములు కలిగిన వారు మాత్రమే రైతులవుతారా..తాము రైతులం కాదా అని ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో గిరిజనులు వ్యవసాయంలో రాణించేలా గత ప్రభుత్వాలు భూముల పంపిణీ చేపట్టింది. ఈ మేరకు ఆత్మకూరు, నందికొట్కూరు, ఆళ్లగడ్డ నియోజకవర్గాల గిరిజన రైతులు అధిక సంఖ్యలో ఉన్నారు. వీరికి కూడా ఫార్మర్ రిజిస్ట్రేషన్ అవకాశం లేకపోవడంతో ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకొని గుర్తింపు నంబర్ పొందిన రైతులకు మాత్రమే సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యత ఉంటుందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో తమ పరిస్థితి ఏమిటని డీ పట్టా, అటవీ భూములు సాగు చేసుకునే రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా రైతుల రిజిస్ట్రేషన్ ఇలా.. నియోజకవర్గం మొత్తం రైతులు ఐడీ పొందిన రైతులు నందికొట్కూరు 36,326 25,553 శ్రీశైలం 25,034 15,473 డోన్ 33,479 20,804 బనగానపల్లె 40,110 28,964 నంద్యాల 12,820 7,800 ఆళ్లగడ్డ 42,451 28,571 మొత్తం 1,90,220 1,27,165 రైతులకు యూనిక్ ఐడీ నంబర్ జారీ సొంత భూమి ఉన్న రైతులకే కేటాయింపు డీ పట్టా, అటవీ భూములు, కౌలు రైతులకు ఇవ్వని వైనం సంక్షేమ పథకాలు అందవని ఆందోళన -
ఉపాధిలో అక్రమాలకు తెర లేపారు!
కోవెలకుంట్ల: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులను అధికార పార్టీ కార్యకర్తల జేబులు నింపేందుకు కూటమి సర్కార్ అక్రమాలకు తెరలేపారు. నిబంధనలను సైతం మార్చి వేసి పథకాన్ని తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు పావులు కదిపారు. జిల్లాలో 489 మంది ఫీల్ట్ అసిస్టెంట్లు పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దాదాపు 200 మందికి పైగా ఫీల్ట్ అసిస్టెంట్లను తొలగించింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఉపాధి పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. గతంలో పనిచేస్తున్న ఫీల్ట్ అసిస్టెంట్లు వైఎస్సార్సీపీ సానుభూతి పరులని కక్ష కట్టి వారిని విధుల నుంచి తప్పించారు. ఆయా మండలాల్లో టీడీపీకి అనుకూలంగా ఉన్న వ్యక్తులను ఫీల్డ్ అసిస్టెంట్లుగా నియమించుకున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని చోట్ల తమ వర్గానికి చెందిన వ్యక్తులకు ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు కావాలని ఆ పార్టీలో వర్గపోరు జరుగుతుండటంతో ఇప్పటికి చాలా గ్రామాల్లో పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఈ కారణంగా ఆయా గ్రామాల్లో ఉపాధి పనులు నిలిచిపోయి కూలీలకు పనులు లేకుండా పోయాయి. అలాగే ఉపాధి హామీ పథకంలో గతంలో ప్రతి 20 మంది కూలీలకు ఒక మేటిని ఉండేవారు. అందరిక కూలీల్లాగే మేటీ సైతం ఉపాధి పనులు చేయాల్సి వచ్చేది. మేటీతోపాటు ఆ గ్రూపులో ఉన్న 20 మంది కూలీలకు సమానంగా వేతనం అందేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మేటీల వ్యవస్థను తమ చేతుల్లోకి తీసుకుంది. మేటీలను కుదిస్తే ఉపాధి పథకంలో అక్రమాలు సులువుగా చేయవచ్చని ఇరవై మందికి కాకుండా ప్రతి 50 మంది కూలీలకు ఒక మేటిని నియమించాలని కొత్త నిబంధనను తెరపైకి తెచ్చారు. జిల్లాలో 2.55 లక్షల మంది కూలీలు పనులు చేస్తుండగా 5,100 మంది మేటీలను నియమించేందుకు కసరత్తు జరుగుతోంది. కొత్తగా నియమించే మేటీలకు పనులు చేసే వేతనంతో పాటు మేటీగా ఉన్నందుకు అదనంగా డబ్బులు చెల్లించేలా చర్యలు చేపట్టారు. దీంతో మేటీలుగా తమ అనుచరులను నియమించుకునేందుకు తెలుగు తమ్ముళ్లు పోటీ పడుతున్నారు. జిల్లాలోని వివిధ గ్రామాల్లో టీడీపీ కార్యకర్తలు, వారి అనుచరులు మేటీలుగా అవతారమెత్తారు. కూటమి పార్టీకి చెందిన మేటీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు బినామీ మస్టర్లతో ఉపాధి పథకాన్ని పెద్ద ఎత్తున దోచుకుని కూలీల కడుపుకొట్టేందుకు కొందరి అధికారులతో కుమ్మకై నట్లు తెలుస్తోంది. 13 లక్షల పని దినాలు.. 37 రోజులు జిల్లాలోని 29 మండలాల పరిధిలో 4.38 లక్షల జాబ్కార్డు కలిగిన కుటుంబాలు ఉన్నాయి. ఇందులో 8.70 లక్షల మంది కూలీలు ఉన్నారు. 1.50 లక్షల కుటుంబాల్లోని 2.55 లక్షల మంది కూలీలు ఉపాధి పనులకు వెళుతున్నారు. 2024– 25 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని ఆయా మండలాల్లో 75 లక్షల పనిదినాలు లక్ష్యంగా నిర్ధేశించారు. ఇందుకోసం రూ. 335 కోట్ల లేబర్ (కూలీల వేతనం, మెటీరియల్ కలిపి) బడ్జెట్ కేటాయించారు. ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి నిర్ధేశించిన లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉంది. ఇప్పటి వరకు జిల్లాలోని ఆయా మండలాల్లో 61.99 లక్షల పనిదినాలు పూర్తి అయ్యాయి. ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో 37 రోజులు మాత్రమే గడువు ఉంది. ఇంకా 13 లక్షల పనిదినాలు పూర్తి చేయాల్సి ఉంది. గతంలో ఇరవై మందికి ఒక మేటి ప్రస్తుతం 50 మందికి ఒక మేటి ఏర్పాటు దిశగా చర్యలు మేటీలను కుదిస్తే పనుల్లో అక్రమాలు సులువు టీడీపీ నాయకుల అనుచరులు మేటీలుగా అవతారం ఉపాధి పనులను వేగవంతం చేయాలి జిల్లాలో వ్యవసాయ పనులు పూర్తి అయిన దృష్ట్యా గ్రామాల్లో ఉపాధి పనులను వేగవంతం చేయాలి. ఈ ఆర్థిక సంవత్సంలో ఇంకా 13 లక్షల పనిదినాలు పూర్తి చేయాల్సి ఉంది. ఫీల్డ్ అసిస్టెంట్లు, మేటీల నియామకాల్లో రాజకీయాన్ని పక్కన పెట్టి కూలీలకు పనులు కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. – సుధాకర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి, కోవెలకుంట్ల రాజకీయ కుట్రతో తొలగించారు 2019వ సంవత్సరం నుంచి ఉపాధి పథకం ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ఐదేళ్లపాటు గ్రామంలోని కూలీలకు ఉపాధి పనులు కల్పించి వారికి ప్రతి రోజు సగటు వేతనం అందేలా తన వంతు కృషి చేశాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజకీయ కక్షతో ఫీల్డ్ అసిస్టెంట్గా తొలగించారు. టీడీపీ నాయకులకు అనుకూలంగా ఉన్న వ్యక్తులను నియమించుకున్నారు. – రాఘవరెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్, కంపమల్ల, కోవెలకుంట్ల మండలం -
ప్రణవ నాదం ప్రతిధ్వనించింది.. ప్రభోత్సవం కనుల పండువగా సాగింది.. మహాశివరాత్రి పర్వదినాన బుధవారం శ్రీగిరి క్షేత్రం భక్తజన సంద్రమైంది. లింగోద్భవకాల సమయాన శాస్త్రోక్తంగా నిర్వహించిన పాగాలంకరణ భక్తిపారవశ్యాన్ని నింపింది. అర్ధరాత్రి మల్లికార్జున స్వామి కల్యాణోత
● శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ● కనుల పండువగా ప్రభోత్సవం, నందివాహనసేవ ● పాగాలంకరుడైన శ్రీమల్లికార్జున స్వామి ● శాస్త్రోక్తంగా మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ● వైభవంగా బ్రహ్మోత్సవ కల్యాణం ● నేడు రథోత్సవం, తెప్పోత్సవంశ్రీశైలంటెంపుల్: ద్వాదశ జ్యోతిర్లింగక్షేత్రమైన శ్రీశైలం శివమయం అయ్యింది. క్షేత్రంలో ఏ వైపు చూసినా భక్తుల కోలాహలం కనిపించింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని లక్షలాదిగా భక్తులు స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. శ్రీభ్రమరాంబా సమేత మల్లికార్జునుడు నందివాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత స్వామిఅమ్మవార్లకు అక్కమహాదేవి అలంకార మండపంలో నందివాహన సేవ నిర్వహించారు. నందివాహనంలో ఆదిదంపతులను అధిష్టింపజేసి ఆలయ ప్రదక్షణ ద్వారా ఊరేగింపు నిర్వహించారు. రమణీయం.. ప్రభోత్సవం శివరాత్రి తర్వాతి రోజు జరిగే రథోత్సవ నిర్వహణకు వీలుగా ముందస్తుగా ప్రతి ఏటా ప్రభోత్సవం నిర్వహిస్తారు. సుగంధ పుష్పాలతో ప్రభను బుధవారం సాయంత్రం అలంకరించారు. స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను వెండిపల్లకీలో ఆలయ ప్రదక్షణ చేయించి క్షేత్ర ప్రధాన వీదుల్లోకి తోడ్కొని వచ్చారు. అనంతరం ప్రభపై ఉత్సవమూర్తులను అధిష్టింపజేసి అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అశేష భక్తజనం మధ్య గంగాధర మండపం నుంచి నందిమండపం వరకు ప్రభోత్సవం సాగింది. రాత్రి 10గంటల నుంచి స్వామివారికి లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరిపించారు. అర్చకులు, పండితులు మహాన్యాసపూర్వకంగా రుద్ర మంత్రాలను పఠిస్తుండగా జ్యోతిర్లింగ స్వరూపుడైన స్వామివారికి అభిషేకం చేశారు. కమనీయం.. కల్యాణోత్సవం రాత్రి 12గంటల సమయంలో స్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. ముందుగా కల్యాణానికి కంకణాలను, స్వామిఅమ్మవార్ల అభరణాలను కల్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చారు. స్వామి, అమ్మవార్లను ముస్తాబు చేసి పెండ్లి పీటలపై అధిష్టింపజేసి కల్యాణోత్సవం నిర్వహించారు. శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు జరిగిన వివాహ వేడుకను తిలకించిన భక్తులు పరవశించిపోయారు. కల్యాణోత్సవంలో అమ్మవారి ఆలయ అర్చకులు, వేదపండితులు భ్రమరాంబాదేవి అమ్మవారి తరుపు బంధువులుగాను, స్వామివారి ఆలయ అర్చకులు, వేదపండితులు మల్లికార్జునస్వామివారి బంధువర్గంగా నిలిచారు. వైశిష్టంగా పాగాలంకరణ బ్రహ్మోత్సవాల్లో పాగాలంకరణకు ఎంతో విశిష్టత ఉంది. వివాహాల్లో పెండ్లి కుమారునికి తలపాగా చుట్టడం ఒక సంప్రదాయం. ఈ ఆచారమే శ్రీశైల ఆలయంలో పాగాలంకరణ పేరుతో అనవాయితీగా కొనసాగుతోంది. గర్భాలయ విమాన శిఖరం నుంచి ముఖమండపంపై ఉండే నవనందులను అనుసంధానం చేస్తూ పాగా అలంకరిస్తారు. హస్తినాపురానికి చెందిన పృథ్వీ సుబ్బారావు దిగంబరుడై పాగాను అలంకరించారు. ఇందుకు రాత్రి 10గంటలకు ఆలయంలోని విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. మొత్తం ఎనిమిది పాగాలు భక్తులు స్వామివారికి సమర్పించారు. పాగాలంకరణ జరుగుతున్నంతసేపు ఆలయంలో ఓంనమఃశివాయ అంటూ శివనామస్మరణ మార్మోగింది. పాతాళగంగలో దీపం వదులుతున్న యువతి -
మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
స్వామిఅమ్మవార్లను దర్శించుకునేందుకు బుధవారం భక్తులు పోటెత్తారు. ఆలయ అధికారులు ఆలయ పూజావేళల్లో మార్పులు చేశారు. వేకువజాము రెండు గంటల నుంచే దర్శనానికి భక్తులను అనుమతించారు. ఉచిత దర్శన క్యూలైన్ భక్తుల క్యూ క్షేత్ర ప్రధాన వీధుల వద్దకు చేరింది. స్వామివారి దర్శనానికి సుమారు ఆరు గంటల సమయం పట్టింది. క్యూలైన్లో వేచి ఉన్న భక్తులకు దేవస్థానం ఉచితంగా తాగునీరు, అల్పాహారాన్ని అందించింది. కొందరు భక్తులు ఉపవాస దీక్ష చేపట్టి ఉదయం నుంచి రాత్రి వరకు ఎటువంటి ఆహారం తీసుకోకుండా శివనామస్మరణ చేశారు. శివమాలను స్వీకరించిన భక్తులు జ్యోతిర్ముడిని సమర్పించారు. పాగాలంకరణ తిలకించిన శివస్వాములు శివమాలధారణ విరమించారు.నేడు రథోత్సవం, తెప్పోత్సవం బ్రహ్మోత్సవాల్లో తొమ్మిదవ రోజు గురువారం శ్రీభ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామివారికి రథోత్సవం నిర్వహిస్తారు. రాత్రి 8గంటలకు ఆలయ పుష్కరిణి వద్ద స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు తెప్పోత్సవం నిర్వహిస్తారు. -
బంగారు ధారా పాత్ర బహూకరణ
