NTR
-
వీఆర్ సిద్ధార్థలో ప్రయోగశాలకు రూ.20 లక్షల విరాళం
పెనమలూరు: కానూరు వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీ డీమ్డ్ టుబీ యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్(ఈసీఈ) విభాగంలో పరిశోధనలకు అత్యాధునిక ప్రయోగశాల ఏర్పాటుకు దాత రూ.20 లక్షల విరాళం అందజేశారు. కాలేజీలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో 1983 బ్యాచ్ పూర్వ విద్యార్థి పొట్లూరి భాస్కరమూర్తి తన తండ్రి పీజే మూర్తి పేరున యాంటీనా ఆర్ఎఫ్ ఇంజినీరింగ్ లేబొరేటరీలో మౌలిక సదుపాయాలు, అభివృద్ధికి విరాళం ఇచ్చారు. ఈ మేరకు చెక్కును వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీ డీమ్డ్ టుబీ యూనివర్సిటీ చాన్సలర్ కేవీ చౌదరికి అందజేశారు. సిద్ధార్థ అకాడమీ కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు మాట్లాడుతూ పరిశోధనలు, అభివృద్ధి సామర్థ్యం బలోపేతం చేయడానికి ప్రయోగశాల ఉపయోగపడుతుందన్నారు. పరిశ్రమలకు అనుగుణంగా విద్యార్థులు పరిశోధనలు చేస్తే ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. దాతలు ముందుకు వచ్చి సాయం అందిస్తే మరిన్ని ప్రయోగశాలలు విద్యార్థులకు సమకూర్చుతామన్నారు. కార్యక్రమంలో వైస్ చాన్సలర్ పి.వెంకటేశ్వరరావు, ప్రో వైస్ చాన్సలర్ డాక్టర్ ఏవీ రత్నప్రసాద్, డైరెక్టర్ బావినేని పాండురంగారావు, డీన్ డి.వెంకట్రావు పలువురు పాల్గొన్నారు. -
మందుల విక్రయాల్లో అప్రమత్తం
విజయవాడస్పోర్ట్స్: రోగులకు మాత్రమే మెడిసిన్స్ విక్రయించాలని, నిబంధనలు అతిక్రమించి అనర్హులకు మందులు విక్రయించిన మెడికల్ షాపు యజమానులపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్స్ చట్టం–1985, డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ చట్టం–1940 ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు హెచ్చరించారు. జిల్లాలోని మెడికల్ షాప్స్ అసోసియేషన్ ప్రతినిధులు, రాష్ట్ర స్టాక్ హోల్డర్స్, అపోలో, మెడ్ప్లస్ మేనేజర్లతో జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో కమిషనర్ మంగళవారం సమావేశమయ్యారు. షెడ్యూల్ డ్రగ్స్ విక్రయం, వినియోగం దుర్వినియోగం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చట్టాన్ని అతిక్రమించి, తప్పుడు ప్రిస్కిప్షన్తో మందులు విక్రయించడం అనేక నేరాలకు దారితీస్తోందని వివరించారు. ఎన్డీపీఎస్ చట్టంలో పొందుపర్చిన షెడ్యూల్ డ్రగ్స్ స్ట్రిప్స్పై ఎరుపు రంగు ఎన్ఆర్ఎక్స్ లేబుల్ ఉంటుందని, వీటి విక్రయాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. సామాజిక బాధ్యతగా తీసుకుని మెడిసిన్స్ విక్రయించాలని, నకిలీ పత్రాలతో మెడిసిన్స్ కొనుగోలు చేసే వ్యక్తుల వివరాలను, డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా మందులు తీసుకునే వ్యక్తుల సమాచారాన్ని వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. సమావేశంలో స్పెషల్ బ్రాంచ్ యాంటీ నార్కోటిక్ ఇన్చార్జ్ ఏసీపీ ఎస్.కిరణ్కుమార్, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ డైరక్టర్ అనిల్కుమార్, నార్కోటిక్ సెల్ ఇనస్పెక్టర్ రవికుమార్, ఈగల్ టీం ఎస్ఐ వీరాంజనేయులు, మెడికల్ షాప్స్ అసోసియేషన్ అధ్యక్షులు సాయి పాల్గొన్నారు. పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు -
హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఏపీ సమగ్ర శిక్షలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ , ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్లో మంగళవారం కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోరుతూ ఫెడరేషన్ ఆధ్వర్యాన నిరసన దీక్ష జరిగింది. కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ ఏవీ నాగేశ్వరరావు దీక్ష శిబిరాన్ని ప్రారంభించారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ సమగ్ర శిక్షలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలన్నారు. మినిమం టైం స్కేల్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి కల్యాణి మాట్లాడుతూ సమ్మె కాలపు ఒప్పందాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, వేతనాలు, సౌకర్యాలను మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాలన్నారు. పదఈ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు చేయాలన్నారు. గ్రాట్యూటీ, మెడికల్ సెలవులు – హెల్త్ కార్డులు, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని కాంట్రాక్ట్ పద్ధతికి మార్చాలన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు చెల్లించాలని, పార్ట్ టైం పదాన్ని పూర్తిగా తొలగించాలన్నారు. కొన్ని క్లస్టర్లలో సీఆర్పీలను తొలగించారని, తక్షణమే విధుల్లోకి తీసుకోవాలన్నారు. తమ సమస్యలు పరిష్కరించేవరకు పోరాడదామన్నారు. దీక్షలో కాంట్రాక్ట్ –ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ చైర్మన్ బి.కాంతారావు, ఆర్గనైజేషన్ సెక్రెటరీ జాన్ మోడీ, వైస్ చైర్మన్ వాసా శ్రీనివాసరావు, మహమ్మద్ రఫీ, ఉద్యోగులు పాల్గొన్నారు. కాంట్రాక్ట్ , ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ -
కార్మికుల భద్రతే రాష్ట్ర భద్రత
మధురానగర్(విజయవాడసెంట్రల్): కార్మికుల భద్రతతోనే స్వర్ణాంధ్రప్రదేశ్ కల సాకారం అవుతుందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. 54వ జాతీయ భద్రతా వారోత్సవాల సందర్భంగా పరిశ్రమలలో భద్రతపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని పరిశ్రమలు, కొండపల్లి ఇండస్ట్రీస్ అసోసియేషన్, ఇతర సంస్థలు బీఆర్టీఎస్ రోడ్డులో ఇండస్ట్రీయల్ సేఫ్టీపై వాక్థాన్ నిర్వహించాయి. కార్యక్రమంలో మంత్రి సుభాష్ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరించి భద్రతా వారోత్సవాలను ప్రారంభించారు. అనంతరం బెలూన్లను గాలిలోకి వదలి వారోత్సవాల ప్రాధాన్యతను వివరించారు. కార్మికులతో భద్రతా శపథం చేయించారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, ఏపీ డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ డి. చంద్రశేఖర్ వర్మ, ఎన్టీఆర్ జిల్లా ఫైర్ ఆఫీసర్ ఏవీ శంకరరావు, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లా డెప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఎం. శివకుమార్ రెడ్డి, కొండపల్లి ఇండస్ట్రీస్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొని భద్రత ప్రాముఖ్యతను వివరించారు. యాజమాన్యాల బాధ్యత.. అనంతరం సత్యనారాయణపురం రైల్వే కమ్యూనిటీ హాల్లో జరిగిన సమావేశంలో మంత్రి వాసంశెట్టి మాట్లాడుతూ యాజమాన్యాల చేతిలో కార్మికుల ప్రాణాలు ఉంటాయని యాజమాన్యాలు కార్మికుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. భద్రతా వారోత్సవాలలో భాగంగా నిర్వహించిన పోటీలలో విజేతలకు మంత్రి చేతుల మీదుగా బహుమతి ప్రదానం జరిగింది. కార్యక్రమంలో అసోసియేట్ ప్రతినిధి రామచంద్రరావు, రామ్స్ ప్లాంట్ హెడ్ ఆశిష్ కుమార్, కెసీపీ ప్లాంట్ హెడ్ మధుసూదన రావు, జాయింట్ చీఫ్ ఆఫ్ ఇన్స్పెక్టర్ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ ముగిసిన 54వ జాతీయ భద్రతా వారోత్సవాలు -
20లోగా ‘కర్మయోగి’ కోర్సులను పూర్తి చేయాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఆధునికతకు, ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగులు సమర్థంగా సేవలందించాలన్నా.. భవిష్యత్తు కార్యాచరణకు సర్వసన్నద్ధంగా ఉండాలన్నా నిరంతర అభ్యసన అవసరమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ అన్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వ సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ కర్మయోగి భారత్ అందించే ఆన్లైన్ కోర్సులను ఈ నెల 20వ తేదీలోగా పూర్తిచేసి, సర్టిఫికెట్లు పొందాలని అధికారులు, సిబ్బందికి కలెక్టర్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి కలెక్టర్ లక్ష్మీశ.. ఏపీ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (ఏపీఎస్డీపీఎస్) సలహాదారు ఎం.వెంకటేశ్వరస్వామితో కలిసి ఐగాట్ కర్మయోగి కోర్సులపై వివిధ శాఖల అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీశ మాట్లాడుతూ తాను కూడా ఇటీవల మూడు కోర్సులను పూర్తిచేశానని.. జిల్లా పరిధిలోని అన్ని శాఖల ఉద్యోగులు, సిబ్బంది ఈ కోర్సులను పూర్తిచేయాలన్నారు. సీఎఫ్ఎంఎస్తో అనుసంధానించిన మొబైల్ నంబర్తో సంబంధిత వెబ్సైట్లో లాగిన్ అయ్యి హార్ట్ ఇన్ గవర్నెన్స్, కోడ్ ఆఫ్ కాండాక్ట్ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఓరియెంటేషన్ మాడ్యూల్ ఆన్ మిషన్ లైఫ్ కోర్సులు పూర్తిచేయొచ్చన్నారు. మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని కూడా ఈ కోర్సులు పూర్తిచేయొచ్చని తెలిపారు. సర్టిఫికెట్ కోర్సుల వివరాలను వెంకటేశ్వరస్వామి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ మూడు కోర్సులను 90 నిమిషాల వ్యవధిలో చాలా తేలిగ్గా పూర్తిచేయడం ద్వారా కర్మ పాయింట్లు సాధించవచ్చని తెలిపారు. ఉత్తమ ప్రతిభ చూపిన కర్మచారిలకు రాష్ట్ర ప్రభుత్వం బ్యాడ్జెట్స్, రివార్డులు, సర్టిఫికెట్లతో పాటు సీఎం చేతుల మీదుగా నగదు బహుమతి కూడా ఉంటుందని వివరించారు. ఏపీఎస్డీపీఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అలపర్తి వెంకటేశ్వరరావు నేతృత్వంలో కోర్సుల పూర్తికి ఉద్యోగులకు సహాయసహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
సమస్యలు పరిష్కరించాలని ధర్నా
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రంలోని మునిసిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి ఎస్. వెంకటసుబ్బయ్య ప్రభుత్వాన్ని కోరారు. ఏపీ మునిసిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారానికి చలో విజయవాడ కార్యక్రమం జరిగింది. ధర్నా చౌక్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆసుల రంగనాయకులు, ఉప ప్రధాన కార్యదర్శి వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ నగరపాలక సంస్థలో వేలాదిమంది కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్నారు. థర్డ్ పార్టీ కాంట్రాక్టు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో 14 రోజులు సమ్మె సందర్భంలో కార్మికులను పర్మినెంట్ చేస్తామని ఇచ్చిన హామీ అమలు చేయాలన్నారు. ప్రతిపక్షంలో ఉంటే ఓ మాట, అధికారం వచ్చాక మరొక మాట సబబు కాదని ప్రభుత్వానికి హితవుపలికారు. అవుట్ సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులను పర్మినెంట్ చేయాలని, మూడు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న సరెండర్ లీవ్స్ నగదు చెల్లించాలని, డీఏలు విడుదల చేయాలని, జనాభా ప్రాతిపదికన అవుట్ సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులను పెంచాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోరుమామిళ్ల సుబ్బారాయుడు, గౌరవ సలహాదారులు నెక్కంటి సుబ్బారావు, వీఎంసీ ఉపాధ్యక్షులు బిందెల రవికుమార్, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కె. మల్లేశ్వరరావు, రాష్ట్ర అధ్యక్షుడు కోట మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. -
పీ4 సర్వేతో ప్రతి ఇంటికి లబ్ధి
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రభుత్వ, దాతల, ప్రజల భాగస్వామ్యం (పీ4) సర్వేతో ప్రతి ఇంటికి అభివృద్ధి, ప్రతి జీవితానికి ప్రగతి చేకూరుతుందని కలెక్టర్ డీకేబాలాజీ అన్నారు. ఆయన చాంబర్లో కార్యక్రమ వాల్పోస్టర్లను మంగళవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర దిశగా ముందడుగు వేస్తోందన్నారు. ఇందులో భాగంగా విలువైన అభిప్రాయాన్ని వెబ్సైట్ ద్వారా అందించడానికి ఈ నెల 25వ తేదీ వరకు ప్రజల భాగస్వామ్యం, సంప్రదింపు కాలపరిమితిగా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రజల తమ అభిప్రాయాలను తెలియజేయడానికి ముందుకు రావాలన్నారు. ఉగాది రోజున ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించనున్నారన్నారు. కార్యక్రమంలో జేసీ గీతాంజలిశర్మ, డీఆర్వో కె.చంద్రశేఖరరావు, సీపీవో గణేష్కృష్ణ, డీఐపీఆర్వో ఎం. వెంకటేశ్వరప్రసాద్ పాల్గొన్నారు. -
దేవినేనికి దిక్కేది?
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ఉమ్మడి కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీలో కొన్నేళ్లపాటు ఏకఛత్రాధిపత్యం చలాయించిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు ఇక రాజకీయంగా దిక్కెవరనే చర్చ ఆ పార్టీ వర్గాల్లో సర్వత్రా నడుస్తోంది. ఎమ్మెల్యేల కోటాలో శాసనమండలి సభ్యత్వం తప్పక దక్కుతుందని ఆశించి నామినేషన్ దాఖలుకు సిద్ధం చేసుకున్న దేవినేనికి చివరకు నిరాశ నిట్టూర్పులే మిగిలాయి. పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు ఆశీస్సులపై అంచనాలన్నీ క్రమంగా పటాపంచలవుతుండటంతో రాజకీయపరంగా దారీతెన్నూ తెలియని దిశకు చేరుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పదవి రాలేదన్న ఆవేదనను, ఆక్రోశాన్ని పంటిబిగువున దాచుకుంటూ కూడా తనదైన మార్కు మాటలతో తాజాగా ప్రతిపక్షాన్ని విమర్శిస్తుండటాన్ని చూసి పార్టీలోని ఆయన వ్యతిరేకులు ‘ఆడలేక మద్దెల ఓడు’ అన్న చందంగా ఆయన వ్యవహారం ఉందని ఎద్దేవా చేస్తున్నారు. సీనియర్ నాయకుడిగా అందరికీ మార్గదర్శకంగా ఉండాల్సిన ఉమా స్వయం కృతాపరాధాలే ఆయనకు శాపాలుగా మారాయని అనుభవజ్ఞులు అభిప్రాయపడుతుండటం పరిశీలనాంశం. అవకాశాలు మెండుగా.. సోదరుడు దేవినేని వెంకటరమణ అకాల మరణంతో రాజకీయాల్లోకి వచ్చిన ఉమా.. నందిగామ, మైలవరం నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, నీటిపారుదలశాఖ మంత్రిగా పని చేశారు. నిత్యం హడావుడి, ఆర్భాటాలతో, విమర్శలతో వ్యవహరించారన్నది విదితమే. ఆయన నాయకత్వంలో సీనియర్ నాయకులతో సఖ్యత విషయంలో ఎప్పుడూ పెటాకులే. కారణాలేవైనా కొడాలి నాని, వల్లభనేని వంశీ, కేశినేని నాని తదితర సీనియర్ నాయకులు టీడీపీని వీడటానికి ఉమానే ప్రధాన కారకుడనే విమర్శలు పార్టీ వర్గాల నుంచి వినిపించినవే. ఎన్నికల సమయంలో.. మొన్నటి సాధారణ ఎన్నికల సమయంలో దేవినేని పార్టీ అధినేతను, అధిష్టానాన్ని ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారని ప్రచారంలోకి రావడం, నాడు ఆయన వ్యవహార శైలి ఇప్పుడు ఆయనకు పదవి దక్కకపోవడానికి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. మైలవ రం సీటును వసంత కృష్ణప్రసాద్కు రూ.100 కోట్లకు అమ్ముకున్నారని.. ఇలాంటి వాటికి తోడు నందిగామ సీటు విషయంలో అనవసర రాద్ధాంతానికి కారకులయ్యారనే అపప్రద మూటకట్టుకున్నారని గుర్తుచేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు దేవినేని ప్రతిపక్షంతో చేతులు కలిపి వ్యాపార వ్యవహారాలూ కొనసాగించేవారనే ఫిర్యాదుల పరంపరతో పాటు ఆడియో, వీడియోలు సైతం అధిష్టానానికి పార్టీలోని ఆయన వ్యతిరేకులు చేరవేశారనే గుసగుసలు వినిపించాయి. మద్దతు కూడగట్టుకోలేక..ఢిల్లీ నుంచి పావులు కదిపినా.. ఉమాకు పదవి దక్కితే మైలవరం, నందిగామ నియోజవర్గాల్లోనే కాకుండా ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నియోజకవర్గాల్లోనూ వర్గాలను కూడగడతారని, లేనిపోని రాద్ధాంతాలు పునరావృతం అవుతాయని గతంలో జరిగిన ఉదంతాలను అధిష్టానం వద్ద, ముఖ్యంగా లోకేష్ వద్ద ఉదహరించినట్లు సమాచారం. ఉమాకు పదవి కేటాయించే విషయంలో మంత్రి లోకేష్ ససేమిరా అన్నట్లు ఆయన వ్యతిరేక వర్గం విస్తృతంగా ప్రచారం చేసింది. లోకేష్తో సన్నిహితంగా మెలుగుతున్న స్థానిక ఎంపీకి మరో రాజ్యసభ సభ్యుడు తోడై ఢిల్లీలో చక్రం తిప్పారని, అందువల్లే ఆగ ‘మేఘాల’పై కూటమిలోని మరో పార్టీ నాయకుడికి ఎమ్మెల్సీ పదవి దక్కిందని అంటున్నారు. దారీతెన్నూ తెలియని దిశలో మాజీ మంత్రి ఉమా ఎమ్మెల్సీ ఖాయమని బాబు సంకేతాలంటూ లీకులు పరిగణనలోనే లేదని చినబాబు వర్గీయుల ఎద్దేవా ఢిల్లీ కేంద్రంగా చక్రం తిప్పిన ఎంపీలు, ఎమ్మెల్యేలు స్వయంకృతాపరాధాలే ఉమాకు శాపాలంటున్న పరిశీలకులు దేవినేనికి జిల్లా పార్టీలో మద్దతుదారులు ఎవరనేది అటుంచితే వ్యతిరేకులు మాత్రం చెప్పుకోదగిన స్థాయిలో ఉండటం గమనార్హం. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తదితరులు బాహాటంగానే వ్యతిరేకిస్తుండగా ఉమ్మడి జిల్లాలోని ఇతర ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు ఆయనకు మద్దతుగా నిలుస్తున్న సందర్భాలు లేవనే చెప్పాలి. -
ఆయుర్వేదంలో విస్తృత పరిశోధనలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఆయుర్వేదంలో విస్తృత పరిశోధనలు జరగాలని వక్తలు పేర్కొన్నారు. మంగళవారం విజయవాడ ఐలాపురం హోటల్లో ఆయుర్వేద ప్రాంతీయ పరిశోధన సంస్థ, విజయవాడ, కేంద్రీయ ఆయుర్వేద విజ్ఞాన పరిశోధనా పరిషత్ సంయుక్త ఆధ్వర్యాన ప్రజారోగ్య సంరక్షణ పరిశోధన కార్యక్రమంలో భాగంగా పరిశోధకుల కోసం రెండు రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమం జరిగింది. దేశంలోని ఎంపిక చేసిన రాష్ట్రాల్లో వివిధ జాతులు, తెగలు, సమూహాల్లో ఆహార అలవాట్ల సమాచార సంగ్రహణపై శిక్షణ ఇస్తున్నట్లు ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ ఇన్చార్జి అసిస్టెంట్ డైరెక్టర్ బి. వెంకటేశ్వర్లు తెలిపారు. భిన్నప్రాంతాల్లో జాతిపరమైన, మతపరమైన ఆచారాల్లో ఉపయోగించే మొక్కలు, లోహాలు, ఖనిజాలు, జంతు ఉత్పత్తులు, ఇతర పదార్థాల సమాచార సంగ్రహణ అనే అంశాలపై శిక్షణ ఇస్తారన్నారు. డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ రబీనారాయణ వర్చువల్గా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ శిక్షణ కార్యక్రమాలు ఆయుర్వేద శాస్త్రంలో మరింత లోతుగా అవగాహన కల్పించేందుకు దోహదం చేస్తాయన్నారు. డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ నారాయణ శ్రీకాంత్, పమ్మి సత్యనారాయణశాస్త్రి, డాక్టర్ మృత్యుంజయరావు తదితరులు పాల్గొన్నారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాబుధవారం శ్రీ 12 శ్రీ మార్చి శ్రీ 2025 ఇఫ్తార్ సహరి (బుధ) (గురు) విజయవాడ 6.22 4.59 మచిలీపట్నం 6.21 4.58విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ లబ్బీపేట: గుణదలలోని మడోన డెఫ్ అండ్ డంబ్ పాఠశాల విద్యార్థులకు మంగళవారం కోవే స్వచ్ఛంద సంస్థ, గ్రోవెల్ సహకారంతో ట్యాబ్లను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అందజేశారు. ముగిసిన స్కౌట్ శిబిరం వన్టౌన్(విజయవాడపశ్చిమ): స్కౌట్ విద్యార్థులకు విజయవాడ పటమటలోని జెడ్పీ హైస్కూల్లో రాష్ట్ర స్థాయి రాజ్య పురస్కార్ పరీక్ష శిబిరం మంగళవారం ముగిసింది. దుర్గమ్మ సేవలో కేంద్ర బృందం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను కేంద్ర అధికారుల బృందం మంగళవారం దర్శించుకుంది. క్యాబినెట్ సెక్రటేరియట్ సెక్రటరీ వందన గుర్నాని, డెప్యూటీ సెక్రటరీ శ్వేత మొహంతి, డీపీఐఐటీ డెప్యూటీ సెక్రటరీ యశ్వసి ముండ్, నీతి అయోగ్ గాయత్రి పాండే అమ్మవారిని దర్శించుకున్నారు. రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలి లబ్బీపేట(విజయవాడతూర్పు): జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, యూపీహెచ్సీలకు వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని అన్నారు. ఆమె మంగళవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లోని ఆరోగ్య కేంద్రాలను సందర్శించారు. ఆయా ప్రాంతాల్లో రోగులకు అందిస్తున్న సేవలను పరిశీలించారు. అంతే కాకుండా మైలవరం–2 సచివాలయం పరిధిలో నిర్వహిస్తున్న హెల్త్ క్యాంప్ను తనిఖీ చేశారు. అక్కడ ఉన్న రోగులు, రక్తపరీక్షలు నిర్వహిస్తున్న తీరు, మందుల అందుబాటు వంటి అంశాలను పరిశీలించారు. అనంతరం అదే గ్రామంలో జరుగుతున్న ఎన్సీడీ–సీడీ సర్వేను ప్రత్యక్షంగా వీక్షించారు. చంద్రాల వైద్యాధికారి డాక్టర్ ఉనీత్ పాల్గొన్నారు. ఏపీకి చేరుకున్న మయన్మార్లో చిక్కుకుపోయిన వ్యక్తులు గన్నవరం: Ð]l$Ķæ$-¯éÃÆŠ‡ §ólÔèæ…ÌZ _MýS$P-MýS$-´ù-Ƈ$$¯]l B…{«§ýl-{ç³-§ól-ÔŒæMýS$ ^ðl…¨¯]l Hyýl$-VýS$Æý‡$ Ð]lÅMýS$¢Ë$ ¿êÆý‡™èl {糿¶æ$™èlÓ ^öÆý‡Ð]l™ø Ð]l$…VýS-âýæ-ÐéÆý‡… çÜ$Æý‡-„ìS-™èl…V> VýS¯]l²-Ð]lÆý‡… ÑÐ]l*-¯é-{Ôèæ-Ķæ*-°MìS ^ólÆý‡$-MýS$-¯é²Æý‡$. VýS$…r*Æý‡$ hÌêÏMýS$ ^ðl…¨¯]l Ð]l¬VýS$YÆý‡$, }M>-MýS$-âýæ…, Æ>f-Ð]l$…{yìl, Ñf-Ķæ$-Ðéyýl, {´÷§ýl$ª-r*-Æý‡$MýS$ ^ðl…¨¯]l Ð]l$Æø ¯]lË$-VýS$Æý‡$ ÑÑ«§ýl Hgñæ-±ÞË$ §éÓÆ> Ð]lÆŠ‡P ÒÝëOò³ E§øÅ-V>Ë$ °Ñ$™èl¢… Ð]l$Ķæ$-¯éÃÆŠ‡ ÐðlâêÏÆý‡$. Ð]lÇP…VŠæ ÒÝëÌS VýSyýl$Ð]l# ¡Ç-¯]l-ç³µsìæMîS Ððl¯]lMìSP Æ>MýS$…yé Ð]l$Ķæ$¯éÃ-ÆŠ‡-ÌZ¯ól íܦÆý‡-ç³yìl-´ù-Ķæ*Æý‡$. D ÑçÙ-Ķæ*°² VýS$Ç¢…-_¯]l A«¨-M>-Æý‡$Ë$ Hyýl$-VýS$రి ´ë‹Ü-´ù-ÆŠ‡tË$, ÒÝë-ÌS¯]l$ ÝëÓ«©¯]l… ^ólçÜ$MýS$° ¿êÆý‡™èl {糿¶æ$™èlÓ A«¨-M>-Æý‡$-ÌSMýS$ çÜÐ]l*-^éÆý‡… C^éaÆý‡$. çܵ…¨…-_¯]l MóS…{§ýl… Ð]l$Ķæ$-¯éÃÆŠ‡ A«¨-M>-Æý‡$-ÌS™ø çÜ…{ç³-¨…-ç³#Ë$ fÇí³ Hyýl$-VýS$-Ç° ¯]l*ÅÉìl-ÎÏMìS ¡çÜ$-MýS$-Ð]l-^éaÆý‡$. AMýSPyýl çÜÐ]l${VýS Ñ^é-Æý‡×æ A¯]l…-™èlÆý‡… Ð]l$…VýS-âýæÐéÆý‡… Æ>{† GƇ$$Ç…-yìlĶæ* ÑÐ]l*-¯]l…ÌZ VýS¯]l²-Ð]lÆý‡… ç³…í³…-^éÆý‡$. CMýSPyýl GƇ$$ÆŠ‡-´ù-ÆŠ‡tÌZ ÒÇ° VýS¯]l²Ð]lÆý‡… ïÜI ½Ò. ÕÐ]l-{ç³-Ý맊æ, G‹ÜI }«§ýl-ÆŠ‡Ë$ ÇïÜÐŒæ ^ólçÜ$-MýS$-¯é²Æý‡$. A¯]l…-™èlÆý‡… Hyýl$-VýS$-ÇÌZ I§ýl$-VýS$-Ç° ÐéÇ MýS$r$…º çÜ¿¶æ$Å-ÌSMýS$ Aç³µ-W…-^éÆý‡$. Æ>fÐ]l$…{yìl, {´÷§ýl$ªr*Æý‡$MýS$ ^ðl…¨¯]l Ð]lÅMýS$¢Ë¯]l$ º$«§ýlÐéÆý‡… Aç³µW…^èl¯]l$¯]l²r$Ï ïÜI ™ðlÍ´ëÆý‡$. కపట ‘కూటమి’ నాటకాలు ఇంకెన్నాళ్లు? వన్టౌన్(విజయవాడపశ్చిమ): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్యాదీవెన, వసతి దీవెన వంటి పథకాలకు నిధులు విడుదల చేయకపోవటంతో విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులపాలవుతున్నారు. ముఖ్యంగా దారిద్య్రరేఖకు దిగువున ఉన్న ప్రతి విద్యార్థికి విద్యాదీవెన, వసతి దీవెన పథకాలతో గత ప్రభుత్వం అండగా నిలచింది. వారి చదువుకు చెల్లించాల్సిన ఫీజులను ఎప్పటికప్పుడు వారి తల్లుల ఖాతాల్లో వేసి వారి చదువులకు భరోసా కల్పించింది. కానీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత ఆయా పథకాలకు నిధులు మంజూరు చేయలేదు. దాంతో ఫీజులు చెల్లించలేకపోవటంతో ఆయా కళాశాలలు ఆ విద్యార్థుల సర్టిఫికెట్లను తమ వద్దనే ఉంచుకుంటున్నాయి. ఉద్యోగాలు లేవు.. పరిశ్రమలు రావు.. ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఏటా వివిధ ఇంజినీరింగ్ కళాశాలల ద్వారా ఏటా 20 వేల మంది పట్టభద్రులు బయటకు వస్తున్నారు. అలాగే డిగ్రీ, పీజీలు చేసిన మరో 25 వేల మంది విద్యార్థులు పట్టాలు చేతపట్టి రోడ్లపైకి వస్తున్నారు. పాలిటెక్నిక్, బీఈడీ వంటి ఇతర కోర్సులను పూర్తి చేసిన యువత తమ అర్హత పత్రాలతో బయటకు చేరుకుంటున్నారు. ఆయా కళాశాలల్లో ప్లేస్మెంట్ల ద్వారా కేవలం పది నుంచి 20 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నా.. అవి అక్కరకు రావటం లేదు. కూటమి ప్రభుత్వ పాలనలో ఉద్యోగ అవకాశాలు పూర్తిగా కానరాకుండా పోవటంతో జిల్లాలోని యువకులు ఏదైనా చిన్న పరిశ్రమలను ఏర్పాటు చేసుకొని జీవించాలని భావిస్తున్నారు. కానీ ఎంఎస్ఎంఈలను ప్రొత్సాహించాల్సిన ప్రభుత్వం వాటిని సైతం యువతకు అందించేందుకు ఏమాత్రం చర్యలు చేపట్టడంలేదు. అంతేకాక చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వ్యాపారాలు పూర్తిగా దిగజారాయి. ఏ నెలకానెల జీఎస్టీ ఆదాయం తగ్గుతుండటం వ్యాపారాల దుస్థితిని తెలియజేస్తుంది. తద్వారా ప్రైవేటు ఉద్యోగాలు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. డీఎస్సీ కోసం ఎదురు చూపులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే డీఎస్సీ ప్రకటిస్తామంటూ, సంతకాలు చేశామంటూ హడావుడి చేసింది. కానీ ఇప్పటి వరకూ పోస్టులను విడుదల చేయకపోవటంతో జిల్లాలోనూ వేలాది మంది ఎదురు చూస్తున్నారు. 16 వేలకు పైగా పోస్టులకు డీఎస్సీ విడుదల చేస్తామని ఆశ చూపిన లోకేష్ ఇతర నాయకులు అవి ఎప్పుడు విడుదల చేస్తారో స్పష్టంగా చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దానికి తోడు జిల్లాలో ఏపీపీఎస్సీ గ్రూప్ –2 పరీక్షలకు హాజరైన 8,792 మంది అభ్యర్థులు సైతం ప్రభుత్వ తీరుపై మండి పడుతున్నారు. రోస్టర్ విధానంపై సరైన చర్యలు తీసుకోకుండా పరీక్షలు నిర్వహించటం ఏమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 7న్యూస్రీల్ సర్కారు వచ్చి తొమ్మిది మాసాలైన ఒక్క ఉద్యోగం ఇవ్వని వైనం వసతి, విద్యా దీవెనలకు నిధులు నిల్ సర్టిఫికెట్లను ఇవ్వకుండా వేధిస్తున్న కళాశాలలు అప్పుల పాలవుతున్న కుటుంబాలు డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది అభ్యర్థులు ఉద్యోగాలు లేక, ఎంఎస్ఎంఈ రాక అల్లాడుతున్న యువతరం యువతకు మద్దతుగా నేడు వైఎస్సార్ సీపీ ‘యువత పోరు’ యువతకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేడు యువత పోరు పేరుతో రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా విజయవాడలోని కోర్టుల కార్యాలయం నుంచి ప్రదర్శనగా కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని అక్కడ వినతిపత్రం ఇవ్వటం జరుగుతుంది. కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులతో పాటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. -
వీఆర్ సిద్ధార్థలో ప్రయోగశాలకు రూ.20 లక్షల విరాళం
పెనమలూరు: కానూరు వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీ డీమ్డ్ టుబీ యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్(ఈసీఈ) విభాగంలో పరిశోధనలకు అత్యాధునిక ప్రయోగశాల ఏర్పాటుకు దాత రూ.20 లక్షల విరాళం అందజేశారు. కాలేజీలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో 1983 బ్యాచ్ పూర్వ విద్యార్థి పొట్లూరి భాస్కరమూర్తి తన తండ్రి పీజే మూర్తి పేరున యాంటీనా ఆర్ఎఫ్ ఇంజినీరింగ్ లేబొరేటరీలో మౌలిక సదుపాయాలు, అభివృద్ధికి విరాళం ఇచ్చారు. ఈ మేరకు చెక్కును వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీ డీమ్డ్ టుబీ యూనివర్సిటీ చాన్సలర్ కేవీ చౌదరికి అందజేశారు. సిద్ధార్థ అకాడమీ కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు మాట్లాడుతూ పరిశోధనలు, అభివృద్ధి సామర్థ్యం బలోపేతం చేయడానికి ప్రయోగశాల ఉపయోగపడుతుందన్నారు. పరిశ్రమలకు అనుగుణంగా విద్యార్థులు పరిశోధనలు చేస్తే ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. దాతలు ముందుకు వచ్చి సాయం అందిస్తే మరిన్ని ప్రయోగశాలలు విద్యార్థులకు సమకూర్చుతామన్నారు. కార్యక్రమంలో వైస్ చాన్సలర్ పి.వెంకటేశ్వరరావు, ప్రో వైస్ చాన్సలర్ డాక్టర్ ఏవీ రత్నప్రసాద్, డైరెక్టర్ బావినేని పాండురంగారావు, డీన్ డి.వెంకట్రావు పలువురు పాల్గొన్నారు. -
యువజనోత్సవాల్లో సత్తాచాటిన కృష్ణా వర్సిటీ
కోనేరుసెంటర్(మచిలీపట్నం): అంతర విశ్వవిద్యాలయాల జాతీయ యువజనోత్సవాల్లో కృష్ణా యూనివర్సిటీ సత్తాచాటింది. కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలోని విజయవాడ పి.బి.సిద్ధార్థ కళాశాల విద్యార్థులు పాల్గొన్న ఆరు అంశాల్లోనూ ప్రతిభచాటారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం రెక్టార్ ప్రొఫెసర్ బసవేశ్వరరావు విజేతలకు పతకాలు, ప్రశంసపత్రాలు అందజేశారు. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ నోయిడాలోని ఎమిటీ వర్సిటీ ప్రాంగణంలో ఈ నెల మూడు నుంచి ఏడో తేదీ వరకు నిర్వహించిన క్లాసికల్, ఓకల్, ఇండియన్ గ్రూప్ సాంగ్, మెహందీ అంశాల్లో కృష్ణా వర్సిటీ తరఫున పీబీ సిద్ధార్థ కాలేజీ విద్యార్థులు ప్రతిభ చాటారు. క్లాసికల్ ఇన్స్ట్రుమెంటల్ (తంత్రీవాయిద్యం, పెర్కషన్) విభాగంలో ద్వితీయం, తంత్రీయేతర సంగీతవిభాగంలో తృతీయ, ఫోక్ ఆర్కెస్ట్రా గ్రూప్ సాంగ్లో తృతీయస్థానంలో నిలిచారు. పీబీ సిద్ధార్థ సంగీత విభాగంలో జాతీయస్థాయిలో మూడో స్థానంలో నిలిచింది. ఆరేళ్లుగా కృష్ణా యూనివర్సిటీ జాతీయ స్థాయి యువజనోత్సవాల్లో రాణిస్తోంది. గతంలో బెంగళూరులోని జైన్ యూనివర్సిటీలో, లూథియానాలోని పంజాబ్ అగ్రికల్చరల్ వర్సిటీలో జరిగిన అంతర విశ్వవిద్యాలయాల జాతీయ యువజనోత్సవ పోటీల్లో కూడా కృష్ణా వర్సిటీ పక్షాన సిద్ధార్థ ఓవరాల్ చాంపియన్గా నిలిచిందని కన్వీనర్ డాక్టర్ బి.జయప్రకాష్, కోఆర్డినేటర్ ఎం.శివరంజని తెలిపారు. విజేతలకు కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె.రాంజీ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ వేమూరి బాబూరావు, డీన్ ఆచార్య రాజేష్ సి.జంపాల, పీబీ సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేకా రమేష్, డెంటల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రామోజీ తదితరులు పాల్గొని విజేతలను అభినందించారు. -
అర్జీల పరిష్కారంలో అగ్రస్థానంలో నిలపాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ (పీజీఆర్ఎస్)కు ప్రజల నుంచి వచ్చే అర్జీల పరిష్కార నాణ్యతలో జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు అధికారులు కృషిచేయాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. కలెక్టరేట్లోని శ్రీపింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమ వారం పీజీఆర్ఎస్ జరిగింది. కలెక్టర్ లక్ష్మీశ, డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, గ్రామ/ వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి తదితరులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ పీజీఆర్ఎస్కు వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, నాణ్యతా ప్రమాణాల మేరకు పరిష్కరించడం ప్రధానమని పేర్కొన్నారు. అధికారులు అర్జీదారునితో నేరుగా మాట్లాడి, సమస్య పరిష్కారానికి కృషిచేయాలన్నారు. అర్జీల పరిష్కార నాణ్యతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారిస్తోందని, డివిజనల్, మండలస్థాయిలోనూ గ్రీవెన్స్డేను సమర్థంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. అర్జీల వెల్లువ పీజీఆర్ఎస్లో మొత్తం 152 అర్జీలు అందాయని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి అత్యధికంగా 60 అర్జీలు అందాయని పేర్కొన్నారు. శాఖల వారీగా డీఆర్డీఏకు సంబంధించి 16, పోలీస్ శాఖ 14, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ 13 అర్జీలు, పౌర సరఫరాలు, గృహ నిర్మాణం, సర్వే విభాగాలకు ఐదు చొప్పున, విద్య, పంచాయతీరాజ్ శాఖలకు నాలుగు చొప్పున, వైద్య ఆరోగ్యం, బ్యాంకింగ్ సేవలు, సాంఘిక సంక్షేమానికి మూడు చొప్పున, కళాశాల విద్య, ఆర్ అండ్ బీ, గ్రామీణ నీటి సరఫరాకు సంబంధించి రెండు చొప్పున అర్జీలు అందాయి. మిగిలిన అర్జీలు పశుసంవర్ధక శాఖ, ఏపీఈడబ్ల్యూఐడీసీ, జెడ్పీ, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం, ఉపాధి కల్పన, అడవులు, భూగర్భ జలాలు, ఐసీడీఎస్, మైనారిటీ, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ, ఖజనా తదితర విభాగాలకు ఒక్కో అర్జీ చొప్పున వచ్చాయి. వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ -
అంగన్వాడీలకు ‘నిర్బంధ శిక్ష’ణ
ఉయ్యూరు రూరల్: అంగన్వాడీ కార్యకర్తల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ‘చలో విజయవాడ‘ పేరిట ఆందోళన జరిగింది. ఈ ఆందోళనలో పాల్గొనకుండా అడ్డుకునేందుకు ఐసీడీఎస్ అధికారులు, పోలీసులు విశ్వప్రయ త్నాలు చేశారు. చివరకు పెద ఓగిరాల ఎంపీపీ పాఠశాలలో శిక్షణ, రివ్యూ సమావేశం నిర్వహించి మమ అనిపించారు. చలో విజయవా డకు అంగన్వాడీ కార్యకర్తలు వెళ్లకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా కృష్ణాజిల్లా కంకిపాడు ప్రాజెక్ట్ అధికారులు స్వామి భక్తిని చాటుకునేలా ఈ సమావేశం నిర్వహించారని ట్రేడ్ యూనియన్ నాయకులు బి.రాజేష్ విమర్శించారు. కంకిపాడు ప్రాజెక్టు పరిధిలో ఎనిమిది సెక్టర్లు ఉండగా, ఆకునూరు సెక్టార్ పరిధిలోని అంగన్వాడీలకు మాత్రమే సమావేశం నిర్వహించి ధర్నాకు వెళ్లకుండా అధికారం ముసుగులో అడ్డు కున్నారన్న ఆరోపణలు వినిపించాయి. ప్రతినెలా చివరిలో సమావేశం నిర్వహించి రిపోర్టులు సేకరించి సమీక్షలు చేయాల్సిన ఐసీడీఎస్ అధికారులు అందుకు విరు ద్ధంగా చలో విజయవాడ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు శిక్షణ, రివ్యూ పేరుతో అడ్డుకోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే సోమవారం ఉయ్యూరు మండలం ఆకునూరు సెక్టర్ రివ్యూ సమావేశాన్ని నిర్వహించామని కంకిపాడు ప్రాజెక్టు సీడీపీఓ బేబీ సుకన్య తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తల నుంచి నెలవారీ రిపోర్టులు సేకరించామని పేర్కొన్నారు. ప్రాజెక్టులో ఒక్క సెక్టారులోనే మీటింగ్ -
అదనపు పనులు చేయలేకపోతున్నాం సార్..