బనగానపల్లె రూరల్: యాగంటి క్షేత్రంలో వెలసిన శ్రీ ఉమామహేశ్వరస్వామికి వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాభూపాల్రెడ్డి, ఆయన సతీమణి కాటసాని ఉమామహేశ్వరమ్మ, ఆయన కుమారుడు కాటసాని శివనరసింహారెడ్డి ఐదున్నర తులాల బంగారు ధారా పాత్ర బహూకరించారు. అలాగే ఎనిమిది కేజీల వెండీ హారతులను ఆలయ ఈఓ చంద్రుడుకు బుధవారం అందజేశారు. ఉమామహేశ్వర నిత్యాన్నదాన సంస్థలో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. ముందుగా ఆలయంలో వెలసిన ఉమామహేశ్వరస్వామికి మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం కాటసాని కుటుంబ సభ్యులను అర్చకులు సత్కరించారు. ఉమామహేశ్వర నిత్యాన్నదాన సంస్థ సభ్యులు దస్తగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దద్దణాల చెరువుకు ఎస్సార్బీసీ నీరు బనగానపల్లె రూరల్: దద్దణాల చెరువుకు జుర్రేరువాగు ఎత్తిపోతల పఽథకం నుంచి నీటి విడుదలను మంత్రి బీసీ జనార్దన్రెడ్డి బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గతంలో ఇచ్చిన హామీ మేరకు తన సొంత నిధులు రూ.25.75 లక్షలతో ఎత్తిపోతల పథకానికి సంబంధించిన నాలుగు మోటార్లకు మరమ్మతు చేయించామన్నారు. చెరువుకు ఎస్సార్బీసీ నుంచి నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. నేడు వక్ఫ్బోర్డు చైర్మన్ రాక కర్నూలు(అర్బన్): రాష్ట్ర వక్ఫ్బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ గురువారం కర్నూలుకు రానున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి సయ్యద్ సబీహా పర్వీన్ తెలిపారు. ఉదయం 8 గంటలకు నెల్లూరు నుంచి బయల్దేరి మధ్యాహ్నం 12 గంటలకు ప్రభుత్వ అతిథి గృహం చేరుకుంటారని ఆమె బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇద్దరి ప్రాణాలు కాపాడిన యువకులు హొళగుంద: స్థానిక హొళగుంద–బళ్లారి రోడ్డులోని తుంగభద్ర దిగువ కాలువ(ఎల్లెల్సీ)లో స్నానానికి వెళ్లి ఈత రాక కొట్టుకుపోతున్న ఇద్దరిని స్థానిక యువకులు కాపాడిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. కర్ణాటక రాష్ట్రం సిరుగుప్పకు చెందిన షమీ, బాషాతో పాటు పలువురు హొళగుందలోని ఓ మసీదులో పెయింట్ పనికి వచ్చారు. పని ముగించుకుని సాయంత్రం స్నానం చేసేందుకు బళ్లారి రోడ్డులోని దిగువ కాలువలో దిగారు. ఇటీవల కాలువ గట్టుకు సిమెంట్ లైనింగ్ చేయడంతో ఈత షమీ, బాషా గట్టు కింద జారుకుంటూ కాలువలో కొట్టుకోపోసాగారు. వారి అరుపులు విన్న అటుగా వెళ్తున్న సిద్దిక్, మౌలాలి, సమీర్ వెంటనే కాలువలో దూకి ఇద్దరినీ బయటకు లాగారు. దీంతో యువకులను పలువురు అభినందించారు. -
శివయ్య లీలలు.. ఎంత వి‘చిత్రమో’
పురాణాల్లో శివయ్య లీలలు ఎన్నో ఉన్నాయి. వాటిని మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు పరమశివుడి గురించి ప్రధాన ఘట్టాలు సూక్ష్మ చిత్రాలుగా ఆవిష్కరించారు. శివుడు యమధర్మరాజు నుండి తన భక్తుడైన మార్కండేయుని కాపాడటం, శ్రీరాముడు రావణాశురుడిని వధించిన తర్వాత బ్రాహ్మణ హత్యాదోశం నుండి విముక్తి పొందాలని శివున్ని పూజిస్తున్నట్లు హనుమంతుడు రామకార్యం విజయవంతం కావాలని శివున్ని ఆరాధిస్తున్నట్లు శ్రీకాళహస్తి, శ్రీ అంటే సాలేపురుగు, కాల అంటే సర్పం, హస్తీ అంటే ఏనుగు ఈ మూడు జీవాలు భక్తితో శివుడికి పూజ చేయడం లంకాధిపతి రావణాశురుడు శివలింగం వద్ద తపస్సు చేయడం, క్షీర సాగర మదనం నుంచి వచ్చిన విషాన్ని లోక కల్యాణం కోసం శివుడు సేవిస్తుండటం, అర్జునుడు శివున్ని ధ్యాన్నించి పాశుపతాస్త్రం పొందినట్లు, ఛత్రపతి శివాజీ మహారాజ్ పరమ శివ భక్తులు శివలింగాన్ని పూజిస్తున్నట్లు, భక్త కన్నప్ప బాణపు మొనతో కంటిని తీసి శివలింగానికి పెట్టడం, కుమారస్వామి, గణపతి స్వాములు ఆది దంపతులు పూజిస్తుండటం, పరమ భక్తులైన అక్క మహాదేవి ఆది శంకరాచార్యులను చిత్రంలో చూపించారు. – నంద్యాల(అర్బన్) -
ఇదేమి ప్రచారం
● డోనేషన్ పేరుతో ఓ ప్రైవేట్ సంస్థ యాడ్ ప్రచురణ ● శ్రీశైల దేవస్థానం నిర్లక్ష్య వైఖరిపై మండిపడుతున్న భక్తులుశ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన మల్లన్న దర్శనానికి అనునిత్యం సామాన్యులే కాక వీఐపీలు, వీవీఐపీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సైతం తరలివస్తారు. అటువంటి మహాపుణ్యక్షేత్రంలో ఎటువంటి ప్రైవేట్ సంస్థల ప్రచారాలు నిర్వహించకూడదు. శ్రీశైల దేవస్థానానికి పలువురు దాతలు అన్నదానం, గోశాల నిర్వహణ, కాటేజీలు, వసతిగదుల నిర్మాణానికి విరాళాలు అందిస్తారు. స్వామి అమ్మవార్లకు బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు బహూకరిస్తారు. కానీ ఎవరు వారి వారి సంస్థలకు చెందిన ఎటువంటి ప్రచారాలు చేసుకోరు. కాగా ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు విచ్చేసే ఆయా శాఖలకు చెందిన పలువురు అధికారులు, సిబ్బందికి, మీడియా ప్రతినిధులకు, స్వచ్ఛంద సేవకులకు క్యూర్ కోడ్తో కూడిన డిజిటల్ గుర్తింపుకార్డులను దేవస్థానం మంజూరు చేశారు. ఈ డిజిటల్ కార్డులను ఓ ప్రైవేట్ సంస్థ స్పాన్సర్ చేసింది. అంతా బాగున్నా ..ఆ డిజిటల్ ఐడెంటీకార్డుల వెనుక ఆ ప్రైవేట్ సంస్థ ప్రచారాన్ని సైతం నిర్వహించుకుంది. ఇదే ఇప్పుడు క్షేత్రంలో పెద్ద చర్చ సాగుతుంది. దేవస్థానంలో ప్రైవేట్ సంస్థ ప్రచారం చేసుకోవడం ఏంటని పలువురు భక్తులు ప్రశ్నిస్తున్నారు. అసలు ఆ సంస్థ ప్రచారం చేసుకునేందుకు అనుమతి ఎవరు ఇచ్చారని భక్తులు మండిపడుతున్నారు. -
పంట గొర్రెల పాలు
దేవనకొండ: రైతుల పరిస్థితి రోజురోజుకు దయనీయంగా మారుతోంది. అమ్మబోతే అడవి.. కొనబోతే కొరవిలాగా రైతుల పరిస్థితి మారింది. రూ.వేలకు వేలు పెట్టుబడి పెట్టి పండించిన వంకాయలు మార్కెట్లో 20 కిలోల బస్తా ధర రూ.20 పలకడంతో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. కనీసం దానిని తీసిన కూలి కూడా గిట్టుబాటు గాక గొర్రెలకు వదిలేస్తున్నారు. మండల కేంద్రానికి సమీపంలో గోవిందు అనే రైతులు ఎకరం పొలంలో వంగతోట సాగు చేశాడు. ఇందుకు రూ.60వేలు ఖర్చు చేశాడు. పంట చేతికి రాగా.. బయట మార్కెట్లో బస్తా రూ.20 కిలో విక్రయిస్తే కేవలం రూ.2లే దక్కడంతో పంటలను గొర్రెలకు వదిలేశాడు. ప్రభుత్వం స్పందించి కనీస మద్దతు ధర కల్పించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. మార్కెట్లో ధర లేకపోవడంతో వంకాయ పంటను గొర్రెలకు వదిలేసిన దృశ్యం -
ఆత్మహత్యకు ప్రేరేపించిన ముగ్గురిపై కేసు నమోదు
కోవెలకుంట్ల: పట్టణంలోని ఎస్ఎల్వీ సినిమా థియేటర్ వెనుక వీధిలో నివాసం ఉంటున్న గుద్దేటి హరిణి ఆత్మహత్యకు కారకులైన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మల్లికార్జునరెడ్డి తెలిపారు. మంగళవారం ఎస్ఐ అందించిన సమాచారం మేరకు.. కోవెలకుంట్లకు చెందిన షేక్ సాధిక్ ఉసేన్ అనే యువకుడు 2021లో హరిణిని కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరి దాంపత్య జీవితం నాలుగేళ్ల పాటు సజావుగా సాగింది. ఇటీవల సాధిక్ ఉసేన్ ఇదే పట్టణానికి చెందిన మరో యువతిని వివాహం చేసుకున్నాడని తెలుసుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో నాలుగు రోజుల క్రితం భర్త, అత్త, మామలు, అవ్వపై పోలీసులు వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి హరిణి బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలి సోదరుడు శేఖర్రెడ్డి ఫిర్యాదు మేరకు హరిణి ఆత్మహత్యకు ప్రేరేపించిన భర్త సాధిక్ ఉసేన్, అత్తమామలు మహబూబ్బీ, జాఫర్ ఉసేన్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఫోర్జరీపై కేసు నమోదు కొలిమిగుండ్ల: మండల పరిధిలోని పెట్నికోటలో పొలం పత్రాలు ఫోర్జరీ చేసి ఇతరుల పేరుపై రి జిస్ట్రేషన్ చేయించడంతో కేసు నమోదు చేసినట్లు సీఐ రమేష్బాబు మంగళవారం తెలిపారు. గ్రామానికి చెందిన పెద్దుగాళ్ల సుబ్బమ్మ పేరుతో ఉన్న నాలుగు ఎకరాల పొలాన్ని పొలతల సుబ్బమ్మ పేరుతో ఫోర్జరీ చేసి రిజిస్ట్రేషన్ చేయించారు. పెద్దుగాళ్ల రామేశ్వరయ్య ఫిర్యాదు మేరకు నాగేంద్రరెడ్డి, వెంకట్రామిరెడ్డితో పాటు మరికొంత మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. -
జేసీబీ ఢీకొని వ్యక్తి మృతి
ప్యాపిలి: స్థానిక పెట్రోల్ బంకు వద్ద సోమవారం రాత్రి జేసీబీ ఢీకొని ప్యాపిలికి చెందిన వడ్డే గోపాల్ (56) మృతి చెందాడు. పని మీద బయట కు వచ్చిన అతను ఇంటికెళ్తుండగా ప్రమాదవశాత్తూ జేసీబీ ఢీకొనడంతో కింద పడ్డాడు. అతనిపై జేసీబీ టైర్లు ఎక్కడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబీకులు వెంటనే చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. టమాట ఆటో బోల్తా బనగానపల్లె రూరల్: యాగంటిపల్లె సమీపంలోని గాలేరు–నగరి సుజల స్రవంతి కాల్వ సమీపంలో టామాట లోడ్డుతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. ఆళ్లగడ్డకు చెందిన ఆటో డ్రైవర్ శివ వివరాల మేరకు.. మంగళవారం పసుపల గ్రామం నుంచి టమాట బాక్సులు వేసుకుని ట్రాలీ ఆటో బనగానపల్లె వైపు వస్తోంది. యాగంటిపల్లె సమీపంలోని జీఎన్ఎస్ఎస్ కాల్వ వద్ద ఎదురుగా వస్తున్న బర్రెలను తప్పించబోయి ఆటో అదుపు తప్పి రోడ్డు పక్కలో లోతైన గుంతలో బోల్తా పడింది. ఈ ప్రమాదంతో శివకు స్వల్ప గాయాలయ్యాయి. -
ట్రాక్టర్ బోల్తా పడి మహిళ కూలీ దుర్మరణం
బొమ్మలసత్రం: నంద్యాల మండలం ఊడుమాల్పురం గ్రామ సమీపంలో ట్రాక్టర్ బోల్తా పడిన ప్రమాదంలో పాణ్యం మండలం తొగర్చేడు గ్రామానికి చెందిన నాగమ్మ (48) దుర్మరణం చెందింది. ట్రాఫిక్ సీఐ మల్లికార్జునగుప్తా తెలిపిన వివరాల మేరకు.. తొగడ్చేడు గ్రామానికి చెందిన 30 మంది మహిళా కూలీలు మంగళవారం పొగాకు కోసేందుకు ఊడుమాల్పురం గ్రామానికి ట్రాక్టర్లో చేరుకున్నారు. పని ముగించుకుని సాయంత్రం తిరిగి వెళ్తుండగా ప్రమాదవశాత్తూ ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నాగమ్మ అక్కడికక్కడే మృతి చెందగా 10 మంది గాయపడ్డారు. గాయపడిన కూలీలను చాపిరేవుల పీహెచ్సీ సెంటర్కు చికిత్స నిమిత్తం తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. మృతురాలి కుమార్తె అనిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
● రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ కరీం
వెలుగోడు: విద్యాభివృద్ధికి ఏటా రూ. 15 లక్షలు సహాయం అందిస్తున్నామని ఫౌజియా కరీం ఫౌండేషన్ చైర్మన్, రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ ముల్లా అబ్దుల్ కరీం తెలిపారు. వెలుగోడు జూనియర్ కళాశాలలో ప్రిన్సి పాల్ వెంకటరమణ అధ్యక్షతన మంగళవారం ఫౌజి యా కరీం ఫౌండేషన్ స్కాలర్షిప్ పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా ముల్లా అబ్దుల్ కరీం మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నత ఆశయాలు, లక్ష్యాలు కలిగి ఉండాలన్నారు. ఉర్దూ ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 97 శాతం మార్కులు సాధించడం అభినందనీయమన్నారు. వక్తలు నసురుల్లా ఖాన్, హిదాయత్ అలీ ఖాన్, సుల్తాన్ మొహిద్దిన్లు మాట్లాడుతూ.. ప్రతి ఏటా ఆత్మకూరు, వెలుగోడు విద్యార్థుల బుక్స్, బ్యాగులనుఅందించడం హర్షించదగ్గ విషయం అన్నారు. అనంతరం ఉపాధ్యాయులకు గౌరవ వేతనం, కళాశాల అభివద్ధికి నిధులకు సంబంధించిన చెక్కులను పంపిణీ చేశారు. అంజుమన్ ప్రెసిడెంట్ మోమిన్ రసూల్, మైనార్టీ నాయకులు ఖలీల్ ఖాన్, సయ్యద్ బాషా, డాక్టర్ ముల్లా అబ్దుల్ ఆఫ్రిద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
పల్లె కన్నీరు పెడుతుందో..!