చిలకలపూడి(మచిలీపట్నం): ‘అదనపు చేయలేక పోతున్నాం సార్. మా శాఖలోనే రోజూ 54 యాప్లను ఓపెన్ చేసి, వాటిలో వివరాలు నమోదు చేయాల్సి ఉంది. ఇవికాక సచివాలయ పరిధిలో అదనపు పనులు అప్పగిస్తున్నారు. వీటితో మాకు పని భారం అధికమవుతోంది. మా పరిస్థితి అర్థం చేసుకుని న్యాయం చేయడి’ అంటూ సచివాలయ హెల్త్ సెక్రటరీలు కృష్ణాజిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీకి సోమవారం గోడు వినిపించారు. తమ శాఖ పరంగా ఉన్న యాప్లు, సర్వేలతో పాటు సచివాలయం పరంగా జేఆర్వో ట్యాగింగ్, హౌస్హోల్డ్ సర్వే, నాన్ ఏపీ రెసిడెన్స్ ఈ–కేవైసీ, ఫ్యామిలీ మైగ్రేషన్, అప్డేట్మొబైల్ నంబర్, ఆధార్ ఈ–కేవైసీ, చిల్డ్రన్ విత్ అవుట్ ఆధార్, పించన్ల సర్వేలతో పాటు ప్రస్తుతం పీ4 సర్వే చేయమంటున్నారని వివరించారు. ఈ సర్వేలు చేయాలంటే కష్టమవుతోందని కలెక్టర్ వద్ద వాపోయారు. తమ శాఖపరంగా ఆర్సీహెచ్, ఎన్సీడీ, ఎన్ఎల్ఈపీ, శానిటేషన్, ఎన్టీఆర్ వైద్యసేవ తదితర అంశాలతో కూడిన 54 యాప్లను రోజూ ఓపెన్ చేసి ఇంటింటికీ తిరిగి ఆయా వివరాలు తెలుసుకుని, వాటిని అప్లోడ్ చేస్తున్నామని వివరించారు. వీటితో పాటుగా సచివాలయ అడ్మిన్ల ద్వారా తమకు ఇతర శాఖలకు సంబంధించి సర్వేలను అప్పగిస్తున్నారని పేర్కొన్నారు. కేవలం వైద్య, ఆరోగ్యశాఖకు సంబంధించిన యాప్లను నిత్యం అప్లోడ్ చేయాలని, ఎటువంటి ఇతర శాఖల సర్వేలు చేయకూడదని వైద్య, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు జీఓ విడుదల చేసినప్పటికీ ఉన్నతాధికారుల ఆదేశాల కారణంగా ఇవి చేయాల్సి వస్తోందని వాపోయారు. సెలవు అడిగినా ఇవ్వటం లేదు తమ వ్యక్తిగత పనుల నిమిత్తం సెలవు అడిగినా వైద్యాధికారులు సెలవు ఇచ్చేది లేదని కఠినంగా చెబుతున్నారని హెల్త్ సెక్రటరీలు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఒక హెల్త్ సెక్రటరీ ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకుని కాలిలో ఉన్న రాడ్ తీయించుకునేందుకు సెలవు అడిగినా ఇవ్వడం లేదని వివరించారు. ఇటువంటి పరిస్థితుల్లో తాము ఈ సర్వేలు, యాప్లలో వివరాలు నమోదు చేయలేకపోతున్నామని పేర్కొన్నారు. సర్వేల పరంగా ప్రజల ఇళ్లకు వెళ్లినప్పుడు వివరాలు నమోదు చేయడానికి ఓటీపీలు అడిగితే వారు చెప్పటం లేదని వివరించారు. ప్రస్తుత సైబర్ నేరాలు జరుగుతున్న నేపథ్యంలో ఏ కుటుంబీకులు తమకు సహకరించటం లేదని, కొంత మంది ఇప్పుడు వద్దు తరువాత రమ్మంటూ తిరస్కరిస్తున్నారని పేర్కొన్నారు. ఒక్కసారి తమ గురించి ఆలోచించి న్యాయం చేయాలని వేడుకుంటు న్నామని కలెక్టర్ బాలాజీకి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై కలెక్టర్ బాలాజీ స్పందిస్తూ రాష్ట్ర ఉన్నతాధికారులతో చర్చించాల్సిన అంశమని, దీనిపై మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మా శాఖలోనే 54 యాప్ల్లో రోజూ వివరాలు అప్లోడ్ చేయాలి ఇవి కాక అదనంగా మాకు సర్వేలు అప్పగిస్తున్నారు అదనపు సర్వేలు చేయొద్దని జీఓ ఉన్నా పట్టించుకోవడం లేదు కృష్ణా జిల్లా కలెక్టర్ ఎదుట గోడు వినిపించిన హెల్త్ సెక్రటరీలు -
సుస్థిర ఆదాయం ఇచ్చే పంటలు సాగుచేయాలి
జి.కొండూరు: సుస్థిర, అధిక ఆదాయం ఇచ్చే పంటలను రైతులు సాగుచేస్తే ఆర్థికంగా బలో పేతమవుతారని రాష్ట్ర ఉద్యాన, పట్టు పరిశ్ర మల శాఖ డైరెక్టర్ డాక్టర్ కె.శ్రీనివాసులు సూచించారు. మైలవరం నియోజకవర్గంలో ఆయన సోమవారం పర్యటించారు. జి.కొండూరులోని టమాట, మైలవరం మండలం పుల్లూరులో మల్లెతోటలు, రెడ్డిగూడెం మండలం రంగాపురంలో మామిడితోటలు పరిశీలించారు. ఆయా గ్రామాల్లో రైతుల సమస్యలు, ధరల్లో తేడా, మార్కెటింగ్ ఇబ్బందులపై ఆరా తీశారు. ఉద్యాన పంటలకు ప్రభుత్వం అందించే రాయితీలు, డ్రిప్ ఇరిగేషన్, నాణ్యమైన దిగుబడులను పొందేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా సూక్ష్మసేద్య అధికారి పి.ఎం.సుభాని, ఎన్టీఆర్ జిల్లా ఉద్యాన అధికారి పి.బాలాజీ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఏపీ హంసా ఉమ్మడి కృష్ణా జిల్లా కార్యదర్శిగా రమా లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆంధ్రప్రదేశ్ హెల్త్ అండ్ మెడికల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ అసోసియేషన్ (ఏపీహంసా) ఉమ్మడి కృష్ణాజిల్లా కార్యదర్శిగా పి.వెంకట రమణ (రమా) నియమితులయ్యారు. విజయవాడలోని కొత్త ప్రభుత్వాస్పత్రిలో సోమవారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అరవ పాల్, కోశాధికారి వై. శ్రీనివాస్తో పాటు ఉమ్మడి కృష్ణా అధ్యక్షుడు వినుకొల్లు రామకృష్ణ, సిటీ అధ్యక్షురాలు జాలం సరోజిని, కార్యదర్శి బొమ్మగంటి రాంబాబు, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. కార్యద ర్శిగా నియమితులైన వెంకట రమణను అసోసియేషన్ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. స్టైపెండ్ పెంచాలని వెటర్నరీ విద్యార్థుల వినతి గన్నవరం: స్టైపెండ్ పెంచాలని ఎన్టీఆర్ పశువైద్య కళాశాల విద్యార్థులు చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఆందోళనలో భాగంగా విద్యార్థులు సోమవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశను కలిసి స్టైపెండ్ పెంచాలని వినతిపత్రం అందజేసి, తమ సమస్యలను విన్నవించుకున్నారు. మెడికల్, డెంటల్, ఆయుష్ విద్యార్థులకు రూ.25 వేల స్టైపెండ్ చెల్లిస్తున్న ప్రభుత్వం వెటర్నరీ విద్యార్థులకు రూ.7 వేలే ఇస్తోందని పేర్కొన్నారు. ఈ అరకొర స్టైపెండ్ చాలక ఇబ్బందులు పడుతున్నామని వివరించారు. మూగజీవాలకు వైద్య సేవలందించేందుకు వెటర్నరీ కోర్స్ అభ్యసిస్తున్న తమపై నిర్లక్ష్యం తగదన్నారు. ప్రభుత్వం స్పందించి రూ.15 వేలకు స్టైపెండ్ పెంచాలని కోరారు. విద్యార్థి నాయకులు పునీత్, భానుప్రకాష్, తిరుమల, లోహిత తదితరులు పాల్గొన్నారు. ఓపెన్ స్కూల్ పరీక్షలకు 539 మంది గైర్హాజరు వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఏపీ సార్వత్రిక విద్యాపీఠం నిర్వహిస్తున్న ఇంటర్మీడియెట్ పరీక్షలకు సోమవారం 539 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 17 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు 2496 మంది విద్యార్థులకు 1957 మంది హాజరయ్యారు. భౌతికశాస్త్రం, రాజనీతిశాస్త్రం, మనోవిజ్ఞానశాస్త్రం తదితర సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలు జరిగాయి. విద్యాపీఠం రాష్ట్ర సంచాలకుడు శివకోటేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా పాఠశాల విద్యాశాఖ అధికారి యు.వి.సుబ్బారావు పలు పరీక్ష కేంద్రాలను సందర్శించారు. -
సర్వేలతో ఉద్యోగుల్లో కలవరం
తిరువూరు: రాష్ట్రప్రభుత్వం క్షేత్రస్థాయి ఉద్యోగులపై సర్వేల పేరుతో తీవ్ర పనిభారం మోపుతోందని తిరువూరు డివిజన్లోని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. సచివాలయాలు, పంచాయతీలలో పని చేసే కార్యదర్శులు గ్రూప్–1, గ్రూప్–2 తదితర ఉద్యోగాల పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే నిమిత్తం సెలవుపై వెళ్లడంతో ఉన్న ఉద్యోగులపై అదనపు భారం పడుతోంది. ఉదయం ఆరు గంటలకు యాప్స్ తెరిచి హాజరు నమోదుచేయడంతో పాటు నిర్ణీత లక్ష్యం చేరుకునే వరకు సమయంతో పని లేకుండా పనిచేస్తూనే ఉండాలని అధికారుల ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇవికాక రోజు వారీ విధుల్లో పాల్గొనడం, సోమవారం పీజీఆర్ఎస్కు హాజరవడం, ఉన్నతాధికారుల జూమ్ కాన్ఫరెన్సులు, ఫోన్ కాన్ఫరెన్సులతో క్షణం తీరిక లేకుండాపోతోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాప్లకు సాంకేతిక లోపంతో ఓటీపీలు రాకపోవడం, సమాచారం నిక్షిప్తం కాకపోవడం, సర్వేకు వెళ్లిన ఇంటిలో కుటుంబసభ్యులు సమాధానం చెప్పడానికి నిరాకరించడం వంటి పలు సమస్యలు వెంటాడుతున్నాయని పేర్కొంటున్నారు. మండల కేంద్రానికి 30, 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలకు సర్వేకు వెళ్లిన సమయంలో అధికారుల సమీక్షలు, సమావేశాలకు పిలవడంతో దూరాభారమైనా పరుగులు పెట్టి రావాల్సి వస్తోందని గంపలగూడెం మండలంలోని ఉద్యోగులు చెబుతున్నారు. ఏ ఏ సర్వేలు చేయాలంటే.. పురపాలక శాఖలో ఎంఎస్ఎంఈ, ఇళ్ల జియోట్యాగింగ్, నాన్ ఏపీ కుటుంబాల వలస సర్వే, ఇతర శాఖల ఈకేవైసీ, వర్క్ ఫ్రం హోం ఈకేవైసీ, ఆధార్ లేని పిల్లల వివరాల సేకరణ, పీ4 సర్వేలు ఉద్యోగులను క్షణం తీరిక లేకుండా చేస్తున్నాయి. వైద్యా రోగ్య శాఖలో ఎన్సీడీలో 3.0, ఆర్సీహెచ్, ఇమ్యూనైజేషన్, ఫీవర్సర్వే, ఎన్ఎల్ఈపీ, శానిటేషన్ డ్రైడే ఫ్రైడేతో పాటు ఏఎన్ఎంలకు హెల్త్ యాప్లో రెగ్యులర్ సర్వేలు, యాంటినాటల్ విజిట్స్, కిశోరబాలికల 4డీ స్క్రీనింగ్ టెస్టులు కలిపి 70 సర్వేలు ఏకకాలంలో చేయాల్సి ఉంది. పంచాయతీరాజ్ శాఖలో పీ4 సర్వే, ఇంటి పన్నులు, కుళాయి పన్నుల వసూలు, ఖాళీ స్థలాలపై పన్నులను వసూలు చేసే బాధ్యతలు కూడా కార్యదర్శులపైనే ఉంచారు. పంచాయతీరాజ్, ఆరోగ్యశాఖలఉద్యోగులపై తీవ్ర వత్తిడి రోజుకు 80 ఇళ్లు సర్వే చేయాలని ఆదేశాలు సమయంలేక కుటుంబానికిదూరమవుతున్నామని ఆవేదన ఇంటికి వెళ్లేదెప్పుడు? అధికారులు ఉదయం 10.30 గంటలకు కార్యాలయానికి వచ్చి సాయంత్రం ఐదు గంట లకు ఇళ్లకు వెళ్లిపోతుండగా, క్షేత్రస్థాయి సిబ్బందికి మాత్రం వేళాపాళా లేకుండా విధులు అప్పగిస్తున్నారని పలువురు వాపో తున్నారు. పర్యవేక్షణ అధికారులు తమను తీవ్ర వత్తిడికి గురిచేస్తుండటంతో పలువురు ఉద్యోగులు సెలవుపై వెళ్లిపోతున్నారు. సర్వే లలో తలమునకలై తమ కుటుంబసభ్యులతో కనీసం కొద్దిసేపైనా గడిపే పరిస్థితి లేకుండా పోయిందని మహిళా ఉద్యోగులు కన్నీటి పర్యంతమవుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడినవారు, వృద్ధాప్యదశలో ఉన్న ఉద్యోగులు ఈ సర్వేలు చేయడంలో వెనుకబడుతుండటంతో అధికారులతో చీవాట్లు తినాల్సి వస్తోంది. -
వరిపై వేటు
చెరువుతో చేటు.. కవులూరు శివారులో అనుమతులు లేకుండా తవ్వుతున్న చేపల చెరువులు జి.కొండూరు: ఎన్టీఆర్ జిల్లాల్లో చేపల చెరువులు వేగంగా విస్తరిస్తున్నాయి. వరి సాగుకు అనుకూలంగా ఉన్నప్పటికీ అధిక లీజు ఆశ చూపుతుండడంతో రైతులు సాగు భూములను చేపల చెరువుల నిర్వహణకు ఇస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన వ్యాపారులు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఇరిగేషన్ చెరువులు, కాలువలను ఆనుకుని ఉన్న వందల ఎకరాల వ్యవసాయ భూములను లీజుకు తీసుకొని చెరువులు తవ్వుతున్నారు. ఈ చెరువుల తవ్వకానికి వివిధ శాఖల నుంచి అనుమతులు అవసరం. అయితే ఆ అనుమతుల కోసం కనీసం దరఖాస్తు కూడా చేయకుండా చెరువులను తవ్వేస్తున్నారు. ఇరిగేషన్ చెరువులు, పంట కాలువల్లో నీటినే చెరువులకు మళ్లించి చేపలను పెంచుతున్నారు. ఫలితంగా ఆయా చెరువులు, కాలువల కింద వరి సాగు చేస్తున్న భూములకు సాగునీటి సమస్య తలెత్తుతోంది. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు ఎటువంటి చర్యలూ తీసుకోపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో విస్తరిస్తున్న చెరువులు ఎన్టీఆర్ జిల్లాలో 13 మండలాల పరిధిలోని 22 గ్రామాల్లో 945.79 ఎకరాల విస్తీర్ణంలో 269 చెరువులను నిర్వహిస్తున్నారు. ఏడాదికి జిల్లాలో నిర్వహిస్తున్న ఈ చెరువుల నుంచి రెండు విడతలు కలిపి 1500 టన్నులకు పైగా చేపల ఉత్పత్తి జరుగు తున్నట్లు అధికారులు చెబుతున్నారు. 364 ఎకరాల విస్తీర్ణంలోని చెరువులకు మాత్రమే అనుమతులు ఉన్నాయి. 581 ఎకరాల విస్తీర్ణంలో చెరువులు అక్రమంగా సాగవుతున్నాయి. కవులూరులో.. జిల్లాలోని జి.కొండూరు మండల పరిధిలో అత్యధికంగా 238 ఎకరాల్లో 67 చెరువులను తవ్వారు. కవులూరు గ్రామ పరిధిలోనే 155.5 ఎకరాల విస్తీర్ణంలో 39 చెరువులు ఉన్నాయి. ఇక్కడ అనుమతులు లేకుండా కొత్తగా చెరువులు తవ్వుతున్నారు. గ్రామ శివారులో తొమ్మండ్రంవాగు, గుర్రాలవాగు ముంపు భూములు 150 ఎకరాల వరకు ఉండగా దీనిలో కొంత మేర రైతులు చేపల చెరువులకు లీజుకు ఇచ్చారు. ఈ చెరువుల తవ్వకం వల్ల మిగిలిన సాగుభూమి కూడా ముంపునకు గురవుతోంది. ఈ నేపథ్యంలో ఆ భూముల రైతులు కూడా చేసేదేమీలేక చేపల చెరువులకు లీజుకిస్తున్నారు. ఏడాదికి ఎకరాకు రూ.50 వేల వరకు లీజు ఇస్తున్న క్రమంలో రైతులు చెరువులకు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో చేపల చెరువులు వేగంగా విస్తరిస్తున్నాయి. కవులూరు గ్రామాన్ని ఆనుకుని ఉన్న పెద్ద చెరువు, తారకరామ ఎడమ, కుడి కాలువల్లో నీటినే ఈ చెరువులకు వినియోగిస్తున్నారు. దీనిపై ఆ గ్రామంలో సాగు చేస్తున్న రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. యథేచ్ఛగా అక్రమంగా చేపల చెరువుల తవ్వకం ఎన్టీఆర్ జిల్లాల్లో విస్తరిస్తున్న చేపల చెరువులు ఇరిగేషన్ చెరువులు, కాలువల జలాలు చేపల చెరువులకు మళ్లింపు చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం ఎన్టీఆర్ జిల్లాలో చేపల చెరువుల వివరాలుఇలా అనుమతులు పొందాలిచేపల చెరువు అనుమతి కోసం మొదట భూమి పత్రాలు, ఆధార్కార్డు, ఇతర వివరాలతో ఈ–మత్స్యకార యాప్లో దరఖాస్తు చేయాలి. ఈ దరఖాస్తును గ్రామ మత్స్యశాఖ అసిస్టెంట్ పరిశీలించి మండల కమిటీకి పంపుతారు. మండల కమిటీలో చైర్మన్గా ఉన్న తహసీల్దార్ భూమి వివాదాలను పరిశీలించి క్లియరెన్స్ ఇస్తారు. మండల వ్యవసాయాధికారి నుంచి చెరువు తవ్వుతున్న భూమి సారవంతం లేనందున లేక ముంపు లేక మరే ఇతర కారణాల వల్ల సాగుకు అనుకూలంగా లేనందునే చెరువులు తవ్వుతున్నట్లు అనుమతి పొందాలి. ఈ చెరువులకు సరిపడా నీటి వసతి కోసం సరిపడా భూగర్భజలాలు అందుబాటులో ఉన్నట్లు ఇరిగేషన్ శాఖ నుంచి అనుమతి పొందాలి. చెరువు తవ్వకం వల్ల పర్యావరణానికి ఎటువంటి ముప్పు వాటిల్లదని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి అనుమతి పొందాలి. మండల కమిటీలో దరఖాస్తు ఆమోదంపొందిన తర్వాత ఈ దరఖాస్తును జిల్లా కమిటీకి పంపుతారు. మండల కమిటీలో వివిధ శాఖల అధికారులు తెలిపిన ఆమోదాన్ని పరిశీలించిన జిల్లా కమిటీ, దరఖాస్తు దారుడు చెరువు తవ్వకానికి అర్హుడని భావిస్తే జిల్లా కమిటీ కూడా ఆమోదిస్తుంది. ఈ రెండు కమిటీలు ఆమోదం తెలిపిన తర్వాత చెరువుల తవ్వకానికి దరఖాస్తుదారుడు అక్వాకల్చర్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ను పొందుతాడు. అనుమతులు పొందాల్సిందే... చేపల చెరువులు తవ్వాలంటే అన్ని అనుమతులు ఉండాల్సిందే. ఇప్పటికే అనుమతులు లేకుండా తవ్విన చెరువులు నిబంధనలకు లోబడి ఉంటే అనుమతి కోసం దరఖాస్తు చేసుకునేలా అవగా హన కల్పిస్తున్నాం. అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా తవ్విన చెరువులను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ధ్వంసం చేసేందుకు కూడా వెనుకాడం. జిల్లాలో రీసర్క్యులేటరీ ఆక్వా కల్చర్ సిస్టమ్తో ఆక్వాకల్చర్ అభివృద్ధికి కృషి చేస్తున్నాం. – సీహెచ్ సౌభాగ్యచక్రాణి, ఎన్టీఆర్ జిల్లా మత్స్య శాఖ అధికారి -
నిత్యాన్నదాన పథకానికి రూ. లక్ష విరాళం
మోపిదేవి: స్థానిక శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవస్థానంలో నిత్యన్నదానానికి మచిలీపట్నంకు చెందిన సర్వా లలిత రూ. లక్ష విరాళంగా అందజేశారు. ఉదయం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. అనంతరం నిత్యన్నదానానికి విరాళాన్ని ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావుకు చెక్కు రూపంలో అందచేశారు. ఈ సందర్భంగా దాత కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో సత్కరించారు. ‘ఇంటర్’ పరీక్షకు 18,280 మంది హాజరు చిలకలపూడి(మచిలీపట్నం): ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం లెక్కలు, జువాలజీ, హిస్టరీ పరీక్షకు 18,280 మంది విద్యార్థులు హాజరైనట్లు ఇంటర్మిడియెట్ ప్రాంతీయ అధికారి పీబీ సాల్మన్రాజు సోమవారం తెలిపారు. ఈ పరీక్షకు 18,500 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 220 మంది హాజరుకాలేదన్నారు. ఒకేషనల్ కోర్సుకు సంబంధించి 672 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 642 మంది హాజరయ్యారన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 63 కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఆకస్మికంగా తనిఖీ చేశాయని ఎక్కడా మాల్ ప్రాక్టీస్ జరగలేదని సాల్మన్రాజు తెలిపారు. చికెన్ పాక్స్తో వ్యాపారి మృతి కోడూరు: చికెన్పాక్స్ (పొంగు జ్వరం)తో మండలంలోని మందపాకల గ్రామానికి చెందిన వ్యాపారి కోడూరు శ్యామ్ దుర్గాప్రసాద్ (43) ఆదివారం రాత్రి మృతి చెందాడు. దుర్గాప్రసాద్ ఐదు రోజులుగా చికెన్ పాక్స్ సోకడంతో తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాడు. నోటి నుంచి ఆహారం వెళ్లే పరిస్థితి లేకపోవడంతో కుటుంబీకులు స్థానిక ప్రైవేటు వైద్యుడితో వైద్యం చేయించారు. అయితే దుర్గాప్రసాద్ పరిస్థితి విషమంగా మారడంతో మృతిచెందినట్లు కుటుంబీకులు తెలిపారు. మందపాకల గ్రామంలో మృతుడు ఎరువు దుకాణంతో పాటు కిరాణా వ్యాపారం చేస్తాడు. దుర్గాప్రసాద్ మృతదేహాన్ని పలువురు రాజకీయ నేతలు, వర్తక, వ్యాపార సంఘాల ప్రతినిధులు సందర్శించి నివాళులర్పించారు. -
‘జేఎస్ఎస్బీ’ ప్రగతికి కృషి చేయాలి
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో జల్ సంచయ్ జన్ భాగీదరి (జేఎస్ఎస్బీ) కార్యక్రమాన్ని మరింత ముందు కు తీసుకెళ్లేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. సోమవారం కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన న్యూఢిల్లీ నుంచి వర్చువల్గా జల్శక్తి అభియాన్–క్యాచ్ ది రెయిన్, జల్ సంచయ్ జన్ భాగీదరిపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ వీసీకి జిల్లా కలెక్టరేట్ నుంచి డ్వామా, భూర్భ జలాలు, గ్రామీణ నీటి సరఫరా విభాగాల అధికారులతో కలిసి కలెక్టర్ హాజరయ్యారు. జల్ సంచయ్ జన్ భాగీదరి కింద అమలవుతున్న కార్యక్రమాలు, ప్రస్తుత స్థితిగతులు, భవిష్యత్ కార్యాచరణపై మంత్రి మార్గనిర్దేశం చేశారు. వీసీ అనంతరం కలెక్టర్ లక్ష్మీశ అధికారులతో మాట్లాడుతూ వర్షపు నీటి సంరక్షణపై ప్రతిఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరముందన్నారు. ‘ఒక రైతు–ఒక నీటి కుంట’ నినాదంతో ముందుకెళ్లాలన్నారు. జిల్లాలో 289 గ్రామ పంచాయతీల పరిధిలో 2,713 కుంటలు మంజూరయ్యాయని.. వీటి పనులు త్వరితగతిన పూర్తయ్యేలా అధికారులు కృషిచేయాలన్నారు. అదేవిధంగా 440 అంగన్ వాడీ కేంద్రాల్లో రూఫ్ టాప్ వాన నీటి సంరక్షణ నిర్మాణాలు మంజూరు కాగా వీటిలో ఇప్పటికే 100 పూర్తయినందున మిగిలిన వాటిని కూడా పూర్తిచేసేందుకు కృషిచేయాలన్నారు. గత నెల మూడో శనివారం పైలెట్ ప్రాజెక్టుగా 1,350 ఇంకుడు గుంతలు మంజూరు చేశామని.. జిల్లా అంతటా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారు. డ్వామా పీడీ ఎ.రాము, భూగర్భ జలాల డెప్యూటీ డైరెక్టర్ నాగరాజు, గ్రామీణ నీటి సరఫరా ఎస్ఈ విద్యా సాగర్ తదితరులు పాల్గొన్నారు. హెవీ వెహికల్ డ్రైవింగ్లో శిక్షణ పూర్తి లబ్బీపేట(విజయవాడతూర్పు): ది కృష్ణాజిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వ ర్యంలో నిర్వహిస్తున్న డ్రైవింగ్ స్కూల్లో హెవీ వెహికల్ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సోమవారం సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ చాంబ ర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ ముఖ్యఅతిథిగా పాల్గొని సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో రవాణా వ్యయం జి.డి.పి.లో 8 శాతమే ఉండగా, మన దేశంలో 14 శాతం ఉండటం వల్ల ఎగుమతుల పరంగా పోటీపడలేని స్థితి నెలకొందన్నారు. రహదారిపై వాహనం నడిపేవారు సమయ స్ఫూర్తి, ఓర్పు, సహనం ఎల్లవేళలా కలిగి ఉంటే రోడ్డు ప్రమాదాలకు ఆస్కారం ఉండదన్నారు. అసోసియేషన్ అధ్యక్షుడు నాగుమోతు రాజా, ఉపాధ్యక్షుడు కె.వి.ఎస్.చలపతిరావు, కార్యదర్శి రావి శరత్ బాబు, కోశాధికారి పొట్లూరి చంద్రశేఖరరావు, లారీ ఓనర్స్ కోఆపరేటివ్ స్టోర్స్ అధ్యక్షులు కోనేరు జగదీశ్వరరావు పాల్గొన్నారు. -
నేడు సామూహిక ఎలుకల నిర్మూలన
పోస్టర్లను ఆవిష్కరించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలోని వరి సాగు చేసే గ్రామాల్లో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో మంగళవారం సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సమగ్ర ఎలుకల యాజమాన్యం (రబీ 2025)పై రూపొందించిన ప్రత్యేక పోస్టర్లను సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీశ.. వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పొలాలు, గట్లపై సజీవ ఎలుక బొరియలను గుర్తించి, వాటిలో బ్రోమోడయోలోన్ మందు కలిపిన ఎరను 10 గ్రాములు చొప్పున వేసి మూసేయాల్సి ఉంటుందని వివరించారు. బ్రోమోడయోలోన్ ఎలుకల మందు కలిపిన ఎరను రైతులు గ్రామ వ్యవసాయ సహాయకుల (వీఏఏ) నుంచి ఉచితంగా పొందొచ్చన్నారు. పంటను కాపాడుకోవాలంటే ఒకేసారి అన్ని పొలాల్లోనూ సామూహిక ఎలుకల నిర్మూలన జరగాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో ఎం. లక్ష్మీనరసింహం, జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయకుమారి, డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, జిల్లా పశుసంవర్ధక అధికారి డాక్టర్ ఎం.హనుమంతరావు, గ్రామ వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
సారా తయారీదారుల అరెస్ట్
తిరువూరు: ‘సారా ఏరులు’ శీర్షికన సాక్షి దిన పత్రికలో సోమవారం వచ్చిన వార్తకు ఎకై ్సజ్ అధికారులు స్పందించారు. తిరువూరు సర్కిల్లో విస్తృత దాడులు చేశారు. గంపలగూడెం మండలం అమ్మిరెడ్డిగూడెంలో సారా కాస్తుండగా పెదగమళ్ల నరసింహారావు, కొత్తపల్లిలో పుప్పాల మోహనరావును తిరువూరు ఎకై ్సజ్ సీఐ శ్రీనివాస్ అరెస్టు చేశారు. కనుమూరులో పాత నేరస్తుడు జెర్రిపోతుల కోటేశ్వరరావును కూడా అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. విస్సన్నపేట మండలంలో కూడా సారా కాస్తూ పలుమార్లు పట్టుబడిన నరసాపురానికి చెందిన ఉమ్మడి రాంబాబు, బాణావతు బుజ్జి, కాటూరి చెన్నారావు, వేమిరెడ్డిపల్లి తండాలో అజ్మీర బాబూరావులను విస్సన్నపేట తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. నవోదయం 2.0లో భాగంగా సారా రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా గంపలగూడెం మండలం అమ్మిరెడ్డిగూడెం, కనుమూరు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సారా నిషేధానికి కృషి చేస్తామని గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. బెల్టుషాపులపై దాడి.. తిరువూరు పట్టణంలో అనధికారికంగా ఆంధ్రా, తెలంగాణ మద్యం విక్రయిస్తున్న పోతురాజు ధర్మ శ్రీను, గోపుల వినోద్కుమార్లను ఎకై ్సజ్ సీఐ శ్రీనివాస్ అరెస్టు చేశారు. రోలుపడిలో ఈడే భారతమ్మ వద్ద 10 మద్యం సీసాలు, గుమ్మా నాగమణి వద్ద 8 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో ఎకై ్సజ్ ఎస్ఐలు వెంకటకుమార్, కృష్ణవేణి, టాస్క్ఫోర్ ఎస్ఐ శేఖర్బాబు పాల్గొన్నారు. -
పాఠశాల విద్యార్థినులకు ఆత్మరక్షణలో శిక్షణ
విజయవాడస్పోర్ట్స్: ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులకు సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఆత్మరక్షణలో శిక్షణను ప్రారంభించినట్లు రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ ఫౌండర్ ఎన్.లక్ష్మీసామ్రాజ్యం తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలోని 314 పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు. విజయవాడ నగరం దుర్గాపురంలోని ఎస్టీవీఆర్ మునిసిపల్ హైస్కూల్లో ఈ శిక్షణను సోమవారం ప్రారంభించారు. జిల్లా కో ఆర్డినేటర్లు ఎం.అంకమరావు, పి.గౌరీశంకర్ పర్యవేక్షణలో విద్యార్థినులకు తైక్వాండోలో శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. సమగ్ర శిక్ష జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఒక్కో పాఠశాలలోని విద్యార్థినులకు 20 గంటల పాటు శిక్షణను ఇస్తామన్నారు. -
అంతర్జాతీయ అథ్లెటిక్స్ పోటీలకు మత్తి అరుణ
గూడూరు: ఏషియన్ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీలకు గూడూరు జెడ్పీ హైస్కూలు పీడీ మత్తి అరుణ ఎంపికయ్యారు. మాస్టర్ అథ్లెట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండి యా ఆధ్వర్యంలో బెంగళూరులో ఈనెల 4 నుంచి 9 వరకు నిర్వహించిన జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలో ఆమె ఆంధ్ర ప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఈ జాతీయ స్థాయిలో పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనపర్చిన మత్తి అరుణ రెండు పతకాలు సాధించి సత్తాచాటారు. 4’400 మీటర్స్ రన్నింగ్లో బంగారు పతకం, 4’100 మీటర్స్ రన్నింగ్లో కాంస్య పథకం సాధించారు. తద్వారా ఇండోనేషియాలో జరగబోయే ఏషియన్ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలకు ఎంపికయ్యారు. జాతీయ స్థాయిలో పతకాలు సాధించడమే కాకుండా అంతర్జాతీయ పోటీలకు ఎంపికై గూడూరు హైస్కూలు పేరు ప్రఖ్యాతులు మార్మోగేలా చేసిన మత్తి అరుణకు సోమవారం పాఠశాల విద్యాకుటుంబం ఘనస్వాగతం పలికింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు డి.పుష్పలత మాట్లాడుతూ మత్తి అరుణ పతకాలు సాధించడం పాఠశాలకు గర్వకారణమన్నారు. -
కారు ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి
గుడ్లవల్లేరు: కారు ఢీకొట్టడంతో ద్విచక్రవాహనదారుడికి బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందిన ఘటన అంగలూరు గ్రామ శివారులో చోటుచేసుకుంది. గుడ్లవల్లేరు ఎస్.ఐ ఎన్.వి.వి.సత్యనారాయణ చెప్పిన వివరాల మేరకు మండలంలో అంగలూరు గ్రామ శివారులో సోమవారం ఉదయం రోడ్డు పక్కన స్కూటీపై పెడనకు వాసిరెడ్డి వెంకటేశ్వరరావు(45) వెళ్తున్నాడు. ఆ స్కూటీని మచిలీపట్నం నుంచి గుడివాడ వైపు ఎదురుగా వస్తున్న కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటేశ్వరరావు తలకు బలమైన గాయమైంది. కాలు, చేతులకు కూడా గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ సత్యనారాయణ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి డ్రైవర్తో పాటు కారును అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ చెప్పారు. -
జిల్లా వ్యాప్తంగా దాతల సాయంతో చలివేంద్రాలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వేసవి లో ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. దాతల సహకారంతో జిల్లా వ్యాప్తంగా మజ్జిగ, తాగునీటిని సరఫరా చేసేలా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి విచ్చేసే సందర్శకులు, అధికారులు, సిబ్బందికి దాహార్తిని తీర్చేందుకు ఆపద్బాంధవులు ట్రస్ట్ సహకారంతో కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరం వద్ద మజ్జిగ సరఫరా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సోమవారం కలెక్టర్ లక్ష్మీశ ఆపద్బాంధవులు ట్రస్ట్ నిర్వహకుడు శ్రావణ్రెడ్డితో కలిసి మజ్జిగ కేంద్రా న్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా 286 గ్రామ పంచాయతీలు, 794 ఆవాసాల్లో 19 సమగ్ర రక్షిత నీటి సరఫరా పథకాలు, 366 రక్షిత నీటి సరఫరా పథకాలు, 63 చిన్న రక్షిత నీటి సరఫరా పథకాలు, 439 డైరెక్ట్ పంపింగ్ పథకాలు, 7,917 చేతి పంపులు ఉన్నాయని.. వీటితో పాటు 44 ప్రభుత్వ, 594 ప్రైవేట్ ఆర్వో ప్లాంట్స్ ద్వారా తాగునీటి సరఫరా జరుగుతుందని తెలిపారు. ఎద్దడి ఉన్న ఆవాసాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. బస్టాండ్లు, ఆసుపత్రులు, రహదారుల కూడళ్లు తదితర ప్రదేశాల వద్ద చలివేంద్రాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నామని, ఇందుకు అవసరమైతే దాతల సహకారం తీసుకోవాలని అధికారులకు సూచించామన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎం. నరసింహరావు, డీఎం అండ్హెచ్ఓ డాక్టర్ ఎం. సుహాసిని, డీఆర్డీఏ పీడీ కె. శ్రీనివాసరావు పాల్గొన్నారు. వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
పాఠశాల విద్యార్థినులకు ఆత్మరక్షణలో శిక్షణ
విజయవాడస్పోర్ట్స్: ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులకు సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఆత్మరక్షణలో శిక్షణను ప్రారంభించినట్లు రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ ఫౌండర్ ఎన్.లక్ష్మీసామ్రాజ్యం తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలోని 314 పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు. విజయవాడ నగరం దుర్గాపురంలోని ఎస్టీవీఆర్ మునిసిపల్ హైస్కూల్లో ఈ శిక్షణను సోమవారం ప్రారంభించారు. జిల్లా కో ఆర్డినేటర్లు ఎం.అంకమరావు, పి.గౌరీశంకర్ పర్యవేక్షణలో విద్యార్థినులకు తైక్వాండోలో శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. సమగ్ర శిక్ష జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఒక్కో పాఠశాలలోని విద్యార్థినులకు 20 గంటల పాటు శిక్షణను ఇస్తామన్నారు. -
నిరంతరాయంగా విద్యుత్ సరఫరాకు చర్యలు
మచిలీపట్నంటౌన్: జిల్లాలో ఎటువంటి అంతరాయం లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఏపీ సీపీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ ఎం. సత్యానందం అన్నారు. జిల్లా పరిషత్ సమావేశపు హాలులో విద్యుత్ శాఖాధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఎస్ఈ మాట్లాడుతూ రాబోయే వేసవి కాలంలో విద్యుత్కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి వినియోగదారుడికి నాణ్యమైన విద్యుత్ అందించాలన్నారు. అలాగే మార్చి నెలకు సంబంధించి ఈ నెల 25వ తేదీలోపే నూరుశాతం బిల్లులు చెల్లించేలా చూడాలన్నారు. వినియోగదారునికి బిల్లు ఇచ్చిన 15 రోజుల్లోగా చెల్లింపులు చేసేలా వారికి అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో విద్యుత్శాఖ జి. గోవిందరావు, డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ తదితరులు పాల్గొన్నారు. -
అయోమయం.. అగమ్యగోచరం
ప్రశ్నార్థకంగా ‘ఓపెన్’ విద్యార్థుల భవిష్యత్తుమధురానగర్(విజయవాడసెంట్రల్): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేసి ఈ విద్యాసంవత్సరం నుంచి అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. విజయవాడలోని ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రాంతీయ అధ్యయన కేంద్రం వద్ద సోమవారం విద్యార్థులు యూనివర్సిటీ సేవలు రాష్ట్రంలో కొనసాగించాలని కోరుతూ నిరసన ధర్నా నిర్వహించారు. సేవలు నిలిపివేత.. పలువురు విద్యార్థులు మాట్లాడుతూ విభజన చట్టం ప్రకారం పదేళ్లు పూర్తయిన దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూనివర్సిటీ సేవలు అకస్మాత్తుగా నిలిపివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో యూనివర్సిటీలో నమోదు చేసుకుని కోర్సులు పూర్తికాని సుమారు రెండు లక్షల మంది విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. ఇంకొక సెమ్ పూర్తయితే చేతికి డిగ్రీ పట్టా వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్న తమకు అసలు పరీక్షలు జరుగుతాయో లేదో డిగ్రీ చేతికి వస్తుందో రాదో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీని రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. అధికారులు చొరవ చూపితే.. ఏటా సుమారు 35 వేల మంది ఓపెన్ యూనివర్సిటీ ద్వారా విద్యనభ్యసిస్తున్నారని ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల విద్యార్థులకు డిగ్రీ దూరమయ్యే ప్రమాదం ఉందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా అధికారులు చొరవ తీసుకుని రాష్ట్రంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి వీసీని నియమించి అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. మొత్తం విద్యార్థులలో 90 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులు, 48 శాతం మహిళలు ఉన్నారని తెలిపారు. అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ సేవలను నిలిపివేసిన తెలంగాణ విజయవాడ ప్రాంతీయ అధ్యయన కేంద్రం వద్ద విద్యార్థుల నిరసన ఏపీలో యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ డిగ్రీ చేసే అవకాశం పోతోంది.. నేడు ఏ చిన్న ఉద్యోగం చేయాలన్నా డిగ్రీ కావాల్సి ఉంది. ఉద్యోగం చేసుకుంటూ, ఇంట్లో వారిని ఒప్పించి మరీ డిగ్రీ చేసేందుకు చదువుకుంటున్నా. ఇప్పటికీ 5 సెమ్లు పూర్తయి ఆరో సెమ్ జూన్ జూలై నెలలో నిర్వహించాల్సి ఉంది. ఈ తరుణంలో తెలంగాణ ప్రభుత్వం ఏపీలో తమ సేవలు నిలిపివేసినట్లు ప్రకటించటంతో పరీక్షలు జరుగుతాయో లేదో తెలియటం లేదు. అడ్మిషన్ నోటిఫికేషన్ కూడా ఇవ్వక పోవటంతో ఇంట్లో ఉంటూ డిగ్రీ పూర్తి చేయాలని అనుకునే వారికి ఆ అవకాశం కోల్పోయే ప్రమాదం ఉంది. – కె.అనిత, అజిత్సింగ్నగర్ -
వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్ డిస్మిస్
విజయవాడ: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని మరోసారి విచారించేందుకు తమ కస్టడీకి ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్ ను విజయవాడ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు తోసిపుచ్చింది. పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ ను డిస్మిస్ చేసింది కోర్టు. అదే సమయంలో వంశీ బెయిల్ పిటిషన్ పై విచారణను ఈ నెల 12 వ తేదీకి వాయిదా వేసింది కోర్టు.ఈ కేసు విచారణలో భాగంగా కౌంటర్ దాఖలు చేసేందుకు సత్యవర్థన్ తరపు న్యాయవాది రెండు రోజులు సమయం కోరారు. దాంతో బెయిల్ పిటిషన్ పై విచారణను 12కు వాయిదా వేసింది కోర్టు. అదే సమయంలో వల్లభనేని వంశీ ఉంటున్న బ్యారక్ మార్చాలని దాఖలు చేసిన పిటిషన్ పై కూడా విచారణ జరిగింది.అయితే ఇతర ఖైదీలు ఉంటున్న బ్యారక్ లోకి వంశీని మార్చడం కుదరదని జైలు అధికారులు కోర్టుకు తెలిపారు. భద్రతా కారణాల రీత్యా బ్యారక్ మార్చలేమని జైలు అధికారులు స్పష్టం చేశారు. కాగా, మెత్తటి దిండు, దుప్పటి కావాలని వంశీ కోరగా, అందుకు జైలు అధికారులు అంగీకరించారు. కాగా, జైలు బ్యారక్లో తనను ఒంటరిగా ఉంచారని గత నెల చివర్లో పిటిషన్ దాఖలు చేశారు వంశీ. భద్రతాపరంగా తనకు ఇబ్బంది లేనప్పటికీ అందరూ ఉన్న సెల్లోకి తనను మార్చాలని కోరారు.సీసీ ఫుటేజ్ను భద్రపరచండితన భర్త అరెస్టు అక్రమమని తేల్చేందుకు అవసరమైన సీసీ ఫుటేజ్ ను భద్రపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ వల్లభనేని వంశీ భార్య.. హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. సీసీ ఫుటేజ్ను భద్రపరచాలంటూ పోలీసుల్ని ఆదేశించింది హైకోర్టు. -
ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరు ప్రకటన
విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్ ఎన్డీయే కూటమి ఎమ్మెల్సీ చివరి అభ్యర్థి పేరును ప్రకటించారు. బీజేపీ తరఫున పార్టీ సీనియర్ నేత సోము వీర్రాజు పేరును ఖరారు చేశారు. తద్వారా గత ఎన్నికల టైం నుంచి పార్టీలో కొనసాగుతున్న లుకలుకలకు అధిష్టానం చెక్ పెట్టే ప్రయత్నం చేసింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల టైంలో.. చంద్రబాబు తన మార్క్ రాజకీయం నడిపించారు. ఒరిజినల్ బీజేపీ నేతలకు సీట్లు దక్కకపోవడంతో సంఘ్పరివార్ నేతలు బహిరంగంగానే అసంతృప్తి వెల్లగక్కారు. ఎమ్మెల్యే, ఎంపీ సీటు దక్కుతుందని ఆయన ఆశించినా.. అది నెరవేరలేదు. సామాజిక సమీకరణాలను కూడా పట్టించుకోకపోవడంతో బీజేపీ అధిష్టానం తప్పు చేసిందనే చర్చ విపరీతంగా నడిచింది. అయితే ఆ తప్పును వీర్రాజు ఎంపిక ద్వారా అధిష్టానం ఇప్పుడు సరిద్దుకున్నట్లు కనిపిస్తోంది. తొలుత ప్రచారంలో చాలామంది పేర్లు వినిపించినప్పటికీ.. సోము వీర్రాజు వైపే అధిష్టానం మొగ్గు చూపింది. సినియారిటీకి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు పవర్ బ్యాలెన్స్ చేసేందుకు ఆయన సామాజిక వర్గాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. ఇవాళ ఆయన నామినేషన్ దాఖలు చేస్తారని సమాచారం. ఏపీలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఉండగా.. మూడు టీడీపీ తీసుకుంది. ఒకటి జనసేన(కొణిదెల నాగబాబు), మరొకటి బీజేపీకి కేటాయించింది. -
‘డౌన్ డౌన్ చంద్రబాబు.. మా సత్తా ఏంటో చూపిస్తాం’
ఎన్టీఆర్ జిల్లా, సాక్షి: వేతనాల పెంపు డిమాండ్తో అంగన్వాడీలు చేపట్టిన విజయవాడ మహా ధర్నా.. కూటమి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో మారుమోగుతోంది. చంద్రబాబూ.. డౌన్ డౌన్.. కూటమి సర్కార్కు మా సత్తా ఏంటో చూపిస్తామంటూ నినాదాలతో విజయవాడ మారుమోగుతోంది. అంతకు ముందు.. ఛలో విజయవాడ ధర్నాను అడ్డుకునేందుకు శతవిధాల ప్రయత్నించారు. ఎక్కడికక్కడే అడ్డుకునేందుకు తనిఖీలు నిర్వహించారు. అయినప్పటికీ రాష్ట్రం నలుమూలలా నుంచి అంగన్వాడీలు తరలి వచ్చారు. వేతనాల పెంపు సహా పలు సమస్యల పరిష్కార డిమాండ్లతో అంగన్వాడీలు సోమవారం (మార్చి 10న) ఛలో విజయవాడ ధర్నా నిర్వహించ తలపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విజయవాడ వెళ్లే అన్ని మార్గాలను పోలీసులు తమ గుప్పిట పెట్టుకున్నారు. అంగన్వాడీలను ఎక్కడికక్కడే అడ్డుకుంటూ నిరంకుశంగా వ్యవహరించారు. కానీ.. 👉టియర్ గ్యాస్ వాహనంతో..పోలీసుల వలయం దాటి.. విజయవాడకు ఇప్పటికే భారీగా చేరుకున్న అంగన్వాడీలు మహా ధర్నాకు సిద్ధమయ్యారు. అలంకార్ సెంటర్కు అంగన్వాడీలు చేరుకోవడంతో.. పోలీసులు అలర్ట్ అయ్యారు. భారీ సంఖ్యలో మహిళా పోలీసులు, సిబ్బంది మోహరించారు. రోడ్డు బ్లాక్ చేసి ఎవరిని ముందుకు కదలనివ్వడం లేదు. ఈ క్రమంలో.. టియర్ గ్యాస్ వాహనం సైతం అక్కడ కనిపించడం గమనార్హం. అయితే ధర్నాను అడ్డుకుంటే తమ సత్తా చూపిస్తామంటూ అంగన్వాడీలు చెబుతున్నారు.👉రైళ్లోంచి బలవంతంగా.. అనంతపురం నుంచి అంగన్వాడీలు రైలులో విజయవాడకు బయల్దేరారు. అయితే..వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల స్టేషన్లో కార్యకర్తలతో పోలీసులు అమానుషంగా వ్యవహరించారు. బలవంతంగా వాళ్లను బయటకు దించేశారు. ఈ క్రమంలో చంద్రబాబు డౌన్.. డౌన్ నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది.👉మచిలీపట్నం మూడు స్తంభాల సెంటర్ లో పోలీస్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ప్రతి వాహనాన్ని.. ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. -
‘యువతను నమ్మించి దగా చేసిన చంద్రబాబు సర్కార్’
సాక్షి, విజయవాడ: ఈ నెల 12న వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పార్టీ అధినేత జగన్ పిలుపు మేరకు ఫీజు పోరు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ తెలిపారు. విద్యార్థులకు అండగా ఉండాలని ఫీజు పోరు, యువత పోరు కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. విద్యార్థులను నమ్మించి కూటమి ప్రభుత్వం మోసం చేసిందని.. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తుందని అవినాష్ మండిపడ్డారు.‘‘జగన్ హయాంలో ఉన్నత విద్యను అందించి పథకాలు అమలు చేసింది. కూటమి ప్రభుత్వం విద్యార్ధుల జీవితాలను నాశనం చేసింది. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజల జీవితాలను నాశనం చేసారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి మోసం చేశారు. జగన్ తెచ్చిన పథకాలు అమలు చేసి ప్రజలకు మంచి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. 12వ తేదీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆన్ని గ్రామాల్లో, పట్టణాల్లో కార్యక్రమాలు చేపడతాం’’ అని అవినాష్ తెలిపారు.కూటమి ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం: స్వామిదాస్మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్ మాట్లాడుతూ, విద్యా వ్యవస్థను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. పేదలకు విద్యను దూరం చేయాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. ‘‘విద్యతోనే సముల మార్పు సాధ్యం.. దీనికి వ్యతిరేకంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. జగన్ పిలుపు మేరకు 12వ తేదీన ఫీజు పోరు చేస్తున్నాం. మెడికల్ కాలేజీలను అమ్ముకొని కార్పొరేట్లకు ఊడిగం చేయాలని ప్రయత్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా తప్పులు సరిచేసుకోవాలి. సూపర్ సిక్స్ పథకాలకు దిక్కులేదు. విద్యా దీవెన, వసతి దీవెన, తల్లికి వందనం పథకాలు మాయం చేశారు. కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారాలు మానుకొని వాస్తవాలు ఒప్పుకోవాలి’’ అని ఆయన హితవు పలికారు.మెడికల్ కాలేజీలను అమ్ముకుంటున్నారు: మొండితోక జగన్మోహన్రావుమాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు మాట్లాడుతూ.. వైఎస్సార్, జగన్ హయంలో పేద ప్రజలు ధీమాగా ఉండేవారు. చదువు విషయంలో బెంగ పడేవారు కాదు. జగన్ మంచి చేస్తారనే నమ్మకం వారిలో ఉండేది. మెడికల్ కాలేజీలను అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. తప్పులు బయటపడతాయని వైఎస్సార్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వటం లేదు. చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు’’ అని జగన్మోహన్రావు హెచ్చరించారు. -
మహిళా సాధికారతతోనే సమాజం అభివృద్ధి
భవానీపురం(విజయవాడపశ్చిమ): మహిళా సాధికారతతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, నగర పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీదుర్గామల్లేశ్వర మహిళా కళాశాల విద్యార్థినులతో కలిసి వారు డప్పు వాయించి ఆకట్టుకున్నారు. మహిళా లబ్ధిదారులకు ఆటోలు, బైక్లు అందజేశారు. వివిధ రంగాలలో విశిష్ట సేవలను అందిస్తున్న మహిళా అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. నేటి తరం మహిళలు ప్రపంచాన్నే శాసించే స్థాయికి ఎదగటం శుభపరిణామమన్నారు. మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు జిల్లాలోని అన్ని విభాగాలు సమష్టిగా ముందుకు సాగుతున్నాయని చెప్పారు. సీపీ రాజశేఖరబాబు మాట్లాడుతూ.. మహిళల రక్షణ కోసం పోలీస్ యంత్రాంగం వినూత్న కార్యక్రమాలను చేపడుతోందన్నారు. నగరంలో మహిళలు స్వేచ్ఛగా, సురక్షితంగా జీవించేందుకు అనుకూల పరిస్థితులను కల్పించడమే లక్ష్యంగా పోలీస్ శాఖ పని చేస్తోందని చెప్పారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, డీఎంఅండ్హెచ్ఓ డాక్టర్ ఎం.సుహాసిని, సీడబ్ల్యూసీ మెంబర్ రాధాకుమారి, ఐసీడీఎస్ పీడీ శ్రీలక్ష్మి, వాసవ్య మహిళా మండలి అధ్యక్షురాలు చెన్నుపాటి కీర్తి, మార్పు ట్రస్ట్ డైరెక్టర్ సూయజ్, డీఎఫ్ఓ చక్రాణి, అరవ రమేష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, సీపీ రాజశేఖరబాబు -
కాలువల్లో అవినీతి మేట
సాక్షి ప్రతినిధి, విజయవాడ: పంట కాలువలు, డ్రెయిన్లలో అవినీతి ‘పూడిక’ అధికమవుతోంది. దీనికి కారణం నీటి పారుదల శాఖ అధికారుల తీరే. కృష్ణా డెల్టా పరిధిలో కాలువలు, డ్రెయిన్లు తూటుకాడ, గుర్రపు డెక్కతో కనిపిస్తున్నాయి. చివరి ఆయకట్టుకు నీరు అందక రైతులు ఇబ్బంది పడే పరిస్థితులున్నాయి. ఇవన్నీ తెలిసినా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. గతేడాది ఆలస్యంగా.. కాలువల మరమ్మతులు, నిర్వహణ పనులకు టెండర్లను ఆలస్యంగా పిలుస్తున్నారు. గతేడాది జూన్లో కాలువలకు నీరు విడుదల చేశారు. ఆ తర్వాత, కాలువల, డ్రెయిన్ల నిర్వహణకు రూ.32.79 కోట్లతో పనులకు టెండర్లు పిలిచారు. కాలువలకు నీరు విడుదల చేయడంతో పనులు చేసే పరిస్థితి లేదు. దీంతో స్థానిక ప్రజాప్రతి నిధుల కనుసన్నల్లో కొంతమంది కాంట్రాక్టర్లు టెండర్లు వేశారు. పనులు చేయకుండా నిధులు మింగేయడానికి కొంతమంది కాంట్రాక్టర్లు ఏకంగా 40–48 శాతంపైగా లెస్కు వేసి పనులు దక్కించుకున్నారు. ఈ ఏడాది మే వరకు పనులు చేసే అవకాశం ఉంది. అయితే పనులు దక్కించుకొన్న కాంట్రాక్టర్లు , నీటి పారుదల శాఖ అధికారులతో కుమ్మక్కై నామ మాత్రంగా పనులు చేసి, బిల్లులు చేయించుకొని దండుకొనేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తాజాగా ఈ ఏడాది పనులకు టెండర్లు పిలవడానికి ఈ సమయం అనువుగా ఉంటుంది. అలా చేయకపోతే చివరి ఆయకట్టు నీరు అందే పరిస్థితులు లేవని రైతులు వాపోతున్నారు. ఎక్కువ వర్షం కురిస్తే డ్రెయిన్లు పొంగి పంట పొలాలను ముంచెత్తుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. టెండర్లు పూర్తి అయినా.. చేయని పనులు గతేడాది కొంత మంది కాంట్రాక్టర్లు 40–48 శాతంపైగా తక్కువకు టెండర్లు వేసి పనులు దక్కించుకున్నారు. కాలువలో నీరు, డ్రెయిన్లలో నీరు ప్రవహిస్తే గుర్రపు డెక్క కొట్టుకొచ్చి షట్టర్ల వద్ద ఆగుతుంది. అక్కడ యంత్రాలతో తీసి కొంతమంది మమ అనిపించే ప్రయత్నం చేశారు. మొత్తానికి ప్రభుత్వ నిర్లక్ష్యం, ఎమ్మెల్యేలు, కాంట్రాక్టర్ల కాసుల కక్కుర్తి రైతులకు పెను శాపంగా మారుతోంది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. అధ్వానంగా డ్రెయిన్లు వర్షం వస్తే..రైతులకు కంటిమీద కునుకు ఉండని పరిస్థితి కృష్ణా డెల్టాలో నెలకొంది. కొద్ది పాటి వర్షానికే డ్రెయిన్లు పొంగి పంట పొలాలను ముంచెత్తుతున్నాయి. గుడివాడ, పెనమలూరు, పామర్రు, అవనిగడ్డ,పెడన నియోజక వర్గాల పరిధిలో ఎక్కువగా పంట పొలాలు మునుగు తున్నాయి. గుడివాడ నియోజకవర్గ పరిధిలోని గుడివాడ, నందివాడ, గుడ్లవల్లేరు మండలాల్లో పూడికలు తీయక డ్రెయిన్లు అధ్వానంగా మారాయి. గుర్రపుడెక్క, తూటుతో మేట వేసుకుపోయాయి. నియోజకవర్గంలో బుడమేరు, చంద్రయ్య, నెహ్రాల్లీ, మోటూరు ఎల్ఎస్ మేజర్ డ్రెయిన్లు అధ్వానంగా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా లజ్జబండ, శివగంగ, తాళ్లపాళెం, ఏనుగులకొడు, వన్నేరు, ముస్తాఫాకోడు, యూటీ,పెద్దలంక, గుండేరు, రత్నకొడు డ్రెయిన్లలో రోజుల తరబడి గుర్రపుడెక్క, నాచు, తూటు దట్టంగా పేరుకుపోయి మురుగునీరు సక్రమంగా దిగువకు పారని పరిస్థితి నెలకొంది. విజయవాడ నుంచి నందివాడ మండలం ఎల్ఎన్పురం వరకు ఉన్న బుడమేరులో గుర్రపుడెక్క దట్టంగా పేరుకుంది. గతేడాది దీని తొలగింపునకు అధికారులు టెండర్లు పిలిచి పనులు అప్పగించినా చేయకపోవడంతో పరిస్థితి దారుణంగా మారింది. చంద్రయ్య డ్రెయిన్ గుడివాడ నుంచి మండవల్లి మండలం పెనుమాకలంక వరకు గుర్రపుడెక్క మేటవేసి నీరు వెళ్లని పరిస్థితి నెలకొంది. తమిరిశ వంతెన, పోలుకొండ రెగ్యులేటర్ వద్ద అలముకున్న గుర్రపుడెక్కతో వంతెనలకు ప్రమాదం పొంచి ఉంది. నందివాడ నుంచి మండవల్లి మండలం నందిగామలంక వరకు ప్రవహిస్తున్న నెహ్రాల్లీ డ్రెయిన్ రాళ్లకోడు డ్రెయిన్లు అధ్వానంగా కనిపిస్తున్నాయి. డ్రెయిన్లలో పేరుకున్న తూటు, గుర్రపుడెక్క గతేడాది రూ.32.19 కోట్లతో టెండర్లు పనులు చేయని కాంట్రాక్టర్లు చివరి ఆయకట్టుకు అందని సాగునీరు రైతుల్లో ఆందోళన పర్యవేక్షణ గాలికి వదిలేశారు డ్రెయిన్ల పర్యవేక్షణకు నిధులు మంజూరు చేసినా కాంట్రాక్టర్లతో అధికారులు కుమ్మౖకై పనుల నిర్వహణను గాలికి వదిలేశారు. డ్రెయిన్లలో గుర్రపుడెక్క, తూటు కన్పిస్తోంది. జిల్లా ఉన్నతాధికారులు స్పందించాలి. – రవి, రైతు లింగవరం తూటు, డెక్క తొలగించడం లేదు బుడమేరు డ్రెయిన్లో పుట్టగుంట వద్ద నుంచి గుర్రపుడెక్క దట్టంగా పేరుకుపోయింది. ఏటా కాంట్రాక్టర్లు కాంట్రాక్టు తీసుకోవడమే గాని పనులు చేపట్టిన దాఖలాలు లేవు. ఇటీవల సంభవించిన వరదలకు పంట పొలాలు, గ్రామాలు ముంపునకు గురై తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. – ఆంజనేయులు, రైతు ఒద్దులమెరకగత ఏడాది టెండర్లు పిలిచిన పనులు డివిజన్ పనుల విలువ సంఖ్య (కోట్లలో)కృష్ణా తూర్పు 42 8.49 కృష్ణా సెంట్రల్ 40 6.77 డ్రెయిన్ గుడివాడ 73 16.41 స్పెషల్ 05 1.12 మొత్తం 160 32.79 -
లోక్ అదాలత్ను వినియోగించుకోండి
చిలకలపూడి(మచిలీపట్నం): లోక్అదాలత్ను పెండింగ్లో ఉన్న కేసుల కక్షిదారులు వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక అన్నారు. జాతీయ లోక్అదాలత్ కార్యక్రమాన్ని న్యాయసేవాసదన్లో శనివారం ఆమె ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలో లోక్ అదాలత్ను నిర్వహించడానికి 41 బెంచ్లను ఏర్పాటు చేశామన్నారు. 10,428 కేసుల పరిష్కారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన లోక్ అదాలత్లో 10,428 కేసులు పరిష్కారమయ్యాయని న్యాయమూర్తి తెలిపారు. 9,674 క్రిమినల్ కేసులు, 159 సివిల్ కేసులు, 333 చెక్బౌన్స్ కేసులు, 98 మోటారు వాహన ప్రమాద క్లయిమ్లకు గానూ రూ. 8.3 కోట్లు నష్టపరిహారంగా చెల్లించేందుకు ఇన్సూరెన్స్ కంపెనీలు అంగీకరించాయన్నారు. ఇవికాక 164 ప్రీ లిటిగేషన్ కేసులను పరిష్కరించి అవార్డులను అందజేశారన్నారు. మచిలీపట్నంలో 1,612 కేసులు, విజయవాడ 5,093, గుడివాడ 754, నందిగామ 239, నూజివీడు 228, మైలవరం 197, జగ్గయ్యపేట 469, బంటుమిల్లి 117, కై కలూరు 788, తిరువూరు 21, గన్నవరం 156, అవనిగడ్డ 228, మొవ్వ 356, ఉయ్యూరు 170 కేసులను పరిష్కరించామన్నారు. కేసుల పరిష్కారంలో రాష్ట్రంలో కృష్ణా రెండోస్థానంలో నిలిచిందని న్యాయమూర్తి తెలిపారు. కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు, న్యాయమూర్తులు కెవీ రామకృష్ణయ్య, చినబాబు, న్యాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాఆదివారం శ్రీ 9 శ్రీ మార్చి శ్రీ 2025సమ్మర్ జిమ్.. –8లోu ఇఫ్తార్ సహరి (ఆది) (సోమ) విజయవాడ 6.21 5.02 మచిలీపట్నం 6.20 5.00● బరువు తగ్గడానికి ఇదే సరైన సమయం ● కొన్ని సమ్మర్ చిట్కాలతో నాజూగ్గా.. ● యోగా, వాకింగ్, జాగింగ్లకు అనుకూలం లబ్బీపేట(విజయవాడతూర్పు): వ్యాయామంతో బరువు తగ్గించుకునేందుకు ఇదే అనువైన సమయమంటున్నారు వైద్య నిపుణులు. ప్రతిరోజూ వ్యాయామం, యోగా చేస్తూ, ఆహార నియమాలు పాటిస్తూ వేసవిలో స్లిమ్గా మారొచ్చంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఇప్పటికే వేసవి ప్రారంభ మైంది. జిమ్ చేయడానికి సిద్ధమవుదాం. నడక ఎంతో ప్రయోజనం ప్రస్తుత యాంత్రిక జీవనంలో అనేక రకాల పనుల కారణంగా తీవ్రమైన ఒత్తిడి ఎదురవుతోంది. దీన్ని నడకతో అధిగమించవచ్చని వైద్యులు చెబుతున్నారు. సాయంత్రం కంటే మార్నింగ్ వాక్ చాలా మంచిది. ఉదయం స్వచ్ఛమైన వాతావరణంతో పాటు, ఆక్సిజన్ స్థాయి అధికంగా ఉంటుంది. సున్నితంగా సూర్యకిరణాలు పడుతుంటే మనసుకు హాయినిస్తుంది. అయితే జాగింగ్ సమయంలో కొన్ని జాగ్రత్తలు తప్పవంటున్నారు. నీరసం వచ్చే వరకూ జాగింగ్ చేయడం ప్రమాదకరమే. దాహం వేస్తే అందుబాటులో తాగునీటిని ఉంచుకోవాలి. శీతల ప్రాణాయామం ● శీతల ప్రాణాయామం చేస్తే కొంత వరకూ ఎండల ప్రతాపాన్ని తట్టుకునే శక్తి శరీరానికి అందడంతోపాటు, బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. ● నాలుకను మడిచి, నోటి ద్వారా గాలి పీల్చి ముక్కుద్వారా వదిలే ప్రక్రియే శీతల ప్రాణా యామం. ఉదయం 7 గంటల లోపు 5 నిమిషాలు ఈ వ్యాయామం చేయడం మంచిదని యోగా నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఆహారం మేలు ● పుచ్చ, కీర, కర్బూజా, తాటి ముంజలు, బీర, పొట్ల వంటి వాటిలో నీటిశాతం పుష్కలంగా ఉంటుంది. వీటితో శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. ● శీతల పానీయాలు, షుగర్ వేసిన జ్యూస్లు, మ్యాంగో, సపోటా వంటివి తీసుకుంటే బరువు తగ్గకపోగా కొత్త సమస్యలు వస్తాయి. ● వేసవిలో ఆకలి తక్కువగా, దాహం ఎక్కువగా ఉంటుంది. డైట్ పాటిస్తూ కాలానికి తగ్గట్టుగా ఆహార పదార్థాలను తీసుకుంటే బరువును నియంత్రించవచ్చు. నీళ్లు, మజ్జిగ, కొబ్బరినీళ్లు తీసుకోవాలి. ఎయిరోస్పేస్లో గుడ్లవల్లేరు విద్యార్థులకు కొలువులు గుడ్లవల్లేరు: దేశానికి గర్వకాణమైన ఎయిరోస్పేస్ కంపెనీ ‘రొసెల్ టెక్సిస్ లిమిటెడ్’లో రూ.3 లక్షల వార్షిక వేతనంతో 23మంది గుడ్లవల్లేరు ఏఏఎన్ఎం అండ్ వీవీఆర్ఎస్ఆర్ పాలిటెక్నిక్ విద్యార్థులకు ఉద్యోగాలు లభించాయి. ఈ విషయాన్ని కాలేజీ ప్రిన్సిపాల్ ఎన్.రాజశేఖర్ శనివారం విలేకరులకు తెలిపారు. ఈ సంస్థ ఏపీలో క్యాంపస్ డ్రైవ్ నిర్వహించిన ఏకై క పాలిటెక్నిక్ కాలేజీ తమదే కావడం గర్వకారణమన్నారు. విద్యార్థులను, ప్రత్యేక శిక్షణను ఇచ్చిన అధ్యాపకులను కళాశాల చైర్మన్ నాగేశ్వరరావు, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సత్యనారాయణరావు, కో – సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రామకృష్ణ అభినందించారు. 7న్యూస్రీల్జాగ్రత్తలు తీసుకోవాలి వాకింగ్, జాగింగ్, వ్యాయామం చేసే సమయంలో నీరసం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అతిగా వాకింగ్ చేయకూడదు. ఎండలో వాకింగ్ చేయడం మంచిది కాదు. వేసవిలో శరీరంలో నీరు త్వరగా ఆవిరై డీ హైడ్రేషన్కు దారితీస్తుంది. మధుమేహం, రక్తపోటు ఉన్న వారు జాగ్రత్తలు తీసుకోవాలి. – డాక్టర్ టీవీ మురళీకృష్ణ, జనరల్ ఫిజీషియన్ఆహార నియమాలు పాటించాలి వేసవిలో ఆహార నియమాలు పాటించాలి. వేపుళ్లు, నూనె ఎక్కువుగా ఉన్న వంటకాలు తీసుకోకుండా ఉండటం మంచిది. తాజా ఆకుకూరలు, పళ్లు తీసుకోవాలి. నీరుశాతం ఎక్కువగా ఉంటే పుచ్చ, కర్బూజ, వంటి పళ్లు తీసుకోవాలి. జాగ్రత్తలు తీసుకుంటూ వ్యాయామం చేస్తే స్లిమ్గా మారొచ్చు. – గర్రే హరిత, ఆహార నిపుణులుఇవి పాటిస్తే.. బరువు తగ్గాలనుకునే వారికి స్విమ్మింగ్ మంచి వ్యాయామం ఎంతటి భోజన ప్రియులైన వేసవిలో కాస్త మోతాదు తగ్గించి ఆహారం తీసుకుంటారు వేసవిలో ఘన పదార్థాల కంటే ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలనిపిస్తుంది రోజుకు కనీసం 5 లీటర్ల నీటిని వివిధ రూపాల్గో తీసుకుంటే బరువు తగ్గడానికి దోహదపడుతుంది. ఫ్రిజ్లో నీటికన్నా కుండలోని నీటిని తాగడం ఉత్తమం. -
అన్నింటా మహిళలు రాణించాలి
చిలకలపూడి(మచిలీపట్నం): అన్ని రంగాల్లో మహిళలు రాణించి నేటి సమాజంలో మహిళాసాధికారత దిశగా అడుగులు వేయాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక అన్నారు. జిల్లా పరిషత్ ప్రాంగణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కృష్ణమ్మ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం జెడ్పీ సమావేశపు హాలులో జిల్లా పరిషత్ సభ్యులతో పాటు మహిళా ఉద్యోగులతో కలిసి ఆమె కేక్ కట్ చేశారు. దేశస్థాయిలో అత్యున్నత అవార్డు సాధించిన చైర్పర్సన్ ఉప్పాల హారికను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ మహిళా సాధికారత కోసం గత ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి వాటిని తూ.చ. తప్పకుండా అమలు చేశారన్నారు. మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు జగనన్న తోడు, జగనన్న ఆసరాతో పాటు అన్ని రంగాల మహిళలకు ఆర్థిక చేయూతను అందించారని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళలకు ఉచితంగా ఇళ్ల పట్టాలు అందజేసి సొంతింటి కలను నెరవేర్చారన్నారు. కార్యక్రమంలో జెడ్పీ డెప్యూటీ సీఈఓ ఆర్సీ ఆనంద్కుమార్, జెడ్పీటీసీ సభ్యులు, ఉద్యోగినులు పాల్గొన్నారు. జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక -
ఒత్తిడి జయించేందుకు క్రీడలు దోహదం
గన్నవరంరూరల్: ఒత్తిడిని జయించేందుకు క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ వి.రాధికారెడ్డి పేర్కొన్నారు. మండలంలోని చిన అవుటపల్లి డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కళాశాల క్రీడా మైదానంలో హెల్త్ యూనివర్సిటీ 26వ పురుషుల ఇంటర్ మెడికల్ గేమ్స్ మీట్ను శనివారం ప్రారంభించారు. యూనివర్సిటీ పరిధిలోని అన్ని వైద్య, డెంటల్ కళాశాలల నుంచి క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ.. విద్యా సంవత్సరానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. క్రీడాకారులను డాక్టర్ రాధికా రెడ్డి అభినందించారు. సిద్ధార్థ మెడికల్ కళాశాల యాజమాన్యం ఆమెను సత్కరించింది. కళాశాల డైరెక్టర్ జనరల్ డాక్టర్ చదలవాడ నాగేశ్వరరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవి భీమేశ్వర్, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి.అనిల్ కుమార్, హెల్త్ యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ డాక్టర్ త్రిమూర్తి, ఆర్గనైజింగ్ సెక్రటరీ దేవినేని రవి, డాక్టర్ రెహమాన్, హెచ్ఓడీలు, వైద్యులు పాల్గొన్నారు. ఇంటర్ పరీక్షలకు 849 మంది గైర్హాజరు వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఇంటర్మీడియెట్ పరీక్షలకు సంబంధించి శనివారం జరిగిన మొదటి సంవత్సరం పరీక్షలకు 849 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 103 పరీక్ష కేంద్రాల్లో 39,274 మంది విద్యార్థులకు 38,425 మంది హాజరు కాగా 849 మంది గైర్హాజరయ్యారు. శనివారం మ్యాథ్స్ ఏబీ, జువాలజీ–1, హిస్టరీ–1 పరీక్షలు జరిగాయి. ఒకేషనల్ పరీక్షలకు 1,337 మంది విద్యార్థులకు 1,190 మంది హాజరు కాగా 147 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. క్లుప్తంగా -
మినుము రైతులు దిగాలు
● ఆశాజనకంగా దిగుబడులు ● మార్కెట్లో ధర లేని వైనం ● ఆర్థికంగా నష్టపోయామంటున్న రైతులు ● గతేడాది రబీలో రూ.9,100 పలికిన క్వింటా ధర కంకిపాడు: సీజన్ మారుతుందే కానీ రైతుల కష్టాలు మాత్రం మారటం లేదు. ఒడిదుడుకులు అధిగమించి పంట చేతికి వచ్చిందని సంతోషించినా మార్కెట్లో సరైన ధర లేకపోవటంతో అన్నదాతలు దిగాలు చెందుతున్నారు. గతేడాదితో పోలిస్తే భారీగా ధరలు నేలచూపులు చూస్తుండటంతో మినుము రైతుల గుండెలు గుభేల్మంటున్నాయి. ఆరుగాలం కష్టించినా అరకొరే చేతికి అందుతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణాజిల్లా వ్యాప్తంగా 25 మండలాల్లో ఈ ఏడాది రబీ సీజన్లో 2,84,237 ఎకరాల్లో మినుము సాగు చేపట్టారు. ప్రధానంగా ఎల్బీజీ, పీయూ 31, టీబీజీ, ఇతర విత్తన రకాలను రైతులు సాగుకు ఎంపిక చేసుకున్నారు. గడిచిన వారం రోజులుగా జిల్లాలో మినుము తీత పనులు సాగుతున్నాయి. ఇప్పటికే 30 శాతం మినుము తీతలు పూర్తయ్యి పంట మార్కెట్కు చేరినట్లు వ్యవసాయశాఖ అంచనా. ఎకరానికి రూ.40 వేల వరకు పెట్టుబడి.. ఈ ఏడాది రబీ సీజన్లో మినుము దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి. అయితే సాగు ఆరంభం నుంచి తెగుళ్లు, పురుగు ఉధృతి పంటపై అధికంగా ఉంది. ప్రధానంగా గతంలో ఎన్నడూ లేని విధంగా పల్లాకు తెగులు విజృంభించటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఎకరాకు సరాసరిన పైరు సంరక్షణ, యాజమాన్య చర్యలకు రూ.25 వేల వరకూ పెట్టుబడులు అయ్యేవి. అలాంటిది ఈ ఏడాది పల్లాకు, మచ్చల పురుగు, ఫంగస్ల కారణంగా యాజమాన్య చర్యలకు అదనంగా రూ.15 వేల వరకూ పెట్టుబడులు పెట్టాల్సి వచ్చింది. ఎకరాకు 10 క్వింటాళ్ల వరకూ దిగుబడులు వస్తాయని ఆశించారు. పంట చేతికి వచ్చే సరికి ఆరు క్వింటాళ్ల నుంచి ఎనిమిది క్వింటాళ్ల లోపు మాత్రమే దిగుబడులు వస్తున్నాయి. ఖరీఫ్ సీజన్లో వరి పంట భారీ వర్షాలు, కృష్ణానది వరదల కారణంగా దెబ్బతినంటంతో ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని చవిచూశారు. ప్రత్యేకించి కౌలు ఒప్పందం ఖరీఫ్కు 20 బస్తాలు పైగా చేసుకుని సాగు చేపట్టిన కౌలురైతులు రెండో పంట రబీలో ఆరుగాలం కష్టించినా కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుందని భావించారు. అయితే దిగుబడులు కూడా మోస్తరుగానే దక్కటంతో రైతుల్లో దిగులు నెలకొంది. ధర నేలచూపులు.. ఈ ఏడాది మార్కెట్లో మినుము ధరలు నేలచూపులు చూస్తున్నాయి. ప్రభుత్వ మద్దతు ధర రూ.7,400గా ఉంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ధర రూ.7,500 నుంచి రూ.7,800 పలుకుతోంది. గత సీజన్లో పంట చేతికి అందే నాటికి క్వింటా మినుము వ్యాపారులు రూ.9,300 నుంచి రూ.9,500 వరకూ ధర చెల్లించి కొనుగోళ్లు చేశారు. కానీ ప్రస్తుతం ఆ ధర పలకటం లేదు. గతంతో పోలిస్తే క్వింటాకు రూ.1800కు పైగా నష్టానికి పంట అమ్ముకోవాల్సి వస్తోంది. మార్కెట్లో వ్యాపారులు సిండికేట్గా మారి ధర నిర్ణయం చేయటంతోనే సరైనా ధర పలకటం లేదని రైతులు వాపోతున్నారు. దీంతో పంటను నిల్వ చేసుకుని మంచి ధర వస్తే విక్రయించుకునే యోచనలో ఉన్నారు. -
ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో రేపు అప్రెంటీస్ మేళా
మొగల్రాజపురం(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రమేష్ ఆస్పత్రి రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలో ఈ నెల 10వ తేదీ సోమవారం అప్రెంటీస్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.కనకారావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఐటీఐ కోర్సు పాస్ అయ్యి అప్రెంటీస్ పూర్తి కాని అన్ని ట్రేడ్ల అభ్యర్థులు ఈ మేళాలో పాల్గొనవచ్చన్నారు. అభ్యర్థులు వారి విద్యార్హతకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని పేర్కొన్నారు. సోమవారం ఉదయం 9 గంటల నుంచి ఈ అప్రెంటీస్ మేళా జరుగుతుందన్నారు. పూర్తి వివరాలకు 77804 29468 నంబర్లో సంప్రదించాలని ఆయన కోరారు. రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ మృతి పెనుగంచిప్రోలు: రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందిన సంఘటన స్థానిక చెరువు కట్ట సమీపంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. మండలంలోని నవాబుపేట గ్రామానికి చెందిన ఇమ్మడి నరసింహారావు(35) మామిడి కర్ర లోడుతో ట్రాక్టర్పై పెనుగంచిప్రోలు నుంచి కొణకంచి వెళ్తుండగా అదుపు తప్పి బోల్తా కొట్టింది. డ్రైవింగ్ చేస్తున్న నరసింహారావు కింద పడిపోగా ఆయనపై కర్రలు పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైల్వేస్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తి.. రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): విజయవాడ రైల్వేస్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందిన ఘటనపై ప్రభుత్వ రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం విజయవాడ రైల్వేస్టేషన్లోని ప్లాట్ఫాం నంబర్ 1లో గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. దీన్ని గుర్తించిన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ రాజా సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి వయసు 40 ఏళ్లు ఉంటాయని, ఒంటిపై నీలం, ఆకుపచ్చ గళ్ల లుంగీ, కాషాయం రంగు టీ షర్ట్ ధరించి ఉన్నాడని, కుడి చేతిపై శివుని బొమ్మతో పచ్చ బొట్టు ఉందని, ఇతర ఆధారాలు లభ్యం కాలేదని తెలిపారు. అనారోగ్యంతో మృతిచెంది ఉండవచ్చని భావిస్తున్నామన్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. మృతుడి ఆచూకీ తెలిసినవారు విజయవాడ జీఆర్పీ పోలీసులను సంప్రదించాలని కోరారు. -
నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియడం లేదు: పోసాని