● పనుల్లేక వలసబాట పట్టిన పల్లె వాసులు ● 130 కుటుంబాలకు గాను 10 కుటుంబాలే జీవనం ● మొత్తం ఖాళీ అయిన గ్రామాలు కొత్తపల్లి: సందడిగా ఉండే గ్రామాలు నేడు వెలవెలబోతున్నాయి. పనుల్లేక ప్రజలంతా కన్నీరు పెడుతూ వలస వెళ్లారు. దీంతో పల్లెలన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. కొత్తపల్లి మండలంలో 12 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఎర్రమఠం గ్రామ పంచాయతీలో పాత మాడుగుల, కపిలేశ్వరం, సంగమేశ్వరం, సిద్దేశ్వరం, జానాల గూడెం, బలపాలతిప్ప మజరా గ్రామాలు ఉన్నాయి. సిద్దేశ్వరం, జానాల గూడెం, బలపాలతిప్ప గ్రామాల్లో 130 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఇక్కడ అత్యధికంగా చెంచు గిరిజనులు ఉన్నారు. వీరితోపాటు ఎస్సీలు, బీసీలు కూడా జీవిస్తున్నారు. ప్రస్తుతం ఈ గ్రామాల్లో 130 కుటుంబాలకు గాను 10 కుటుంబాలే ఉన్నాయి. ఈ గ్రామాల్లో ప్రజలు సమీపంలోని కృష్ణానదిలో జలాలు ఉన్నప్పుడు చేపల వేట చేస్తారు. నీళ్లు తగ్గుతున్న క్రమంలో కృష్ణానదీ ఒడ్డువెంట బయటపడుతున్న భూముల్లో ఆరుతడి పంటలతో వ్యవసాయం చేసుకొని జీనవనం సాగిస్తున్నారు. ఈ భూములపై 2016లో ఆంక్షలు విధిస్తూ 145 సెక్షన్ అమలుచేశారు. ఆ భూముల్లో ఎవరూ వ్యవసాయం చేయకూడదని ఆదేశాలు జారీ చేశారు. అప్పటి నుంచి నేటి వరకు నీటి ముంపు భూములను ఎవరు సాగుచేయడం లేదు. దీంతో ఆ గ్రామాల ప్రజలందరూ ఉపాధి కోసం పట్టణ ప్రాంతాలకు వెళ్తున్నారు. చాలా మంది పూర్తిగా గ్రామాలను ఖాళీ చేసి బతుకు జీవుడా అంటూ హైదరాబాద్కు వెళ్తుంటారు. కుటుంబ పోషణ భారమై.. వలస వెళ్లడంతో ఇంటికి తాళం వేసిన దృశ్యం జనాల గూడెం గ్రామంలో అంగన్వాడీ టీచర్ చాలీచాలని జీతంతో ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో అంగన్వాడీ టీచర్లకు ప్రతినెలా రెండు నుంచి మూడు సమావేశాలు ఉంటున్నాయి. అయితే జానాల గూడెంకు చెందిన అంగన్వాడీ టీచర్ నియోజకవర్గ సమావేశాలకు వెళ్లాలంటే సుమారు 100 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంది. ఉదయం ఆరు గంటలకు బయలుదేరితే ఇంటికి చేరేలోపు రాత్రి పది గంటలు సమయం అవుతుంది. అలాగే సమావేశాలు ఉన్న రోజున తన భర్త కూలి పనులు వదులుకొని ఆమెతోపాటు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. అలాగే ప్రత్యేక ఆటోలో వెళ్లాలంటే రాను, పోను వెయ్యి రూపాయల దాకా ఖర్చు అవుతుంది. సమావేశాలకే జీతం మొత్తం ఖర్చు అయి చాలీచాలని జీతంతో కుటుంబ పోషణ భారమై పిల్లల ఉన్నత చదువుల కోసం ఖర్చులకు లేక కుటుంబమంతా కలిసి హైదరాబాద్కు ఉపాధి కోసం వెళ్లినట్లు సమాచారం. ఇప్పటికై న జిల్లా కలెక్టర్, ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలకు ఉపాధి హామీ పనులు చూపించి వలసలు నివారించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
పశుగ్రాసం దగ్ధం
కొత్తపల్లి: మండల కేంద్రంలో పశువుల మేత కోసం నిల్వ ఉంచిన పశుగ్రాసం దగ్ధమైంది. గ్రామానికి చెందిన ప్రాతకోట వెంకటరమణ, జి. మల్లయ్య సుమారు 40 ట్రాక్టర్ల వరిగడ్డిని లింగాపురం గ్రామం వెళ్లే దారి లోని కల్లం దొడ్డికి తరలించారు. ఆ గడ్డిని వాములు వేసేందుకు వేయడం ప్రారంభించారు. మధ్యాహ్నం భోజనానికి ఇంటికెళ్లారు. అయితే ప్రమాదవశాత్తూ మంటలు వ్యాపించి క్షణాల్లో పశుగ్రాసం దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన చేరుకుని మంటలను అదుపు చేశారు. దీంతో పక్కనే ఉన్న గడ్డివాములకు ప్రమాదం తప్పింది. దాదాపు రూ. 2 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. -
విద్యాభివృద్ధికి ఏటా రూ.12 లక్షల సహాయం
ఆలయంలోకి చెప్పులతో టీటీడీ బోర్డు మెంబర్! సాక్షి టాస్క్ఫోర్స్: ఓర్వకల్లు మండలం శ్రీ బుగ్గరామేశ్వరస్వామి దేవస్థానంలో సాక్షాత్తూ టీటీడీ బోర్డు సభ్యులు మల్లెల రాజశేఖర్ ఆలయంలో చెప్పులు వేసుకొని అధికారులతో కలిసి మహాశివరాత్రి వేడుకలను పర్యవేక్షించారు. అధికారులందరూ ఆలయంలోకి వెళ్లకముందే చెప్పులను వదిలి లోనికి వెళ్లారు. కానీ టీటీడీ బోర్డు సభ్యుడు మాత్రం చెప్పులు వేసుకొని మరీ ఆలయంలో కలియతిరిగారు. ఆయన వెంట కర్నూలు టౌన్ డీఎస్పీ బాబుప్రసాద్, సీఐ చంద్రబాబునాయుడు, ఈఓ మద్దిలేటి ఉన్నారు. ఘటనపై భక్తులు మండిపడుతున్నారు. -
పాగాలంకరణ పూర్వజన్మ సుకృతం
● ఫృధ్వీ సుబ్బారావుతో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ శ్రీశైలం టెంపుల్: మహాశివరాత్రి బ్ర హ్మో త్సవాల్లో శ్రీశైల మల్లన్నకు లింగోద్భవ కాలాన నిర్వహించే పాగాలంకరణకు ఎంతో విశిష్టత ఉంది. బ్రహ్మోత్సవ కల్యాణానికి ముందు మల్లికార్జున స్వామికి పాగాలంకరణ చేయడం సంప్రదాయం. ఈ సేవను ఒకే కుటుంబం వారసత్వంగా నిర్వహిస్తోంది. ఏటా మహాశివరాత్రి నాడు మల్లన్నకు తలపాగా చుడుతున్న దేవాంగ భక్తుడు ఫృధ్వి వెంకటేశ్వర్లు కుమారుడు సుబ్బారావు సతీసమేతంగా పాగాతో స్వామి సన్నిధికి చేరుకున్నారు. ఈ సందర్బంగా ‘సాక్షి’ ఆ యనను పలకరించింది. పాగాలంకరణ విశేషాలు ఆయన మాటల్లో.. ప్రశ్న. పాగాలంకరణ ఎలా మొదలైంది? ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఫృధ్వి: మా పెద్దలు ఇంటి దైవంగా కొలిచే మల్లన్న బ్రహ్మోత్సవాల్లో మహాశివరాత్రి నాడు స్వయంగా నేసిన పాగాను అలంకరించేవారు. నాలుగు తరాల నుంచి ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. మొదట మా ముని తాతయ్య కందస్వామి, ఆ తరువాత మా తాత సుబ్బారావు, అటు తరువాత మా నాన్న ఫృధ్వీ వెంకటేశ్వర్లు పాగాలంకరణ చేశారు. ఆయన తరువాత నేను స్వామివారికి పాగాలంకరణ చేస్తున్నా. నా చిన్నప్పటి నుంచి పాగా తయారు చేస్తున్నా. మా పూర్వీకుల నుంచి సుమారు 70ఏళ్లకు పైగా ఈ ఆచారం కొనసాగుతోంది. ప్రశ్న. పాగా నేసే విధానం ఎలా? ఫృధ్వి: స్వామివారికి పాగా ఎంతో భక్తి శ్రద్ధలతో నేస్తాం. ఇది ఒక దీక్ష. గతంలో ప్రతిరోజు ఒకమూర చొప్పున ఏడాది పాటు 365రోజులు 365మూరలు నేస్తాం. అయితే ప్రస్తుతం కార్తీకమాసం ప్రారంభం నుంచి పాగా నేతను ప్రారంభించి శివరాత్రికి 10రోజుల ముందే మూర వెడల్పుతో 300 మూరలు పూర్తి చేస్తాం. మహాశివరాత్రి పండుగ రోజున కుటుంబ సమేతంగా వచ్చి సంప్రదాయబద్ధంగా పాగాలంకరణ చేస్తాం. ప్రశ్న: మీ కుటుంబ నేపథ్యం? ఫృధ్వి: మాది ప్రకాశం జిల్లా చీరాల వద్ద హస్తినాపురం. మా అమ్మానాన్న ఫృధ్వి వెంకటేశ్వర్లు, గౌరీకుమారి. నేను, మా చెల్లెలు మల్లీశ్వరి. ఇద్దరికి పెళ్లిళ్లు అయ్యాయి. అందరం ఒకే ఇంట్లో ఉమ్మడిగా ఉంటున్నాం. ప్రశ్న: పాగాలంకరణకు దేవస్థానం అందిస్తున్న సహకారం ఏంటి? ఫృధ్వి: ఏటా మహాశివరాత్రి నాడు మల్లన్నకు తలపాగా చుట్టాలని ప్రత్యేక ఆహ్వన పత్రాన్ని దేవస్థాన అధికారులు అందజేస్తారు. పాగా వస్త్రంతో వచ్చినప్పుడు ఆలయ మర్యాదలతో స్వాగతం పలుకుతారు. భోజనం, వసతి, ప్రత్యేక దర్శనాలతో పాటు ఆర్థిక పోత్రాహన్ని కూడా అందజేస్తున్నారు. ప్రశ్న: మల్లన్నకు పాగా చుట్టే అవకాశం రావడం ఎలా ఉంది? ఫృధ్వి: మా పూర్వీకుల నుంచి ఈ ఆచారం వస్తుంది. కొట్లాది మంది భక్తులు ఇష్టదైవంగా కొలిచే మల్లికార్జున స్వామికి పాగాలంకరణ చేయడం మేము చేసుకున్న అదృష్టం. మల్లయ్యే మాకు ఈ అదృష్టాన్ని కల్పించారు. -
జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలి
● జిల్లా కలెక్టర్ను కోరిన ఏజీ ఎన్జీఓ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వీసీహెచ్ వెంగళ్రెడ్డి కర్నూలు(అగ్రికల్చర్): ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై చర్చించి పరిష్కరించేందుకు వీలుగా సత్వరం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రంజిత్బాషాను ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్ వీసీహెచ్ వెంగళ్రెడ్డి కోరారు. జేఏసీ ప్రతినిధులు మంగళవారం జిల్లా కలెక్టర్ను ఆయన చాంబరులో కలసి వివిధ సమస్యలపై చర్చించారు. అలాగే వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వెంగళ్రెడ్డి మాట్లాడుతూ... కొన్ని నెలలుగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరగడం లేదన్నారు. ఎంప్లాయీస్ వెల్ఫేర్ ఫండ్ వినియోగంపై చర్చించి తగిన నిర్ణయం తీసుకునేందుకు ప్రత్యేక సమావేశం నిర్వహించాలని కలెక్టర్ను కోరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్చి 6, 7 తేదీల్లో మహిళాఉద్యోగులకు స్పెషల్ క్యాజువల్ లీవ్లు ఇవ్వాలని సూచించారు. కర్నూలు నగర శాఖ అధ్యక్షుడు ఎంసీ కాశన్న, జిల్లా సహ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, ప్రభుత్వం నర్సెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు లీలావతి, బంగారి, వెటర్నరీ ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మద్దిలేటి, ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు నాగేశ్వరరావు, నగర కార్యవర్గ సభ్యులు సాయిరాం, రాఘవేంద్ర, చలపతి, మునీర్ అహ్మద్, మద్దయ్య తదితరులు పాల్గొన్నారు. -
నీటి దోపిడీని అరికట్టడంలో ప్రభుత్వం విఫలం
● రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి నంద్యాల(అర్బన్): విద్యుత్ ఉత్పత్తి పేరుతో శ్రీశైలం జలాశయం నీటిని యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నా అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి విమర్శించారు. కృష్ణారెడ్డి యజామాన్య బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం రాయలసీమ సాగునీటి సామితి ఆధ్వర్యంలో పట్టణంలో రైతులతో భారీ ర్యాలీని నిర్వహించారు. ర్యాలీలో వైఎస్సార్సీపీ, సీపీఐ, సీపీఎం, ముస్లింలీగ్, ఏఐకేఎస్, రైతు, వాణిజ్య, వర్తక, కార్మిక, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ.. ఈ ఏడాది శ్రీశైలం ప్రాజెక్టుకు 1562 టీఎంసీలకు వచ్చి చేరితే సాగర్కు హక్కుగా ఉన్న 264 టీఎంసీలు దిగువకు వదిలి మిగిలినవి శ్రీశైలంలో నిల్వ ఉంచాల్సి ఉందన్నారు. అయితే 1200 టీఎంసీల నీటిని సాగర్కు వదిలి శ్రీశైలాన్ని ఎండగట్టడం దారుణమన్నారు. చట్టాలను గౌరవించాల్సిన ప్రభుత్వం వాటి ఉల్లంఘనలకు పాల్పడటాన్ని ప్రజలు హర్షించబోరన్నారు. కర్నూలులోనే కేఆర్ఎంబీని ఏర్పాటు చేయాలని, రాయలసీమ ప్రజల ఆకాంక్షకు విరుద్ధంగా పాలకులు చర్యలు తీసుకుంటే సీమ వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేరిట రాసిన లేఖను నంద్యాల తహసీల్దార్ ప్రియదర్శినికి అందజేశారు. కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షుడు వైఎన్రెడ్డి, సీపీఐ, సీపీఎం నాయకులు రంగనాయకులు, రాజశేఖర్, బాలీశ్వరరెడ్డి, బెక్కెం రామసుబ్బారెడ్డి, కొండారెడ్డి, సలాం, వైఎస్సార్సీపీ నాయకులు సోమ శేఖర్రెడ్డి, సయ్యద్ మహబూబ్బాషా తదితరులు పాల్గొన్నారు. -
ఇంటి వద్దే ‘జీవన్ ప్రమాణ్’