సాక్షి, విజయవాడ: పోసాని కృష్ణమురళీపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపును కొనసాగిస్తూనే ఉంది. వరుస కేసుల్లో అరెస్ట్ చేస్తూ స్టేషన్ల చుట్టూ పోలీసులు తిప్పుతున్నారు. ఇవాళ విజయవాడ చీఫ్ మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ కోర్టులో పోసానిని పోలీసులు హాజరుపరిచారు. ఈ నెల 20 వరకు కోర్టు రిమాండ్ విధించింది. తనకు ఆనారోగ్య సమస్యలున్నాయని న్యాయమూర్తికి పోసాని చెప్పారు. గుండె ఆపరేషన్ అయ్యిందని.. పక్షవాతం కూడా వచ్చిందని ఆయన తెలిపారు. ‘‘నాపై అక్రమ కేసులు పెట్టారు. నన్ను ఎక్కడికి తీసుకెళుతున్నారో కూడా తెలియడం లేదు’’ అంటూ పోసాని ఆవేదన వ్యక్తం చేశారు.పోలీసు వాహనంలో గంటల తరబడి కూర్చోలేకపోతున్నానని.. తనను ఒకే జైలులో ఉంచేలా ఆదేశాలివ్వాలని పోసాని కోరగా, పిటి వారెంట్పై వచ్చినందున తాను ఎలాంటి ఆదేశాలివ్వలేనని న్యాయమూర్తి తెలిపారు. పోసాని కృష్ణమురళికి ఈనెల 20 వరకూ న్యాయమూర్తి రిమాండ్ విధించారు. పోసానిని కర్నూలు జైలుకి తరలించారు.కాగా, అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో పోసానికి బెయిల్ మంజూరు చేస్తూ కడప మొబైల్ కోర్టు శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. పోసానికి బెయిలు ఇవ్వకూడదని పోలీసుల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించినప్పటికీ.. కోర్టు పోసాని తరఫు న్యాయవాదుల వాదనలతో ఏకీభవిస్తూ... బెయిల్ మంజూరు చేసింది. పోసాని కస్టడీ పిటిషన్ను కోర్టు కొట్టేసింది. ఈ కేసులోనే పోసాని ఫిబ్రవరి 26వ తేదీన అరెస్టయ్యారు. -
పోసానిపై ఆగని వేధింపులు.. మరో పీఎస్కు తరలింపు
కర్నూలు/ఎన్టీఆర్, సాక్షి: పోసాని కృష్ణ మురళి(Posani Krishna Murali)పై కూటమి సర్కార్ వేధింపులు ఆగడం లేదు. కూటమి పార్టీల నేతలు పెట్టిన కేసుల్లో ఆయనకు వరుసగా ఊరటలు దక్కుతుండడం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన్ని ఇంకో కేసులో ఇప్పుడు మరో పీఎస్కు తరలిస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి నరసరావుపేట పోలీసుల కస్టడీ పిటిషన్ను కోర్టు రద్దు చేసింది. దీంతో ఆగమేఘాల మీద విజయవాడ భవానీపురం పోలీసులు కర్నూల్ జైలుకు చేరుకున్నారు. ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్(PT Warrant) కింది పోసానిని హైదరాబాద్ మీదుగా విజయవాడకు తరలిస్తున్నారు. సాయంత్రంలోగా ఆయన్ని విజయవాడకు తీసుకొచ్చే అవకాశం ఉంది. కోర్టులో లేదంటే మెజిస్ట్రేట్ ఎదుట పోసానిని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. రిమాండ్ విధిస్తే గనుక విజయవాడ జైలుకు పోసానిని తరలిస్తారు. లేదంటే మళ్లీ కర్నూలు జైలుకే తరలిస్తారు. ఈ కేసు చాలా ముఖ్యమైందని చెబుతూ కోర్టు నుంచి భవానీపురం పోలీసులు పీటీ వారెంట్ పొందారు.ఇదిలా ఉంటే.. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో పోసానికి బెయిల్ మంజూరు చేస్తూ కడప మొబైల్ కోర్టు శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. పోసానికి బెయిలు ఇవ్వకూడదని పోలీసుల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించినప్పటికీ.. కోర్టు పోసాని తరఫు న్యాయవాదుల వాదనలతో ఏకీభవిస్తూ... బెయిల్ మంజూరు చేసింది. పోసాని కస్టడీ పిటిషన్ను కోర్టు కొట్టేసింది. ఈ కేసులోనే పోసాని ఫిబ్రవరి 26వ తేదీన అరెస్టయ్యారు. పోసానిని హైదరాబాద్లోని నివాసంలో అరెస్ట్ చేసి.. ఆ మరుసటి రోజు ఓబులవారిపల్లెకు తీసుకెళ్లారు. అటుపై పల్నాడు జిల్లా నరసరావుపేటలో, కర్నూల్ జిల్లా ఆదోనీ పీఎస్లలో నమోదైన కేసుల్లో పీటీ వారెంట్ కింద ఆయన్ని తరలించారు. ఈ కేసుల్లో ఉపశమనం కోరుతూ ఆయన వేసిన పిటిషన్లపై తీర్పు వెల్లడి కావాల్సి ఉంది. మరోవైపు హైకోర్టులోనూ ఆయన వేసిన క్వాష్ పిటిషన్ విచారణ దశలో ఉంది. -
మామిడిలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి
ప్రధాన శాస్త్రవేత్త కనకమహాలక్ష్మి సూచన గన్నవరం రూరల్: మామిడి తోటలలో సస్యరక్షణ చర్యలు చేపట్టి అధిక దిగుబడులు సాధించాలని నూజివీడు మామిడి పరిశోధన కేంద్ర ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.కనకమహాలక్ష్మి రైతులకు సూచించారు. మండలంలోని గోపవరపుగూడెం గ్రామంలో శుక్రవారం ఆమె జిల్లా ఉద్యానవన అధికారి జె.జ్యోతితో కలసి మామిడి తోటలు పరిశీలించారు. అనంతరం రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కనకమహాలక్ష్మి మాట్లాడుతూ ప్రస్తుతం కొన్ని తోటలలో తేనె మంచు పురుగు, తామర పురుగు, బూడిద తెగులు, పక్షి కన్ను తెగులు గమనించామన్నారు. ఈ పురుగులు, తెగుళ్ల నివారణకు ఇమిడాక్లోప్రిడ్ 0.3 ఎంఎల్ లేదా సాప్ 2జీ హెక్సకోనజోల్ 2జీ లేదా యాన్ట్రాకోల్ 2జీ లీటర్ నీటికి కలిపి స్ప్రే చేయాలన్నారు. మామిడి మొక్క వయస్సు, భూమి తేమ శాతం బట్టి నీరు పారించాలన్నారు. పిందెలు పసుపు రంగుకు మారి రాలిపోతుంటే ఫ్లానోఫిక్స్ 0.2 ఎంఎల్ లీటర్ నీటిని కలిపి పిచికారీ చేయాలన్నారు. డాక్టర్ జ్యోతి మాట్లాడుతూ మామిడి రైతులకు కవర్లు అందుబాటులో 50 శాతం రాయితీపై ఇస్తున్నామని చెప్పారు. కావాల్సిన రైతులు ఉద్యానవన సిబ్బందిని సంప్రదించాలన్నారు. మండల హార్టీ కల్చర్ అధికారి ఇ.హరిచంద్, ఉద్యానవన సహాయకులు వి.దీక్ష, కౌశిక్, భవాని, మాజీ సహకార బ్యాంకు అధ్యక్షుడు నల్లూరి కోటేశ్వరరావు, కొత్తలంక వెంకట్రామయ్య, రైతులు పాల్గొన్నారు. -
అంతర్ రాష్ట్ర నేరస్తుడు అరెస్ట్
జగ్గయ్యపేటఅర్బన్: రాత్రి సమయాలలో దొంగతనాలు చేేసే అంతర్ రాష్ట్ర పాత నేరస్తుడిని పేట పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలను (220 గ్రాములు) స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సీఐ పి.వెంకటేశ్వర్లుతో కలిసి నందిగామ ఏసీపీ తిలక్ వివరాలు వెల్లడించారు. సీఐ పి.వెంకటేశ్వర్లుకు వచ్చిన పక్కా సమాచారం మేరకు శుక్రవారం పేట మండల పరిఽధిలోని గరికపాడు చెక్పోస్ట్ వద్ద తెలంగాణ రాష్ట్రం పాండురంగాపురం గ్రామానికి చెందిన సంపతి ఉమాప్రసాద్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించి అతని వద్ద నుంచి రూ.20 లక్షల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఇంటర్ వరకు చదువుకున్న నిందితుడు చిన్ననాటి నుంచే చెడు సావాసాలు చేసేవాడని, తాళం వేసి ఉన్న ఇళ్లలోకి జొరబడి డబ్బు, బంగారాన్ని దొంగతనం చేసి వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవాడన్నారు. ఇతనిపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో మొత్తం 32 దొంగతనం కేసులు ఉన్నాయని, వీటిలో 25 కేసుల్లో నాన్బెయిలబుల్ వారెంట్ పెండింగ్లో ఉందని, 12 కేసుల్లో అరెస్ట్ ఎండింగ్లో ఉన్నాడన్నారు. గత నెల 19 వ తేదీన జగ్గయ్యపేటలో దొంగతనం చేశాడని, ఆ వస్తువులను నందిగామలో అమ్ముదామని వెళుతుండగా సీఐ వెంకటేశ్వర్లుకు వచ్చిన సమాచారం మేరకు గరికపాడు చెక్పోస్టు సమీపంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. చైన్ స్నాచింగ్ కేసులో మరొక నిందితుడు అరెస్ట్... జగ్గయ్యపేట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసులో తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ముత్తవరం గ్రామానికి చెందిన గలంజీపల్లి శేఖర్ను అదుపులోకి తీసుకొని విచారించి అతని వద్ద నుంచి 36 గ్రాముల బంగారు గొలుసును స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేసినట్లు ఏసీపీ తిలక్ తెలిపారు. ఈ సందర్భంగా సీఐ పి.వెంకటేశ్వర్లు, ఎస్ఐలు రాజు, వెంకటేశ్వరరావులను, వారి సిబ్బందిని నగర పోలీస్ కమిషనర్ అభినందించారు. ఇంటర్ పరీక్షలకు 710 మంది గైర్హాజరు వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఇంటర్మీడియెట్ పరీక్షలకు సంబంధించి శుక్రవారం జరిగిన పరీక్షలకు 710 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. శుక్రవారం మ్యాథ్స్–2ఏ, సివిక్స్–2, బోటనీ –2 పేపర్లకు సంబంధించిన పరీక్షలు జరిగాయి. వీటికి 36,996 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా అందులో 36,286 మంది హాజరయ్యారు. 710 మంది గైర్హాజరైనట్లు అధికారులు ప్రకటించారు. వొకేషనల్ కోర్సులకు సంబంధించి 1014 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 952 మంది హాజరయ్యారు. 62 మంది గైర్హాజరైనట్లు అధికారులు ప్రకటించారు. జిల్లాలో శుక్రవారం మాల్ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదు. ఓపెన్ స్కూల్ పరీక్షలకు 543 మంది గైర్హాజరు ఏపీ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియెట్ పరీక్షలకు శుక్రవారం జిల్లా వ్యాపితంగా 17 పరీక్ష కేంద్రాల్లో పరీక్షను నిర్వహించారు. వాటిలో 2604 మంది విద్యార్థులను కేటాయించగా 2055 మంది హాజరయ్యారు. 543 మంది గైర్హాజరయ్యారు. నగరంలోని గాంధీజీ మున్సిపల్ హైస్కూల్, బీఎస్ఆర్కే మున్సిపల్ హైస్కూల్, ఏపీఎస్ఆర్ఎం మున్సిపల్ హైస్కూల్ పరీక్ష కేంద్రాలను డీఈవో సుబ్బారావు శుక్రవారం తనిఖీ చేశారు. తిరువూరు, జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, విజయవాడ పరీక్ష కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్లు సందర్శించాయి. -
కొమరవోలులో పర్యటించిన నారా భువనేశ్వరి
కొమరవోలు(పామర్రు): గతంలో తాను దత్తత తీసుకున్న గ్రామమైన పామర్రు మండలం కొమరవోలు గ్రామంలో ఎన్టీఆర్ ట్రస్టు చైర్పర్సన్, సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి శుక్రవారం పర్యటించారు. గ్రామ పొలిమేరలో ఆమెకు పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్రాజా, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, ఏపీ ఎస్ డబ్ల్యూసీ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, కూటమి నేతలు ఘనంగా స్వాగతం పలికారు. తొలుత తన తల్లిదండ్రులు ఎన్టీఆర్, బసవ తారకం విగ్రహాలకు ఆమె పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గ్రామంలోని శివాలయంలో ఆమె ప్రత్యేక పూజలను నిర్వహించి మొక్కుబడులను చెల్లించుకున్నారు. అనంతరం గ్రామ సచివాలయం వద్ద ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ దిరిశం రత్నకుమారి గ్రామ సమస్యలను తెలియజేశారు. గ్రామంలోని శ్మశాన వాటిక అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని, గ్రామంలో మూడు కిలోమీటర్ల మేర సీసీ రహదార్లు ఏర్పాటు చేయాలని, ఎస్సీ కాలనీ అభివృద్ధి పర్చాలని కోరారు. గ్రామస్తులు వారి వారి సమస్యలను ఆమెకు తెలియజేశారు. భువనేశ్వరి మాట్లాడుతూ గ్రామ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. కార్యక్రమంలో కృష్ణాజిల్లా ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ వల్లూరిపల్లి గణేష్, టీడీపీ మండల అధ్యక్షుడు కుదరవల్లి ప్రవీణ్చంద్ర, ఆ పార్టీ నేతలు కాట్రగడ్డ రమేష్బాబు, గొట్టిపాటి లక్ష్మీదాసు, కాకరాల హరిబాబు, గ్రామ కార్యదర్శి స్నేహలత తదితరులు పాల్గొన్నారు. -
శాటిలైట్ స్టేషన్గా రాయనపాడు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్లోని రాయనపాడు రైల్వే స్టేషన్కు మహర్దశ పట్టనుంది. ఎన్ఎస్జీ–5 కేటగిరీ కలిగిన ఈ రైల్వే స్టేషన్ దక్షిణ తీర ప్రాంతంలో అత్యంత రద్దీగా ఉండే చైన్నె – బల్హార్షా – నాగ్పూర్ – న్యూఢిల్లీ లైన్లోని గ్రాండ్ ట్రంక్ మార్గంలో ఉంది. నిత్యం 250 రైళ్లు, 1.40 లక్షల మంది ప్రయాణికులతో విజయవాడ రైల్వేస్టేషన్లో అధిక రద్దీ నెలకుంటుండటంతో దీనికి ప్రత్యామ్నాయంగా రాయన పాడు రైల్వే స్టేషన్ను శాటిలైట్ స్టేషన్గా ఆధునీకరించేందుకు రైల్వేశాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు కొన్ని సాధారణ రైళ్లు మాత్రమే ఆగే ఈ స్టేషన్లో భవిష్యత్తులో అన్ని ప్రధాన రైళ్లు కూడా ఆగనున్నాయి. ముఖ్యంగా నాగ్పూర్, సికింద్రాబాద్ మార్గం నుంచి వరంగల్ మీదుగా విశాఖపట్నం, భువనేశ్వర్, కోల్కతా వైపు వెళ్లే అనేక రైళ్లు విజయవాడ రైల్వే స్టేషన్కు వెళ్లకుండా రాయనపాడు మీదుగా దారి మళ్లించనున్నారు. దీంతో విజయవాడ ప్రధాన స్టేషన్పై చాలావరకు వత్తిడి తగ్గుతుంది. ఈ కారణంగానే రాయనపాడు రైల్వే స్టేషన్ను విజయవాడ బైపాస్ స్టేషన్ అని కూడ పిలుస్తున్నారు. శాటిలైట్ స్టేషన్గా వేగంగా పనులు... అమృత్ భారత్ స్టేషన్ స్కీం (ఏబీఎస్ఎస్) పథకంలో భాగంగా విజయవాడ ప్రధాన రైల్వే స్టేషన్కు ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు రాయనపాడు రైల్వే స్టేషన్ను శాటిలైట్ స్టేషన్ను అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక మౌలిక సదుపాయాలతో అభివృద్ధి పర్చేందుకు రైల్వేశాఖ రూ.12.13 కోట్లతో స్టేషన్ పునరాభివృద్ధి పనులు చేపట్టింది. గత ఏడాది ఫిబ్రవరిలో స్టేషన్ పునరాభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా శంకుస్థాపన చేయగా ఇప్పటి వరకు 58 శాతం పనులు పూర్తయ్యాయి. ఈ ఏడాది చివరి కల్లా మిగిలిన పనులను కూడ పూర్తిచేసే దిశగా అధికారులు పనులను వేగవంతం చేశారు. రూ.12.13 కోట్లతో స్టేషన్ ఆధునికీకరణ పనులు అంతర్జాతీయ ప్రమాణాలతో బహుళ అంతస్తుల నిర్మాణం అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేషన్ ఆధునికీకరణ పనులు... అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఆంధ్రప్రదేశ్లో 53 స్టేషన్లలో పునరాభివృద్ధి పనులకు రైల్వేశాఖ చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే విజయవాడ డివిజన్లో 22 స్టేషన్లు ఈ పథకానికి ఎంపిక చేయగా అందులో రాయపాడు స్టేషన్ ఒకటి. ఈ ప్రాజెక్ట్లో స్థానిక సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఆధునిక బహుళ అంతస్తుల స్టేషన్ భవన నిర్మాణాలు, పరిసర ప్రాంతాలలో గ్రీనరీ, ఏసీ, నాన్ ఏసీ వెయిటింగ్ హాల్స్, ప్లాట్ఫాంల పొడిగింపు, ఎస్కలేటర్లు, లిఫ్ట్ల ఏర్పాటు, ఫుట్ బ్రిడ్జి నిర్మాణాలు, రిజర్వేషన్ కౌంటర్లు, ముఖ్యంగా దివ్యాంగ ప్రయాణికుల కోసం ప్రత్యేక ర్యాంపు మార్గాలు, మాడ్యులర్ టాయిలెట్ల నిర్మాణాలు చేపట్టనున్నారు. పనులను వేగవంతంగా చేపట్టామని, ఇప్పటివరకు 58 శాతం భౌతిక పనులు పూర్తయ్యాయని, ఈ ఏడాది చివరి నాటికి మొత్తం ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా పనులు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. -
భార్య పై సుత్తితో దాడి
పెనమలూరు: కానూరులో భార్యపై సుత్తితో దాడి చేసి గాయపర్చటంతో పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం కానూరు మన కల్యాణ మండపం ప్రాంతంలో ఉన్న సౌమీ అపార్టుమెంట్లో పి.లక్ష్మి, భర్త తలుపులు ఇద్దరు పిల్లలతో కలసి ఉంటున్నారు. భర్త అపార్టుమెంట్లో వాచ్మన్గా పని చేస్తుండగా భార్య అపార్టుమెంట్ ఇళ్లల్లో పని చేస్తుంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త తలుపులు ఆమె ఇంట్లో నిద్రపోతున్న సమయంలో సుత్తితో తలపై కొట్టాడు. భార్య బిగ్గరగా కేకలు వేయగా అపార్టుమెంట్లో ఉన్న వారు ఆమెను కాపాడారు. గాయపడిన లక్ష్మిని కానూరులో ఆస్పత్రిలో చేర్చారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు భర్తపై కేసు నమోదు చేశారు. -
ఎన్టీఆర్ జిల్లాలో నేటి నుంచి పీ4 సర్వే
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్టనర్షిప్ (పీ4) విధానానికి ఈ ఏడాది ఉగాది నుంచి శ్రీకారం చుట్టనుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. ఈ నెల 8 నుంచి 18వ తేదీ వరకు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ప్రత్యేక సర్వే జరుగుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కలెక్టర్ లక్ష్మీశ నోడల్ అధికారులతో కలిసి కలెక్టరేట్ నుంచి పీ4 సర్వేపై వర్చువల్గా వర్క్షాప్ నిర్వహించారు. పీ4 సర్వే తీరుతెన్నులను పీపీటీ ద్వారా వివరించారు. సర్వేకు సంబంధించి సిబ్బందికి ఇప్పటికే శిక్షణ పూర్తయిందన్నారు. కుటుంబ వివరాలు, సామాజిక, ఆర్థిక స్థితిగతులకు సంబంధించి మొత్తం 27 ప్రశ్నల ద్వారా డేటాను సేకరిస్తారన్నారు. సర్వే అనంతరం మార్చి 21న సమాచార జాబితాలను గ్రామసభలో ప్రదర్శిస్తారన్నారు. పేదరికాన్ని దూరం చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికాయుతంగా చేపడుతున్న కార్యక్రమాలకు అదనంగా సామాజికంగా, ఆర్థికంగా పైన ఉన్న కుటుంబాలు సామాజిక బాధ్యతగా అట్టడుగున ఉన్న కుటుంబాలకు మద్దతుగా నిలిచేలా ప్రోత్సహించడం పీ4 విధానం లక్ష్యమని వివరించారు. కుటుంబాలు ప్రస్తుతం అందుకుంటున్న పథకాలపై ఈ సర్వే ఎలాంటి ప్రభావం చూపదని స్పష్టం చేశారు. అవసరమైతే పథకాల లబ్ధిదారుల జాబితాలో చేర్చడమే తప్ప తొలగించడం జరగదన్నారు. సర్వే ప్రయోజనాలను కుటుంబాలకు క్షుణ్ణంగా వివరించి, కచ్చితమైన డేటాను ఆఫ్లైన్, ఆన్లైన్లో పొందుపరిచేందుకు ఎన్యూమరేట్లు కృషి చేయాలన్నారు. సర్వే ప్రగతిని డ్యాష్బోర్డు ద్వారా జిల్లా, రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. సర్వే విజయవంతానికి కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో సీపీవో వై.శ్రీలత, గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి, డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, జిల్లా పరిశ్రమల అధికారి బి.సాంబయ్య, డీఎంహెచ్వో డాక్టర్ ఎం.సుహాసిని, డీపీవో పి.లావణ్య కుమారి, జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయకుమారి, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ ఎం.శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు. క్షేత్రస్థాయి సిబ్బందికి పూర్తయిన శిక్షణ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ -
కాటికాపరుల సమస్యలపై 11న మహాధర్నా
కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల్యాద్రి మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): శ్మశానంలో గుంతలు తీసి, శవాలను పూడ్చి, కాల్చే కాటికాపరుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 11న ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ప్రదర్శన, మహాధర్నాను నిర్వహించనున్నామని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి చెప్పారు. విజయవాడ నగరంలోని సున్నపుబట్టీల సెంటర్లో ఉన్న పూలే, అంబేడ్కర్ భవన్లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాల్యాద్రి మాట్లాడుతూ 11న రైల్వేస్టేషన్ నుంచి అలంకార్ సెంటర్ వరకు ప్రదర్శన, అనంతరం ధర్నా చౌక్లో ధర్నా జరుగుతుందని చెప్పారు. ధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ ముద్రించిన కరపత్రాన్ని సంఘం సభ్యులు ఆవిష్కరించారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుడిసె నటరాజ్, సహాయ కార్యదర్శి జి.క్రాంతి కుమార్ పాల్గొన్నారు. -
భక్త జన జాతర
భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి చిన్న తిరునాళ్ల ఉత్సవాలకు వచ్చే భక్తులకు అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పించేందుకు ముందస్తుగా ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రత్యేకంగా క్యూలైన్లు, బారికేడ్లు, ప్రసాదాల కౌంటర్లు, బస్టాండ్ ఏర్పాట్లు ఆలయ ఇంజినీరింగ్ అధికారుల ద్వారా చేస్తున్నాం. మునేరులో షవర్బాత్లు, తలనీలాలు తీసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు జరగనున్నాయి. –బీహెచ్వీఎస్ఎన్ కిషోర్కుమార్, ఆలయ ఈఓ ఉత్సవాల విజయవంతానికి సహకరించాలి అమ్మవారి చిన్నతిరునాళ్ల మహోత్సవాన్ని భక్తులతో పాటు గ్రామస్తులు, అధికారులు సహకరించి విజయవంతం చేయాలి. తిరునాళ్ల ఐదు రోజుల పాటు ఆలయం వద్ద రాత్రి సమయంలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నాం. –జంగాల శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్ పెనుగంచిప్రోలు: రాష్ట్ర ప్రజలతో విశేష పూజలందుకుంటున్న పెనుగంచిప్రోలు శ్రీతిరుపతమ్మ అమ్మవారి చిన్న తిరునాళ్ల మహోత్సవాలు మార్చి 14 నుంచి 18 వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఇందుకోసం ఆలయ అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. తిరునాళ్ల మహోత్సవాలు జరిగే ఐదు రోజులు, ఒక్కో రోజు ఒక్కో ఉత్సవం కనుల పండువగా జరగనుంది. ఉత్సవాల్లో అమ్మవారి పుట్టినిల్లు అనిగండ్లపాడు గ్రామం నుంచి పసుపు–కుంకుమల బండ్లు రాక ప్రధాన ఘట్టంగా ఉంటుంది. తిరునాళ్లకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలి వస్తారు. ఇవీ ఏర్పాట్లు... మునేరులో జల్లు స్నానాలు, పలు చోట్ల భక్తుల సౌకర్యార్ధం చేతి పంపులు, శుద్ధి చేసిన తాగు నీరు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు వసతి కోసం పలుచోట్ల షామియానాలు ఏర్పాటు చేస్తున్నారు. అఖండ జ్యోతి స్థాపనతో తిరునాళ్ల ప్రారంభం చిన్న తిరునాళ్లలో మొదటి రోజు మార్చి 14 న ఉదయం 6–02 గంటలకు అఖండజ్యోతి స్థాపనతో ఉత్సవాలు మొదలవుతాయి. వేలాదిగా భక్తులు అమ్మవారికి పాలు, పొంగళ్లతో మొక్కులు తీర్చుకుంటారు. నిత్య కల్యాణ మూర్తులకు అభిషేకం ఉంటాయి. రెండవ రోజు గ్రామోత్సవం తిరునాళ్లలో రెండవ రోజు మార్చి 15 న రాత్రి 6–56 గంటలకు ఉత్సవమూర్తులను రథంపై ఉంచి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా రథోత్సవం (గ్రామోత్సవం) నిర్వహిస్తారు. భక్తులు వేలాదిగా పాల్గొంటారు. మూడవ రోజు దివ్య ప్రభోత్సవం మూడవ రోజు మార్చి 16 న రాత్రి 9–05 గంటలకు దివ్య ప్రభోత్సవం వైభవంగా జరగనుంది. ఎన్నో ఏళ్లుగా సాగుతున్న ఈ ఉత్సవంలో సుమారు 90 అడుగుల దివ్యప్రభపై ఉత్సవమూర్తులను ఉంచి ప్రభను ఎడ్లు లాగుతూ ఆలయం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయిస్తారు. ఈ అపురూప దృశ్యాన్ని చూడటానికి మండల ప్రజలే కాక పలు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. నాల్గవరోజు అమ్మవారి పుట్టింటి పసుపు–కుంకుమలు చిన్న తిరునాళ్లలో ప్రధాన ఘట్టమైన అమ్మవారి పుట్టింటి పసుపు–కుంకుమ బండ్లు తిరునాళ్ల నాల్గవ రోజున మార్చి 17న అనిగండ్లపాడు గ్రామం నుంచి సాయంత్రం 4–53 గంటలకు ప్రారంభం కానున్నాయి. అమ్మవారి పుట్టింటి వంశీకులు కొల్లా శ్రీనివాసరావు ఇంటి నుంచి ఏటా పసుపు కుంకుమలు బండ్లపై తీసుకు రావటం ఆనవాయితీగా వస్తోంది. గ్రామానికి చెందిన వారు వందల బండ్లతో పసుపు– కుంకుమ బండి వెంట పెనుగంచిప్రోలు ఆలయానికి చేరుకుంటారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు వేల సంఖ్యలో భక్తులు వస్తారు. ఐదవ రోజు భక్తుల బోనాల సమర్పణ ఐదవరోజు మార్చి 18 న ఉదయం 5–30 గంటలకు భక్తులు బోనాల సమర్పణతో చిన్న తిరునాళ్ల ఉత్సవాలు ముగుస్తాయి. ఐదు రోజులు జరిగే ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు మార్చి 14 నుంచి ఉత్సవాలు ప్రారంభం మార్చి 17 న అమ్మవారి పుట్టింటి పసుపు–కుంకుమ బండ్లు రాక -
సుబ్రహ్మణ్యుని సేవలో కృష్ణా కలెక్టర్
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ శుక్రవారం దర్శించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. తొలుత ఆలయ ప్రదక్షిణ చేసిన ఆయన నాగపుట్టలో పాలుపోసి మొక్కుబడి చెల్లించుకున్నారు. అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆయన వెంట మచిలీపట్నం ఆర్డీవో కె. స్వాతి, స్థానిక ఎస్ఐ సత్యనారాయణ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. పేలిన ఫ్రిడ్జ్.. వంటింటి సామగ్రి ధ్వంసం మైలవరం: వంటింట్లో ఫ్రిడ్జ్ పేలి సామాన్లు ధ్వంసం అయిన సంఘటన ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం పూరగుట్టలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. పూరగుట్ట గ్రామానికి చెందిన మరీదు నిరంజన్రావు, రమాదేవి దంపతులు కూలి పనులు చేసుకుని జీవిస్తుంటారు. గురువారం రాత్రి వారు బెడ్రూమ్లో నిద్రపోయారు. శుక్రవారం తెల్లవారుజామున వంట గదిలోని ఫ్రిడ్జ్ ఒక్కసారిగా పేలిపోయింది. ఆ పేలుడు ధాటికి ఇంటి తలుపులు, కిటికీలు విరిగిపోయాయి. వంట గదిలోని సామాన్లు చెల్లాచెదురుగా పడ్డాయి. దంపతులు బెడ్రూమ్లో పడుకుని ఉండటం, వంటగదిలో గ్యాస్ సిలిండర్ ఉన్నా అది పేలకపోవడంతో ఎటువంటి అపాయం జరగలేదు. ఫ్రిడ్జ్ పేలుడు శబ్దానికి చుట్టు పక్కల వారు భయాందోళనకు గురయ్యారు. పేలిన శబ్దం అర కిలోమీటరు వరకు వినిపించిందని స్థానికులు తెలిపారు. దుర్గమ్మ సన్నిధిలోనీతి అయోగ్ సభ్యుడు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మను నీతి అయోగ్ సభ్యుడు డాక్టర్ విజయ్కుమార్ సరస్వత్ శుక్రవారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన విజయ్కుమార్ సరస్వత్ను ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలకగా, అర్చకులు ఆలయ మర్యాదలతో ఆహ్వానించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. ఆలయ ఏఈవో జంగం శ్రీనివాసరావు విజయ్కుమార్ సరస్వత్కు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందించారు. నిత్యాన్నదానానికి విరాళం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి విజయవాడ ముత్యాలంపాడుకు చెందిన గొట్టిముక్కల సత్యనారాయణరాజు కుటుంబం రూ. 1,11,116 విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేసింది. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు. -
బుడమేరు డైవర్షన్ కెనాల్ పరిశీలన
జి.కొండూరు: గత ఏడాది ఆగస్టులో బుడమేరుకు వచ్చిన వరదల కారణంగా కవులూరు గ్రామ శివారులోని బుడమేరు డైవర్షన్ కెనాల్కు గండ్లు పడిన ప్రాంతాన్ని, వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ శుక్రవారం పరిశీలించారు. ఈ నెల 6వ తేదీన సాక్షి ప్రచురించిన ‘బుడమేరకు పొంచి ఉన్న కడగండ్లు’ కథనానికి స్పందించి ఆయన ఈ పరిశీలనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా మొదట డైవర్షన్ కెనాల్కు గండ్లు పడి పూడ్చిన ప్రదేశంలో ఊట వస్తున్న ప్రదేశాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఇక్కడ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సైపన్ల వద్ద కట్ట బలోపేతంపై అధికారులతో చర్చించారు. అనంతరం వెలగలేరు హెడ్రెగ్యులేటర్ వద్ద గేట్లను పరిశీలించారు. సమస్య ఉన్న గేట్లకు చేపట్టవలసిన మరమ్మతులపై ఆరా తీశారు. వరదల కారణంగా బుడమేరు, పులివాగుతో పాటు పలు వాగులకు పడిన గండ్లు, మేజర్, మైనర్ ఇరిగేషన్ చెరువులు వాటికి పడిన గండ్లపై అధికారులు, రైతులతో చర్చించారు. రైతులకు ఎటువంటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి పంపిన నేపథ్యంలో అనుమతి రాగానే పనులు ప్రారంభించి వర్షాకాలంలోపు పనులను పూర్తి చేస్తామని అధికారులు కలెక్టర్కు తెలియజేశారు. -
అర్చకత్వానికి అంకితం
ఘంటసాల: మహిళలు అన్ని రంగాలలో ముందుంటూ వారసత్వాన్ని, కుటుంబ బాధ్యతలను స్వీకరించడంలో చాలా దృఢ నిశ్చయంతో కొనసాగుతున్నారు అనడానికి నిదర్శనం ఘంటసాల విజయలక్ష్మి, ఆమె సోదరీమణులు లక్ష్మి, మాధవీలత. ఘంటసాలలోని శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వరస్వామి దేవాలయం, శ్రీ బాల పార్వతీ సమేత జలధీశ్వరస్వామి దేవాలయాల్లో శతాబ్దాలుగా వంశపారంపర్య అర్చకత్వం కొనసాగుతోంది. ఈ పరంపరలో శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో అర్చకులు ఘంటసాల వెంకటేశ్వరరావుకు ముగ్గురు ఆడపిల్లలు సంతానం ఉన్నారు. వారు ఉన్నత విద్యనభ్యసించారు. ఆయన తదనంతరం కుటుంబంలో పురుషులు లేకపోవడంతో ఆడ పిల్లలు తండ్రి వారసత్వాన్ని కొనసాగించడానికి ముందుకు వచ్చారు. 1981లో ఘంటసాల వెంకటేశ్వరరావు కాలం చేయగా.. వారి కుమార్తెలు అర్చకత్వ బాధ్యతలు చేపట్టారు. వీరిలో ముఖ్యంగా ఘంటసాల విజయలక్ష్మి పోస్టు గ్రాడ్యుయేషన్, బీఈడీ చేసినప్పటికీ ఆ రంగాన్ని వదిలి అర్చకత్వ పరీక్షలలో ఉత్తీర్ణురాలై, అవివాహితగా ఉండి తన జీవితాన్ని సంపూర్ణంగా అర్చకత్వానికి అంకితం చేశారు. శ్రీ విశ్వేశ్వర స్వామి దేవాలయంతో పాటు సుమారు ఏడేళ్లు శ్రీ జలధీశ్వర స్వామి దేవాలయంలో కూడా విజయలక్ష్మి అర్చకత్వం చేశారు. ఈమెకు వారి సోదరిలు లక్ష్మి, మాధవీలతలు కూడా సహకారం అందించే వారు. ఘంటసాల చుట్టు పక్కల ప్రాంతాల్లో శుభకార్యాలు కూడా వీరే చేయించడం ఓ ప్రత్యేకత. -
మహిళలపై వివక్ష, సవాళ్లపై చర్చ
భవానీపురం(విజయవాడపశ్చిమ): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషరేట్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్యానల్ డిస్కషన్ జరిగింది. ‘అదృశ్య అవరోధాలను ఛేదించడం – మహిళల నాయకత్వం – సవాళ్లు’ అనే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో రాష్ట్ర హోం శాఖ మంత్రి వి. అనిత, సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు, పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు. మహిళలు నాయకత్వ స్థాయికి ఎదగడంలో ఎదుర్కొనే సవాళ్ల, అవరోధాలు, వివక్షను అధిగమించే మార్గాల గురించి చర్చించారు. హోం మంత్రి అనిత మాట్లాడుతూ మహిళను విమర్శించే క్రమంలో ముందు క్యారెక్టర్ను దూషిస్తారన్నారు. బీసీ వెల్ఫేర్ మంత్రి సవిత మాట్లాడుతూ రాజకీయంగా అనేక ఒడుదుడుకులను ఎదుర్కొన్నానని చెప్పారు. అలాగే అనేక కేసులు, అవమానాలు పడుతూ ఈ స్థాయికి వచ్చానని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ -
No Headline
గుడ్లవల్లేరు: దేశ చరిత్రలో అరుదైన పురస్కారం ఇటీవల కృష్ణాజిల్లా పరిషత్కు లభించింది. జెడ్పీ ఎంతో పారదర్శకంగా పరిపాలన సాగించిందని చెప్పేందుకు ఐసీఏఐ ఇచ్చిన ఈ అవార్డు నిదర్శనంగా నిలిచింది. ఈ అవార్డు పొందడంలో జెడ్పీ చైర్ పర్సన్గా ఉప్పాల హారిక కృషి ఎంతో ఉంది. భారతదేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వెరసి 778 జిల్లాలు ఉన్నాయి. ఈ జాతీయ అవార్డును ఇంతవరకు దేశంలో ఏ జిల్లా పరిషత్కు ఇవ్వలేదు. 2023 ఆర్థిక సంవత్సరం కింద జిల్లా పరిషత్కు ఆర్థిక నివేదికలను ఉత్తమంగా నిర్వహించినందుకు గాను కేంద్ర స్థాయిలో ఈ అవార్డు వచ్చింది. ఢిల్లీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) వారు ఉమ్మడి కృష్ణాజిల్లా పరిషత్కు అరుదైన ఉత్తమ జాతీయ పురస్కారాన్ని ఇచ్చింది. గత నెల ఒకటో తేదీన జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక, వైఎస్సార్ సీపీ పెడన నియోజకవర్గ ఇన్చార్జి ఉప్పాల రాము దంపతులు ఢిల్లీలోని కేంద్ర న్యాయ శాఖామంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, ఐసీఏఐ ప్రెసిడెంట్ రంజిత్కుమార్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. -
వందే వనితరం
సమాజానికి నగిషీలుగా మారుతున్న మహిళామణులు అందం, అభినయం, అణకువ ఒకప్పటి మహిళకు నిర్వచనం.. పరిణతి, పరిపక్వత, పరాక్రమం నేటి మహిళ సొంతం.. ఆమె ఆకాశంలో సగం కాదు.. ఇప్పుడు ఆమే ఆకాశం.. ‘ఇందుగలరు.. అందులేర’ని సందేహం లేకుండా అన్ని రంగాల్లో విజయకేతనం ఎగురవేస్తున్నారు. ఆత్మవిశ్వాసాన్ని ఆభరణంగా మలచుకొని.. విభిన్న వేదికలపై ‘వనిత’ర సాధ్యులమని చాటి చెబుతున్నారు. సర్పంచి నుంచి రాష్ట్రపతి వరకూ.. ఉపాధ్యాయ ఉద్యోగాల నుంచి దేశాన్ని రక్షించే త్రివిధ దళాల వరకూ ప్రతి చోట పురుషులకు దీటుగా సత్తా చాటుతున్నారు. అన్నింటా తెగువ చూపుతూ సమాజానికి నగిషీలుగా మారుతున్నారు. ‘ఇంతి’ంతై.. విశ్వమంతై అన్నట్లుగా జగతి ప్రగతికి మేము సైతం అంటూ నడుం బిగిస్తున్నారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న మగువల మనోగతం మీ కోసం.. -
ఆకాశమే హద్దుగా..
మహిళలు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతున్నారు. వ్యాపార, వాణిజ్య రంగాల్లో విజయం సాధిస్తున్నారు. ఆకాశమే హద్దుగా మహిళలు దూసుకుపోతున్నారు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. చట్ట సభల్లోనూ అత్యధిక సీట్లు మహిళలు విజయం సాధిస్తున్నారు. అనేక నామినేటెడ్ పదవుల్లోనూ మహిళలకు ప్రాధాన్యం పెరిగింది. విజయవాడ నగరపాలకసంస్థ పరిధిలో అనేక మంది మహిళలు కార్పొరేటర్లుగా గెలిచారు. రాష్ట్రంలో డ్వాక్రా మహిళలు సైతం చిన్న వ్యాపార సంస్థలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ప్రధానంగా మహిళలు విద్యావంతులైతే ఆ కుటుంబం మంచి ఉన్నతిని సాధిస్తుంది. ప్రతి కుటుంబం ఆడపిల్లలకు ఉన్నత చదువులు చదివించేందుకు కృషి చేయాలి. – రాయన భాగ్యలక్ష్మి, మేయర్, విజయవాడ నగర పాలక సంస్థ -
ఆదర్శ మహిళా సర్పంచ్గా కోటమ్మ
జి.కొండూరు: పురుషులతో సమానంగా మహిళలు రాజకీయాలలో రాణించగలరని భావించి రాజకీయాలలో మహిళలకు యాభైశాతం రిజర్వేషన్ను అమలు చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలు సాకారమవుతున్నాయి. అవకాశాన్ని అందిపుచ్చుకొని ఎన్టీఆర్ జిల్లా, మైలవరం మండల పరిధి పొందుగల గ్రామ పంచాయతీ నుంచి మొదటి మహిళా సర్పంచ్గా ఎన్నికై న గుగులోతు కోటమ్మ విభిన్నమైన ప్రణాళికతో పొందుగలను ఉత్తమ గ్రామ పంచాయతీగా నిలిపి కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డును అందుకున్నారు. సర్పంచ్ కోటమ్మ చదివింది పదో తరగతి. ఏడు ఓట్ల మెజారిటీతో మహిళా సర్పంచ్గా గెలుపొందారు. తనకి ఓటు వేసిన వారే కాదు.. ఓటు వేయని వారికి కూడా తాను సర్పంచ్ననే భావనతో ఎటువంటి వివక్షకు తావులేకుండా గ్రామాభివృద్ధే ద్యేయంగా పని చేశారు. గ్రామ పంచాయతీలో లేబర్ కాంట్రాక్టరుగా, గుమాస్తాగా పని చేసిన తన భర్త అనుభవాన్ని కూడగట్టుకొని, రాజకీయాలకతీతంగా నిధుల లభ్యతను అందిపుచ్చుకొని, ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చి దిద్దడంలో విజయం సాధించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక మహిళగా రాజకీయాలలో పురుషుల కంటే తామేమీ తక్కువ కాదని నిరూపించిన పొందుగల సర్పంచ్ గుగులోతు కోటమ్మకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. -
మగపిల్లలతో సమానంగా చూడాలి..
సమాజం మగపిల్లలతో పాటుగా ఆడపిల్లలను సమానంగా చూడాలి. ఎంత అభివృద్ధి సాధించినా ఇంకా వివక్ష కొంత కొనసాగుతోంది. మహిళలు విద్యావంతులైనప్పుడే సమాజం అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంది. ఆడపిల్లలను వారి తల్లిదండ్రులు చదివించటంతో పాటుగా సమాజంలో తిరగటానికి అవకాశం ఇవ్వాలి. తద్వారా కెరీర్పై అవగాహన పెరుగుతుంది. అలాగే ప్రేమ, వివాహం మాత్రమే జీవితం కాదు. తమకాళ్లపై తాము నిలబడే దిశగా మహిళలు కృషి చేసి ఆర్థికంగా నిలదొక్కుకోవటానికి ప్రయత్నించాలి. – ఆచార్య ఎన్. ఉషా, రిజిస్ట్రార్ కృష్ణా విశ్వవిద్యాలయం -
కదులుతున్న డొంక!
ప్రత్యేక కమిటీ ముందుకు ‘ఆ ముగ్గురు’! దుర్గమ్మ చీరల విభాగంలో 2018 నుంచి 2023 వరకు బాధ్యతలు నిర్వర్తించిన వారిలో సుబ్రహ్మణ్యం, చెన్నకేశవరావు, రమేష్ కీలకంగా ఉన్నట్లు గుర్తించారు. 2018 నుంచి 2019 వరకు చీరల వ్యవహారంలో గోల్మాల్ జరగగా, ఆ సమయంలో సుబ్రహ్మణ్యం విధుల్లో ఉన్నారు. ఆ తర్వాత చీరల విభాగానికి వచ్చిన మిగిలిన వారు పాత రికార్డులను పట్టించుకోకుండా, తాము బాధ్యతలు స్వీకరించిన తర్వాత వచ్చిన చీరల వివరాలను మాత్రమే రికార్డులలో పొందుపరిచారు. తాజాగా ప్రత్యేక కమిటీ ఆ ముగ్గురు ఉద్యోగులను విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చీరల గోల్మాల్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన సుబ్రహ్మణ్యం ప్రస్తుతం కూటమి నేతల పంచన చేరారు. కూటమి మంత్రి చేత మాట్లాడించి ప్రత్యేక కమిటీ ముందు హాజరు కాకుండా ఉండేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జనసేనకు చెందిన ఓ మంత్రి సాయంతో ఈ వ్యవహారం నుంచి బయట పడాలని చూస్తున్నట్లు సమాచారం. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గగుడిలో చీరల స్కామ్పై శుక్రవారం ప్రత్యేక కమిటీ విచారణ చేపట్టింది. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని మహా మండపం 5వ అంతస్తులోని చీరల విభాగంలో దేవదాయ శాఖ గుంటూరు డెప్యూటీ కమిషనర్ కేబీ రావు పర్యవేక్షణలో మొత్తం ముగ్గురు ఏసీలు విచారణ చేపట్టారు. దేవస్థాన పరిపాలనా విభాగం, లీజెస్ సెక్షన్తో పాటు చీరల విభాగానికి చెందిన ఉద్యోగులు ప్రత్యేక కమిటీ బృందం ముందు హాజరయ్యారు. చీరల స్కామ్ జరిగినప్పటి రికార్డులను ఇవ్వాలని వారు కోరగా, వాటితో పాటు తాను గతంలో చేసిన విచారణ తాలుకూ రిపోర్డును ఏఈవో సుధారాణి ప్రత్యేక కమిటీకి అందజేశారు. అసలు విషయం ఏమిటంటే.. 2018 నుంచి 2019 వరకు చీరల వ్యవహారంలో గోల్మాల్ జరిగినట్లు గతంలోనే గుర్తించారు. మొత్తం రూ. 2కోట్ల విలువైన 33,686 చీరలు మాయం కాగా వాటి స్థానంలో నాసిరకం, నాణ్యత లేని చీరలను ఉంచినట్లు గుర్తించారు. అయితే చీరల స్కామ్ జరిగినప్పుడు ఎవరెవరూ ఆ విభాగంలో విధులు నిర్వర్తించారు.. ఆ తర్వాత ఎవరు బాధ్యతలు తీసుకున్నారనే దానిపై దేవస్థాన పరిపాలనా విభాగం నుంచి రికార్డులను తెప్పించుకుని కమిటీ పర్యవేక్షించినట్లు తెలుస్తోంది. శుక్రవారం జరిగిన విచారణలో చీరల విభాగంలో విధులు నిర్వర్తించిన పలువురు ఉద్యోగులు ప్రత్యేక కమిటీ ముందు హాజరై వివరాలను వెల్లడించారు. సెక్షన్ బాధ్యతలు తమపై ఉన్నా.. భక్తులు సమర్పించిన చీరలు, కౌంటర్లో అమ్మకాలు, చీరల నిల్వ వంటి అంశాలన్నీ గుమాస్తాల పర్యవేక్షణలో జరిగాయని తెలియజేశారు. శనివారం కూడా ప్రత్యేక కమిటీ విచారణ చేపట్టే అవకాశాలున్నాయని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. అధికారి మెప్పు కోసమేనా! 2018 నుంచి 2019ల మధ్య తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా, ఆ సమయంలో సుబ్రహ్మణ్యం ఉన్నతాధికారుల మెప్పు కోసమే చీరలను గోల్మాల్ చేసినట్లు అప్పట్లో దుర్గగుడిలో ప్రచారం జరిగింది. కొంత మంది అధికారులు, అప్పటి ప్రజాప్రతినిధులకు భారీ ఖరీదైన పట్టు చీరలను సమర్పించి, వాటి స్థానంలో నాసిరకం, తక్కువ రేటు ఉన్న చీరలను ఉంచినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దుర్గమ్మ చీరల స్కామ్లో విచారణ చేపట్టిన ప్రత్యేక కమిటీ -
ఆర్థిక స్వావలంబన సాధించాలి..
ఆడపిల్లలకు చదువెందుకు అన్న వ్యవస్థ నుంచి చాలా ముందడుగు వేశాం. సావిత్రిబాయి పూలే, అంబేడ్కర్ వంటి వ్యక్తుల కృషి వల్ల మహిళలు విద్యారంగంలో అడుగులు వేస్తున్నారు. అయితే కనీసం డిగ్రీ చదివితేనే అది మహిళలకు అండగా ఉంటుంది. చాలా మంది డిగ్రీ లోపే చదువును ఆపేస్తున్నారు. వారి తల్లిదండ్రులు పెళ్లిళ్లు చేసేస్తున్నారు. అది మారాలి. జీవితంలో ఏ కష్టమొచ్చినా నిలదొక్కుకోవాలంటే ఆర్థిక స్వావలంబన దిశగా మహిళలు అడుగులు వేయాలి. అందుకు కనీసం డిగ్రీ చేతిలో ఉంటే ఆ ధైర్యం వేరుగా ఉంటుంది. – డాక్టర్ కె. భాగ్యలక్ష్మి, ప్రిన్సిపాల్, ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ కళాశాల -
● టిక్కిల్ రోడ్డులో నివసించే యువకుడు తాజాగా ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. ఇంకా ఫైనలియర్ ఫలితాలు రాకపోవడంతో నిత్యం ఐజీఎం స్టేడియానికి బాస్కెట్బాల్ ఆడేందుకు వస్తుంటాడు. యువకుడు ఇంటి నుంచి సైకిల్పై గ్రౌండ్కు వస్తుంటాడు. ఆ సైకిల్ ఖరీదు ఎంతంటే సింపుల్గా రూ
● నగరానికి చెందిన ఒక న్యూరోసర్జన్ ప్రతిరోజూ వాలీబాల్ ఆడేందుకు ఐజీఎంసీ స్టేడియానికి వస్తుంటారు. రెండు గంటల పాటు వాలీబాల్ ఆడిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్తుంటారు. ఆయన రాకపోకలకు సైకిల్ వినియోగిస్తుంటారు. అదేమంటే అదే మనకు ఆరోగ్యాన్నిస్తుందంటారు. వీళ్లేకాదు.. సెలవు రోజుల్లో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి క్రికెట్ వంటి క్రీడలు ఆడేందుకు వచ్చే యువకులు పదుల సంఖ్యలో సైకిళ్లపైనే వస్తున్నారు. వాటిల్లో ఎక్కువ శాతం ఖరీదైన సైకిళ్లే ఉంటున్నాయి. కొన్ని విదేశీ సైకిళ్లు కూడా ఉంటున్నాయి. యువత, టీనేజ్ ఆసక్తికి అనుగుణంగా అధునాతన మోడల్ సైకిళ్లు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. -
అంతర్జాతీయ జలక్రీడలకు నాగాయలంక యువతి
నాగాయలంక: థాయిలాండ్లో శుక్రవారం నుంచి నిర్వహించనున్న అంతర్జాతీయ జలక్రీడల్లో ఏపీ స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో కెనోయింగ్ కయాకింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున కెనోయ్ స్లాలమ్లో పాల్గొనేందుకు నాగాయలంక వాటర్ స్పోర్ట్స్ క్రీడాకారిణి నాగిడి గాయత్రి ఎంపికై ంది. ఇప్పటికే థాయిలాండ్ చేరుకున్న ఈ యువతి స్లాలమ్ ఈవెంట్లో సీనియర్, జూనియర్ విభాగాలలో పాల్గొంటుందని అసోసియేషన్ అధ్యక్షుడు బలరామ్ నాయుడు, అడ్వయిజర్ తిప్పిరెడ్డి శివారెడ్డి ద్వారా గురువారం తెలిసింది. గాయత్రి 2023లో గోవాలో జరిగిన నేషనల్ గేమ్స్లో రజత పతకం, ఈ ఏడాది గత నెలలో ఉత్తరాఖండ్ రాష్ట్రం శివపురి ప్రాంతంలోని గంగానదిలో జరిగిన నేషనల్స్లో బంగారు పతకం సాధించింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తరఫున అంతర్జాతీయ స్థాయిలో జలక్రీడలకు ఎంపికై న గాయత్రిని ఈ ప్రాంతంలో పలువురు ప్రముఖులు అభినందించారు. పతకాలతో తిరిగిరావాలని అభిలషించారు. కొనసాగుతున్న పశువైద్య విద్యార్థుల రిలే దీక్షలు గన్నవరం: ఉపకార వేతనాలు పెంచాలని స్థానిక ఎన్టీఆర్ పశువైద్య కళాశాల విద్యార్థులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం 33వ రోజుకు చేరుకున్నాయి. కళాశాల ఎదుట బైఠాయించిన పశువైద్య విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి నిరసన తెలియజేశారు. ఈ సంద ర్భంగా వెటర్నరీ విద్యార్థినులు ఐశ్వర్య, మృదు ల, హరిత, కోమలి మాట్లాడుతూ మెడికల్, డెంటల్ విద్యార్థులకు రూ. 25 వేలు వరకు స్టైఫండ్ ఇస్తున్న ప్రభుత్వం వెటర్నరీ విద్యార్థులకు మాత్రం గత పదమూడేళ్లుగా రూ. 7 వేలు చొప్పున చెల్లిస్తుండడం అన్యాయమన్నారు. ఉపకార వేతనాలు పెంచాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా పట్టించుకునేవారే కరువయ్యారని వాపోయారు. ఇప్పటికై నా స్పందించి స్టైఫండ్ను కనీసం రూ. 15 వేలకు పెంచాలని, ఈ దిశగా ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వచ్చే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కదం తొక్కిన కోకో రైతులు ఏలూరు (టూటౌన్): కంపెనీలు సిండికేట్గా మారి కోకో గింజల ధర తగ్గిస్తున్నాయంటూ ఏలూరులో రైతులు కదం తొక్కారు. చలో ఏలూరు కార్యక్రమంలో భాగంగా రైతులు ర్యాలీ, మహాధర్నా చేపట్టారు. ముందుగా ఫైర్స్టేషన్ మీదుగా ఉద్యాన శాఖ డీడీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేసి కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ధర్నాను ఉద్దేశించి ఏపీ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ కోకో గింజలను అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం కిలోకు రూ.900 ధర ఇప్పించాలని, సిండికేట్గా మారిన కంపెనీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం అందుకున్న కలెక్టర్ వెట్రిసెల్వి రైతులతో చర్చలు జరిపి వారి సమస్యలు తెలుసుకున్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామన్నారు. ఏలూరుతో పాటు పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల రైతులు భారీగా తరలివచ్చారు. -
ఎవర్గ్రీన్ సైకిల్
● విజయవాడలో సైక్లింగ్కు సై అంటున్న యువత ● ఫిట్నెస్ కోసం కొందరు.. స్టైల్ కోసం మరికొందరు ● ఖరీదైన మోడళ్లపై మోజు ● విదేశీ సైకిళ్లకు డిమాండ్ ● ఆరోగ్యదాయకమే అంటున్న నిపుణులు ప్రతిరోజూ సైకిల్ తొక్కుతా.. ప్రతిరోజూ 20 నుంచి 25 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతా. దీని వల్ల రోజంతా యాక్టివ్గా ఉంటాం. ఎనిమిదేళ్ల కిందట సైకిల్ తొక్కడం ప్రారంభించా. తొలుత ఐదారు కిలో మీటర్లు తొక్కేవాడిని, ఇప్పుడు ఉదయాన్నే 25 కి.మీల వరకూ తొక్కడం ప్రారంభించా. నగరంలో తీవ్ర ట్రాఫిక్తో సైకిల్ తొక్కేందుకు అనువైన రోడ్లు లేవు. సైకిల్ ట్రాక్లు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. – చలపాక కిరణ్కుమార్, వ్యాపారి సైకిల్ ఇష్టంగా వాడతా.. నా చిన్నప్పటి నుంచి సైకిల్ను ఇష్టంగా వాడతా. ఇప్పటికీ బాస్కెట్బాల్ ఆడేందుకు స్టేడియానికి సైకిల్ పైనే వెళ్తుంటా. నాకు ఇష్టమైన సైకిల్ను కొనుగోలు చేశా. వైద్య కళాశాలకు వెళ్లి వస్తూనే ప్రతిరోజూ కొద్ది సమయం సైకిల్కు కేటాయిస్తా. సెలవు రోజుల్లో దానిపైనే బయటకు వెళ్తుంటా. మా అమ్మా, నాన్న ఇద్దరూ వైద్యులే. ఖరీదైన బైక్ కంటే నాకు సైకిల్ అంటేనే ఇష్టం. నచ్చిన మోడల్ను రూ.40 వేలు పెట్టి కొన్నా. – అక్రమ్ షరీఫ్, వైద్య విద్యార్థి గుడ్ మార్నింగ్.. ఇదొక్క అందమైన మార్నింగ్.. అంటూ సూర్యోదయానికి ముందే ట్రింగ్ ట్రింగ్ మనే సైకిల్ బెల్.. కాసేపైన తర్వాత అదే శబ్దం మరోసారి.. ఇది పాలవాడి సైరన్.. మరికాసేపైన తర్వాత అదే సైకిల్ బెల్.. ఇది మన ఇంట్లోని పిల్లలు స్కూల్కి బయలుదేరిన శబ్దం.. ఇలా మనిషి జీవన గమనంలో సైకిల్ అనేది అతి ప్రాముఖ్యమైన, నిత్యావసరమైన సాధనంగా ఉండేది. ముఖ్యంగా సామాన్యుడి వాహనంగా పేరుగడించింది. కాల క్రమంలో మోటారు వాహనాల రాకతో సైకిల్ వన్నె తగ్గినట్లు కనిపించింది. కానీ ఇప్పుడు అదే సైకిల్ శ్రీమంతుడి వాహనంగా రూపాంతరం చెందింది. ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ నడవడమో, సైకిల్ తొక్కడమో చేయాల్సిందేనని డాక్టర్లు చెబుతుంటే మళ్లీ ఫ్లాష్ బ్యాక్ ‘చక్రాల్లోకి’ వెళ్లక తప్పడం లేదు. యువత కూడా ఖరీదైన సైకిల్ను తొక్కడం ఫ్యాషన్గా భావిస్తోంది. సైకిల్ కూడా కాలానుగుణంగా తన రూపురేఖలు మార్చుకొని తాను ‘ఎవర్గ్రీన్’ అని చాటిచెబుతోంది. – లబ్బీపేట(విజయవాడతూర్పు) -
మార్కెట్లు తరలుతున్నాయ్!
● వీఎంసీ సమీపంలోని పూల, కూరగాయల మార్కెట్ల తరలింపు దిశగా అడుగులు ● రైల్వే స్థలం కావడంతో ఖాళీ చేయాలని అధికారుల ఒత్తిడి ● కూరగాయల మార్కెట్ను నున్నలో, పూల మార్కెట్ వాంబే కాలనీలో ఏర్పాటు చేసే యోచన ● వ్యాపారులతో చర్చించిన సెంట్రల్ నియోజకవర్గ ప్రజాప్రతినిధి అనుచరులు ● నెలకు రూ. 5లక్షలు ఇవ్వాలని ప్రతిపాదన సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ కార్పొరేషన్ కార్యాలయం సమీపంలో ఉన్న మార్కెట్ల తరలింపు దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం రైల్వే స్థలంలో రాజీవ్ గాంధీ హోల్సేల్ పూల మార్కెట్, రాజీవ్ గాంధీ హోల్సేల్ కూరగాయల మార్కెట్లు కొనసాగుతున్నాయి. 40 ఏళ్ల కిత్రం ఈ ప్రాంతంలో కూరగాయల మార్కెట్ తొలుత ఏర్పడింది. 1990 వరకు వన్టౌన్ పంజా సెంటర్ ప్రాంతంలో పూల మార్కెట్ ఉండేది. తర్వాత దానిని కూడా అక్కడి నుంచి వీఎంసీ కార్యాలయం పక్కన ఉన్న రైల్వే స్థలానికి తరలించారు. ఈ మార్కెట్లకు విజయవాడలో ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. తరలించాల్సిందే.. రైల్వే అధికారులు గత కొంత కాలం నుంచి తమ స్థలాన్ని ఖాళీ చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. ప్రస్తుతం రైల్వే డీజీఎం తమ స్థలం ఖాళీ చేసి ఇవ్వాలని గట్టిగా పట్టు పడుతుండటంతో ప్రత్యామ్నాయం వైపు దిశగా కార్పొరేషన్ అధికారులు అడుగులు వేస్తున్నారు. ఈ స్థలం విషయమై రైల్వే అధికారులు స్థానిక ఎంపీని సైతం కలిసి, తమ స్థలం ఖాళీ చేయించాలని ఇటీవల విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. దీంతో ఆయన సైతం రైల్వేశాఖ స్థలం వారికి అప్పగించి, మార్కెట్లను వేరే ప్రాంతంలో ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించినట్లు సమాచారం. గతంలోనే ప్రతిపాదనలు.. గత టీడీపీ హయాంలో పూల, కూరగాయల మార్కెట్కు వాంబే కాలనీలోని డంపింగ్ యార్డు ప్రాంతంలో స్థలం కేటాయించి, షాపుల కోసం ఫౌండేషన్ వేసి, వదిలేశారు. అయితే ప్రస్తుతం పూల, కూరగాయ మార్కెట్ తరలిస్తే అక్కడే ఏర్పాటు చేయాలనే విషయంలో కార్పొరేషన్ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఆ ప్రాంతం తమకు అనువైన ప్రాంతం కాదని, పూలవ్యాపారులు అక్కడికి వెళ్లేందుకు పెద్దగా ఆసక్తి చూపటం లేదు. పూల మార్కెట్ వ్యాపారులతో.. మార్కెట్ తరలించే ప్రాంతం వాంబే కాలనీలో ఉండటంతో, సెంట్రల్ నియోజక వర్గ ప్రజాప్రతినిధికి ‘కొండ’లా ఉండే ప్రధాన అనుచరునితోపాటు, కొంత మంది ఇటీవల పూల మార్కెట్లో వ్యాపారులతో చర్చించినట్లు తెలిసింది. పూల మార్కెట్ అక్కడికి తరలితే, నెలకు ప్రజా ప్రతినిధికి రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పాటు, అక్కడ ఏర్పాటు చేసే షాపుల్లో 10 షాపులను టీడీపీ కి చెందిన అనుచరులకు ఇవ్వాలని ముందే ప్రతిపాదించారు. అక్కడ షాపులు ఏర్పాటు కాకముందే ఈ బేరాలు ఏంటని వ్యాపారులు బెంబేలెత్తి పోతున్నారు. అక్కడ సెంట్రల్ ప్రజా ప్రతినిధి అనుచరులతో జరిగిన చర్చల సారాంశాన్ని బయటికి వెల్లడి చేసేందుకు పూల వ్యాపారులు ఇష్టపడటం లేదు. ఫోన్లో వివరణ కోసం ప్రయత్నించినా కార్పొరేషన్ అధికారులు స్పందించలేదు. నున్నకు తరలివెళ్తాం.. ట్రాఫిక్ సమస్యలతో పాటుగా ఇతర ప్రభుత్వ శాఖల సూచనలతో మేం విశాలంగా ఉండే ఇతర ప్రాంతానికి తరలివెళ్లాలని నిర్ణయించుకున్నాం. అందులో భాగంగా మా సంఘం తరఫున సున్నలో ఏడు ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశాం. అందులో దుకాణాలను నిర్మించుకున్నాం. రానున్న రెండుమూడు మాసాల్లో మా దుకాణాలను అక్కడకు తరలించేందుకు సిద్ధమవుతున్నాం. మా సంఘంలో 64 మంది సభ్యులు ఉన్నారు. అందరూ అక్కడకు తరలివస్తారు. ఇతర సంఘాలతో మాకు సంబంధం లేదు. – సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి, హోల్ సేల్ కూరగాయల మార్కెట్ సంఘ నేత మేం ఇక్కడే ఉంటాం.. పాతబస్తీలోని రైల్వేస్టేషన్ వెస్ట్కింగ్ సెంటర్ సమీపంలో ఉన్న మమ్మల్ని ట్రాఫిక్ సమస్యలంటూ ఇక్కడకు తరలించారు. మళ్లీ ఇక్కడి నుంచి వెళ్లిపోమంటున్నారు. మేం ప్రస్తుతానికి ఎక్కడకు తరలివెళ్లటం లేదు. ఇక్కడే ఉంటున్నాం. గతంలో మా మార్కెట్లు తరలించేందుకు అధికారులు సూచనలు చేశారు. అయితే అధికారులు సూచించిన ప్రాంతం మా వ్యాపారానికి అనుకూలంగా లేకపోవటంతో తరలివెళ్లటానికి అంగీకరించలేదు. మా సంఘంలో 85 మంది సభ్యులు ఉన్నారు. – రఫీ, ఉపాధ్యక్షుడు, హోల్సేల్ పూలమార్కెట్ విజయవాడ టు నున్న, వాంబే కాలనీ కూరగాయల మార్కెట్ నున్నలో.. ప్రస్తుతం రాజీవ్ గాంధీహోల్ సేల్ కూరగాయల మార్కెట్లో 64 మంది వ్యాపారులు అసోసియేషన్గా ఏర్పడి, నున్న ప్రాంతంలో 7 ఎకరాల స్థలం కొనుగోలు చేసి, అక్కడ షాపులను సైతం నిర్మించుకున్నారు. మే నెలలో షాపులను అక్కడికి షిఫ్ట్ చేసేందుకు సన్నాహాలు చేసుకొంటున్నారు. ఈ అసోసియేషన్లో లేకుండా మిగిలిన షాపుల వారు కార్పొరేషన్ అధికారులు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసే కూరగాయల మార్కెట్లో ఏర్పాటు చేసే షాపుల వైపు మొగ్గు చూపుతున్నారు. -
విజయవంతం చేద్దాం
తిరుపతమ్మ చిన్న తిరునాళ్లను పెనుగంచిప్రోలు: స్థానిక శ్రీతిరుపతమ్మవారి ఆలయంలో చిన్న తిరునాళ్లను అందరూ సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని నందిగామ డివిజన్ ఆర్డీఓ కె. బాలకృష్ణ ఆదేశించారు. మార్చి 14 నుంచి 18 వరకు ఐదు రోజుల పాటు జరిగే తిరునాళ్ల ఉత్సవాలకు సంబంధించి గురువారం ఆలయ బేడా మండపంలో అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో సమర్థంగా పనిచేయాలన్నారు. తిరునాళ్ల ఉత్సవాలు జరిగే ఐదు రోజులు పారిశుద్ధ్యం, తాగునీటికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. మార్చి 17న పుట్టింటి పసుపు–కుంకుమ బండ్లకు విద్యుత్ దీప కాంతులు ఏర్పాటు చేసే సందర్భంలో తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. భక్తులకు అసౌకర్యం లేకుండా ఆలయం వద్ద పలు శాఖల సమాచార కేంద్రాలతో పాటు, తాగునీటి సౌకర్యం, తాత్కాలికంగా బస్టాండ్ల ఏర్పాటు ఉంటుందన్నారు. పుట్టింటి పసుపు కుంకుమ బండ్లకు ప్రభలు 11 అడుగులకు మించి ఉండకూడదన్నారు. సీసీ కెమెరాలు అన్నీ ఒకే చోట పెట్టకుండా గ్రామంలోకి వచ్చే అన్ని దారుల్లో ఏర్పాటు చేయాలని దేవాలయ అధికారులకు సూచించారు. పసుపు బండ్లు వచ్చే దారిలో తాత్కాలిక దుకాణాలు, ఆక్రమణలు ఉండకుండా పంచాయతీ అధికారులు ఇతర శాఖల సహకారంతో చర్యలు తీసుకోవాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు.. ఆలయ చైర్మన్ జంగాల శ్రీనివాసరావు, ఈఓ బీహెచ్వీఎస్ఎన్ కిషోర్కుమార్ మాట్లాడుతూ ఉత్సవాల సందర్భంగా ఐదు రోజుల పాటు ఆలయం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మునేటిలో భక్తులకు జల్లు స్నానాల ఏర్పాటుతో పాటు మునేరులో తాత్కాలిక కేశఖండనశాల ఏర్పాటు చేస్తామన్నారు. ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ.. నందిగామ ఏసీపీ తిలక్ మాట్లాడుతూ శాంతి భద్రతలకు ఎటువంటి అవరోధం లేకుండా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం తిరునాళ్ల ఉత్సవాల పోస్టర్ను అధికారులు, పాలకవర్గ సభ్యులు ఆవిష్కరించారు. తహసీల్దార్ ఎ. శాంతిలక్ష్మి, ఎంపీడీఓ జి. శ్రీను, ఆలయ ఈఈ ఎల్. రమ, వైద్యాధికారి పి. ఇందిర, జగ్గయ్యపేట సీఐ పి. వెంకటేశ్వర్లు, ఎస్ఐ ఎంఎస్కే అర్జున్, ఇరిగేషన్ జేఈ మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సమన్వయ సమావేశంలో ఆర్డీఓ బాలకృష్ణ -
సైకిల్ అమ్మకాలు పెరిగాయి..