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో 18,707 మంది ప్రభుత్వ పెన్షన్దారులు ఉన్నారని, ఇప్పటి వరకు 15,701 మంది జీవన్ ప్రమాణ్ ధ్రువీకరణ పత్రా లు సమర్పించినట్లు జిల్లా ఖజానా అధికారి బి.రామచంద్రరావు తెలిపారు. ఇంకా 3,006 మంది వీటిని ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. కదల్లేని పెన్షన్దారుల వివరాలు తెలియచేసినట్లయితే జిల్లా ఖజా నా సిబ్బంది నేరుగా ఇంటికే వెళ్లి జీవన్ ప్రమాణ్ ధ్రువీకరణ పత్రాన్ని ప్రభుత్వ యాప్ ద్వారా అప్లోడ్ చేస్తారన్నారు.పెన్షన్దారుల సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో మంగళవారం ఆయన మాట్లాడారు. జీవన్ ప్రమాణ్ ధ్రువీకరణ పత్రాలను ఈ నెల 28వ తేదీలోపు సమర్పించాలన్నారు. పెన్షనర్లు నేరుగా సబ్ ట్రెజరీ కా ర్యాలయాలకు వచ్చి బయోమెట్రిక్ వేసి సమర్పించవచ్చని, లేదంటే జీవన్ ప్రమాణ్ ప్రభుత్వ యాప్ ద్వారా సమర్పించవచ్చని ఆయన పేర్కొన్నారు. జిల్లా ఖజానా అధికారి రామచంద్రరావు -
ముచ్చుమర్రిలో నిలిచిన
నీటి పంపింగ్ జూపాడుబంగ్లా: ముచ్చుమర్రి ఎత్తిపోతల పథ కం నుంచి నీటి పంపింగ్ నిలిచిపోయింది. దీంతో కేసీ కాల్వలో నీటి ప్రవాహం తగ్గిపోయింది. కేవలం సుంకేసుల డ్యాం నుంచి 1,600 క్యూసెక్కుల సాగునీరు కేసీ కాల్వకు సరఫరా అవుతున్నట్లు అధికారులు మంగళవారం తెలిపారు. రైతుల వినియోగార్థం లాకిన్స్లా వరకు 700 క్యూసెక్కుల నీరు చేరుతుంది. ఈ నీటిని నిప్పులవాగుకు 590, తూడిచెర్ల సబ్చానల్ కాల్వకు 110 క్యూసెక్కుల చొప్పున సరఫరా చేస్తున్నట్లు ఏఈ శ్రీనివాసనాయక్ తెలిపారు. భద్రతా ఏర్పాట్లు పరిశీలన శ్రీశైలం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలంలో భద్రతా ఏర్పాట్లను కర్నూ లు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ జిల్లా ఇన్చార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్తో కలిసి పరిశీలించారు. మంగళవారం డీఐజీ శ్రీశైలం చేరుకుని ముందుగా సీసీ కమాండ్ కంట్రోల్ రూమ్ను తనిఖీ చేశారు. క్షేత్ర పరిధిలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా సీసీ కెమెరాల ద్వారా వెంటనే గుర్తించి అక్కడికి పోలీసు బృందాలు చేరుకునే విధంగా ఏర్పాట్లు చేశామని ఇన్చార్జ్ ఎస్పీ వివరించారు. దేవస్థానం తరఫున 550 పైగా సీసీ కెమెరాలు ఉండగా అదనంగా పలు ప్రదేశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. అనంతరం ఉచిత ప్రత్యేక దర్శన క్యూలు, శివదీక్ష స్వాములు క్యూలను ఎస్పీ, డీఎస్పీలతో కలిసి డీఐజీ పరిశీలించారు. వారి వెంట ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేటితో పార్వేట ముగింపు రుద్రవరం: అహోబిలేశుడి పార్వేట ఉత్సవాలు బుధవారం రాత్రితో ముగియనున్నాయి. అహోబిలం ఆలయ నిర్వాహకులు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 28వ తేదీ రుద్రవరం నుంచి అహోబిలానికి ఉత్సవ మూర్తులు చేరుకోవాల్సి ఉంది. అనివార్య కారణాలు అంటూ నిర్వాహకులు రెండు రోజులు ముందుగానే ఈనెల 26వ తేదీ రాత్రికే పల్లకీని అహోబిలం క్షేత్రానికి చేర్చుతున్నారు. ఆనవాయితీ ప్రకారం ఆరు రోజులు రుద్రవరంలో తెలుపులపై కొలువై పూజలందుకోవాల్సిన అహోబిలేశుడు నాలుగు రోజులకే పరిమితం కానున్నారు. బుధవారం రాత్రి పల్లకీ రుద్రవరం దొర్వి నరసింహ స్వామి ఆలయం నుంచి బయలుదేరి గండ్లేరు సమీపంలోని ఇస్కాన్ టెంపుల్ వద్దకు చేరుకోనుంది. అక్కడ ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత గురువారం తెల్లవారుజామున స్వామి అహోబిలం ఆలయానికి చేరుకున్నారు. ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి ● ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఎస్.గోకారి కర్నూలు (హాస్పిటల్): ప్రభుత్వంపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు ఎస్.గోకారి అన్నారు. కర్నూలులోని సలాం ఖాన్ ఎస్టీయూ భవనంలో మంగళవారం ము ఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గోకారి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ని కూటమి ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోవడం దారుణమన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 30 శా తం మధ్యంతర భృతిని ప్రకటించలేదని, 12వ పీఆర్సీని నియమించలేదని, డీఏలను మంజూరు చేయలేదని.. ఇలా సమస్యలు అనేకం ఉన్నాయన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రయత్నం చేయాలని, లేనిపక్షంలో ఎస్టీయూ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తుందన్నారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి టి.కె.జనార్ధన్, గోవిందు, శేఖర్, గోవిందు నాయక్, సురేష్, దేవదాస్ పాల్గొన్నారు. -
గజ వాహనంపై మల్లన్న విహారం
ఇల కై లాసమైన శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజు మంగళవారం భ్రమరాంబా సమేతుడైన మల్లన్న గజ వాహనంపై విహరించారు. ముందుగా ఉభయ దేవాలయ ప్రాంగణంలోని అలంకార మండపంలో ఉత్సవమూర్తులను గజవాహనంపై ఆశీనులు చేశారు. ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు, వేదపండితులు వేదమంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక అర్చన, హారతి పూజలు నిర్వహించారు. అనంతరం గజవాహనాధీశులైన స్వామిఅమ్మవార్లను ఆలయ ప్రదక్షిణ చేయించారు. అనంతరం గంగాధర మండపం నుంచి ప్రారంభమైన గ్రామోత్సవం నందిమండపం, బయలువీరభద్రస్వామి ఆలయం వరకు సాగింది. జానపద కళాకారుల నృత్య ప్రదర్శనలు, డ్రమ్స్, డప్పులు, తప్పెట్లు, మేళతాళాలు, భజంత్రీలు, శంఖానాదాల కోలాహలం నడుమ గ్రామోత్సవం కనుల పండువగా సాగింది. గజవాహనంపై దర్శనమిచ్చిన స్వామిఅమ్మవార్లను భక్తులు కనులారా దర్శించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. పూజల్లో కలెక్టర్ రాజకుమారి, జేసీ విష్ణు చరణ్, శ్రీశైల దేవస్థాన ఈఓ ఎం.శ్రీనివాసరావు, బ్రహ్మోత్సవాల ప్రత్యేక అధికారి ఎస్.ఎస్.చంద్రశేఖర ఆజాద్ తదితరులు పాల్గొన్నారు. -
సింహ వాహనాధీశా... నమోస్తుతే!
మహానంది: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో మహానంది క్షేత్రంలో మంగళవారం రాత్రి శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి అమ్మవార్లు సింహ వాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్/డిప్యూటీ కమిషనర్ ఎం.రామాంజనేయులు, ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని, అర్చకులు వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా పూజలు చేపట్టారు. అనంతరం కనుల పండువగా గ్రామోత్సవం నిర్వహించారు.పూజా కార్యక్రమాల్లో ఏఈఓ ఎరమల మధు, సూపరింటెండెంట్లు అంబటి శశిధర్రెడ్డి, దేవిక తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా ఉదయం శ్రీ కామేశ్వరీదేవి, శ్రీ మహానందీశ్వరస్వామి వార్లు ఉదయం సూర్యప్రభ వాహనంపై కొలువై ఆలయ ప్రాకారాల్లో విహరించారు. -
ఆత్మీయ కలయిక.. ఆనంద వేడుక
వారంతా 1975లో పోలీస్ శిక్షణ పొందిన వారు. 50 సంవత్సరాల తర్వాత ఒక చోట కలుసుకున్నారు. అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు. అలనాటి జ్ఞాపకాలను ఆనందంగా పంచుకున్నారు. విధి నిర్వహణలో ఎదుర్కొన్న సవాళ్లు, అనుభవాలను మిత్రులకు చెప్పారు. ఈ అ‘పూర్వ’ కలయికకు మంగళవారం కర్నూలు కొత్తపేటలోని పోలీస్ వెల్ఫేర్ హాస్పిటల్ దగ్గర ఉన్న విశ్రాంత పోలీసు అధికారుల భవనం వేదిక అయ్యింది. వీరంతా హైదరాబాద్ అంబర్పేట ట్రైనింగ్ సెంటర్లో 1975లో శిక్షణ పొందారు. సుదీర్ఘ కాలం పాటు పోలీసు శాఖలో పనిచేస్తూ వివిధ హోదాల్లో పదోన్నతి పొంది పదవీ విరమణ చేశారు. ఆత్మీయతతో ఒక చోట చేరి మిత్రులను పలకరించారు. యోగక్షేమ విషయాలు తెలసుకున్నారు. క్రమశిక్షణను గుర్తు చేసుకుంటూ హాస్యాన్ని పండించారు. – కర్నూలు -
శాస్త్రోక్తంగా నారసింహస్వామి దీక్ష విరమణ
ఆళ్లగడ్డ: 41 రోజులు నియమ నిష్టలతో కఠోరమైన దీక్ష చేపట్టిన అహోబిల లక్ష్మీనారసింహ స్వామి భక్తులు సోమవారం భక్తి శ్రద్ధలతో దీక్ష విరమణ చేశారు. దీక్ష చేపట్టి మండలం పూర్తి కావడంతో దీక్ష విరమించేందుకు భక్తులు సుదూర ప్రాంతాల నుంచి ఇరుముడి కట్టుకుని కాలినడకన అహోబిలం క్షేత్రం చేరుకున్నారు. తెల్లవారు జామున ఎగువ, దిగువ అహోబిల ఆలయాల వద్ద పుణ్యస్నానాలు ఆచరించి కాలినడకన మాలోల లక్ష్మీనరసింహస్వామి సన్నిధికి చేరుకుని ఇరుముడి సమర్పించి దీక్ష విరమించారు. అనంతరం వేదపండితులు ఆలయ సమీపంలో నిర్వహించిన సుదర్శన హోమంలో పాల్గొన్నారు. దీక్షాపరులతో పాటు వారి కుటుంబ సభ్యులు తండోపతండాలుగా తరలిరావడంతో అహోబిలం క్షేత్రం గోవింద నామస్మరణతో పులకించి పోయింది. -
చెరువులకు నీళ్లు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం
ప్యాపిలి: కూటమి ప్రభుత్వం చెరువులకు నీళ్లు ఇవ్వలేని అసమర్థ పాలన సాగిస్తోందని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. గుడిపాడు చెరువుతో పాటు పైప్ లైన్లో ఓ పైపును దుండగులు అపహరించిన ప్రాంతాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. అనంతరం గుడిపాడులో ఆయన మాట్లాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో హెన్ఎన్ఎస్ఎస్ ద్వారా చెరువులను నింపే కార్యక్రమం చేపట్టామన్నారు. 2024 ఎన్నికల కోడ్ వచ్చేనాటికి 90 శాతం పనులు పూర్తి చేశామన్నారు. మరో నెలరోజులైతే అన్ని చెరువులు జలకళను సంతరించుకుని రైతులు ఈ పాటికి రెండు, మూడు పంటలు తీసేవారన్నారు. కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చి 9 నెలలైనా ఇప్పటికీ పెండింగ్లో ఉన్న పది శాతం పనులు పూర్తి చేయలేక ఆపసోపాలు పడుతుందని విమర్శించారు. దీనిని బట్టి రైతుల పట్ల ప్రభుత్వానికి, స్థానిక పాలకులకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో తెలుస్తోందన్నారు. డోన్ నియోజకవర్గంలోని దాదాపు అన్ని గ్రామాలకు తమ హయాంలో రోడ్డు సౌకర్యం కల్పించామన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రోడ్లకు ఇరువైపులా ఉన్న ముళ్ల పొదలు కూడా తొలగించలేని పరిస్థితిలో ఉందన్నారు. డోన్లో వంద పడకల ఆసుపత్రి దేశంలోనే ఎక్కడా లేని విధంగా నిర్మించామన్నారు. కనీసం ఈ ఆసుపత్రిలో రగ్గులు, బెడ్షీట్లు కూడా ఇప్పటి వరకు ఇవ్వలేక పోయారని విమర్శించారు. కంబగిరి స్వామి ఆలయం, మద్దిలేటి స్వామి ఆలయాల అభివృద్ధి పనులను కొనసాగించలేక పోవడం బాధాకరం అన్నారు. గుండాల చెన్నకేశవ స్వామి ఆలయ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పైపుల దొంగలను పట్టుకోవడంలో విఫలం.. గుడిపాడు చెరువుకు నీటిని సరఫరా చేసే పైప్ను దుండగులు అపహరించడం హేయమైన చర్య అని మాజీ మంత్రి బుగ్గన అన్నారు. దాదాపు 3–4 టన్నుల బరువు ఉన్న పైప్ను గ్యాస్ కట్టర్తో కత్తిరించి లారీలో తరలించినా పోలీసులు గుర్తించలేక పోయారన్నారు. కనీసం ఈ వ్యవహారంలో దుండగులను పట్టుకుని శిక్షించడంలో జాప్యం ఎందుకు జరుగుతుందని ప్రశ్నించారు. డిపార్ట్మెంట్ తలచుకుంటే, పాలకులకు చిత్తశుద్ధి ఉంటే దొంగలను పట్టుకోవడం ఎంతసేపు అన్నారు. బుగ్గన వెంట రాష్ట్ర మీట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీరాములు, జెడ్పీటీసీ సభ్యులు బోరెడ్డి శ్రీరామిరెడ్డి, గుడిపాడు సర్పంచ్ శ్రీనివాసులు, ఎంపీటీసీ వెంకటరామిరెడ్డి, ప్యాపిలి ఉప సర్పంచ్ గడ్డం భువనేశ్వర్ రెడ్డి. వైఎస్సార్సీపీ నాయకులు మెట్టు వెంకటేశ్వర్ రెడ్డి, బోరెడ్డి పుల్లారెడ్డి, బొర్రా మల్లికార్జునరెడ్డి, బోరెడ్డి రాము, రాజా మురళీకృష్ణ ఉన్నారు. హంద్రీ నీవా నీరు చెరువులకు తరలింపులో నిర్లక్ష్యం తగదు 90 శాతం పనులు వైఎస్సార్సీపీ పాలనలోనే పూర్తి పైప్లు చోరీకి గురవుతున్నా పట్టించుకోరా? మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి -
శ్రీశైలం.. శివమయం
శివభక్తులతో శ్రీగిరి నిండిపోయింది. ఎటు చూసినా శివభక్తుల భజనలు, శివనామస్మరణలు, పూజలతో శ్రీగిరి క్షేత్రం మారుమోగుతోంది. బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. నల్లమల అటవీ ప్రాంతం మీదుగా భక్తులు పాదయాత్రగా వస్తున్నారు. వృద్ధులు, మహిళలు, చంటిపిల్లల తల్లులు సైతం ఎండను లెక్క చేయకుండా కదలివస్తున్నారు. పాతాళగంగలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, కృష్ణమ్మకు వాయనం సమర్పిస్తున్నారు. అనంతరం క్యూలైన్ల వద్దకు చేరుకుని శ్రీశైల మల్లన్న దర్శనానికి వెళ్తున్నారు. భక్తుల రద్దీతో ఆలయ క్యూలైన్లన్నీ నిండిపోయాయి. -
కందిపప్పు.. ఇస్తే ఒట్టు
● నామమాత్రంగా కందిపప్పు పంపిణీ ● జిల్లాలో 5.34 లక్షల రేషన్ కార్డులు ● ఫిబ్రవరి నెల కేటాయింపు 2.16 లక్షల కిలోలు మాత్రమే ● సగం మందితో సరిపెడుతున్న వైనంగోస్పాడు: కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో రేషన్ దుకాణాల ద్వారా కార్డుదారులకు కంది పప్పు, పంచదార, జొన్నలు, గోధుమపిండి, రాగులు.. తదితర సరుకులు ప్రతి నెలా అందిస్తామని చెప్పిన పాలకుల మాటలు నీటమూటలవుతు న్నాయి. రేషన్ కార్డుదారులకు బియ్యంతో సరిపెట్టేస్తున్నారు. పూర్తి స్థాయిలో కందిపప్పు ఊసే లేదు. ఇక చక్కెర కూడా అరకొరగా పంపిణీ చేస్తున్నారు. నిత్యావసర సరుకుల ధరలు బహిరంగ మార్కెట్లో ఆకాశన్నంటుతున్నాయి. ఈ సమయంలో పౌర సరఫరాల శాఖ అధికారులు పంపిణీ చేయాల్సిన కందిపప్పును కంటితుడుపుగా ఇస్తున్నారు. దీంతో కార్డుదారులు మార్కెట్లో అధిక ధరకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఫిబ్రవరి నెల పూర్తిస్థాయిలో రేషన్ సరుకులు అందక కొందరు బియ్యంతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలో 5,34,293 రేషన్ కార్డులు ఉన్నాయి. జిల్లాకు ఫిబ్రవరి నెలకు సంబంధించి 6,600 మెట్రిక్ టన్నుల బియ్యం, 2,16,000 కిలోల కందిపప్పు, 2,13,000 కిలోల చక్కెర కేటాయించినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. దీంతో వినియోగదారులందరికీ సవ్యంగా కందిపప్పు, చక్కెరను అందించలేక పోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణాల్లో కార్డుదారులకు కొంత మేర అందుతున్నా.. గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ పూర్తిగా తగ్గిపోతుంది. కేవలం కొద్ది మందికే ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. బహిరంగ మార్కెట్లో పట్టణ ప్రాంతాల్లో కిలో రూ.110 నుంచి రూ.120, పల్లెలలో రూ. 120 నుంచి రూ. 140 వరకూ విక్రయిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం ఎండీయూ వాహనాల్లో కందిపప్పును పూర్తి స్థాయిలో ఇవ్వక పోవటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. కిలో కందిపప్పు రూ.67కే ఒక్కో కార్డుదారునకు అందించాల్సి ఉంది. కానీ ముందుగా రేషన్ తీసుకున్న వారికి మాత్రమే కందిపప్పు అందుతుందని కార్డుదారులు చెబుతున్నారు. జిల్లాలో రేషన్ కార్డుల సంఖ్యకు అనుగుణంగా కేటాయించకపోవడంతో అరకొరగా పంపిణీ చేస్తున్నారు. డీడీలు కట్టని డీలర్లు... బియ్యం పూర్తి స్థాయి కోటాకు ముందుగానే డీడీలు చెల్లిస్తున్నా డీలర్లు కందిపప్పు, చక్కెరకు మాత్రం ముందుకు రావడం లేదు. కార్డుల సంఖ్యకు అనుగుణంగా డబ్బులు కట్టినా ఆ మేరకు కేటాయింపులు లేకపోవడంతో గ్రామాల్లో పంపిణీ సమస్య తలెత్తుతుందని వెనుకడుగు వేస్తున్నారు. అలాగే కందిపప్పుకు అధిక మొత్తం చెల్లించాల్సి రావడం ఒక కారణం కాగా.. బ్లాక్ మార్కెట్కు తరలించి అమ్ముకునే ఆలోచన ఉన్నా నాణ్యత లేకపోవడంతో మిన్నుకుండిపోతున్నారనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో పూర్తి స్థాయిలో కందిపప్పు వినియోగదారులకు చేరటం లేదనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. -
ఇరుముడి విప్పితే.. సమర్పించాల్సిందే!
శ్రీశైలంటెంపుల్: శివ దీక్ష భక్తులు దోపిడీకి గురవుతున్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో 41 రోజుల పాటు శివమాల స్వీకరించిన భక్తులు దీక్ష విరమణకు ఇరుముడితో శ్రీశైలానికి తరలివస్తున్నారు. దీక్ష విరమణకు దేవస్థానం ప్రత్యేకంగా శివదీక్ష శిబిరాలను ఏర్పాటు చేసింది. స్థానిక ఆగమ పాఠశాలకు చెందిన సుమారు 106 మంది విద్యార్థులను మూడు విడుతలుగా విధులు కేటాయించారు. వీరికి ప్రత్యేక గుర్తింపుకార్డులను సైతం అందించారు. అయితే ఆగమ పాఠశాలలో గతంలో చదివిన వారు, ఆగమ పాఠశాలలో పనిచేసే వారికి పరిచయం ఉన్న కొందరికి సైతం గుర్తింపు కార్డులను ఇచ్చి ఇరుముడి విరమణ చేసేందుకు అనుమతించారు. వీరిలో కొందరు భక్తుల నుంచి దక్షిణ రూపంలో డిమాండ్ చేస్తున్నారు. దీక్ష విరమణ పూర్తయిన తరువాత భక్తులు తోచినంత ఇస్తే అర్చకులు స్వీకరించాలి. అలా కాకుండా కచ్చితంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇరుముడి విరమణ చేస్తే కచ్చితంగా రూ.100, అపై ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు పలువురు భక్తులు ఆరోపిస్తున్నారు. ‘ఏంటి స్వామి ఇలా డిమాండ్ చేస్తున్నారు’ అని భక్తులు ప్రశ్నిస్తే ‘మేము ఇచ్చుకునేవి ఉన్నాయని’ బదులిస్తున్నట్లు శివభక్తులు ఆరోపిస్తున్నారు. శివదీక్ష శిబిరాలను పర్యవేక్షించాల్సిన దేవస్థానం అధికారుల నిర్లక్ష్యంతో భక్తులు దోపిడీకి గురవుతున్నారు. -
ప్రతి అర్జీని సత్వరమే పరిష్కరించాలి
● కలెక్టర్ రాజకుమారి శ్రీశైలంప్రాజెక్ట్: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ప్రతి అర్జీని ఆయా శాఖల అధికారులు సమగ్రంగా విచారణ చేసి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి ఆదేశించారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల పర్యవేక్షణకు శ్రీశైలం వచ్చిన కలెక్టర్ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సున్నిపెంటలోని తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులో ఆమె మాట్లాడారు. రీ ఓపెన్ అయిన దరఖాస్తులను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలన్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇతర మంత్రుల నుంచి వచ్చిన అర్జీలకు ప్రాధాన్యతని స్తూ ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. పీ4 సర్వే, మిస్సింగ్ హౌస్హోల్డ్ డాటా, ఎంఎస్ఎంఈ సర్వే, చిన్నపిల్లల ఆధార్ అప్డేట్లను మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. అన్ని పారామీటర్లలో బనగానపల్లె, బేతంచెర్ల, శిరివెళ్ల మండలాలు వెనుకబడి ఉన్నాయని, ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సర్వేలు పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. బీసీ గురుకులాల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం ● 600 మంది విద్యార్థులకు 5వ తరగతిలో ప్రవేశాలకు అవకాశం నంద్యాల(న్యూటౌన్): మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకు ల విద్యాలయాల్లో 5వ తరగతిలో ప్రవేశానికి ద 2025–26 విద్యా సంవత్సరానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న తొమ్మిది పాఠశాలల్లో 600 మంది విద్యార్థుల ప్రవేశానికి అవకాశం లభించింది. ఈ నెల 15 నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు దరఖాస్తులు ఆన్లైన్లో స్వీకరించేందుకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. హెచ్టీటీపీఎస్://ఎంజేపీ ఏపీబీసీడబ్ల్యూఆర్ ఈఐఎస్.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కన్వీనర్, పాణ్యం ఎంజేపీఏపీబీసీ సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపాల్ ఫ్లోరమ్మ తెలిపారు. సీట్ల కేటాయింపులో రిజర్వేషన్లను పరిగణలోకి తీసుకుంటారన్నారు. మార్కుల ఆధారంగా మెరిట్ లిస్టు మొదటి, రెండవ, మూడవ జాబితాను ఖాళీలను బట్టి ప్రకటిస్తారన్నారు. మోడల్ స్కూళ్లలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోండి నంద్యాల(న్యూటౌన్): జిల్లాలోని 20 మోడల్స్కూల్లో 2025–26 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ జనార్ధన్రెడ్డి ఒక ప్రకటనలో సోమవారం పేర్కొన్నారు. ఏప్రిల్ 20వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఈనెల 25వ తేదీ నుంచి మార్చి 31లోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. మరింత సమాచారం కోసం జిల్లా విద్యాశాఖ కార్యాలయాన్ని సంప్రదించాలని పేర్కొన్నారు. పింఛన్లకు రూ.195.28 కోట్లు మంజూరు కర్నూలు(అగ్రికల్చర్): ఎన్టీఆర్ పెన్షన్ కానుక కింద మార్చి నెలకు ఉమ్మడి జిల్లాలో 4,53,829 పింఛన్లకు రూ.195.28 కోట్లు మంజూరయ్యాయి. ఫిబ్రవరి నెలతో పోలిస్తే మార్చిలో 1,095 పింఛన్లపై కోత పడింది. ప్రభుత్వం పింఛన్ల పంపిణీ నిధులను ఈ నెల 28న బ్యాంకులకు విడుదల చేస్తుంది. మార్చి 1న ఉదయం 6 గంటల నుంచి సచివాలయ ఉద్యోగులు పింఛన్లు పంపిణీ చేయనున్నారు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కృషి కర్నూలు కల్చరల్: ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీటీడీసీ) నూతన డివిజినల్ మేనేజర్ జి.లక్ష్మీనారాయణ అన్నారు. ఇప్పటి వరకు డీవీఎంగా ఉన్న చంద్రమౌళీశ్వర్ రెడ్డిని ఏపీటీడీసీ రాష్ట్ర కార్యాలయానికి బదిలీ చేశారు. ఆ స్థానంలో లక్ష్మీనారాయణ డీవీఎంగా నియమితులయ్యారు. సోమవారం వెంకటరమ ణ కాలనీలోని టూరిజం కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మాట్లాడు తూ పర్యాటక ప్రాంతాల్లో సౌకర్యాలు మెరుగు పరిచి సందర్శకుల సంఖ్య పెరిగేందుకు చర్యలు చేపడతామన్నారు. గార్గేయపురం చెరువు బోటింగ్ పాయింట్లో రోలింగ్ బోట్ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. నూతన డీవీఎంకు ఉర్దూ యూని వర్సిటీ ఇన్చార్జ్జ్ వీసీ ప్రొఫెసర్ షావలిఖాన్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. -
నూతన పద్ధతులతో ఉద్యాన పంటల అభివృద్ధి