గతంలో కంటే ప్రస్తుతం సైకిల్ విక్రయాలు పెరిగాయి. యువత ఎక్కువగా ఆధునిక మోడల్స్పై ఆసక్తి చూపుతున్నారు. మా వద్ద చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకూ అన్ని వయస్సుల వారికి సైకిళ్లు అందుబాటులో ఉన్నాయి. రూ. 6 వేల నుంచి రూ.6 లక్షల విలువ చేసే స్వ దేశీ, విదేశీ సైకిళ్లు 130కి పైగా మోడళ్లు అందుబాటులో ఉంచాం. యూత్ తమ కిష్టమైన మోడల్ను ముందుగానే ఎంచుకొని స్టోర్కు వస్తున్నారు. – బీఎస్ కిరణ్, పెడల్ జోన్ స్టోర్, విజయవాడ -
ఇదీ పెడల్ పవర్..
● ప్రతిరోజూ సైకిల్ తొక్కడం వల్ల క్యాలరీలు ఖర్చు అవడంతో బరువును నియంత్రించుకోవచ్చు. ● గుండె ఆరోగ్యం మెరుగు పడటంతో పాటు, రక్తప్రసరణ మెరుగవుతుందని సైంటిఫిక్గా నిర్ధారణ అయింది. ● రన్నింగ్ చేయడం కంటే సైకిల్ తొక్కడం వల్ల కీళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. ● స్ట్రెస్ అండ్ యాంగ్జయిటీ నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. ● ఎముకలు పటిష్టంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. ● మోటారు వాహనాల వినియోగం తగ్గించి, సైకిల్ను వినియోగిస్తే పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుంది. ఇది కూడా ఓ కారణమే.. నగర వాసుల్లో ద్విచక్ర వాహనాలు వాడే కొందరు సైకిల్ తొక్కుతూ కనిపిస్తున్నారు. పెరిగిన పెట్రోల్, లైసెన్స్ ఇతర పత్రాలు తనిఖీలు ముమ్మరం చేసి, భారీగా జరిమానాలు విధిస్తుండటం కూడా సైకిళ్ల వైపు మరలడానికి ఒక కారణంగా కనిపిస్తోంది. -
గీత కులాలకు మద్యం షాపుల కేటాయింపు
11 షాపులకు 335 దరఖాస్తులు భవానీపురం(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా కల్లు గీత కులాలకు సంబంధించి మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ గురువారం జరిగింది. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి పరిధిలో గల బీసీ సంక్షేమ భవన్లో ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అధ్యక్షత వహించారు. జిల్లా వ్యాప్తంగా ఆన్లైన్/ఆఫ్లైన్ ద్వారా 335 దరఖాస్తులు దాఖలయ్యాయి. వాటన్నింటినీ పరిశీలించిన అనంతరం కటెక్టర్ లక్ష్మీశ లాటరీ ప్రక్రియ ద్వారా దుకాణాలను కేటాయించారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 71 దరఖాస్తులు వచ్చాయి. అలాగే జగ్గయ్యపేట నుంచి 21, కొండపల్లి మునిసిపాలిటీ నుంచి 47, వీరులపాడు 17, వత్సవాయి 31, తిరువూరు 20, ఎ.కొండూరు 31, నందిగామ 31, రెడ్డిగూడెం 18, విస్సన్నపేట 16 (శెట్టిబలిజ), జగ్గయ్యపేట రూరల్ నుంచి 22 వచ్చాయి. కొన్ని ప్రాంతాల్లోని మద్యం దుకాణాలకు ఒక్కరే నాలుగైదు దరఖాస్తులు చేశారు. ఒక్కో దుకాణానికిగాను మూడు నంబర్లు చొప్పున లాటరీ తీయగా వాటిల్లో మొదటి వ్యక్తిని విజేతగా ప్రకటించారు. రిజర్వ్–1, రిజర్వ్–2గా మరో రెండు నంబర్లను తీశారు. మొదట ప్రకటించిన వ్యక్తికి మరో దుకాణం దక్కి దాని వైపు వెళ్తే వెంటనే రిజర్వ్–1కి కేటాయిస్తారు. అతను ముందుకు రాని పక్షంలో రిజర్వ్–2కు కేటాయిస్తారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ డెప్యూటీ కమిషనర్ టి. శ్రీనివాసరావు, డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఆఫీసర్ ఎస్. శ్రీనివాసరావు, అసిస్టెంట్ డీపీఈఓ రామశివ, భవానీపురం ఎకై ్సజ్ స్టేషన్ సీఐ పి. గోపాలకృష్ణ పాల్గొన్నారు. ప్రభుత్వానికి రూ.6.70 కోట్ల ఆదాయం ఒక మద్యం దుకాణం కోసం దరఖాస్తు చేయాలంటే రూ.2లక్షలు ముందస్తుగా చెల్లించాల్సి ఉంది (నాన్ రిఫండబుల్). ఆ విధంగా 335 దరఖాస్తుల ద్వారా రూ.6.70 కోట్ల మేర ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. ఇది కాకుండా ఒక్కో దుకాణం లైసెన్స్ ఫీజు నిమిత్తం రూ.30లక్షలు చెల్లించాలి. లాటరీ ద్వారా ఎన్నికై న వ్యక్తి నిర్ణయించిన ఫీజు మొత్తంలో వెంటనే 1/4 మొత్తాన్ని చెల్లించాల్సి ఉంది. -
కులాంతర వివాహాలకు రక్షణ కల్పించాలని వినతి
కృష్ణలంక(విజయవాడతూర్పు): కులాంతర వివాహాలకు రక్షణ కల్పించాలని, కన్న బిడ్డలను హత్య చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని ఐద్వా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు బి.ప్రభావతి, డి.రమాదేవి గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కుప్పం నియోజకవర్గంలో ప్రేమ వివాహం చేసుకున్నందుకు కన్నకూతురిపై, మధ్యవర్తులుగా వచ్చిన వారిపై యువతి తండ్రి శివప్ప దాడిచేసిన ఘటనపై, అనంతపురం జిల్లాలోని గుంతకల్లులో రామాంజనేయులు తన కుమార్తె భారతి ప్రేమను అంగీకరించలేక ఉరేసి చంపి, ఆపై పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటనలపై త్వరితగతిన విచారణ పూర్తి చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దారుణాలు ఎందుకు జరుగుతున్నాయో ప్రభుత్వం పరిశీలన చేసి నివారణా చర్యలు చేపట్టాలని కోరారు. కులాంతర వివాహాలు చేసుకున్న వారికి, చేసుకోబోయే వారికి రక్షణ, భద్రత, ఆసరా కల్పించాల్సిన ప్రభుత్వాలు మౌనం వహిస్తూ పరో క్షంగా కుల అహంకారులకు మద్దతు పలకడం దారుణమని పేర్కొన్నారు. ప్రేమగా పెంచుకున్న బిడ్డలను హత్య చేసి హంతకులుగా మార్చుతున్న కుల అహంకార ప్రచారాలపై, దళిత, ఆదివాసీలపై జరుగుతున్న దాడులపై, వివక్షతపై చర్యలు తీసుకోవాలని, నిందితులైన రామాంజనేయులు, శివప్పను ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా విచారణ చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. కులాంతర వివాహం చేసుకున్న కౌసల్య, చంద్రశేఖర్కు కేరళ ప్రభుత్వం మాదిరిగా రూ.10 లక్షల పారితోషికం, ఇల్లు, ఉద్యోగం ఇవ్వాలని కోరారు. ప్రేమ వివాహం చేసుకునే వారికి దండల వివాహాన్ని గుర్తించి వివాహ పద్ధతిని సులభతరం చేయాలని కోరారు. కుల ఉన్మాదాలను సమూలంగా అరికట్టే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. -
ఆధునిక మోడళ్లపై ఆసక్తి..
పాత తరం నాటి సైకిళ్లకు స్వస్తి చెప్పేశారు. ఇప్పుడు ఎక్కవ మంది ఆధునిక మోడల్ సైకిళ్లపై మోజు చూపుతున్నారు. అంతేకాదు తమ ఎత్తుకు అనువుగా ఉండే సైకిల్ను ఎంచుకుంటున్నారు. సైకిల్ తొక్కినా ఎలాంటి కీళ్లు, మజిల్స్ నొప్పులు రాకుండా ఉండేందుకు తమ ఎత్తుకు అనువుగా ఉండే సైకిల్స్ను ఎంచుకుంటున్నారు. అంతేకాక సైకిల్ స్టోర్స్లో సైతం ఎత్తు, బరువుకు తగిన సైకిల్ను ఎంపిక చేసుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకూ ఏ సైజు సైకిల్ వారికి సరిపోతుందో చూసి విక్రయిస్తున్నారు. -
డెప్యూటీ సీఎం గన్నవరం పర్యటన వాయిదా
గన్నవరం: స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్ చేతుల మీదుగా శుక్రవారం జరగాల్సిన స్వర్ణ పంచా యతీ వెబ్సైట్ ప్రారంభోత్సవ కార్యక్రమం వాయిదా పడింది. ఈ మేరకు అధికార వర్గాలు గురువారం ఓ ప్రకటనలో తెలిపాయి. రెండు, మూడు వారాల తర్వాత ఈ కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ కార్యక్రమం నిర్వహణకు సంబంధించి పలు ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది మూడు రోజులుగా శ్రమిస్తున్నారు. జాతీయ రహదారి నుంచి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వరకు రోడ్డు నిర్మించడంతోపాటు కళాశాల పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. కళాశాల ఆవరణలో స్టేజీ నిర్మాణం దాదాపుగా పూర్తయింది. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పర్యటన వాయిదాపడింది. ‘టీబీ ముక్త్ పంచాయతీ’ కమిటీ సమావేశం లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లాలో టీబీ ముక్త్ పంచాయతీలుగా ఎంపికై న ఇబ్రహీంపట్నం, మూలపాడు, నందిగామ మండలం పల్లగిరి గ్రామాలు కమిటీ సభ్యులు పరిశీలన పూర్తి కాగా, ఆ కమిటీల సమావేశం గురువారం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ మాచర్ల సుహసిని అధ్యక్షతన నగరంలోని తమ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. జిల్లా టీబీ అధికారి డాక్టర్ జె ఉషారాణి, డాక్టర్ కె. శ్రీనివాసరావు , ఐఎంఏ ప్రతినిధి డాక్టర్ విజయ్ కృష్ణ , డీపీసీ దినేష్ చాట్రగడ్డ, లీలా కుమార్, తిరుపతమ్మ పాల్గొన్నారు. రేపు జాతీయ లోక్ అదాలత్ విజయవాడలీగల్: విజయవాడ కోర్టుల్లో శనివారం జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందని మండల న్యాయసేవా అధికార సంస్థ చైర్మన్, రెండో అదనపు జిల్లా జడ్జి ఎ.సత్యానంద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దీర్ఘకాలంగా కోర్టుల్లో పెండింగ్లో ఉన్న సివిల్, పరిష్కరించదగిన క్రిమినల్ కేసులను లోక్అదాలత్ ద్వారా త్వరితగతిన కక్షిదారులు పరిష్కరించుకునేందుకు ఇదొక చక్కని అవకాశమని సూచించారు. జాతీయ లోక్ అదాలత్ కోసం 12 బెంచ్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. -
భవనంపై నుంచి పడి కార్మికుడు మృతి
పెనమలూరు: మండలంలోని పోరంకిలో నిర్మాణంలో ఉన్న భవనం పైనుంచి ఓ కార్మికుడు ప్రమాదవశాత్తు కిందకు పడి మృతి చెందాడు. ఈ ఘటనపై పెనమలూరు పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. సీఐ వెంకటరమణ కథనం మేరకు.. ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రం మహారాజ్గంజ్ జిల్లా మహదేవ గ్రామానికి చెందిన అమిత్కుమార్ కొద్ది కాలం క్రితం అదే గ్రామానికి చెందిన విశాల్కుమార్ (23), మరి కొందరితో కలిసి పెయింటింగ్ పనులకు పోరంకి వచ్చారు. వారు పోరంకి లోని ఓ నిర్మాణ సంస్థలో ఎనిమిది అంతస్తుల భవనంలో పెయింటింగ్ పని చేస్తున్నారు. మంగళవారం పనులు ముగించుకుని అందరూ అదే భవనంలో మొదటి అంతస్తులో నిద్రపోయారు. అర్ధరాత్రి అమిత్కుమార్కు మెలకువ వచ్చి చూడగా నిద్రించిన కార్మికుల్లో విశాల్కుమార్ కనబడలేదు. దీంతో అందరు నిద్రలేచి అతని కోసం వెతికారు. అయితే విశాల్కుమార్ లిఫ్టు కోసం సెల్లార్లో ఏర్పాటు చేసిన గుంతలో రక్తం మడుగులో పడి శవమై కనిపించాడు. అతను అర్ధరాత్రి నిద్రలేచి పై నుంచి లిఫ్టు గుంతలో మూత్రం పోస్తూ ప్రమాదవశాత్తు కిందపడి చనిపోయాడు. ఆ సమయంలో అతను మద్యం మత్తులో ఉన్నాడని ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అమిత్కుమార్ తెలిపాడు. ఈ ఘటనపై పోలీసులకు ఆలస్యంగా ఫిర్యాదు అందటంతో కేసు నమోదు చేశారు. ఉరేసుకుని గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య తోట్లవల్లూరు: చెట్టుకు ఉరేసుకుని గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పదస్థితిలో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని చాగంటిపాడు శివారు కళ్లంవారిపాలెం వద్ద జరిగింది. పోలీసుల కథనం మేరకు.. స్థానిక కృష్ణానది ఆవలి ఒడ్డున ఉన్న ఓ పొలంలోని టేకు చెట్టుకు గుర్తు తెలియన వ్యక్తి బుధవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సమాచారం అందుకున్న ఎస్ఐ అవినాష్ ఘటనాస్థలాన్ని సందర్శించారు. మృతుడి వయసు 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. మృతుడి ఎడమ చేతి మీద డిజైన్, బ్రూస్లీ అని, కుడి చేతి మీద నాయక్, ప్రేమకావాలి, కాజల్, అమ్మ, నాన్న, గంగ అని, ఛాతీపైన పోలమ్మ, కాజల్, బసవమ్మ అని పచ్చబొట్లు ఉన్నాయి. మృతుని ఒంటిపై చొక్కా, టవల్ మాత్రమే ఉన్నాయి. మొక్కజొన్న పొలాల రక్షణకు వినియోగిస్తున్న చీరతో ఉరేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వీఆర్ఓ బాలకోటయ్య ఫిర్యాదు మేరకు ఎస్ఐ అవినాష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాలికను వేధిస్తున్న ఇద్దరిపై పోక్సో కేసు కంకిపాడు: బాలికను వేధిస్తున్న ఇద్దరిపై కంకిపాడు పోలీసుస్టేషన్లో పోక్సో చట్టం కింద గురువారం కేసు నమోదైంది. ఎస్ఐ డి.సందీప్ కథనం మేరకు.. మండలంలోని గొడవర్రు గ్రామానికి బాలుడు, మరో వ్యక్తి మేకల రాజశేఖర్ ఆదే గ్రామానికి చెందిన బాలిక వెంట పడి వేధింపులకు గురిచేస్తున్నారు. వారిపై బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు బాలుడు, రాజశేఖర్పై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సందీప్ తెలిపారు. ఆర్టీసీను ఢీకొట్టిన ప్యాసింజర్ ఆటో ●ఒకరు మృతి, మరో ఆరుగురికి గాయాలు ● చిట్టిగూడూరు వద్ద హైవేపై జరిగిన ప్రమాదం గూడూరు: విజయవాడ –మచిలీపట్నం జాతీయ రహదారిపై గూడూరు మండలం చిట్టిగూడూరు వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు. ఆర్టీసీ బస్సును ప్యాసింజర్ ఆటో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. గూడూరు ఎస్ఐ కె.ఎన్.వి.సత్యనారాయణ కథనం మేరకు.. మండలంలోని ఆకుమర్రు గ్రామానికి చెందిన బొల్లా రామ్మోహన రావు(49) ప్యాసింజర్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం విజయవాడ నుంచి ప్యాసింజర్లతో మచిలీపట్నం బయలుదేరాడు. చిట్టిగూడూరు వద్ద పాయింట్లో ఆగిన ఆర్టీసీ బస్సును ఆటో వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జవగా, డ్రైవర్ రామ్మోహనరావు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే మృతిచెందాడు. ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. మల్లవోలుకు చెందిన ప్రత్తిపాటి వెంకటేశ్వరరావు, నాగమణికి తీవ్ర గాయాలవగా విజయవాడ ఆస్పత్రికి తరలించారు. జె.వెంకటేశ్వరరావు, శాంతకుమారి, సుధ మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతుండగా, దుర్గారావు గూడూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్స చేయించుకున్నాడు. రామ్మోహనరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బందరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. -
విజయవాడ సమగ్రాభివృద్ధికి చర్యలు
ఎంపీ కేశినేని శివనాథ్ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విజయవాడ నగర సమగ్రాభివృద్ధికి అవసరమైన సవివర ప్రాజెక్టుల నివేదికలు రూపొందించేందుకు అధికారులు కృషి చేయాలని ఎంపీ కేశినేని శివనాథ్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, సీపీ రాజశేఖరబాబు అన్నారు. గురువారం కలెక్టరేట్లో రహదారులు, భవనాలు విజయవాడ నగరపాలక సంస్థ, రెవెన్యూ శాఖల అధికారులతో ఎంపీ సమావేశం నిర్వహించారు. విజయవాడ తూర్పు, పశ్చిమ, మధ్య నియోజకవర్గాల పరిధిలో భవిష్యత్లో చేపట్టాల్సిన పనులపై చర్చించారు. నగరంలో భవిష్యత్లో ఎలాంటి ట్రాఫిక్ సమస్య ఎదురుకాకుండా ఏర్పాటు చేయాల్సిన పార్కింగ్ స్థలాలు, వంతెనలు, జంక్షన్ల అభి వృద్ధి, ప్రత్యామ్నాయ రహదారులు, రహదారుల అనుసంధానం తదితరాలపైనా చర్చించారు. రివర్ బండ్ సుందరీకరణ, హిల్స్ రెయిలింగ్, కాళేశ్వరరావు మార్కెట్ జంక్షన్ సుందరీకరణ, గాంధీ హిల్ అభివృద్ధి, కేదారేశ్వరరావుపేట–టన్నెల్ రహదారి విస్తరణ, చిట్టినగర్ జంక్షన్ సుందరీకరణ, వాటర్ ఫౌంటేన్తో సితార జంక్షన్ సుందరీకరణ, టన్నెల్ – గొల్లపూడి 200 అడుగుల రహదారి సుందరీకరణ, కృష్ణలంక కట్ట సుందరీకరణ, వాక్వేలు తదితరాలపై సమావేశంలో చర్చించారు. ఈ అంశాలకు సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించి.. యుద్ధ ప్రాతిపదికన ప్రతిపాదనలు, అంచనాలు, డీపీఆర్లు సిద్ధం చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. విపత్తు నిర్వహణ ప్రణాళికలో భాగంగా మూడు నియోజకవర్గాల పరిధిలో సైక్లోన్ సెంటర్ల ఏర్పాటు చేయాలన్నారు. విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య, విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డి.చంద్రశేఖర్, వీఎంసీ సూపరింటెంటింగ్ ఇంజనీర్ (ప్రాజెక్టులు) సి.సత్యకుమారి తదితరులు పాల్గొన్నారు. -
పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలి
ఔత్సాహికులకు కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ పిలుపు మచిలీపట్నంటౌన్: పరిశ్రమల స్థాపనకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ పిలుపునిచ్చారు. పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చిన వారికి రుణాల మంజూరులో బ్యాంకర్లు పూర్తి సహకారం అందించాలని సూచించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గురువారం స్థానిక రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న శుభం కన్వెన్షన్ హాల్లో మెగా ఎంఎస్ఎంఈ ఔట్ రీచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. పరిశ్రమల స్థాపనకు కృష్ణాజిల్లా అనువైన ప్రాంతమని, బ్యాంకర్లు కూడా విరివిగా రుణాలు అందించేందుకు ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సులభతరమైన ఇండస్ట్రియల్ పాలసీని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనతో ఈ ప్రాంతం మరింత పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఎంఎస్ఎంఈ పరిశ్రమల స్థాపన ద్వారానే అభివృద్ధి చెందాయన్నారు. అతి చిన్న దేశమైన ఇజ్రాయిల్ 1948వ సంవత్సరం నుంచి నేటి వరకు పారిశ్రామికంగా అభివృద్ధి చెంది ముఖ్యంగా ఏరోనాటికల్ సెక్టార్లో తిరుగులేని ఆధిపత్యం వహిస్తోందన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనతో పారిశ్రామికవేత్తలు ఆర్థికంగా బలోపేతం కావడంతోనే కాకుండా యువతకు విరివిగా ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో దోహదపడతారని కలెక్టర్ బాలాజీ అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రూ.85 కోట్ల రుణాలను సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, మహిళా శక్తి సంఘాలకు కలెక్టర్ బాలాజీ అందజేశారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చరల్ బ్యాంక్ ఆఫ్ డెవలప్మెంట్ జీఎం తలశిల కామేశ్వరరావు, ఎస్ఎల్బీసీ కన్వీనర్, జోన్ హెడ్ సి.వి.ఎన్.భాస్కరరావు, మెప్మా పీడీ పి.సాయిబాబు, ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ ఆర్.వెంకట్రావు, యూబీఐ రీజనల్ హెడ్ కె.వెంకట్రావు పాల్గొన్నారు. -
దేశమంతా ఒకేసారి ఎన్నికలతో అభివృద్ధి
●కేంద్ర మాజీ మంత్రి మురళీధరన్ ●స్టెల్లా కాలేజీ ఆడిటోరియంలో వన్ నేషన్–వన్ ఎలక్షన్పై సదస్సు లబ్బీపేట(విజయవాడతూర్పు): వన్ నేషన్ – వన్ ఎలక్షన్ విధానంలో దేశమంతటా అన్ని రకాల ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం ద్వారా దేశాభివృద్ధి సాధ్యమవుతుందని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత మురళీధరన్ అన్నారు. జమిలి ఎన్నికల వల్ల కలిగే ప్రయోజనాలు దేశంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విజయవాడ స్టెల్లా కళాశాల ఆడిటోరియంలో వన్ నేషన్ – వన్ ఎలక్షన్ అంశంపై గురువారం జరిగిన సెమినార్లో మురళీ ధరన్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఏటా ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికల నిర్వహించాల్సి రావడంతో ఎన్నికల కోడ్ పేరుతో సుమారు మూడు నెలల వరకు ఎలాంటి నిర్ణయాలు, పథకాలు, అభి వృద్ధి పనులు చేపట్టడానికి వీలులేని పరిస్థితులు దేశాభివృద్ధికి అటంకం కలిగిస్తు న్నాయని పేర్కొన్నారు. చాలా రాష్ట్రాల్లో శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలు ఆ తరువాత స్థానిక సంస్థలు ఇలా ఒకదాని తరువాత ఒక ఎన్నికలు జరుగుతూ రాష్ట్ర అభివృద్ధికి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. పాఠశాలలో పోలింగ్ బూత్లు ఉండటం కారణంగా ఎన్నికల సమయంలో రెండు, మూడు రోజులైనా పాఠశాలలను మూసివేయాల్సిన పరిస్థితి ఉందని, అధికారులకు ఎన్నికల డ్యూటీలతో వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఇబ్బందులు తప్పడం లేదని పేర్కొన్నారు. తరుచూ ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు జరగటం వల్ల ఖర్చుతో పాటు సమయం వృథా అవుతోందని, అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడుతున్నాయని తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 5వ స్థానం వన్ నేషన్ – వన్ ఎలక్షన్తో దేశం అభి వృద్ధి చెందుతుందని కేంద్ర మాజీ మంత్రి మురళీధరన్ అన్నారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో అభివృద్ధి పథంలో దేశం ముందుకు వెళ్తోందని, ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 5వ స్థానంలో దేశం ఉందని తెలిపారు. విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు చేసి పూర్తి స్థాయి విజ్ఞానాన్ని అందించే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఈ సందర్భంగా కాలేజీ విద్యార్థులు అడిగిన పలు ప్రశ్న లకు ఆయన సమాధానమిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. సెమినార్ అనంతరం మీడియా ప్రతినిధుల అడి గిన పలు ప్రశ్నలకు మురుళీధరన్ జవాబిస్తూ, వన్ నేషన్ – వన్ ఎలక్షన్ అన్న అంశంపై పార్లమెంట్లో చర్చ జరుగుతోందన్నారు. 2023 నవంబర్లో తెచ్చిన చట్టం ప్రకారం పార్లమెంటు, అసెంబ్లీల్లో నియోజకవర్గాల విభజనపై చర్చ జరగా లన్నారు. 2029 ముందే డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి చేసేలా కేంద్రం చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. -
ఆధార్ ప్రామాణికత విధానాన్ని మార్చండి
సచివాలయ ఉద్యోగుల పంక్షేమ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు అర్లయ్య భవానీపురం(విజయవాడపశ్చిమ): ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, సామాజికాభివృద్ధి, సంతృప్తికర స్థాయిలను తెలుసుకు నేందుకు వినియోగిస్తున్న ఆధార్ ప్రామాణికత విధానాన్ని మార్చాలని గ్రామ/వార్డ్ సచివాలయ ఉద్యోగుల పంక్షేమ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు వేల్పుల అర్లయ్య గురువారం ఓ ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ వరుస సర్వేల నిమిత్తం సచివాలయ ఉద్యోగులను ప్రజల ఇళ్లకు పంపి ఆధార్ అథెంటిఫికేషన్ కోసం ఓటీపీ లేదా బయోమెట్రిక్, ఫేషియల్ కోసం అడిగినప్పుడు పదే పదే ఎందుకు ఇన్ని సార్లు తీసుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారని తెలి పారు. ఒక వైపు ఓటీపీలు షేర్ చేయవద్దని వివిధ మాధ్య మాల్లో బ్యాంకులు చెబుతున్నాయని పేర్కొ న్నారు. సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వచ్చి ఓటీపీలు అడిగి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సచివాలయ ఉద్యోగుల ద్వారా చేయించే ప్రతి సర్వే గురించి ప్రభుత్వం ముందుగా ఎలక్ట్రానిక్, ప్రింట్ మాధ్యమాల ద్వారా ప్రతి పౌరుడికి తెలిసేలా ప్రచారం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అప్పుడే ఫలితం ఉంటుందని పేర్కొన్నారు. -
ఇంటర్ గ్రూప్ పరీక్షలు ప్రశాంతం
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం గ్రూప్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా జరిగాయి. మ్యాథ్స్ 1ఏ, సివిక్స్, బోటనీ పేపర్ల 41,775 మంది విద్యార్థులకు మంది 40,638 మంది హాజరయ్యారు. 1,136 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ కోర్సు పరీక్షలను 1,328 మంది విద్యార్థులకు 1184 మంది రాశారు. కేంద్రీయ విద్యాలయం అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం మధురానగర్(విజయవాడసెంట్రల్): కేంద్రీయ విద్యాలయం నంబర్–1 విజయవాడలో 2025 – 2026 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని, ఆసక్తి, అర్హత కలిగిన వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ ఎస్. ఆదిశేషు శర్మ గురువారం ఒక ప్రకటనలో సూచించారు. కేంద్రీయ విద్యాలయంలో ఒకటో తరగతి, బాలవాటిక–3లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొ న్నారు. శుక్రవారం ఉదయం పది గంటల నుంచి 21వ తేదీ వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ఒకటో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 31వ తేదీ నాటికి ఆరేళ్లు నిండి ఎనిమిదేళ్ల లోపు ఉండాలని, బాలవాటిక–3లో ప్రవేశాలకు ఐదేళ్లు నిండి ఏడేళ్ల లోపు వయస్సు ఉండాలని స్పష్టంచేశారు. ఆసక్తి కల వారు ఈ నెల 21వ తేదీ రాత్రి పది గంటల్లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పలు ఎక్స్ప్రెస్ రైళ్ల సర్వీస్ నంబర్లు మార్పు రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): పరిపాలన సౌలభ్యం దిశగా ఈస్కోస్ట్ రైల్వే నిర్వహణలో నడుస్తున్న పలు ఎక్స్ప్రెస్ రైళ్ల సర్వీసు నంబర్లను మార్పు చేసినట్లు విజయవాడ రైల్వే పీఆర్ఓ నుస్రత్ మండ్రుప్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. 17488 సర్వీసు నంబర్తో నడిచే విశాఖపట్నం – కడప ఎక్స్ప్రెస్ ఇక 18521 నంబరుతో నడుస్తుంది. 17487 నంబరు కడప – విశాఖపట్నం రైలు 18522 నంబరుతో, 22701 నంబర్ విశాఖపట్నం – గుంటూరు రైలు 22875 నంబరుతో, 22702 నంబర్ గుంటూరు – విశాఖపట్నం 22876 నంబరుతో, 20896 నంబర్ భువనేశ్వర్ – రామేశ్వరం రైలు 20879 నంబరుతో, 20895 నంబర్ రామేశ్వరం – భువనేశ్వర్ రైలు 20850 నంబరుతో, 12898 నంబర్ భువనేశ్వర్ – పుదుచ్చేరి రైలు 20851 నంబరుతో, 12897 నంబర్ పుదుచ్చేరి – భువనేశ్వర్ రైలు 20852 నంబరుతో, 12830 నంబర్ భువనేశ్వర్ – చైన్నె సెంట్రల్ రైలు 20853 నంబరుతో, 12829 నంబర్ చైన్నె సెంట్రల్ – భువనేశ్వర్ రైలు 20854 నంబరుతో నడవన్నాయి. ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని పీఆర్వో నుస్రత్ మండ్రుప్కర్ కోరారు. రేపటి నుంచి హెల్త్ వర్సిటీ పురుషుల గేమ్స్ మీట్ గన్నవరం రూరల్: మండలంలోని చిన అవుటపల్లిలో ఉన్న డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కళాశాల ప్రాంగణంలో ఈ నెల ఎనిమిది నుంచి 17వ తేదీ వరకూ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఆధ్వర్యంలో 26వ పురుషుల ఇంటర్ మెడికల్ కాలేజ్ గేమ్స్ మీట్ జరుగుతుందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.వి.భీమేశ్వర్ గురువారం తెలిపారు. సిద్ధార్థ అకాడమీ ఆఫ్ జనరల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ గోల్డెన్ జూబ్లీ కార్యక్రమంలో భాగంగా కళాశాల క్రీడా మైదానంలో జరిగే గేమ్స్ మీట్ను యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ వేమిరెడ్డి రాధికా రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభిస్తారని పేర్కొన్నారు. సిద్ధార్థ అకాడమీ అధ్యక్షుడు రాజయ్య, కార్యదర్శి లక్ష్మణరావు, డైరెక్టర్ జనరల్ డాక్టర్ సి.నాగేశ్వరరావు, అకాడమీ ప్రతినిధులు, యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ డాక్టర్ ఇ.త్రిమూర్తి తదితరులు పాల్గొంటారని వివరించారు. -
విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం
మల్లాయి చిట్టూరు(ఘంటసాల): విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక ఇల్లు, నాలుగు పశువుల పాకలు, రెండు గడ్డి వాములు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదం ఘంట సాల మండలం మల్లాయి చిట్టూరు శివారు మామిడితోట గ్రామంలో గురువారం జరిగింది. మచిలీపట్నం ఏడీఎఫ్ఓ బి.నరసింహారావు కథనం మేరకు.. మల్లాయి చిట్టూరు శివారు గ్రామమైన మామిడితోటలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఎండిన ఆకులకు నింప్పు అంటుకుని మంటలు చెలరేగాయి. సమీపంలోని ఇంటికి ఆ మంటలు వ్యాపించాయి. పక్కనే ఉన్న నాలుగు పశువుల పాకలు, రెండు గడ్డి వాములకు మంటలు అంటుకున్నాయి. గ్రామస్తులు మచిలీపట్నం అగ్నిమాపక కేంద్రానికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఏడీఎఫ్ఓ బి.నరసింహారావు ఆధ్వర్యంలో సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో లోయ కాశీరత్నంనకు చెందిన రెండు పశువుల పాకలు, ఐదు ఎకరాల గడ్డివామి, లోయ చిన్న శ్రీనివాసరావుకు చెందిన ఇల్లు, రెండు ఎకరాల వరిగడ్డివామి, లోయ సుబ్బమ్మ, లోయ బేబీ సరోజినికి చెందిన పశువుల పాకలు బుగ్గిపాలయ్యాయి. ఈ ప్రమాదంలో రూ.5 లక్షల ఆస్తినష్టం జరిగిందని ఏడీఎఫ్ఓ నరసింహారావు తెలిపారు. సకాలంలో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపుచేయడంతో భారీ ప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొన్నారు. మంటలు చెల రేగిన వెంటనే పశువులను పాకల నుంచి బయటకు తోలడంతో వాటికి ప్రాణాపాయం తప్పింది. -
తాడో పేడో తేల్చుకుంటాం.. విజయవాడకు భారీగా చేరుకున్న ఆశావర్కర్లు
సాక్షి, విజయవాడ: ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకొనేందుకు ఆశావర్కర్లు సిద్ధమవుతున్నారు. కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. గత సమ్మె కాలంలో ప్రభుత్వంతో జరిగిన ఒప్పందాలపై జీవోలు విడుదల చేయాలని ఆశావర్కర్లు కోరుతున్నారు. ఇప్పటికే రెండు రోజుల పాటు ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కాగా, రాష్ట్ర వ్యాప్తంగా ఆశా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.గురువారం.. అన్ని జిల్లాల నుంచి ధర్నా చౌక్కు భారీగా చేరుకున్న ఆశా వర్కర్లు.. రోడ్లపై సైతం కార్పెట్లు వేసుకుని ఎండలో ధర్నాకు దిగారు. ఆశా వర్కర్ల కదలికలపై డ్రోన్లు, ఇంటిలిజెన్స్ బృందాల ద్వారా పోలీసులు నిఘా పెట్టారు. ధర్నాచౌక్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు.దాదాపు 10 వేల మంది హాజరయ్యే అవకాశం ఉంటుందని యూనియన్ నాయకులు అంటున్నారు. ఆర్ముడ్ రిజర్వ్, సివిల్, ర్యాపిడ్ యాక్షన్ టీంలను పోలీసులు సిద్ధం చేశారు. ఏడీసీపీ, ఏఎస్పీ, ముగ్గురు డిఎస్పీలు, నలుగురు సీఐలు, ఇతర సిబ్బందితో భారీగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లపై స్వష్టమైన ప్రకటన చేస్తే వరకు పోరాటం ఆపే ప్రసక్తే లేదని ఆశా వర్కర్లు చెబుతున్నారు. -
బుడమేరుకు పొంచివున్న కడగండ్లు
అడుగడుగునా నిర్లక్ష్యం ●● డైవర్షన్ కెనాల్ గండ్ల నుంచి ఆగని ఊట ● పంటపొలాల్లో ఉధృతంగా ప్రవహిస్తున్న లీకేజీ నీరు ● ఆధునికీకరణను గాలికొదిలేసిన ప్రభుత్వం ● హెడ్ రెగ్యులేటర్కు మరమ్మతులు చేపట్టని వైనం ● సైపన్ల వద్ద ప్రమాదకరంగా మారిన కెనాల్ కట్ట గేట్లకు మరమ్మతులేవీ? వరద విధ్వంసం సమయంలో బడుమేరు ప్రక్షాళన, ఆధునికీకరణ అంటూ మీడియా ముందు గొప్పలు చెప్పిన ప్రభుత్వ పెద్దలు ఆ దిశగా ఒక్క అడుగూ వేయలేదు. కనీసం వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ గేట్లకు మరమ్మతులు చేపట్టలేదు. 11 గేట్లలో మూడు గేట్ల సపోర్టింగ్ రాడ్లు వంకరపోయి పైకి లేపాలన్నా, కిందకి దింపాలన్నా ఇబ్బందిగా మారింది. రెండు గేట్లు పూర్తిగా కిందకి దిగకపోవడంతో పట్టసీమ జలాలు వచ్చినప్పుడు నీరు లీకవ్వకుండా ఇసుక బస్తాలను వేశారు. వరదచ్చి ఆరు నెలలు గడిచినా ఈ గేట్ల మరమ్మతులను గాలికొదిలేయడంతో గేట్ల కింద ఇసుక బస్తాలు ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి. హెడ్ రెగ్యులేటర్ నుంచి ఎగువున బుడమేరు గండ్లను పూడ్చేందుకు రూ.29 కోట్ల ఖర్చవుతుందని అధికారులు ప్రభుత్వానికి అంచనాలు పంపినా నిధులు మాత్రం విడుదల కాలేదు. దీంతో మళ్లీ వరద ముప్పు తప్పేలా లేదని బడమేరు పరిసర గ్రామాల ప్రజలు, రైతులు ఆందోళన చెందుతున్నారు.జి.కొండూరు: అసలే పొలాల్లో మట్టి మేటలు. గండ్ల నుంచి ఆగని నీటి ఊట. ఒక పంటకు వరద పోటు. మరో పంటకు నీటి కరువు. వచ్చే ఖరీఫ్లో సాగుకు అవకాశం ఉంటుందో లేదో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసింది. బుడమేరు డైవర్షన్ కెనాల్కు పడిన గండ్లను తాత్కాలికంగా పూడ్చి చేతులు దులుపుకొంది. సాక్షాత్తూ ముఖ్యమంత్రే పరిశీలించి డైవర్షన్ కెనాల్ ఆధునికీకరణ చేస్తామంటూ ఇచ్చిన హామీ నీటి మూటగా మిగిలింది. బుడమేరు డైవర్షన్ కెనాల్కు పూడ్చిన గండ్ల నుంచి ఊట ఆగడంలేదు. ఊట నీరు పొలాల మీదగా ఉధృతంగా ప్రవహిస్తోంది. బుడమేరు వరద కారణంగా పొలాల్లో మూడు నుంచి ఐదు అడుగుల మేర మట్టి మేటలు వేసింది. ఇప్పుడు గండ్ల నుంచి వస్తున్న నీటి ఊట ఆ పొలాల మీదుగా ఉధృతంగా ప్రవహిస్తోంది. మరో మూడు నెలల్లో ఖరీఫ్ సీజన్ మొదలవుతుంది. ఇప్పుడు ఈ పొలాల్లో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం స్పందించి యుద్ధ ప్రాతిపది కన నష్ట నివారణ చర్యలు చేపట్టకపోతే 50 ఎకరాల వ్యవసాయ భూమి నీటి కుంటలా మారే ప్రమాదం పొంచివుంది. ఊట ఆగడం కష్టమే గత ఏడాది ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు బుడమేరు వరదతో పోటెత్తింది. వరద ఉధృతితో వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ నుంచి కృష్ణానది వరకు 11.90 కిలోమీటర్లు మేర ఉన్న బుడమేరు డైవర్షర్ కెనాల్కు ఎడమ వైపు కట్టకు మూడు చోట్ల, కుడి వైపు కట్టకు ఏడు చోట్ల గండ్లు పడ్డాయి. హెడ్ రెగ్యులేటర్ నుంచి ఎగువ భాగాన బుడమేరుకు 42 కిలోమీటర్ల మేర 65 వరకు గండ్లు పడ్డాయి. డైవర్షన్ కెనాల్కు పడిన గండ్లను మాత్రం మిలటరీ సాయంతో పూడ్చారు. డైవర్షన్ కెనాల్ ఎడమ కట్టకు పడిన మూడు గండ్ల నుంచి నిత్యం నీటి ఊట వస్తూనే ఉంది. వీటీపీఎస్ బ్యాక్ వాటర్ కవులూరు హెడ్ రెగ్యులేటర్ వరకు పోటువేసి ఉండడంతో గండ్లు పూడ్చిన ప్రదేశం నుంచి నీరు లీకై సమీపంలోని పొలాల మీదుగా ప్రవహిస్తూ తారకరామ ఏడమ కాలువలో కలుస్తోంది. గండ్లకు సమీపంలోని 50కి పైగా ఎకరాల్లో సాగు ప్రశ్నార్థకంగా మారింది. సైపన్ల వద్ద పొంచి ఉన్న ప్రమాదం బుడమేరు హెడ్ రెగ్యులేటర్ నుంచి కొండపల్లి శాంతి నగర్ వంతెన వరకు డైవర్షన్ కెనాల్ ఎడమ కట్టకు ఐదు సైపన్లు ఉన్నాయి. గత వరదకు కుడి, ఎడమ వైపు కట్టలకు సైపన్లు, తూముల వద్దనే ఎక్కవ శాతం గండ్లు పడ్డాయి. సైపన్ల వద్ద గండ్లు పూడ్చేందుకు మట్టిపోసి వదిలేశారు. బలోపేతం చేయకపోవడంతో సాధారణ నీటి ప్రవాహానికే గండ్లు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎడమ కట్టకు పడిన ప్రధాన గండి వద్ద కట్టనైతే బలోపేతం చేశారు కానీ సైపన్ వద్ద తూతూమంత్రంగా పూడ్చి వదిలేశారు. సైపన్ వద్ద మళ్లీ గండి పడే అవకాశం ఉన్నందున కాంక్రీటుతో కట్టను బలోపేతం చేయా లని రైతులు కోరుతున్నారు. సైపన్ వద్ద కట్ట తక్కువ ఎత్తులో వెడల్పుగా లేనందున వ్యవసాయభూములకు ఈ కట్టమీదుగా ట్రాక్టర్లతో రాకపోకలు సాగించే వీలు లేక ఇబ్బంది పడుతున్నామని రైతులు పేర్కొంటున్నారు. -
8 నుంచి ఎన్టీఆర్ జిల్లాలో పీ4 సర్వే
గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్టనర్షిప్ (పీ4) సర్వేకు రూపకల్పన చేసిందని, ఎన్టీఆర్ జిల్లాలో ఈ నెల 8 నుంచి 18వ తేదీ వరకు గ్రామ/వార్డు సచివాలయ సిబ్బందితో సర్వే జరుగుతుందని కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. బుధవారం పీ4 సర్వేపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ నెల ఆరు, ఏడు తేదీల్లో మాస్టర్ ట్రైనర్లుగా ఎంపీడీఓలు, మునిసిపల్ కమిషనర్లు తమ పరిధిలోని గ్రామ లేదా వార్డు సచివాలయ సిబ్బందికి సర్వేపై పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. టెక్ మాడ్యూల్తో పాటు సర్వే విధానాన్ని క్షుణ్ణంగా వివరించాలన్నారు. పేదరిక నిర్మూలనకు చేపడుతున్న కార్యక్రమాలకు ఈ సర్వే దోహదం చేస్తుందన్నారు. కుటుంబ వివరాలతో పాటు వివిధ సామాజిక, ఆర్థిక పరామితుల కచ్చితమైన సమాచారాన్ని యాప్లో పొందుపరచాలన్నారు. కుటుంబాలకు ఏవైనా అపోహలు ఉంటే తొలగించి, సర్వేను పది రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. సీపీఓ వై.శ్రీలత, గ్రామ/వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి, జిల్లా పరిశ్రమల అధికారి బి.సాంబయ్య పాల్గొన్నారు. -
‘ఉపాధి’ వేతన లక్ష్యాలను చేరుకోవాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకం ద్వారా ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాల్లో లబ్ధిదారులకు పని కల్పించడం, దినసరి వేతనం రూ.300 అందేలా చూడడంలో నిర్దేశించిన లక్ష్యాలను తప్పనిసరిగా చేరుకోవాల్సిందేనని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి డ్వామా అధికారులతో కలిసి ఆయా మండలాల ఎంపీడీఓలు, మునిసిపల్ కమిషనర్లు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్షేత్రస్థాయి సిబ్బందితో కలెక్టర్ బుధవారం వర్చువల్గా సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ పథకం అమలు తీరు, రోజు వారీ సగటు వేతనాలు, గ్రామాల వారీగా వేతనదారుల హాజరు, వారికి అందుతున్న వేతనం తదితరాల్లో పురోగతిని ఈ సంద ర్భంగా కలెక్టర్ లక్ష్మీశ సమీక్షించారు. పథకం ద్వారా వీలైనంత ఎక్కువ మందికి పని కల్పించడంలో పురోగతి చూపాలని సూచించారు. ఈ పథకం కింద చేపట్టేందుకు గ్రామాభివృద్ధి, వ్యక్తిగత, సామాజిక పనులను గుర్తించాలని ఆదేశించారు. వేసవి నేపథ్యంలో ఉదయాన్నే పనులు ప్రారంభించాలని, పని ప్రదేశాల్లో తాగునీరు అందుబాటులో ఉంచేలా చూడా లని ఆదేశించారు. ఉపాధి పనులపై ప్రతివారం జిల్లాస్థాయిలో సమీక్ష చేస్తున్నామని పేర్కొన్నారు. ఎంపీడీఓలు అందరూ తమ మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని, క్షేత్రస్థాయి సిబ్బందికి దిశానిర్దేశం చేయాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. ఈ సమావేశంలో డ్వామా పీడీ ఎ.రాము, గ్రామ/వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి, సీపీఓ వై.శ్రీలత తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
ఆశ.. నిరాశ
● టీడీపీ నేతలను ఊరిస్తున్న ఎమ్మెల్సీ పదవులు ● ఎమ్మెల్సీ కోసం ఉమ్మడి కృష్ణా జిల్లాలో పలువురి పోటీ ● చంద్రబాబు, చినబాబు చుట్టూ ఆశావహుల ప్రదక్షిణలు ● సొంత పార్టీలోనే పలువురికి మోకాలడ్డు ● దేవినేని ఉమా ఆశలు ఈసారైనా ఫలించేనా? ఎమ్మెల్సీ హామీకూరలో కరివేపాకులా.. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామనే సంకేతాలు టీడీపీ అధిష్టానం నుంచి ఇంత వరకూ అందలేదని సమాచారం. చివరి క్షణంలోనైనా అవకాశం దక్కుతుందనే భావనలో ఆయన వర్గీయలు ఉన్నారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వాడుకొని ఎన్నికల తరువాత పట్టించుకోకపోవడం పరిపాటిగా మారిందనే భావనను కొంత మంది వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చి, మంత్రిని చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినా ప్రస్తుతం ఆ ఊసే టీడీపీ అధిస్టానం ఎత్తడం లేదని పలువురు స్పష్టంచేస్తున్నారు. ఎన్నికల సమయంలో వాడు కొని కూరలో కరివేపాకులా తీసి వేసినా ఆశ్చర్యం లేదని వారు స్పష్టంచేస్తున్నారు. ఎన్నికల సమయంలో తమకు ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ అధికారంలోకి వచ్చాక కనీసం దగ్గరకు కూడా రానివ్వటం లేదని పలువురు వాపోతున్నారు. మొత్తం మీద ఈ సారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలకు అవకాశం లేనట్టేననే భావన పార్టీ వర్గాల్లోనే వ్యక్తం అవుతోంది. సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన పలువురు టీడీపీ నేతలు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడాశలు పెట్టుకున్నారు. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల కావడంతో తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. చంద్రబాబు, చినబాబును ప్రసన్నం చేసుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. పార్టీకి కష్ట కాలంలో వెన్నంటి ఉండి పలు పోరాటాలు చేసి, అసెంబ్లీ ఎన్నికల్లో సీటు త్యాగం చేసిన వారి పరిస్థితి దయనీయంగా మారిందని టీడీపీ వర్గాలే విస్మయం వ్యక్తం చేస్తు న్నాయి. ప్రస్తుతం పలువురు నేతలు చంద్ర బాబును కలిసి ఈ సారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు అవకాశం ఇవ్వాలని వేడుకొంటున్నారు. ఆయన చినబాబును కలవండి అంటూ ఉచిత సలహాలు ఇస్తుండటంతో వారు నివ్వెరపోతున్నారు. చినబాబుతో అయ్యేదేమీ లేదని ఎమ్మెల్సీ పదవులపై ఆశలు వదులుకొంటున్నారు. వారు పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ లోలోన రగిలిపోతున్నారు. చినబాబు సీనియర్లను పక్కన పెట్టి తన సొంత టీంను సిద్ధం చేసుకొంటున్నారు. ఇందులో భాగంగా డబ్బు మూటలతో పాటు, తన సొంత కోటరీకే ప్రాధాన్యం ఇస్తున్నా రన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవిపై ఆశల పల్లకీలో ఊరేగుతున్న మాజీ మంత్రి దేవినేని ఉమా, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం, పార్టీ నాయ కులు బుద్దా వెంకన్న, వంగవీటి రాధాతోపాటు పలువురికి చాన్స్ ఉండదేమోననే భావన టీడీపీ వర్గాల్లోనే వ్యక్తమవుతోంది. పాపం..ఉమా టీడీపీలో నేనే నంబరు–2 అనే స్థాయిలో బీరాలు పలికే మాజీ మంత్రి దేవినేని ఉమా పరిస్థితి ప్రస్తుతం పార్టీలో కుడితిలో పడ్డ ఎలుకలా దయనీయంగా మారింది. ఎమ్మెల్సీ పదవి కోసం కాలు కాలిన పిల్లిలా అధిష్టానం చుట్టూ తిరుగుతూ గట్టి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని తెలుస్తోంది. పార్టీలో కొంత మంది ఈ సారీ ఉమాకు అవకాశం లేదనే భావన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు దేవినేని ఉమాకు ఎమ్మెల్సీ పదవి దక్కకుండా టీడీపీ పార్లమెంటు ప్రజాప్రతినిధి, మైలవరం ప్రజాప్రతినిధి గట్టి ప్రయత్నం చేస్తున్నారనే చర్చ టీడీపీలోనే సాగుతోంది. వారు ఇద్దరు చినబాబుకు సన్నిహితంగా ఉండటం ఈ వాదనకు బలం చేకూర్చుతోంది. ఇందులో భాగంగానే వారిద్దరూ ఎమ్మెల్సీ పదవి కోసం నెట్టెం రఘురాం పేరును తెరపైకి తెచ్చి మద్దతు తెలుపుతున్నారు. దేవినేని ఉమాకు అవకాశం దక్కకుండా ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చినట్లు సమాచారం. ఇప్పటికే పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని తమ సొంత సామాజిక వర్గానికే కేటాయించడం కూడా అడ్డంకిగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. బుద్దాకు మొండి చెయ్యేనా? పేవరు పులిగా పేరొందిన బుద్దా వెంకన్న పరిస్థితి అధిష్టానం వద్ద ఆధ్వానంగా ఉందని పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. మాటకు ముందు వైఎస్సార్ సీపీపై ప్రెస్ మీట్లు పెట్టి ఒంటికాలిపై లేస్తే తనకు అవకాశం దక్కుతుందనుకున్న ఆయనకు అధిష్టానం వద్ద అంతసీన్ లేదంటున్నారు. చంద్రబాబు, చినబాబు ఇద్దరూ బుద్దాను పక్కన పెట్టినట్లు పార్టీ వర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి. దీనికితోడు పార్లమెంటు ప్రజాప్రతినిధితో పాటు, స్థానిక బీజేపీ ప్రజాప్రతినిధి నుంచి ఇతనికి సహకారం పూర్తిగా కొరవడింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవికి ప్రస్తుతం బుద్దా పేరును కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం లేదనే భావనను టీడీపీ వర్గాలే వ్యక్తం చేస్తున్నాయి. విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, నాగుల్ మీరా, ఎంకే బేగ్ వంటి పలువురు నేతలు ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తుండటం గమ నార్హం. సామాజిక సమీకరణలను తీసుకున్నా బుద్దా వెంకన్నకు మైనస్గా మారే అవకాశం ఉందని టీడీపీ నేతలే పేర్కొంటున్నారు. -
జలవనరుల శాఖ ఉద్యోగి బలవన్మరణం
రామవరప్పాడు: జలవనరుల శాఖ ఉద్యోగి పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విజయవాడ రూరల్ మండలం నిడమానూరు రామానగర్లో బుధవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. నిడమానూరు రామానగర్లో కన్నేటి వినోద్, భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తు న్నారు. ఆయన జలవనరుల శాఖలో నది పరిరక్షణ విభాగం అసిస్టెంట్ పనిచేస్తున్నారు. రొయ్యూరు నుంచి ఘంటసాల మండలం పాపావినాశం వరకు ఉన్న కృష్ణానది ఆయన పరిధిలో ఉంది. వినోద్ మద్యానికి బానిసై తరుచూ ఇంట్లో గొడవ పడేవాడు. విధులకు సైతం గైర్హాజరయ్యేవారు. గతంలో విధులకు హాజరుకావాలని ఉన్నతాధికారులు ఫోన్ చేస్తే తాను చనిపోతున్నానని బెదిరిస్తూ వాట్సాప్లో పురుగు మందు డబ్బా పంపించారు. ఈ క్రమంలో బుధవారం కూడా తన చావుకు తమ శాఖలో కొందరు అధికారులు కారణమంటూ సూసైడ్ నోట్ రాసి పురుగుల మందు తాగారు. అపస్మారకస్థితిలో ఉన్న వినోద్ను కుటుంబ సభ్యులు గమనించి హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు. పటమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సూసైడ్ నోట్లో అధికారుల పేర్లు తన బలవన్మరణానికి జలవనరుల శాఖ జేఈ శ్రీరామ జనార్దన్, వర్క్ ఇన్స్పెక్టర్ వి.కిరణ్, సీనియర్ అసిస్టెంట్ సుజాత, తన అత్త కనకదుర్గ కారణమంటూ వినోద్ సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సూసైడ్ నోట్లో ప్రస్తావించిన అధికారులు తరుచూ తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వినోద్ తమతో చెప్పేవారని అతని సన్నిహితులు పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులతో రుణానికి దరఖాస్తు చేసు కుంటే అడ్డుపడ్డారని, మచిలీపట్నం సమీపంలోని శ్రీకాకుళానికి పెట్టుకున్న బదిలీని కూడా అడ్డుకుని వేధిస్తున్నారని వినోద్ చెప్పవారని వివరించారు. వరుసగా జరుగుతున్న ఈ ఘటనలతో మనస్తాపానికి గురైన వినోద్ ఆదే శాఖలో పనిచేసే మరో ఉద్యోగికి ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన చావుకు కారణమైన వారిపై చర్యలు తీసుకునేలా చూడాలని చివరగా మాట్లాడినట్లు సమాచారం. -
మహిళా దినోత్సవాన్ని విజయవంతం చేయాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల ఎనిమిదో తేదీన తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఎన్టీఆర్ జిల్లా స్థాయి కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. ఇందులో భాగంగా మహిళా భద్రత, సాధికారతను ప్రతిబింబించేలా స్టాళ్లు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మహిళా దినోత్సవాన్ని విజయ వంతం చేయాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాస్థాయి వేడుకల నిర్వహణకు సంబంధించి దిశానిర్దేశం చేసేందుకు రాష్ట్ర సీ్త్ర, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వేడుకల నిర్వహణకు సూచనలు చేశారు. ఈ కాన్ఫరెన్స్ అనంతరం డీఆర్డీఏ, మెప్మా, వైద్య ఆరోగ్యం, సీ్త్ర, శిశు సంక్షేమం, పరిశ్రమలు తదితర శాఖల అధికారులతో కలెక్టర్ లక్ష్మీశ సమావేశం నిర్వహించి, శాఖల వారీగా కార్యాచరణను వివరించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సచివాలయం మొదలు, రాష్ట్ర స్థాయి వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. ఎన్టీఆర్ జిల్లాస్థాయి కార్య క్రమం నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరుగుతుందని తెలిపారు. బ్యాంకు లింకేజీ మద్దతు, ప్రకృతి సేద్యం ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్, మిల్లెట్స్ విలువ జోడింపు, మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు చేయూతనిచ్చే పథకాలు, పోషణ భద్రత, పీఎం విశ్వకర్మ, పీఎంఈజీపీ వంటి పథకాలు, లఖ్పతి దీదీ, డ్రోన్ దీదీ తదితరాలకు సంబంధించిన స్టాళ్లను ఏర్పాటు చేయాలన్నారు. ప్రత్యేక అవగాహన ర్యాలీల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, పీఓ–యూసీడీ వెంకటరత్నం, డీఎంహెచ్ఓ డాక్టర్ ఎం.సుహాసిని, డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ సమన్వయకర్త డాక్టర్ జె.సుమన్, ఐసీడీఎస్ పీడీ డి.శ్రీలక్ష్మి, జిల్లా పరిశ్రమల అధికారి బి. సాంబయ్య, ఏసీపీ కె.లతాకుమారి, ఎల్డీఎం కె.ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
ఉత్సాహంగా.. ఉల్లాసంగా ఆటల పోటీలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): నిత్యం విధి నిర్వహణలో బిజీగా ఉండే మహిళా ఉద్యోగులు ఆటల పోటీల్లో పాల్గొని సందడి చేశారు. ఉత్సా హంగా, ఉల్లాసంగా ఆటలు ఆడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయం ఆవరణలో మహిళా ఉద్యోగులకు నిర్వహిస్తున్న ఆటల పోటీలు బుధవారం కొనసాగాయి. ఏపీ జేఏసీ అమరావతి మహిళా విభాగం చైర్ పర్సన్ పారె లక్ష్మి, కార్యదర్శి పొన్నూరు విజయలక్ష్మి, జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదర్రావు ఈ ఆటల పోటీలను ప్రారంభించారు. అమరావతి జేఏసీ సభ్య సంఘాలకు చెందిన మహిళా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఈ పోటీల్లో పాల్గొన్నారు. లెమన్ అండ్ స్పూన్, మ్యూజికల్ చైర్స్, స్కిప్పింగ్, కప్ – బెలూన్, షటిల్, చెస్, క్యారమ్స్, బాల్ గేమ్ వంటి పోటీలు ఉత్సాహంగా సాగాయి. గురువారం కూడా వివిధ క్రీడాంశాలలో పోటీలు జరుగుతాయని చైర్ పర్సన్ లక్ష్మి తెలిపారు. -
వ్యక్తి సజీవ దహనం
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): మంచంపై ఉన్న ఓ వ్యక్తి సజీవ దహనమైన ఘటన కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని లంబాడీపేటలో బుధవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. లంబాడీపేట అడ్డరోడ్డులో షేక్ బాజీ(55) తన తల్లి అమ్మాజీతో కలిసి నివసిస్తున్నాడు. బాజీ భార్య కొన్నేళ్ల కిందట మృతి చెందగా, ఇద్దరు కుమార్తెలకు వివాహాలయ్యాయి. నాలుగేళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాజీ అప్పటి నుంచి మంచానికే పరిమితం అయ్యాడు. అప్పటి నుంచి తల్లి అమ్మాజీనే అతడి బాగోగులు చూసుకుంటోంది. బుధవారం సాయంత్రం బాజీ కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత తల్లి అతనిని మంచంపై పడుకోబెట్టి బయటకు వెళ్లింది. ఇంతలో ఇంటి లోపల నుంచి పొగలు రావడంతో స్థానికులు కంగారుగా వచ్చి చూసే సరికి బాజీ పడుకున్న మంచం మంటల్లో చిక్కుకుంది. స్థానికులు ఇంటి ఆవరణలో ఉన్న నీటితో మంటలను అదుపు చేశారు. అప్పటికే బాజీ పూర్తిగా కాలిపోయి కనిపించాడు. ఘటనపై పోలీ సులకు సమాచారం ఇవ్వగా వారు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మంటలు ఎలా వ్యాపించాయనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
భక్తిశ్రద్ధలతో రాహుకాల పూజలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో మంగళవారం రాహుకాల పూజలను భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మంగళవారం మధ్యాహ్నం అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని నటరాజ స్వామి వారి ఆలయం, సహస్ర కుంకుమార్చన ప్రాంగణంతో పాటు పాత మెట్ల వద్ద భక్తులు రాహుకాల పూజలను నిర్వహించారు. రాహుకాల పూజలకు తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. సుమారు గంట పాటు భక్తులు రాహుకాల పూజలను నిర్వహించారు. అనంతరం భక్తులు సర్వదర్శనంతో పాటు రూ.100 టికెట్ క్యూలైన్లో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.4.07 కోట్లు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు భక్తులు మాఘమాసంలో రికార్డు స్థాయిలో కానుకలు, మొక్కుబడులను సమర్పించారు. భక్తులు హుండీల ద్వారా రూ.4.07 కోట్ల నగదును ఆది దంపతులకు సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకలు, మొక్కుబడులను మంగళవారం మహా మండపం ఆరో అంతస్తులో లెక్కించారు. 26 రోజులకు గాను రూ.4,07,39,829 నగదుతో పాటు 700 గ్రాముల బంగారం, 6కిలోల 550 గ్రాముల వెండి లభ్యమైనట్లు ఆలయ ఈవో కె.రామచంద్రమోహన్ తెలిపారు. ఇక ఈ హుండీ ద్వారా భక్తులు రూ.2,31,386 విరాళాలను దేవస్థానానికి సమర్పించారు. కానుకల లెక్కింపును ఆలయ ఈవో రామచంద్రమోహన్ పర్యవేక్షించగా, డీఈవో రత్నరాజు దేవదాయ శాఖ సిబ్బది, దేవస్థాన సిబ్బంది, వన్టౌన్, ఎస్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. రేపటి నుంచి గుడారాల పండగ అమరావతి: ఏటా నిర్వహించే గుడారాల పండగను ఈ ఏడాది గుంటూరు శివారు లోని గోరంట్లలో కాకుండా మండల పరిధిలోని లేమల్లె గ్రామంలో నిర్వహించటానికి అన్ని ఏర్పాట్లనూ పూర్తిచేశామని హోసన్నా మినిస్ట్రీస్ అధ్యక్షుడు అబ్రహం చెప్పారు. మంగళవారం లేమల్లెలోని హోసన్నా దయాక్షేత్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ హోసన్నా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు ఏసన్న తొలుత లేమల్లె గ్రామంలో హోసన్నా మందిరం నిర్మాణం చేసిన ప్రదేశంలో సుమారు 25 ఏళ్ల తర్వాత 48వ గుడారాల పండుగ నిర్వహిస్తున్నట్టు వివరించారు. ఈనెల 6,7,8,9 తేదీలలో జరిగే ఈ పండగకు విశ్వాసులు తరలిరావాలని కోరారు. ఆర్టీసీ గుంటూరు నుంచి ప్రత్యేకంగా బస్సులు నడుపుతున్నట్టు వెల్లడించారు. ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. పోలీసు శాఖ బందోబస్తును పర్యవేక్షిస్తుందని వెల్లడించారు. రాయలసీమ, భీమవరం, అనకాపల్లి తదితర ప్రాంతాల నుంచి గుంటూరుకు వచ్చే రైళ్లలో 15 ప్రత్యేక కోచ్లను గుడారాల పండుగ కోసం ఏర్పాటు చేయడం విశేషమని చెప్పారు. ఐదో తేదీ బుధవారం సాయంత్రం హోసన్నా దయా క్షేత్రంలో కొత్తగా నిర్మించిన చర్చి ప్రారంభోత్సవం జరగనుందని వెల్లడించారు. -
హాకీ జిల్లా జట్టు ఎంపిక
విజయవాడస్పోర్ట్స్: రాష్ట్ర స్థాయి సీనియర్ పురుషుల హాకీ పోటీలకు ప్రాతినిధ్యం వహించే జిల్లా జట్టును ఎంపిక చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా హాకీ సంఘం కార్యదర్శి కె.రాజశేఖర్ తెలిపారు. సింగ్నగర్లోని మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో మంగళవారం ఎంపిక పోటీలను నిర్వహించామని, ఈ పోటీల్లో అత్యుత్తమ క్రీడా నైపుణ్యం ప్రదర్శించిన క్రీడాకారులను జట్టుకు ఎంపిక చేశామన్నారు. రాఘవేంద్రరావు, వేణుగోపాల్, ఉపేంద్ర, శివప్రసాద్, ప్రశాంత్, వరప్రసాద్, సురేంద్ర, పౌల్రత్నం, సాయి, పవన్కుమార్, దుర్గామల్లేశ్వరరావు, శ్రీనివాసరావు, ప్రభుకుమార్, సందీప్, కృపాసాగర్, ధావన్, మహ్మద్ బాషా, నరసింహ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ నెల ఆరు నుంచి ఎనిమిదో తేదీ వరకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో ఈ జట్టు పాల్గొంటుందన్నారు. -
ఆలపాటి గెలుపు
సాక్షిప్రతినిధి,గుంటూరు: కృష్ణా–గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఎన్నికయ్యారు. మొత్తం తొమ్మిది రౌండ్ల కౌంటింగ్ జరగగా మొత్తం పోలైన ఓట్లు 2,41,774కి గాను 2,14,865 ఓట్లు చెల్లబాటయ్యాయి. 26,909 ఓట్లు చెల్లలేదు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 1,45,057 ఓట్లు సాధించారు. తన సమీప ప్రత్యర్థి పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణ రావుకు 62,737 ఓట్లు వచ్చాయి. దీంతో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 82,320 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. మొదటి ప్రాధాన్య ఓట్లతోనే ఈ విజయం దక్కించుకున్నారు. మొత్తం 25 మంది అభ్యర్థులు బరిలో ఉండగా మిగిలిన వారెవరూ కనీస పోటీ ఇవ్వలేదు. మూడోస్థానంలో ఉన్న అన్నవరపు ఆనందకిషోర్కు 860 ఓట్లు దక్కగా గౌతుకట్ల అంకమ్మరావుకు అత్యల్పంగా 26 ఓట్లు దక్కాయి. మంగళవారం గుంటూరు కలెక్టర్ చాంబర్లో కృష్ణా, గుంటూరు పట్టభధ్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, గుంటూరు కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆలపాటి రాజేంద్రప్రసాద్కు ధ్రువీకరణ పత్రం అందించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి ఎన్నికల సెక్షన్ సూపరింటెండెంట్ మల్లేశ్వరి పాల్గొన్నారు. దొంగఓట్లు, రిగ్గింగ్తో గెలిచారు ఈ ఎన్నికల్లో దొంగ ఓట్లు, బూత్ క్యాప్చరింగ్, రిగ్గింగ్లతో అధికార పార్టీ గెలిచిందని పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు ఆరోపించారు. ఫలితాల వెల్లడి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికలను రాజకీయం చేసిందని, తనపై ప్రత్యర్థులు దుష్ప్రచారం చేశారని, ఉద్యోగులు, ఉపాధ్యాయ వర్గాల మధ్య చీలిక తెచ్చారని, రూ.కోట్లు ఖర్చు చేశారని విమర్శించారు. అనేక చోట్ల ఎన్నికల రోజు, దొంగ ఓట్లు, అక్రమాలు చోటుచేసుకున్నాయని, దీనికి అధికార యంత్రాంగం కూడా సహకరించిందని ధ్వజమెత్తారు. ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు అనేక సమస్యలు ఉన్నాయి. నిరుద్యోగ యువత, రైతులు పలు ఇబ్బందులు పడుతున్నారు. కాంట్రాక్ట్, అవుట్ – సోర్సింగ్, అనేక రంగాల్లో పనిచేస్తున్న చిరు ఉద్యోగులు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీటిపై పోరాటాలను కొనసాగిస్తానని కేఎస్ లక్ష్మణరావు ప్రకటించారు. 40శాతం మంది తొలిసారి ఓటర్లు ఎన్నికల్లో గెలుపొందిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో 40 శాతం మంది తొలిసారి ఓటు హక్కును ఉపయోగించుకున్నారని చెప్పారు. తనపై వ్యతిరేక ప్రచారం చేసినా ఓటర్లు గెలిపించారని పేర్కొన్నారు. సమస్యలపై శాసనమండలిలో గళం విప్పుతానని వివరించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే మ్యాజిక్ ఫిగర్ 82, 390 ఓట్ల మెజారిటీ... అనైతికంగా గెలిచారంటున్న పీడీఎఫ్ ప్రజలు కూటమికే పట్టం కట్టారన్న ఆలపాటి రాజేంద్రప్రసాద్ -
జీవితంలో క్రీడలు భాగం కావాలి
విజయవాడస్పోర్ట్స్: మానసిక సాంత్వన, శారీరక దృఢత్వం కోసం క్రీడలు దోహదపడతాయని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్జీజీవో రాష్ట్ర మహిళా విభాగం ఆధ్వర్యంలో క్రీడా పోటీలను నిర్వహించారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో మంత్రి రాంప్రసాద్రెడ్డి పోటీలను మంగళవారం ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగాన్ని ప్రోత్సహిస్తోందని, రెండు శాతం ఉన్న క్రీడల కోటాను మూడు శాతానికి ప్రభుత్వం పెంచిందన్నారు. ప్రతి ఒక్క మహిళా ఉద్యోగి క్రీడల సాధనకు సమయాన్ని కేటాయించి, దైనందిన జీవితంలో ఎదురయ్యే వత్తిడిని జయించాలని సూచించారు. మహిళా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కట్టుబడి ఉందన్నారు. ఈ పోటీలను నిర్వహిస్తున్న ఏపీ ఎన్జీవో నాయకులను అభినందించారు. ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు కె.వి.శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల నమ్మకం, విశ్వాసాన్ని కాపాడుతుందన్నారు. టగ్ ఆఫ్ వార్, బ్యాడ్మింటన్, లెమన్ అండ్ స్పూన్ తదితర పోటీల్లో మహిళా ఉద్యోగులు తలపడ్డారు. మరో రెండు రోజులపాటు ఈ పోటీలు జరగనున్నాయని ఏపీ ఎన్జీజీవో మహిళా ఉద్యోగుల సంఘం చైర్పర్సన్ వి.నిర్మలకుమారి వెల్లడించారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా విభాగం కన్వీనర్ పి.మాధవి, కమిటీ కన్వీనర్ ఎం.రాజ్యలక్ష్మి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి బి.జానకి, రాష్ట్ర కార్యదర్శి బి.తులసిరత్నం, రాష్ట్ర మహిళా విభాగం నాయకులు, క్యాపిటల్ సిటీ బ్రాంచ్ అమరావతి మహిళా నాయకులు పాల్గొన్నారు. మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీల నిర్వహణ అభినందనీయం మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న ఏపీ ఎన్జీజీవో మహిళా ఉద్యోగుల క్రీడా పోటీలను కలెక్టర్ మంగళవారం సందర్శించి, లెమన్ అండ్ స్పూన్ పోటీలను ప్రారంభించారు.మంత్రి రాంప్రసాద్రెడ్డి -
పది విద్యార్థులకు వాట్సాప్ ద్వారా హాల్టికెట్
చిలకలపూడి(మచిలీపట్నం): ఈనెల 17న ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షలకు హాజ రయ్యే విద్యార్థులు హాల్టికెట్లను వాట్సాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించినట్లు డీఈవో పీవీజే రామారావు మంగళవారం తెలిపారు. విద్యార్థులు సెల్ఫోన్ ద్వారా 9552300009 నంబరుకు హాయ్ అనే సందేశాన్ని పంపితే సేవను ఎంచుకోండి అని వస్తుందన్నారు. దానిపై క్లిక్ చేసి ఎడ్యుకేషన్ సర్వీస్ లేదా విద్యాసేవలు ఎంచుకోండని వస్తుందన్నారు.ఎస్ఎస్సీ హాల్టికెట్ అని నమోదు చేసి అప్లికేషన్ నంబరు, విద్యార్థి గుర్తింపు నంబరు, డేట్ ఆఫ్ బర్త్ను నమోదు చేసి స్ట్రీమ్ను సెలక్ట్ చేయాలన్నారు. అనంతరం కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే హాల్టికెట్ మీ వాట్సాప్కు వస్తుందన్నారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల హెచ్ఎంలు డౌన్లోడ్ అయిన హాల్టికెట్లో పేరు, పుట్టినతేదీ, మీడియం, ఫొటోగ్రాఫ్, సంతకం మొదలైన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలన్నారు. విద్యార్థుల వివరాల్లో ఏదైనా మార్పు ఉంటే వెంటనే ప్రధానోపాధ్యాయుడు డైరెక్టర్ ఆఫ్ గవర్న మెంట్ ఎగ్జామ్స్కు మెయిల్ ద్వారా సమాచారం పంపాల్సి ఉందన్నారు. -
సరుకు విక్రయించిన తర్వాత మూసివేశాం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్)/కంచికచర్ల: కూటమి ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. హామీల మాట అటుంచి మహిళలు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఏర్పాటు చేసిన మహిళా మార్ట్ల మూసివేతకు కూటమి నేతలు కుట్రలు చేస్తున్నారు. ఇతర వ్యాపారుల ప్రయోజనాల కోసం లాభాల్లో నడిచే చేయూత మార్ట్లను మూసివేయాలని వత్తిళ్లు తెస్తున్నారు. ఆడిట్ అధికారులపై వత్తిడి తేవడమే కాకుండా చేయూత మార్ట్ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చేయూత మహిళా మార్ట్లకు రాజకీయ గ్రహణం పట్టింది. స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేసి, వాటి సభ్యులకు ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేయూత మహిళా మార్ట్లను ఏర్పాటు చేసింది. స్వయం సహాయక సంఘాలలోని ఒక్కో సభ్యురాలి వద్ద నుంచి పెట్టుబడిగా రూ.200 వసూలు చేసి ఆ వచ్చిన మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టి మహిళా మార్ట్లను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా సరసమైన ధరలకు, నాణ్యమైన సరుకులు సరఫరా చేయాలని నిర్ణయించింది. మార్ట్లో వచ్చే లాభాల్లో స్వయం సహాయక సంఘ సభ్యులకు జీవిత కాలం వాటా దక్కుతుంది. ఇంతటి సదుద్దేశంతో ఎన్టీఆర్ జిల్లాలో కంచికచర్ల, విస్సన్నపేట, కృష్ణాజిల్లాలో పెడన, అవనిగడ్డ మండల కేంద్రాల్లో మహిళా మార్టులు ఏర్పాటు చేశాారు. భవిష్యత్తులో మండలానికో మార్ట్ చొప్పున ఏర్పాటు చేయాలనే సంకల్పంతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పనిచేసింది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సిబ్బంది, వీఓలు, మార్ట్ బోర్డు ఆఫ్ డైరెక్టర్ల కృషితో మార్ట్లు మాల్స్కు దీటుగా ఏర్పాటయ్యాయి. డ్వాక్రా సభ్యులు తయారు చేసిన ఉత్పత్తులను మార్ట్ల ద్వారా విక్రయించేందుకు వెసులుబాటు కల్పించారు. మార్ట్లు ప్రారంభం నాటి నుంచే లాభాల పట్టాయి. ప్రారంభంలో ఒక్కో మార్ట్ రోజుకు రూ.1.50 లక్షల వ్యాపార లావేదేవీలు నిర్వహించాయి. కంచికచర్లలో ఏర్పాటైన చేయూత మార్ట్ను ఒడిశా బృందం సందర్శించి సభ్యులను అభినందించింది. స్కోచ్ అవార్డు కూడా దక్కింది. నాడు కళకళ...నేడు వెలవెల కంచికచర్ల పట్టణంలో రూ.28 లక్షల వ్యయంతో మార్ట్ ఏర్పాటు చేశారు. ఫ్లిప్కార్ట్, మెట్రో, మాల్గుడి వంటి సంస్థలు, హోల్ సేల్ మార్కెట్ల ద్వారా నాణ్యమైన సరుకు అందుబాటులో ఉంచారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మార్ట్లను నిర్వీర్యం చేసే కుట్రలకు కూటమి నేతలు పదును పెట్టారు. వ్యాపారులతో కుమ్మకై ్క మహిళలు నడిపే మార్ట్లపై విషం చిమ్మారు. వ్యాపారుల ప్రయోజనం కోసం సభ్యులు ఎవరూ మార్ట్లో సరుకులు కొనుగోలు చేయెద్దంటూ ప్రచారం చేశారు. మార్ట్ను మూసివేయాలంటూ కొందరు ఉన్నతాధికారులకు లేఖలు సైతం సంధించారు. కంచికచర్ల మండలానికి చెందిన ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు మార్ట్ను నిర్వీర్యం చేసే కుట్రలో భాగస్వామి అయ్యాడు. మార్ట్ బోర్డు ఆఫ్ డైరెక్టర్లను మార్చి కొత్త వారిని నియమించారు. వీరిలో వ్యాపారస్తులు ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం మార్ట్లో అవసరమైన సరుకులు కూడా ఇవ్వడం లేదని కొందరు సభ్యులు వాపోతున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో కళకళ లాడిన మార్ట్ ఇప్పుడు వెలవెలబోతోంది. పెడనలో ప్రత్యామ్నాయం చూపని వైనం పెడనలో 2023 సెప్టెంబర్ నెలలో అన్న క్యాంటీన్లో మహిళా మార్ట్ను ఏర్పాటు చేశారు. రూ.25లక్షల వ్యయంతో మార్ట్ను తీర్చిదిద్దారు. మార్టు ఏర్పాటుకు రెండేళ్ల ఒప్పందం చేసుకున్నారు. ఈ మార్ట్ కూడా లాభాల బాటలోనే ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇంకా ఒప్పంద కాలం పూర్తికానప్పటికీ మార్ట్ను తొలగించారు. సభ్యులు వేరే గది అద్దెకు తీసుకుని అప్పటికే నిల్వ ఉన్న సరుకును విక్రయించారు. ఆ తర్వాత దానిని శాశ్వతంగా మూసివేశారు. దానికి ప్రత్యామ్నాయం కూడా చూపలేదు. మూసివేతకు కూటమి నేతల కుట్ర వ్యాపారస్తులతో కుమ్మకై ్క విష ప్రచారం లాభాల బాటలో ఉన్నా మూసివేయించేందుకు వత్తిడి–రవిబాబు, ఏరియా కో ఆర్డినేటర్ పెడనలో ఏర్పాటు చేసిన చేయూత మహిళా మార్ట్ లాభాల్లోనే నడిచింది. కొన్నాళ్ల తర్వాత ఇక్కడ మార్ట్ను తొలగించడంతో రూమ్ అద్దెకు తీసుకుని సరుకులు అందులోకి మార్చేశాం. సరుకు నిల్వ మొత్తం అమ్మిన తర్వాత మార్ట్ మూసివేశాం. -