మహానంది: వాణిజ్య ఉద్యాన పంటల అభివృద్ధికి డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వ విద్యాలయం నూతన పద్ధతులను రూపొందిస్తోందని వైస్ చాన్స్లర్ డాక్టర్ గోపాల్ అన్నారు. మహానంది సమీపంలోని వైఎస్సార్ ఉద్యాన పరిశోధన స్థానం ప్రాంగణంలో శనివారం ఉద్యాన కిసాన్ మేళా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ వైఎస్సార్ హెచ్యూ వ్యవసాయ పరిశోధన, శిక్షణ, సాంకేతిక సేవల ద్వారా మహానంది మండలంలో రైతులు హార్టికల్చర్ రంగంలో రాణిస్తున్నారన్నారు. ఉద్యాన పరిశోధనా స్థానాల్లో ఎక్కువగా ఉల్లి, పసుపు, అరటి, ధనియాలు రకాలపై పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. కొబ్బరి ప్లాంటేషన్పై దృష్టి సారించామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, మహానంది హెచ్ఆర్ఎస్ హెడ్ సైంటిస్ట్ డాక్టర్ ముత్యాల నాయుడు, సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ ఠాగూర్ నాయక్, డాక్టర్ కిషోర్, తదితరులు పాల్గొని రైతులకు సలహాలు ఇచ్చారు. -
15 నిమిషాలు ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి
● నేడు గ్రూపు–2 మెయిన్స్ పరీక్షలుకర్నూలు(సెంట్రల్): గ్రూపు–2 మెయిన్స్ పరీక్షలు ఆదివారం నిర్వహించనున్నారు. పరీక్ష రాసే వారు 15 నిమిషాలు ముందుగానే కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రాల్లోకి అనుమతించబోమని ఏపీపీఎస్సీ ప్రకటించింది. గ్రూపు–2 మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యే వారు తప్పనిసరిగా ఏదైనా గుర్తింపు కార్డుతోపాటు హాల్ టిక్కెట్తో కేంద్రంలోకి వెళ్లాలి. ఆదివారం ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు మొదటి పేపర్, మధ్యాహ్నం 3 నుంచి 5.30 గంటల వరకు రెండో పేపర్ను నిర్వహిస్తారు. కర్నూలు జిల్లాలో 30 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా, వాటిలో 9,993 మంది పరీక్షలు రాయనున్నారు. పరీక్షల ఏర్పాట్లు, అధికారుల సమన్వయం కోసం జేసీ డాక్టర్ బి.నవ్యను కోర్డినేట్ అధికారిగా ఏపీపీఎస్సీ నియమించింది. గ్రూపు–2 మెయిన్స్ రాత పరీక్షకు వచ్చే అభ్యర్థులు సందేహాలను నివృత్తికి 08518–277305కు ఫోన్ చేయవచ్చని జేసీ డాక్టర్ బి.నవ్య తెలిపారు. -
రేపు శ్రీశైలానికి రాష్ట్ర గవర్నర్ రాక
శ్రీశైలంటెంపుల్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు సోమవారం రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులు శ్రీశైలం రానున్నారు. సాయంత్రం ప్రత్యేక హెలికాప్టర్లో సున్నిపెంట హెలిపాడ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీశైలం భ్రమరాంబా అతిథి గృహానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఆలయానికి చేరు కుని శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను దర్శించుకుంటారు. అనంతరం రాత్రికి అతిథి గృహంలోనే బస చేసి మంగళవారం ఉద యం విజయవాడకు తిరిగి వెళ్తారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో దేవస్థాన అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రద్దయిన సీఎం పర్యటన.. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు వస్తు ్నట్లు అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే సీఎం పర్యటన వివిధ కారణాల వలన రద్దయిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు నంద్యాల(న్యూటౌన్): ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఐఈఓ సునీత తెలిపారు. శనివారం ఆమె జిల్లాలోని పలు పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు జరిగే ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. విద్యార్థులు మనమిత్ర యాప్తో వాట్సాప్ నెంబర్ 9552300009 ద్వారా హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. అలాగే http://bie.ap.gov.inలో విద్యా ర్థుల ఆధార్ నెంబరుతో, రెండవ సంవత్సరం విద్యార్థులు గత ఏడాది హాల్టికెట్ నెంబర్ ఆధారంగా హాల్టికెట్ పొందవచ్చన్నారు. నంద్యాల జిల్లాలో మొదటి సంవత్సరం జనరల్ విద్యార్థులు 14,239 మంది, ఒకేషనల్ 1,456 మంది విద్యార్థులు, రెండో సంవత్సరం జనరల్ విద్యార్థులు 12,230 మంది, ఒకేషనల్ 11,070 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారన్నారు. రేనాటి సూరీడుఉయ్యాలవాడ నరసింహారెడ్డి నంద్యాల: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధు లు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి రేనాటి సూరీడు అని డీఆర్ఓ రాము నాయక్ కొనియాడారు. శనివారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెనన్స్ హాల్లో నరసింహారెడ్డి 178వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ బ్రిటీష్ పాలకులను ఎదిరించి సాయుధ పోరాటం చేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు. సాంప్రదాయ వ్యవసాయ వ్యవస్థలో బ్రిటీషుయులు చేసిన మార్పులకు వ్యతిరేకంగా నరసింహారెడ్డి పోరాటం చేశారన్నారు. 1806 నవంబర్ 24న కర్నూలు జిల్లాలోని రూపనగుడిలో జన్మించి స్వాతంత్య్ర సాధన కోసం బ్రిటీష్ పాలకులతో వ్యతిరేకంగా పోరాటం చేసిన ఆయన 1847 ఫిబ్రవరి 22న వీరమరణం పొందారన్నారు. కార్యక్రమంలో రెడ్డి సేవా సంఘం ప్రతినిధులు రామకృష్ణారెడ్డి, మనోహర్ రెడ్డి, తిరుపంరెడ్డి, సాయిరాంరెడ్డి, శివకుమార్ రెడ్డి, కలెక్టరేట్ ఏఓ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. నేడు ‘మాలల యుద్ధగర్జన’కర్నూలు(అర్బన్): రిజర్వేషన్లలో ఎస్సీ ఉప వర్గీకరణకు వ్యతిరేకంగా ఆదివారం కర్నూలులో భారీగా రాయలసీమ మాలల యుద్ధగర్జన సభను నిర్వహిస్తున్నట్లు మాల సంఘాల జేఏసీ కన్వీనర్ యాట ఓబులేసు, గౌరవాధ్యక్షులు గోన నాగరాజు తెలిపారు. శనివారం స్థానిక కార్యాల యంలో వారు విలేకరులతో మాట్లాడుతూ.. కర్నూలు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో సభ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం అవుందన్నారు. అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్, అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ ఉప్పులేటి దేవీప్రసాద్, మాల మహాసభ అధ్యక్షులు మల్లెల వెంకట్రావ్, ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్, స్వర్గీయ పీవీ రావు సోదరుడు పీఎస్ఎన్ మూర్తి తదితరులు హాజరవుతున్నట్లు తెలిపారు. రాయలసీమ ఉమ్మడి నాలుగు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో మాలలు ఈ సభకు రానున్నారని చెప్పారు. -
ఓర్వకల్లు సమీపంలోని రాక్ గార్డెన్స్.. సినిమా చిత్రీకరణకు భళా అనిపిస్తోంది. కర్నూలులోని కొండారెడ్డి బురుజు రాజసం చిత్రాల్లో కనిపిస్తోంది. అహోబిల క్షేత్రం పలు సినిమాల్లో కనిపించి ప్రేక్షకులకు ఆధ్యాత్మికతను పంచుతోంది. యాగంటి క్షేత్రంలో సైతం సినిమాల చిత్రీక
సినిమాల చిత్రీకరణకు ముఖ్య ప్రాంతాలు ఇవీ.. ● కొండారెడ్డి బురుజు వేదికగా ఒక్కడు, సరిలేరు నీకెవ్వరు, సమరసింహారెడ్డి, సీతయ్య, ప్రేమించు కుందాం రాం.. తదితర సినిమాల్లో పలు సన్నివేశాలు చిత్రీకరించారు. ● నరసింహ నాయుడు, శంభో శివ శంభో, తెనాలి రామకృష్ణ తదితర సినిమాల్లో ప్రముఖ ఘట్టాలను కర్నూలులోనే తీశారు. ● ఓర్వకల్లు రాక్ గార్డెన్స్లో బాహుబలి, జయం మనదేరా, సుభాష్ చంద్రబోస్, టక్కరి దొంగ తదితర సినిమాల్లో పలు సన్నివేవాలు చిత్రీకరించారు. ● అహోబిలంలో లక్ష్మీనరసింహ, యాగంటిలో నేనే రాజు నేనే మంత్రి, గద్దల కొండ గణేశ్ తదితర చిత్రాల్లో ఘట్టాలను నిర్మాణం చేయగా.. అవి హిట్ కొట్టాయి. ● మంత్రాలయం పరిధిలో కొన్ని తెలుగు, కన్నడ సినిమాల చిత్రీకరణ జరిగింది. ప్రభాస్ హీరోగా రాఘవేంద్ర సినిమా మంత్రాలయంలోనే తీశారు. ● కర్నూలు జిల్లాలో పుష్ప సినిమాలో కొన్ని ఘట్టాల షూటింగ్ జరిగింది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్గా నిలిచింది. ● నంద్యాల సమీపంలోని నల్లమల అడవుల్లో క్షణక్షణం, రౌడీ ఇన్స్పెక్టర్, బొబ్బిలి రాజా చిత్రాల్లో పలు సన్నివేశాలు చిత్రీకరించారు. రాక్గార్డెన్స్లో.. డాకు మహారాజ్ యాగింటిలో పుష్ప–2 చిత్రంలో దృశ్యంకొండారెడ్డి బురుజుపై గేమ్ ఛేంజర్ ..రాక్ గార్డెన్స్లో షూటింగ్లో దర్శకుడు రాజమౌళి (ఫైల్)రాక్గార్డెన్స్లో.. బాహుబలిబెలుం గుహలుఅరుంధతి చిత్రంలో నవాబు బంగ్లా -
డెయిరీకి జగత్ విఖ్యాత్రెడ్డి డీఫాల్టర్
తీసుకున్న అప్పు తక్షణమే చెల్లించాలి ● బోర్డు మీటింగ్ అనంతరం చైర్మన్ ఎస్వీ జగన్మోహన్రెడ్డి ● మందీ మార్బలంతో డెయిరీలోకి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ ● ఎండీ సీట్లో కూర్చొని హల్చల్ ● పరస్పర సవాళ్లతో వేడెక్కిన రాజకీయంనంద్యాల(అర్బన్): జగత్ విఖ్యాత్రెడ్డి డెయిరీ నుంచి డబ్బు తీసుకొని డీఫాల్టర్ అయ్యారని.. సొసైటీ ప్రెసి డెంట్గా అనర్హుడు కాబట్టే చక్రవర్తులపల్లె సొసైటీని రద్దు చేశామని విజయడెయిరీ చైర్మన్ ఎస్వీ జగన్మోహన్రెడ్డి తెలిపారు. శనివారం డెయిరీలో బోర్డు మీటింగ్ నిర్వహించారు. అయితే విషయం తెలుసుకున్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ మందీ మార్బలంతో అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. వెంటనే పోలీసులు డెయిరీ వద్దకు చేరుకొని బందోబస్తు నిర్వహించారు. వచ్చీ రావడంతోనే ఎమ్మెల్యే.. ఎండీ ప్రదీప్కుమార్ సీట్లో కూర్చొని హల్చల్ చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే తిష్టవేయడంతో అధికారులు, సిబ్బంది బిక్కుబిక్కుమంటూ గడిపారు. ● ఇదిలా ఉంటే బోర్డు మీటింగ్ అనంతరం చైర్మన్ ఎస్వీ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే తన అనుచరులను వెంటేసుకొని డెయిరీలోకి వచ్చి హల్చల్ చేస్తే ఊరుకొనేది లేదన్నారు. తమ్ముడు విఖ్యాత్రెడ్డిని చైర్మన్ను చేసేందుకు అఖిలప్రియ ఇలాంటి చర్యలకు పాల్పడుతుందన్నారు. జగత్ విఖ్యాత్ రెడ్డి డెయిరీకి డీఫాల్టర్గా ఉన్న విషయాన్ని ఆమె మరువరాదన్నారు. అప్పటి డెయిరీ చైర్మన్ భూమా నారాయణరెడ్డి నుంచి జగత్ డెయిరీ పాల నాణ్యత చూపి రూ.1.40 కోట్లు రుణంగా తీసుకొని డీ ఫాల్టర్గా ఉన్న జగత్ విఖ్యాత్రెడ్డి తిరిగి రుణం చెల్లించే వరకు డైరెక్టర్ కాలేడన్నారు. గతంలో తన సీట్లో కూర్చోవడం, ప్రస్తుతం ఎండీ సీట్లో కూర్చుంటే ప్రశ్నించేవారు లేరనుకుంటున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదాయంలో నడుస్తున్న డెయిరీ జోలికి రావద్దని, డెయిరీలో అవినీతి జరిగితే ఏ విచారణకై నా తాము సిద్ధమన్నారు. తాను రైతు బిడ్డనని, తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు. నాలుగున్నరేళ్లలో రూ.45కోట్లు డెయిరీకి ఆదాయాన్ని ఇచ్చామని.. పాడిరైతులు, ఉద్యోగులకు డెయిరీ ఏర్పాటు నుంచి తొలిసారి బోనస్ అందించిన చరిత్ర తమదని, తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. ● ఇదే సందర్భంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ మాట్లాడుతూ ఐదేళ్లుగా డీఫాల్టర్ అయినప్పటికీ తమ్ముడు విఖ్యాత్రెడ్డిపై చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యం ఏమిటో చెప్పాలన్నారు. చైర్మన్ సీటు పోతుందనే భయంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. నోటీసులు ఇప్పుడెందుకు ఇస్తున్నారో అర్థం కావడం లేదని, కాలమే సమాధానం చెబుతుందన్నారు. సమావేశంలో డెయిరీ డైరెక్టర్ పీపీ మధుసూదన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చిత్ర పరిశ్రమకు కర్నూలు కలిసి వస్తోంది
రాష్ట్ర విజన తర్వాత సినిమా రంగం హైదరాబాద్లో స్ధిరపడింది. కర్నూలు జిల్లాలో షూటింగ్ జరిగితే ఆ సినిమా హిట్ అవుతుందనే సెంటిమెంట్ దర్శకులకు ఉంది. హైదరాబాద్ సిటీకి కర్నూలు దగ్గరగా ఉంది. కర్నూలులో షూటింగ్ స్పాట్లు ఉండటం సినీవాళ్లకు కలిసి వస్తోంది. స్థానిక కళాకారులకు సినిమాల్లో అవకాశాలు కల్పిస్తే మరింత జనాదరణ వస్తుంది. – పత్తి ఓబులయ్య, ట్రెజరర్, ఏపీ తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ రాయలసీమకు ప్రాధాన్యం ఇవ్వాలి కర్నూలు జిల్లాలో షూటింగ్ జరుపుకున్న సినిమాలు దాదాపు 90 శాతం విజయం సాధించాయి. కరోనా కంటే ముందు చాలా సినిమాల షూటింగ్లు కర్నూలులో జరిగాయి. అవి హిట్ కొట్టాయి. మన ప్రాంతం నుంచి చాలా మంది సినీ పరిశ్రమలో ఉన్నారు. వీరితో పాటు మిగతావారు సైతం రాయలసీమలో సినిమా షూటింగ్లకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అసవరం ఉంది. – బైటింటి మీనాక్షిరెడ్డి, సినీ నటుడు -
ప్రకృతి వ్యవసాయంతో అధిక దిగుబడులు
బనగానపల్లె: కూరగాయలు, ఆకుకూరలు ప్రకృతి వ్యవసాయంతో సాగు చేస్తే అధిక దిగుబడు లు సాధించవచ్చునని వ్యవసాయ సాంకేతిక పరిశోధన, అనుప్రయోగ సంస్థ(అటారీ) హైదరాబాద్ జోన్ డైరెక్టర్ డాక్టర్ షేక్ ఎన్ మీరా అన్నారు. యాగంటిపల్లె కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త ధనలక్ష్మీ అధ్యక్షతన యాగంటిపల్లెలో రైతులు సాగు చేసిన కూరగాయలు ఆకుకూరల పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన దిగుబడులకు మార్కెట్లో గిట్టుబాటు ధర లభిస్తుందన్నారు. శాస్త్రవేత్తల సూచనలు, సలహాలు పాటించి రైతులు లాభాలు పొందాలన్నారు. యాగంటిపల్లె పరిసర ప్రాంతంలో మామిడితోటలను సందర్శించి రైతులు చేపట్టిన యాజమాన్య పద్ధతులను అడిగి తెలుసుకున్నారు. నేల, మానవాళి ఆరోగ్యం కోసం తప్పకుండా రసాయన రహిత వ్యవసాయ విధానాలపై దృష్టి సారించాలని రైతులకు సూచించారు. ఆయన వెంట సొసైటీ ఏఓ సురేష్కుమార్, కేవీకే శాస్త్రవేత్తలు ఉన్నారు. శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నంద్యాల(వ్యవసాయం): మహాశివరాత్రి సందర్భంగా జిల్లాలోని వివిధ శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు జిల్లా రవాణా అధికారి రజియా సుల్తానా తెలిపారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ 24వ తేదీ నుంచి శ్రీశైల క్షేత్రానికి వివిధ డిపోల నుంచి 180 బస్సులు ఏర్పాటు చేశామన్నారు. ఆళ్లగడ్డ డిపో నుంచి 15, ఆత్మకూరు నుంచి 50, బనగానపల్లె 10, డోన్ 15, కోవెలకుంట్ల 15, నందికొట్కూరు 35, నంద్యాల డిపో నుంచి 40 బస్సులతో పాటు ఇతర జిల్లాల నుంచి 90 బస్సులను నడుపుతున్నట్లు వివరించారు. బస్సుల మెయింటెన్స్ కోసం శ్రీశైలం హఠకేశ్వరం, దోర్నాలలో రిలీప్ క్యాంపులను ఏర్పాటు చేశామన్నారు. 24 గంటల పాటు ట్రాఫిక్ క్లియరెన్స్, మెయింటెన్స్పై నలుగురు ఎస్ఎస్ఓలు, పది మంది డీఎంఎస్, 100 మంది సూపర్ వైజర్లతో బ్రహ్మోత్సవాలు ముగిసే వరకు పర్యవేక్షణ కొనసాగుతుందన్నారు. అలాగే నంద్యాల డిపో నుంచి మహానందికి 25 బస్సులు, ఓంకారానికి 10, భోగేశ్వరానికి 3, ఆత్మకూరు డిపో నుంచి రుద్రకోడూరుకు 5, సంగమేశ్వరానికి 5, కొలను భారతికి 2, నందికొట్కూరు డిపో నుంచి భోగేశ్వరానికి 2, బనగానపల్లె డిపో నుంచి యాగంటికి 10, డోన్ డిపో నుంచి బ్రహ్మగుండంకు 14, కోవెలకుంట్ల డిపో నుంచి నయనాలప్పకు 6 ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు మెరుగైన వసతులు శ్రీశైలంటెంపుల్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలానికి వచ్చే భక్తులకు మెరుగైన వసతులు కల్పిస్తున్నట్లు శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం ఆయన దర్శనం క్యూలైన్లు, శివదీక్షా శి బిరాలు, పార్కింగ్ ప్రదేశాలు, 30 పడకల తాత్కాలిక వైద్యశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. క్యూలైన్లలో నిరంతరం అల్పాహారం, మంచినీరు, బిస్కెట్లు పంపిణీ చేయాలనాన్రు. దివ్యాంగులకు, చంటిబిడ్డ తల్లులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. శివదీక్ష శిబిరాలను సందర్శించి, ఏర్పాట్లపై పలువురు భక్తుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. కోర్టుల భవన నిర్మాణాలకుస్థల పరిశీలనఎమ్మిగనూరుటౌన్: ఐదు అడిషనల్ కోర్టుల భవనాల నిర్మాణానికి ఎమ్మిగనూరు పట్టణంలో స్థలాలను శుక్రవారం జిల్లా జడ్జి కబర్ధి పరిశీలించారు. జూనియర్ సివిల్ కోర్టు భవనాన్ని పునర్నిర్మించేందుకు స్థానిక కోర్టు జడ్జి పి.హేమ, న్యాయవారులతో మాట్లాడారు. తాత్కాలిక కోర్టు ఏర్పాటు చేసేందుకు పట్టణంలో పాత మున్సిపల్ కార్యాలయాన్ని పరిశీలించారు. అడిషనల్ కోర్టుల భవన నిర్మాణాలకు పాత తహసీల్దార్ కార్యాలయం, ఆదోని రోడ్డులోని టీబీపీ కార్యాలయం, వెటర్నరీ ఆసుపత్రి స్థలాన్ని పరిశీలించారు. ఏ ప్రాంతం అనువుగా ఉంటుందో తెలియజేయాల ని స్థానిక కోర్టు బార్ అసోసియేషన్ సభ్యులకు, న్యాయవాదులకు సూచించారు. కార్యక్రమంలో స్థానిక జడ్జి హేమ, తహసీల్దార్ శేషఫణి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గురురాజారావు, కార్యదర్శి రఘురాం, న్యాయవాదులు మామిడి మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. -
కేఆర్ఎంబీ కర్నూలులో ఏర్పాటు చేయాలి
నంద్యాల(అర్బన్): కృష్ణానది యాజమాన్య బోర్డు (కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు)ను విజయవాడ లో ఏర్పాటు చేస్తామనే ప్రభుత్వ ప్రకటనపై రాయలసీమ సాగునీటి సాధన సమితి, ప్రజా రైతు సంఘాలు భగ్గుమన్నాయి. కర్నూలులోనే కేఆర్ఎంబీని ఏర్పాటు చేయాలని కోరుతూ శుక్రవారం నంద్యాల పట్టణంలోని సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి నివాస గృహం నుంచి గాంధీచౌక్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీరు అందించేటప్పుడు ఆ ప్రాంతానికి శ్రీశైలం ప్రాజెక్టుతో అనుబంధం తెగిపోయిందన్నారు. కృష్ణానది యాజమాన్య బోర్డును శ్రీశైలం ప్రాజెక్టు ఉన్న కర్నూలు జిల్లాలోనే ఏర్పాటు చేయాలన్నారు. కేఆర్ఎంబీని కర్నూలులో ఏర్పాటు చేయకపోతే సీమ వాసులు తాగు, సాగునీటికి ఇబ్బందులు పడక తప్పదన్నారు. ఈనెల 25వ తేదీలోగా యాజమాన్య బోర్డు మార్పుపై ప్రకటన చేయకపోతే అదే రోజు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. నిరసన ర్యాలీలో ఆయా సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
మార్చి 24, 25 తేదీల్లో బ్యాంకుల సమ్మె
కర్నూలు (అగ్రికల్చర్): మార్చి 24, 25 తేదీల్లో బ్యాంకుల సమ్మె చేపట్టనున్నట్లు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యూఎఫ్బీయూ) నేత లు తెలిపారు. కర్నూలు గాయత్రి ఎస్టేట్లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారపేట బ్రాంచ్ ఎదుట శుక్రవారం సాయంత్రం నిరసన కార్యక్రమాన్ని చేప ట్టారు. అన్ని బ్యాంకులకు చెందిన ఉద్యోగులు 400 మంది వరకు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూఎఫ్బీయూ జిల్లా కన్వీనర్ నాగరాజు మాట్లాడుతూ.. బ్యాంకు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. అన్ని కేడర్లలో తగిన ని యామకాలు చేపట్టాలని, తాత్కాలిక ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఐడీబీఐ ప్రైవేటీకరించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. బ్యాంకు అధికారులు, ఉద్యోగులపై దాడులను అరికట్టేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఐబీవోసీ నాయకులు జియాపూర్, రాజు, మురళీకృష్ణ, ఎన్సీబీఈ నాయకులు ప్రవీణ్, రవి, నూర్బాషా తదితరులు పాల్గొన్నారు. -
10 మంది వైద్యులకు షోకాజ్ నోటీసులు
కర్నూలు(హాస్పిటల్): సమాచారం లేకుండా విధులకు గైర్హాజరైన 10 మంది వైద్యులకు ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇందులో కర్నూలు మెడికల్ కాలేజీలో పనిచేసే ఇద్దరు ప్రొఫెసర్లు, ఒక అసోసియేట్ ప్రొఫెసర్, ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, వైద్య విధాన పరిషత్లోని సీహెచ్సీల్లో పనిచేసే నలుగురు వైద్యులు ఉన్నారు. వీరు ఏడాది కాలంగా సెలవు కూడా పెట్టకుండా విధులకు గైర్హాజరవుతుండటంతో రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ, డీసీహెచ్ఎస్ డాక్టర్ మాధవిలు ఇటీవల షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కొంత మంది నుంచి స్పందన లేకపోవడంతో త్వరలో ఉద్యోగం నుంచి తొలగించే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. -
కోసిగి మండలంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 12,770 కుటుంబాలు ఉన్నాయి. ఇందులో 5వేలకు పైగా కుటుంబాలు ఇప్పటికే వలసబాట పట్టాయి. ఆర్లబండ, దుద్ది, వందగల్లు, కోసిగి, ఐరన్గల్, పల్లెపాడు, చింతకుంట, కందుకూరు, చిరుతనగల్లు తదితర గ్రామాల నుంచి వందలాది కుటుంబాలు వలస వెళ
ఉపాధిలో ‘పచ్చ’పాతం ● రోజుకు లక్ష మందికి ఉపాధి కల్పించాలనేది లక్ష్యం ● 62వేల మందికి పనులు కల్పిస్తున్నట్లు లెక్కలు ● ఇందులో 50 శాతం వరకు దొంగ హాజరే ● సగటున కుటుంబానికి కల్పించిన పని దినాలు 37 మాత్రమే ● టీడీపీ నేతల కనుసన్నల్లో యంత్రాలతో పనులుయంత్రాలతో పనులు చేయిస్తున్న దృశ్యంగ్రామంలో పనుల్లేకనే వలస నేను, నా భార్య లక్ష్మి ఏడాది పొడవునా రెక్కల కష్టం మీదనే బతుకుతున్నాం. గ్రామంలో ఉపాధి పనులు పెడతారేమోనని ఎదురుచూశాం. వర్క్ ఐడీలు రాలేదన్నారు. ఇంకా ఆలస్యం కావచ్చన్నారు. దిక్కులేక పిల్లలతో పాటు వలస వెళ్లాం. – చిరంజీవి, కోతికొండ, తుగ్గలి మండలం పెట్టుబడి కూడా దక్కలేదు నాకు 5 ఎకరాల భూమి ఉంది. వర్షాధారం కింద పత్తి సాగు చేస్తున్నా. వర్షాభావం, అధిక వర్షాల వల్ల ఎకరాకు 3 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. పెట్టుబడి కూడా దక్కలేదు. స్థానికంగా ఉపాధి పనులు లేవు. భార్య, ముగ్గురు పిల్లలతో కలసి గుంటూరుకు వలస వెళ్లాం. – సుధాకర్, యాటకల్లు గ్రామం, ఆస్పరి మండలం యంత్రాలతో ఉపాధి పనులు ● వెల్దుర్తి, తుగ్గలి, మద్దికెర, దేవనకొండ, ఆస్పరి తదితర మండలాల్లో యంత్రాలతో ఉపాధి పనులు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ● ఇటీవలనే వెల్దుర్తి మండలంలోని ఓ గ్రామంలో యంత్రాలతో పనులు చేయిస్తుండగా సీపీఐ కార్యకర్తలు అడ్డుకోవడం కలకలం రేపింది. ● యంత్రాలతో పనులు చేయిస్తూ దొంగ మస్టర్లు వేసి ఉపాధి నిధులు కొల్లగొడుతుండటం గమనార్హం. ● నంద్యాల జిల్లాలోని డోన్ నియోజకవర్గంలో లేబర్తో చేయించాల్సిన పనులకు యంత్రాలు ఉపయోగిస్తున్నట్లు సమాచారం. కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయ సీజను ముగిసింది. ఉపాధి పనులకు సహజంగా జనవరి నుంచి మే నెల వరకు డిమాండ్ ఉంటుంది. ఈ సమయంలోనే 100 శాతం గ్రామాల్లో ఉపాధి పనులు కల్పించాల్సిన అవసరం ఉంది. అయితే సగం పంచాయతీల్లో ఉపాఽధి జాడ లేకపోవడంతో వేలాది కుటుంబాలకు బతుకు భారంగా మారింది. విధిలేని పరిస్థితుల్లో కటుంబ సభ్యులను వెంట తీసుకొని వలసబాట పడుతున్నారు. తుగ్గలి, పత్తికొండ, మద్దికెర, దేవనకొండ, మంత్రాలయం, కొసిగి, పెద్దకడుబూరు, హొళగుంద, హాలహర్వి, ఆలూరు, ఆదోని, ఆస్పరి మండలాలు అత్యల్ప వర్షపాతం ఉన్న మండలాలు. నంద్యాల జిల్లాలో ప్యాపిలి, డోన్, బేతంచెర్ల తదితర మండలాల్లోనూ ఇదే పరిస్థితి. ఈ మండలాల్లో వ్యవసాయం కష్టతరం కావడంతో వలసలు సర్వసాధారణం. గతంలో ఎప్పుడూ లేని విధంగా గత ఏడాది నవంబర్ నెల నుంచే వలసలు మొదలైనప్పటికీ ఉపాధి పనులు కల్పించడంలో జిల్లా యంత్రాంగం విఫలమైంది. 2024–25 సంవత్సరంలో ఉమ్మడి జిల్లాలో 1.71 కోట్ల పని దినాలు కల్పించాలనేది లక్ష్యం. ఆర్థిక సంవత్సరం మరో 35 రోజుల్లో ముగియనుంది. ఇప్పటి వరకు కేవలం 1.40 కోట్ల పని దినాలు మాత్రమే కల్పించారు. ఉమ్మడి జిల్లాలో 972 గ్రామ పంచాయతీలు ఉండగా అధికారుల లెక్కల ప్రకారం 90 శాతం పంచాయతీల్లో ఉపాధి పనులు కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవంగా 50 శాతం పంచాయతీల్లోనే ఉపాధి పనులు జరుగుతుండటం.. ఇది కూడా అరకొరగానే కావడం గమనార్హం. సగటున 37 కుటుంబాలకే ఉపాధి జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం కుటుంబాలు 8,87,652. నేటికి ఈ కుటుంబాల సంఖ్య 30 శాతం వరకు పెరిగి ఉంటుంది. 2024–25లో కర్నూలు జిల్లాలో కటుంబానికి సగటున 37 పని దినాలు మాత్రమే కల్పించినట్లు తెలుస్తోంది. నంద్యాల జిల్లాలో కుటుంబానికి 38 పని దినాలు కల్పించినట్ల స్పష్టమవుతోంది. ఉపాధి కల్పనలో ‘పచ్చ’పాతం ఉమ్మడి జిల్లాలో మొత్తం జనాభా 40.53 లక్షలు. ఇందులో రోజుకు 1.56లక్షల మందికి ఉపాధి కల్పించాలనేది లక్ష్యం. అయితే డిమాండ్ ఎక్కువగా ఉండాల్సిన సమయంలోనూ ఉపాధి 96 వేల మందికి మించని పరిస్థితి. కర్నూలు జిల్లాలో 62 వేలు, నంద్యాల జిల్లాలో 34 వేల మందికి మాత్రమే ఉపాధి లభిస్తోంది. ఇందులోనూ 50 శాతం వరకు బోగస్ హాజరు ఉంటోంది.ప్రస్తుతం ఉపాధి పనులు మొత్తం టీడీపీ నేతల కనుసన్నల్లో సాగుతున్నాయి. మొన్నటి వరకు కేవలం ఫీల్డ్ అసిస్టెంట్లు మాత్రమే ఉండగా.. నేడు ప్రతి గ్రామంలో ఐదారు శ్రమశక్తి సంఘాలు పుట్టుకు రాగా, ప్రతి సంఘానికి ఒక మేట్ ఉన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్, మేట్లు టీడీపీ కార్యకర్తలే. ఈ నేపథ్యంలో రాజకీయాలకు అతీతంగా ఉపాధి పనులు కల్పించాల్సి ఉన్నప్పటికీ ‘పచ్చ’పాతం చూపుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 11,052 కుటుంబాలకే 100 రోజుల పని ఉమ్మడి జిల్లాలో ఎన్ఆర్ఈజీఎస్ మార్గదర్శకాల ప్రకారం ఏడాదికి లక్ష కుటుంబాలకు 100 రోజుల పని కల్పించాల్సి ఉంది. ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరినప్పటికీ కర్నూలు జిల్లాలో ఇప్పటి వరకు 5,621 మందికి, నంద్యాల జిల్లాలో 5,431 కుటుంబాలకు మాత్రమే 100 రోజుల పని దక్కింది. సాధించిన ప్రగతి 19 శాతం మాత్రమే. మండలం కుటుంబాలు వంద రోజుల పని దక్కిన కుటుంబాలు గోనెగండ్ల 14,578 54 నందవరం 12,26668 క్రిష్ణగిరి 9,78074 -
నివాస గృహాల క్రమబద్ధీకరణ
నంద్యాల(అర్బన్): రెవెన్యూ శాఖ ఆక్షేపణ లేని ప్రభుత్వ భూముల్లో 2019 అక్టోబర్ 15 నాటికి ముందే ఏర్పాటు చేసుకున్న నివాస గృహాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా కలెక్టర్ రాజకుమారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హులైన వారు గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరు వరకు గడువు ఉందన్నారు. నాణ్యమైన విద్యుత్ అందించాలి ● ఏపీఈఆర్సీ చైర్మన్ ఠాగూర్ రామ్సింగ్నంద్యాల(అర్బన్): లో, హై ఓల్టేజీ సమస్యను అధిగమించి వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ను అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) చైర్మన్ ఠాగూర్ రామ్సింగ్ ఆదేశించారు. పట్టణంలోని 2020/132/33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్, 33/11 కేవీ ఇండోర్ సబ్ స్టేషన్లను శుక్రవారం ఆయన స్థానిక అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నంద్యాల 2020/132/ 33 కేవీ సబ్ స్టేషన్ లోని పవర్ ట్రాన్స్ఫార్మర్ సామర్థ్యం వంద ఎంవీఏ నుంచి 160 ఎంవీఏకు పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. నంద్యాల డివిజన్ పరిధిలో అధిక లోడు ఉన్న 33కేవీ ఫీడర్ నుంచి తక్కువ లోడు ఉన్న ఫీడర్కు లోడు డైవర్షన్ చేసేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. శిరివెళ్ల ప్రాంతంలో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. ఆయన వెంట ఎస్ఈలు మధుసూదనరావు, బాబు రాజేంద్ర, ఈఈ శ్రీనివాసులురెడ్డి, ప్రభాకర్, ఏడీ రమేష్కుమార్, ఏఈ రామయ్య ఉన్నారు. -
మా భూమి ఏమైంది మేడం!
● భూ రీ సర్వేలో లోపాలను కలెక్టర్కు వివరించిన రైతులుఉయ్యాలవాడ: భూ రీ సర్వే జరిగిన పొలాల విస్తీర్ణంలో తేడా వస్తుండటంతో పలువురు రైతులు కలెక్టర్ రాజకుమారి దృష్టికి తీసుకెళ్లారు. ఎస్.కొత్తపల్లె గ్రామంలో జరుగుతున్న భూముల రీ సర్వేను శుక్రవారం కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రీ సర్వే ద్వారా క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను పూర్తి స్థాయిలో ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్.కొత్తపల్లె గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్గా తీసుకుని 251 మంది రైతులకు చెందిన 973.40 ఎకరాల విస్తీర్ణంలో సర్వే ప్రారంభించడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు 613 ఎకరాల్లో సర్వే పూర్తయిందన్నారు. గ్రామానికి చెందిన నరసింహుడు అనే రైతు 98 సెంట్ల భూమి ఆన్లైన్లో నమోదు కాలేదని, మరో రైతు రవికుమార్ తనకు ఎకరా ఉంటే 92 సెంట్లు మాత్రమే చూపుతున్నారని, మిగులు 8 సెంట్ల భూమి ఎక్కడికి పోయిందని కలెక్టర్ ముందు వాపోయారు. అలాగే మరి కొంత మంది రైతులు విస్తీర్ణంలో కొలతల్లో తేడాలు వస్తున్నాయన్నారు. సర్వే నెంబర్ 141లో 8.79 ఎకరాల విస్తీర్ణంలో కొలతలు వేస్తుండగా క్షేత్రస్థాయిలో తేడాలు వున్నాయని మండల సర్వేయర్ విజయలక్ష్మి, తహసీల్దార్ శ్రీనివాసులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు కలెక్టర్ మాట్లాడుతూ రికార్డులలో ఉన్న వివరాలపై అవగాహన కల్పిస్తూ కొలతల్లో తేడాలు లేకుండా రైతులకు న్యాయం జరిగేలా రీ సర్వే చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా సర్వేయర్ జయరాజు, ఎంపీడీఓ ఉమామహేశ్వరరావు, ఆర్అండ్బీ డీఈ సునీల్రెడ్డి తదితరులు ఉన్నారు. ఉపాధి సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మండలంలో ఏ మేరకు పనులు జరుగుతున్నాయని, ఎంత మంది కూలీలు పనుల్లోకి వస్తున్నారని ఏపీఓ రవిప్రకాష్ను కలెక్టర్ ఆరా తీశారు. 1000 మంది కూలీలు ఉపాధి పనుల్లో పాల్గొనాల్సి వుండగా కేవలం ప్రతి రోజు 500 మంది హాజరవుతున్నట్లు ఏపీఓ చెప్పడంతో మండిపడ్డారు. కూలీల హాజరు పెంచాలని ఆదేశించారు. గ్రామాల్లో రహదారులకు ఇరువైపులా నాటిన మొక్కలను నిప్పంటించి పచ్చదనాన్ని నాశనం చేస్తున్న విషయాన్ని కలెక్టర్ గుర్తించి ‘మేరేమి చేస్తున్నారు’ అంటూ ఎంపీడీఓ ఉమామహేశ్వరరావు, ఏపీఓ రవిప్రకాష్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పచ్చని మొక్కలను నాశనం చేసిన వ్యక్తులను గుర్తించి వెంటనే వారికి నోటీసులు అందజేసి కేసులు నమోదు చేయాలని ఉపాధి, పోలీస్ శాఖను ఆదేశించారు. -
కృత్రిమ గర్భధారణతో మేలుజాతి దూడల ఉత్పత్తి
పగిడ్యాల: ఎదకొచ్చిన పశువులకు కృత్రిమ గర్భాధారణతో మేలు జాతి దూడలను ఉత్పత్తి చేసుకోవచ్చునని పశుసంవర్ధక శాఖ జిల్లా సంచాలకులు డాక్టర్ గోవిందనాయక్ అన్నారు. గురువారం నెహ్రూనగర్ పశుగణాభివృద్ధి ఉపకేంద్రం వద్ద గ్రామ సర్పంచ్ రాజేశ్వరి అధ్యక్షతన రాష్ట్రీయ గోకుల్ మిషన్ కింద లేగదూడల ప్రదర్శన కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్య అతిథిగా హాజరైన జేడీఏ మాట్లాడుతూ వ్యవసాయంతో పాటు రైతులు పాడి పరిశ్రమను అభివృద్ధి చేసుకోవడంతో లాభసాటిగా ఉంటుందన్నారు. ప్రతి రైతు ఒక ఆవును పెంచుకోవడంతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా 56 దూడలకు కాల్షి యం టానిక్ తాపించారు. లేగదూడల ప్రదర్శనలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థాయిలో నిలిచిన దూడల పశుపోషకులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఏపీఎల్డీఏ ఉప సంచాలకులు డాక్టర్ రాజశేఖర్, జూపాడుబంగ్లా డివిజన్ పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ రామాంజినాయక్, పశువైద్యులు డాక్టర్ రాగసంధ్య, శృతికీర్తి పాల్గొన్నారు. -
మోడల్ స్కూల్ ఆదర్శంగా నిలవాలి
గోస్పాడు: మోడల్ స్కూల్ అంటే ఫలితాలు, వస తుల్లో ఆదర్శంగా నిలవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. మండల కేంద్రంలోని ఏపీ మోడల్ స్కూల్ను గురువారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరిసరాలు, తరగతి గదులను శుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. ఆర్ఓ ప్లాంట్లో లీకేజీ సమస్యను గుర్తించి మరమ్మతులు చేయించాలని ప్రిన్సిపాల్ ఖాజా హుసేన్ను ఆదేశించారు. లైబ్రరీలో పుస్తకాలు తప్ప మిగతా సామగ్రి ఉంచొద్దని సూచించారు. పాఠశాలలో మిగిలిపోయిన స్కూల్ బ్యాగులను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అ టల్ టింకరింగ్ ల్యాబ్లో రైటింగ్ ప్యాడ్ కుర్చీలు లేకపోవడంతో మండిపడ్డారు. ల్యాబ్ గదులన్నింటికీ తాళాలు వేయకుండా క్రమం తప్పకుండా వినియోగంలోకి తేవాలన్నారు. భక్తులకు మెరుగైనవైద్య సేవలు అందించాలి గోస్పాడు: శ్రీశైల పాదయాత్ర భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలను సక్రమంగా నిర్వహించాలని డీఎంహెచ్ఓ వెంకటరమణ వైద్య సిబ్బందికి సూచించారు. గురువారం బైర్లూటీలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య శిబిరాలకు కేటాయించిన సిబ్బంది అప్రమత్తంగా ఉండి భక్తులకు వైద్యసేవలు అందించాలని సూచించారు. తీవ్ర అస్వస్థతకు గురైన భక్తులు వస్తే ఆసుపత్రికి తరలించాలని సూచించారు. పాదయాత్ర భక్తులు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.