మహిళా మార్ట్లకు
మహిళలను లక్షాధికారులను చేస్తామని కల్లబొల్లి కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఉన్న అవకాశాలను కూడా ఊడగొట్టి వారిని రోడ్డుపాలు చేస్తోంది. వాస్తవానికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో డ్వాక్రా మహిళలను వ్యాపారవేత్తలుగా మలిచేందుకు చేయూత మహిళా మార్ట్లను ఏర్పాటుచేసింది. కేవలం రూ.200 పెట్టుబడితో ప్రతి డ్వాక్రా మహిళ వ్యాపార భాగస్వామి అయింది. వ్యాపారంలో వచ్చే లాభాల్లో జీవిత కాలం వాటాదారు అయింది. అయితే జగన్ హయాంలో ఏర్పాటుచేసిన మార్ట్లను కొనసాగిస్తే ఆ పేరు ఆయనకే వస్తుందన్న దురాలోచనతో కూటమి ప్రభుత్వం వీటి నిర్వీర్యానికి నడుంకట్టింది. అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే పెడనలో మార్ట్ను మూసివేయించింది. మిగతా మార్ట్ల మూసివేతకు కుట్రలు పన్నుతోంది. -
వేసవిలో తాగునీటిపై ఫిర్యాదులు రాకుండా చూడాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటికి సంబంధించి ఎటువంటి ఫిర్యాదులు రాకుండా సమన్వయ శాఖల అధికారులు కృషిచేయాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. ఈ నెల 15 నాటికి జిల్లాలో తాగునీటి సరఫరా పథకాలు క్రీయాశీలం కావాలని స్పష్టం చేశారు. వేసవి తాగునీటి సరఫరా కార్యాచరణపై మంగళవారం కలెక్టర్ లక్ష్మీశ కలెక్టరేట్ నుంచి ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లు, పంచాయతీరాజ్ విస్తరణాధికారులు, గ్రామీణ నీటి సరఫరా ఇంజినీర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 286 గ్రామ పంచాయతీలు, 794 ఆవాసాల్లో 19 సమగ్ర రక్షిత నీటి సరఫరా పథకాలు, 366 రక్షిత నీటి సరఫరా పథకాలు, 63 చిన్న రక్షిత నీటి సరఫరా పథకాలు, 439 డైరెక్ట్ పంపింగ్ పథకాలు, 7,917 చేతిపంపులు ఉన్నాయని, దాదాపు ఇవన్నీ పనిచేసే స్థితిలో ఉన్నాయని, ఇంకా ఏవైనా పునరుద్ధరణ, మరమ్మతు పనులు ఉంటే తక్షణమే పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. నీటి వనరులకు సంబంధించి ఫ్లషింగ్ లేదా పూడికతీత, బోరుబావులు, ఇతర బావులను లోతు చేయడం వంటి పనులు ఏవైనా చేయాల్సి ఉంటే క్రాష్ కార్యక్రమం ద్వారా పటిష్ట ప్రణాళికతో సత్వరమే పూర్తిచేయాలన్నారు. ఇందుకు మండల స్థాయి కమిటీలు చొరవ చూపాలన్నారు. నీటి ఎద్దడి ఉన్న ఆవాసాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ప్రత్యేక ఏర్పాట్లు ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లు చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ చలివేంద్రాల కార్యకలాపాలను నిరంతరం సమీక్షించాలని, పారిశుద్ధ్య పనులూ చేపట్టాలని స్పష్టం చేశారు. రీఫిల్లింగ్కు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఇతర ప్రాంతాలతో పోల్చితే విజయవాడలో అధిక ఉష్ణోగ్రతలు, వేడిమి పరిస్థితులు ఉంటాయని, దీన్ని దృష్టిలో ఉంచుకుని బస్టాండ్లు, ఆసుపత్రులు, రహదారుల కూడళ్లు తదితరాల వద్ద తప్పనిసరిగా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు కూడా వేసవిని దృష్టిలో ఉంచుకొని తమ సిబ్బందితో పాటు బయటి నుంచి కార్యాలయాలకు వచ్చే వారికోసం తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. నరేగా పని ప్రదేశాల్లో నీడ సౌకర్యంతో పాటు తాగునీటి సౌకర్యం కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. పశుపక్ష్యాదులకు నీటి ఎద్దడి లేకుండా చూడాలన్నారు. టెలీ కాన్ఫరెన్స్లో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం, గ్రామీణ నీటి సరఫరా సూపరింటెండింగ్ ఇంజినీర్ ఎస్.విద్యాసాగర్, మునిసిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 15 నాటికి నీటి సరఫరా పథకాలు క్రియాశీలం కావాలి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ -
మల్కాపురం, ముచ్చింతాల రిజిస్ట్రేషన్ కొనసాగింపు
జిల్లా రిజిస్ట్రార్ దుర్గాప్రసాద్ జగ్గయ్యపేట అర్బన్: రగామ పంచాయతీ పెండింగ్ సెస్ టీడీ ఎమౌంట్ ఏప్రిల్లో విడుదల అవుతుందని, మల్కాపురం, ముచ్చింతాల గ్రామాల రిజిస్ట్రేషన్ కొనసాగుతుందని జిల్లా రిజిస్ట్రార్ పీవీవీ దుర్గాప్రసాద్ అన్నారు. జగ్గయ్యపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని మంగళవారం జిల్లా రిజిస్ట్రార్ దుర్గాప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో సుమారు రూ.44 కోట్ల ప్రభుత్వ టార్గెట్లో 2023 ఏప్రిల్ నుంచి 2024 మార్చి నాటికి 10,788 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్తో సుమారు రూ. 39.17కోట్ల 34 శాతంగా ఉందన్నారు. ప్రస్తుతం రూ.59.18 కోట్ల టార్గెట్ రావాల్సి ఉండగా 2024 ఏప్రిల్ 2025 ఇప్పటి వరకు 8601 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్తో రూ.29.83 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చిందన్నారు. దీంతో గత ఏడాది కన్నా 1,049 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు తగ్గడమే కాకుండా 18 శాతం ఆదాయం ఈ కార్యాలయం నుంచి తగ్గిందన్నారు. ఇప్పటికే మల్కాపురం, ముచ్చింతాల గ్రామాల రిజిస్ట్రేషన్ కొనసాగడంలేదని మీడియా సమాచారంతో అత్యవసరంగా డీఆర్, డీఐజీతో ఫోన్లో మాట్లాడి వెంటనే తిరిగి రిజిస్ట్రేషన్ కొనసాగించేలా సమస్యను పరిష్కరించారు. జగ్గయ్యపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి నవంబర్ 2023 నుంచి నేటి వరకు రావాల్సిన సెస్ టీడీ ఎమౌంట్ అందక పంచాయతీలు ఇబ్బందులు పడుతున్నాయన్న మీడియా ప్రశ్నలకు.. ఇది కలెక్టర్ దృష్టిలో ఉందని, పంచాయతీ పెండింగ్ ఎమౌంట్ను ఏప్రిల్లో వారికి చెల్లిస్తామన్నారు. జిల్లాలో ఇప్పటికే క్లర్క్ ఆఫీస్ సబార్డినేటర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆయన తెలిపారు. ఎటువంటి అభ్యంతరం లేని ఓటీఎస్కు పట్టాలకు రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందన్నారు. త్వరలో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో బిల్డర్లతో రిజిస్ట్రేషన్ పెంచడానికి అవగాహన సమావేశం ఏర్పాటుచేస్తామన్నారు. కార్యక్రమంలో సబ్ రిజిస్ట్రార్ సిబ్బంది, బిల్డర్స్ పాల్గొన్నారు. -
ఎన్ఆర్ఈజీఎస్తో పేదలకు ఉపాధి అవకాశాలు
విజయవాడరూరల్: జాతీయ ఉపాధి హామీ పథకంతో గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్టు పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ జాయింట్ కమిషనర్ జె.సునీత తెలియ జేశారు. విజయవాడ రూరల్ మండలం నున్న, పాతపాడు గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి పనులను శిక్షణలో ఉన్న ఎంపీడీఓలతో కలసి మంగళవారం ఆమె పరిశీలించారు. ఉపాధి పథకం ద్వారా భూగర్భ జలాల అభివృద్ధి కోసం నీటికుంటలు తవ్వించడం, మామిడితోటల్లో పాదులు తవ్వడం, సరిహద్దు కందకాలు తవ్వకం పనులు జరుగుతున్నాయని ట్రైనీ ఎంపీడీఓలకు అవగాహన కల్పించారు. అనంతరం నున్న గ్రామంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో దాదాపు మూడు లక్షల మంది గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు ఉపాధి పథకం ద్వారా వంద రోజుల పని కల్పిస్తున్నామన్నారు. రెండు లక్షల మంది జాబ్కార్డులు కలిగిన వారు ఉన్నారని తెలియజేశారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎ.రాము, ఇన్చార్జి ఎంపీడీఓ పి.మురళీకృష్ణప్రసాద్, 11 మంది ట్రైనీ ఎంపీడీఓలు పాల్గొన్నారు. -
7 నాటికి సొసైటీల కంప్యూటరీకరణ పూర్తి చేయాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో ఈనెల 7వ తేదీ నాటికి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల(పీఏసీఎస్) కంప్యూటరీకరణ ప్రక్రియ పూర్తి చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. పీఏసీఎస్ల కంప్యూటరీకరణ ప్రగతిపై మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. 131 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో మార్చి 7 నాటికి కంప్యూటరీకరణ పూర్తిచేసి ఈ – పీఏసీఎస్లుగా మార్పు చేయాలన్నారు. వ్యవసాయదారులకు పేపర్ లెస్ ఆన్లైన్ సేవలు అందించాలని ఆదేశించారు. ఈ ప్రక్రియలో తలెత్తే సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని స్టేట్ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ వారికి ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంలో అలసత్వం వహించిన ఆడిటర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సమీక్ష సమావేశంలో జిల్లా సహకార అధికారి డాక్టర్ ఎస్.శ్రీనివాసరెడ్డి, జిల్లా సహకార ఆడిట్ అధికారి సీహెచ్ శైలజ, విభాగ సహకార అధికారి పి.కిరణ్ కుమార్, జిల్లా సహకార కేంద్ర బ్యాంకు జనరల్ మేనేజర్ జి.రంగబాబు పాల్గొన్నారు. -
ఇంటర్ పరీక్షకు 920 మంది గైర్హాజరు
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఇంటర్మీడియెట్ పరీక్షలకు సంబంధించి మంగళవారం జరిగిన మొదటి సంవత్సరం ఇంగ్లిష్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. 920 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. 40,608 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 39,686 మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఇంటర్మీడియెట్ బోర్డు అధికారి సత్యనారాయణరెడ్డి పరీక్షల తీరును పరిశీలించారు. ఎక్కడా ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోలేదని ఆయన పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి మధురానగర్(విజయవాడసెంట్రల్): రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందిన ఘటన గుణదల పీఎస్ పరిధిలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రసాదంపాడుకు చెందిన మంత్రవాది సూర్య తేజ తండ్రి మురళీధర్ (62)మంగళవారం ఉదయం ద్విచక్రవాహనంపై విజయవాడ వైపు వస్తున్నారు. పడవల రేవు జంక్షన్ వద్దకు వచ్చేసరికి ఎదరుగా వస్తున్న మరొక ద్విచక్రవాహనం ఢీ కొట్టింది. కిందపడిపోయిన మురళీధర్ అపస్మారక స్థితిలోకి వెళ్లారు. స్థానికులు హుటాహుటిన చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే మురళీధర్ మృతిచెందారు. దీంతో గుణదల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
యూత్ పార్లమెంట్ని వినియోగించుకోవాలి
మధురానగర్(విజయవాడసెంట్రల్): యూత పార్లమెంట్ అవకాశాన్ని యువత వినియోగించుకోవాలని ఎన్టీఆర్ జిల్లా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ కొల్లేటి రమేష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ వారి ఆదేశాల మేరకు జిల్లా స్థాయి యూత్ పార్లమెంట్ పోటీలను గుంటూరులోని టీజేపీఎస్ కళాశాలలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం కావాలని, మేధాశక్తి ఉపయోగించి ప్రపంచంలో మన దేశం ప్రథమ స్థానంలో ఉండటానికి కృషి చేయాలన్నారు. ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల నుంచి 18 నుంచి 25 ఏళ్లవారు యూత్ పార్లమెంట్ పోటీల్లో పాల్గొనవచ్చని తెలిపారు. పాల్గొనదలచిన వారు ముందుగా మై భారత్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత ఒక్క నిమిషం నిడివి కలిగిన ‘వాట్ డజ్ వికసిత్ భారత్ మీన్ టూ యూ’ అంశం పై వీడియో చేసి మార్చి 9వ తేదీ రాత్రి 11.59 గంటలలోపు అప్లోడ్ చేయాలని సూచించారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారిని స్క్రీనింగ్ చేసి జిల్లా స్థాయిలో ఎంపిక చేస్తారని తెలిపారు. తర్వాత ఈ ఐదు జిల్లాల నుంచి ఎంపికై న వారికి జిల్లా స్థాయిలో టీజేపీఎస్ కళాశాల, గుంటూరులో 150 విద్యార్థులకు పోటీ ఉంటుందని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్.. పేవింగ్ ది వే ఫర్ వికసిత్ భారత్’పై 3 నిముషాలు మాట్లాడాలని సూచించారు. యూనివర్సిటీ ప్రొఫెసర్లు, వివిధ కళాశాలల అధ్యాపకులు, గుంటూరు, పల్నాడు, బాపట్ల, కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాల ఎన్ఎస్ఎస్ అధికారులు, యూత్ నాయకులు, నెహ్రూ యువ కేంద్రం అధికారులు, ఇతర అధ్యాపకులు, సామాజిక కార్యకర్తలు ఈ పోటీల గురించి యువతకు అవగాహన కలిగించి ఎక్కువ సంఖ్యలో పాల్గొనేలా చూడాలని ఆయన కోరారు. -
పురుగుల మందు తాగి వృద్ధురాలి ఆత్మహత్య
గుడివాడరూరల్: పురుగుల మందు తాగి వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం చోటు చేసుకుంది. గుడివాడ తాలూకా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని తటివర్రు గ్రామానికి చెందిన నగుళ్ల రాఘవమ్మ (65) ఆమె కొడుకు సత్యనారాయణ వద్ద పక్క పోర్షన్లో నివాసముంటోంది. ఆమెకు 8 సెంట్ల స్థలం ఉంది. దీన్ని ఆమె అమ్ముకునే ప్రయత్నం చేయగా కొడుకు సత్యనారాయణ, కోడలు లక్ష్మి, మనుమడు గంగాధరరావు అడ్డుకుని తీవ్ర మనోవేదనకు గురి చేయడంతో తెల్లవారు జామున 3గంటలకు వృద్ధురాలు పురుగు మందు సేవించింది. తెల్లవారినా లేవకపోవడంతో చుట్టు పక్కల వారు ఆమెను గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలి చావుకి కారణమైన కొడుకు, కోడలు, మనుమడుపై కేసు నమోదు చేసి ఎస్ఐ చంటిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు పోలీసులు అప్పగించారు. తటివర్రులో ఘటన -
భాగస్వాములు కావాలి
ప్రకృతి వ్యవసాయంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మానవ మనుగడకు కీలకమైన ప్రకృతి వ్యవసాయ ఉద్యమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ పిలుపునిచ్చారు. దశల వారీ కార్యాచరణతో సహజ సాగులో జిల్లాను నంబర్1లో నిలపడానికి కృషి చేయాలన్నారు. మంగళవారం విజయవాడలోని లయోల కళాశాల ఎదురుగా ఉన్న రైతు సాధికార సంస్థ ప్రకృతి వ్యవసాయ విభాగం జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో రిసోర్స్ పర్సన్లు, యూనిట్ ఇన్చార్జ్లు, మోడల్ మేకర్ ట్రైనర్లు తదితరులకు ప్రకృతి వ్యవసాయం–ఖరీఫ్ కార్యాచరణ ప్రణాళికపై వర్క్షాప్ జరి గింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంపై అన్నదాతల్లో ఉన్న అపోహలను తొలగించాలన్నారు. ఆరోగ్యకర ఉత్పత్తులతో మొత్తం సమాజానికే మేలు కలిగించే సాగు విధానాలపై పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. ర్యాలీలు, స్వయం సహాయక సంఘాల మహిళలకు అవగాహన కార్యక్రమాలు, పొలం సందర్శనలు వంటివి చేయాలన్నారు. తాను సేంద్రియ వ్యవసాయంలో పీహెచ్డీ చేశానని.. రసాయన పురుగు మందులు, ఎరువులు క్రమేపీ మనిషి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని వివరించారు. సాగులో సేంద్రియ ఎరువులు, జీవ ఉత్ప్రేరకాలు, కషాయాలు/ద్రావణాలు తదితరాల వినియోగంతో ఆరోగ్యకరమైన వ్యవసాయ ఉత్పత్తులు చేతికందుతాయని కలెక్టర్ వివరించారు. క్షేత్రస్థాయి సిబ్బంది ప్రతి రైతుకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన పెంచాలని.. దశల వారీగా విస్తీర్ణాన్ని పెంచుతూ జిల్లాను ఆదర్శవంతంగా నిలుపుదామని పిలుపునిచ్చారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్లోనూ రైతులకు తోడుగా నిలవాల్సిన అవసరముందని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. వర్క్షాప్నకు వచ్చిన వారితో కలెక్టర్.. ప్రకృతి వ్యవసాయంపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి, ప్రకృతి వ్యవసాయం ప్రాజెక్టు మేనేజర్ డీఎంఎఫ్ విజయకుమారి, ట్రైనర్లు డి.రవికుమార్, ఎ.వాణి, సీహెచ్ అంజిరెడ్డి, పి.రాజశ్రీ, వి.సింధు తదితరులు పాల్గొన్నారు. -
వైద్యం వికటించి గర్భిణి మృతి
● ఆందోళన వ్యక్తం చేసిన బంధువులు ● ఆస్పత్రిలో ఫర్నిచర్ ధ్వంసం ● నిండు గర్భిణి మరణిస్తే రేటు కడతారా మచిలీపట్నం టౌన్: వైద్యం వికటించి ఏడు నెలల నిండు గర్భిణి మృతి చెందిన ఘటన జిల్లా కేంద్రం మచిలీపట్నంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. నగరంలోని రామానాయుడు పేట సోషల్క్లబ్ సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పెడన మండలం జింజేరు గ్రామానికి చెందిన గర్భిణి నాగదుర్గ(24) ఈ ఆస్పత్రిలో వైద్యం పొందుతోంది. ఎప్పటి మాదిరి మంగళవారం ఉదయం వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చారు. పలు పరీక్షలు చేయాలని పేర్కొంటూ రూ.700 కట్టించుకుని మధ్యాహ్నం సమయంలో వైద్యురాలు నాగదుర్గకు ఇంజక్షన్ చేశారు. కొంతసేపటికి ఆమె ఆస్వస్థతకు గురి కావడంతో ఐసీయూలో చికిత్స అందించారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో నాగదుర్గ మరణించిందని వైద్యురాలు పేర్కొనంతో బంధువులు తీవ్ర ఆందోళన చెందారు. వైద్యురాలి నిర్లక్ష్యంతో నాగదుర్గ చనిపోయిందని బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. ఆందోళన వ్యక్తం చేసిన వారు వైద్యురాలి గదిలోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. డాక్టర్ చేసిన ఇంజక్షన్ వికటించి నాగదుర్గ చనిపోయిందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఓ పక్క నిండుగర్భిణి చనిపోయిందని బాధతో ఉన్న బంధువులను సెటిల్మెంట్ చేసుకుందామని రావాలంటూ వైద్యురాలి భర్త, వైద్యుడితోపాటు మరికొందరు చెప్పడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన బంధువులు ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. నిండు గర్భిణి మృతికి కారణమైన ఆస్పత్రిని సీజ్ చేయాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. తమకు ప్రజాప్రతినిధులు న్యాయం చేయాలని కోరుతున్నారు. -
ప్రపంచ పారా అథ్లెటిక్స్కు ముగ్గురు రాష్ట్ర క్రీడాకారులు
విజయవాడస్పోర్ట్స్: వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్–2025కు ప్రాతినిధ్యం వహించే భారత జట్టులో ముగ్గురు రాష్ట్ర క్రీడాకారులు చోటు దక్కించుకున్నారని ఏపీ పారా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష,కార్యదర్శులు జి.కోటేశ్వరరావు, వి.రామస్వామి తెలిపారు. ఎఫ్–40 కేటగిరిలో ఆర్.రవి(అనకాపల్లి), టి–11 కేటగిరిలో కె.లలిత(పార్వతిపురం), టి–35 కేటగిరిలో టి.రాము(శ్రీకాకుళం) ప్రపంచ పోటీలకు అర్హత సాధించారని వెల్లడించారు. ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగే వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్–2025 పోటీల్లో పాల్గొంటారన్నారు. ప్రపంచ పోటీలకు అర్హత సాధించిన క్రీడాకారులను ఏపీ క్రీడా ప్రాఽథికార సంస్థ(శాప్) చైర్మన్ అనిమిని రవినాయుడు, ఎండీ పి.ఎస్.గిరీష అభినందించారు. టీల్లో రాణించి రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేయాలని ఆకాంక్షించారు. డీజీపీకి లారీ యజమానుల వినతి లబ్బీపేట(విజయవాడతూర్పు): రోడ్డు ప్రమాదాలు జరిగినపుడు సంబంధిత లారీ ధ్రువపత్రాలన్నీ సక్రమంగా ఉంటే సమీప పోలీసుస్టేషన్ లోనే లారీని విడుదల చేయాలని గతంలో డీజీపీ ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని లారీ యజమానులు విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు లారీ యజమానుల సంఘం నాయకులు మంగళవారం డీజీపీ హరీష్కుమార్ గుప్తాను కలిసి వినతిపత్రం అందజేశారు. ఆలిండియా మోటార్ ట్రాన్స్ పోర్టు కాంగ్రెస్ (న్యూఢిల్లీ) సౌత్ జోన్ ఉపాధ్యక్షుడు వైవీ ఈశ్వరరావు, ది కృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగుమోతు రాజా, ప్రధాన కార్యదర్శి అల్లాడ వీరవెంకట సత్యనారాయణ తదితరులు డీజీపీని ఆయన కార్యాలయంలో కలిసి సమస్యను వివరించారు. దీనిపై డీజీపీ సానుకూలంగా స్పందిస్తూ కొత్త సర్క్యులర్ జారీ చేస్తామని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన 32 మందికి జరిమానా విజయవాడలీగల్: నగరంలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 32 మందికి న్యాయస్థానం జరిమానా విధించింది. నగరంలో రోడ్డు ప్రమాదాలను నివారించడానికి నగర పోలీసు కమిషనర్ ఆదేశాల మేరకు వివిధ ప్రాంతాల్లో మద్యం సేవించిన వాహనచోదకులపై 5వ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మంగళవారం ఆరో అదనపు జ్యుడీషియల్ మెట్రోపాలిటన్ న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి లెనిన్ బాబు 8 మందికి ఒక్కొక్కరికి 15వేలు చొప్పున, మిగిలిన 24 మందికి ఒక్కొక్కరికి 10వేలు చొప్పున జరిమానా విధించారు. -
మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలలో ప్రవేశాలు
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఏపీ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యాన విజయవాడ భవానీపురంలో నిర్వహిస్తున్న ఏపీఆర్ఎస్ మైనార్టీ గురుకుల బాలికల పాఠశాల 2025–26 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు కల్పిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఎస్. శివకుమారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 5వ తరగతిలో 40 సీట్లు, 6, 7, 8 తరగతుల్లో (బ్యాక్ లాగ్) మిగిలి ఉన్న సీట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ముస్లిం (బీసీ–ఇ, బీసీ–బీ, బీసీ–సీ (కన్వర్టెడ్ క్రిస్టియన్) విద్యార్థినులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆయా తరగతుల్లో ప్రవేశానికి శ్రీకాకుళం నుంచి తిరుపతి జిల్లా వరకు ఆసక్తి ఉన్న విద్యార్థినులు ఈ నెల 31వ తేదీలోపు ఆన్లైన్లో htt pr://aprrapcfrr.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేయాలని సూచించారు. ఏప్రిల్ 25న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. మృతుడు తాడిగడప వాసిగా గుర్తింపు కంకిపాడు: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి పెనమలూరు మండలం తాడిగడప వాసిగా పోలీసులు తేల్చారు. ఎస్ఐ సందీప్ మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడారు. ఈనెల 3న కంకిపాడు బైపాస్ సమీపంలో ప్రొద్దుటూరు పరిఽధిలోని శరత్చంద్ర అకాడమి దగ్గర విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారి దాటుతున్న వ్యక్తిని ఉయ్యూరు నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొంది. ఘటనలో మృతి చెందిన వ్యక్తి పెనమలూరు మండలం తాడిగడప శ్రీనగర్కు చెందిన సింగంపల్లి సాయి (40)గా నిర్ధారించారు. ప్రమాదానికి కారణమైన కారు ఉయ్యూరులోని ఓ పాఠశాలకు చెందిన ప్రిన్సిపాల్దిగా గుర్తించారు. ప్రమాద సమయంలో ప్రిన్సిపాల్ స్వయంగా కారు నడుపుతున్నట్లు గుర్తించారు. ప్రమాదానికి కారణమైన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సందీప్ తెలిపారు. వృద్ధురాలి హత్య కేసులో జీవిత ఖైదు విజయవాడలీగల్: నగలు కోసం వృద్ధురాలిని హత్యచేసిన కేసులో నిందితుడికి జీవిత ఖైదు, జరిమానా విధిస్తూ 7వ అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి ఎస్.నాగేశ్వరరావు తీర్పునిచ్చారు. వివరాల్లోకి వెళ్తే నవంబరు, 2014లో విజయవాడ గుణదల ప్రాంతంలో మాధురి అనే వృద్ధురాలు ఇంట్లో ఒంటరిగా ఉంది. తోట్లవల్లూరు గ్రామానికి చెందిన కార్పెంటర్ అబ్దుల్ అజీజ్ అనే బుజ్జి ఇంట్లోకి ప్రవేశించి, ఆమె చేతికి ఉన్న బంగారుగాజులు దొంగి లించి, ఆమెను హత్యచేశాడని మృతురాలి బంధువులు ఆరోపించారు. ఐపీసీ 302, 380 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన మాచవరం పోలీసులు దర్యాప్తు చేసి, బుజ్జిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ప్రాసిక్యూషన్ తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వై.జేమ్స్, సీఎంఎస్ ఇన్స్పెక్టర్ జగదీశ్వరరావు, మాచవరం ఇన్స్పెక్టర్ ప్రకాష్రావు పర్యవేక్షణలో 18మంది సాక్షులను విచారణ చేశారు. బుజ్జిపై నేరం రుజువు కావడంతో నగలు దోపిడీ చేసి, హత్యచేసినందుకు నిందితుడికి జీవితఖైదు, రూ. 3 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. -
కోడూరుపాడులో ప్రత్యక్షమైన పునుగు పిల్లి
హనుమాన్జంక్షన్ రూరల్: కృష్ణాజిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడులో అరుదైన జాతికి చెందిన పునుగు పిల్లి ప్రత్యక్షమైంది. అటవీ ప్రాంతంలో అధికంగా సంచరించే పునుగు పిల్లి జనావాసాల్లోకి రావటంతో గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గ్రామంలో పిల్లిని పోలిన ఓ వింత జీవి తిరుగుతుండటంతో పట్టుకునేందుకు స్థానికులు యత్నించారు. ఈ నేపథ్యంలో సోమవారం గ్రామానికి చెందిన ఆళ్ల భాను దానిని వల సాయంతో పట్టుకుని, తన ఇంట్లోని బోనులో ఉంచారు. ఆ తర్వాత ఈ జంతువును అరుదైన పునుగు పిల్లి అని, కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వరునికి ప్రీతి పాత్రమైనదంటూ పలువురు గుర్తించటంతో మరింత ఆశ్చర్యానికి గురయ్యారు. పునుగుపిల్లి సమాచారాన్ని అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారు గ్రామానికి వచ్చి పునుగు పిల్లిని స్వాధీనం చేసుకున్నారు. -
వినికిడి దినోత్సవ పోస్టర్ల ఆవిష్కరణ
మధురానగర్(విజయవాడసెంట్రల్): చిన్న పిల్లల్లో వినికిడి సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించడం ద్వారా వారి ఆరోగ్యకర జీవితానికి మంచి పునాది వేయవచ్చని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్యఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ప్రత్యేక పోస్టర్లను సోమవారం వివిధ శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ లక్ష్మీశ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినికిడి సమస్యలకు కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామ/వార్డు సచివాలయ స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ఈ విషయంలో క్షేత్రస్థాయి వైద్యాధికా రులు, ఏఎన్ఎం, ఆశాలు, అంగన్వాడీ కార్య కర్తలు తదితరులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ శుభం నోఖ్వాల్, డీఆర్వో ఎం.లక్ష్మీనర సింహం, డీఎంహెచ్ఓ డాక్టర్ ఎం.సుహాసిని, సీపీఓ వై.శ్రీలత, డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, పీఓ–యూసీడీ వెంకటరత్నం, ఐసీడీఎస్ పీడీ డి.శ్రీలక్ష్మి, ఎన్సీడీ కార్యక్రమం అధికారి డాక్టర్ మాధవి నాయుడు, ఎల్డీఎం కె.ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. -
56 మంది కొత్త సబ్ ఇన్స్పెక్టర్లు
విజయవాడస్పోర్ట్స్: అనంతపురం పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో శిక్షణ పూర్తి చేసుకున్న వారిలో 56 మంది సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ)లను ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్కు హోం శాఖ కేటాయించింది. ఈ ఎస్ఐలు అందరూ సోమవారం విజయవాడలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీపీ ఎస్.వి.రాజశేఖరబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. నిర్భ యంగా, నిష్పక్షపాతంగా, జవాబుదారీతనంతో విధి నిర్వహణ చేయాలని వారికి సీపీ సూచించారు. బాధితులకు న్యాయం చేస్తూ, దోషులకు శిక్ష పడేలా పని చేయాలని పేర్కొన్నారు. ప్రజలకు అత్యుత్తమ సేవలు అందిస్తూ, పోలీస్ శాఖ ప్రతిష్టను మరింత పెంచేలా విధులు నిర్వర్తించాలన్నారు. విధి నిర్వహణలో తలెత్తే సందేహాలపై ఉన్నతాధికారులు సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు గౌతమి శాలి, తిరుమలేశ్వరరెడ్డి, కె.జి.వి.సరిత, ఎ.బి.టి.ఎస్.ఉదయారాణి, కృష్ణమూర్తినాయుడు పాల్గొన్నారు. -
ఎత్తిపోతల ఎడారి.. పొలాలు తడారి..
పెనుగంచిప్రోలు: నీటి చెమ్మలేకుండా పెనుగంచిప్రోలు ఎత్తిపోతల పథకం ఎడారిని తలపిస్తోంది. సాగునీరు అందక ఆయకట్టు పొలాలన్నీ తడారిపోతున్నాయి. ఎండుముఖం పట్టిన మొక్కజొన్న, శనగ పైర్లకు నీటి తడులు ఎలా అందించాలో అర్థంకాక రైతులు సతమతం అవుతున్నారు. ఎత్తపోతల పథకానికి మరమ్మతులు పూర్తిచేస్తేనే తమ పొలాలు కళకళలాడతాయని, లేకుంటే సాగు కష్టమేనని రైతులు పేర్కొంటున్నారు. గత ఏడాది సెప్టెంబర్లో మునేరుకు వచ్చిన భారీ వరదలకు పెనుగంచిప్రోలు ఎత్తిపోతల పథకం మరమ్మతులకు గురైంది. మునేరు వరదకు పంపుహౌస్ పూర్తిగా నీటిలో మునిగింది. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ కొట్టుకుపోయాయి. ఎత్తిపోతల పథకం లోపల నాలుగు మోటార్లు, విద్యుత్ సామగ్రి, ప్యానెల్ బోర్డులు తడిసి మరమ్మతులకు గురయ్యాయి. దీంతో పథకం పూర్తిగా మూలన పడింది. నాగార్జున సాగర్ ఎడమ కాలువ డీవీఆర్ బ్రాంచి కాలువ పరిధిలోని పెనుగంచిప్రోలు మేజర్ ఆయకట్టులోని చివరి గ్రామం పెనుగంచిప్రోలు. సాగర్ కాలువకు చివరగా ఉండటంతో ఆయకట్టు రైతులకు సాగు నీరు సక్రమంగా అందటం లేదు. చివరి భూముల సాగు నీటి కోసం స్థానిక మునేరులో ఐడీసీ ఆధ్వర్యంలో రూ.17.23 కోట్లతో ఎత్తిపోతల పథకం నిర్మించారు. ఈ పథకం ఆయకట్టు కింద పెనుగంచిప్రోలు, సుబ్బాయిగూడెం గ్రామాల పరిధిలోని 2,465.02 ఎకరాలు ఉన్నాయి. ప్రస్తుతం సాగర్ నీరు లభ్యత లేకపోవటంతో రైతులకు ఎత్తిపోతల పథకం నీరు అవసరమైంది. ఎత్తిపోతల పథకానికి మరమ్మతులు జరగకపోవడంతో రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రబీ పంటలకు నీటి వెతలు ప్రస్తుతం రబీ పంటలు మొక్కజొన్న, శనగ సాగుకు నీటి అవసరం ఉంది. ముఖ్యంగా మొక్కజొన్న సాగుకు నీరు అవసరం చాలా ఎక్కువ. నీరు లేక పంట వడలిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయిల్ మోటార్లు ఏర్పాటు చేసి నీటి తడులు అందించి పైరును కాపాడుకుంటున్నామని, ఎకరానికి మరో రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు అదనంగా ఖర్చవుతోందని పేర్కొంటున్నారు. ఎత్తిపోతల పథకానికి మరమ్మతులు చేస్తేనే తమ వెతలు తీరతాయని స్పష్టంచేస్తున్నారు. మరమ్మతులకు నోచుకోని పెనుగంచిప్రోలు ఎత్తిపోతల పథకం నీరు అందక మొక్కజొన్న, శనగ పంటలు ఎండుముఖం 2,465 ఎకరాల్లో రైతుల కన్నీటి సాగు ఎత్తిపోతల పథకానికి తక్షణ మరమ్మతుల కోసం రూ.6 లక్షలు అవసరమని ఏపీఎస్ఐడీసీ అధికారులు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. అయితే ఇప్పటి వరకు నిధులు మంజూరు కాలేదు. అయితే మరమ్మతులకు సుమారుగా రూ.15 లక్షల వరకు అవసరమని రైతులు పేర్కొంటున్నారు. ఇటీవల గ్రామానికి వచ్చిన కలెక్టర్ లక్ష్మీశ దృష్టికి రైతులు సాగునీటి ఇబ్బందులను తీసుకెళ్లారు. ఎత్తిపోతల పథకం మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. అధికారులు స్పందించి ఎత్తిపోతల పథకం మరమ్మతుల పథకానికి మరమ్మ తులు చేయాలని రైతులు విజ్ఞప్తిచేస్తున్నారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లామంగళవారం శ్రీ 4 శ్రీ మార్చి శ్రీ 2025సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 527.80 అడుగుల వద్ద ఉంది. కుడి కాలువకు 7,033 క్యూసెక్కులు విడుదలవుతోంది. పీహెచ్సీ తనిఖీ పెనమలూరు: పోరంకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కృష్ణా జిల్లా వైద్యాధికారిణి శర్మిష్ఠ సోమ వారం తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సేవల వివరాలు తెలుసుకున్నారు. మహిళలను రక్షించుకుందాం..చిలకలపూడి(మచిలీపట్నం): మహిళలను రక్షించుకుందాం, చదివించుకుందామని నినదిస్తూ మచిలీపట్నంలో సోమవారం అంగన్వాడీలు ర్యాలీ చేశారు. ఇఫ్తార్ సహరి (మంగళ) (బుధ) విజయవాడ 6.20 5.05 మచిలీపట్నం 6.19 5.03జి.కొండూరు: ఎన్టీఆర్ జిల్లాలో మామిడి దిగుబడులు నేలచూపులు చూస్తున్నాయి. మార్కెట్లో కాయల లభ్యత లేకపోవడం, డిమాండ్ అధికంగా ఉండ టంతో ధర మాత్రం ఆకాశాన్ని అంటుతోంది. మిట్టగూడెం మార్కెట్లో ఆదివారం టన్ను బంగినపల్లి ధర రూ.1.20 లక్షలు పలికింది. అయితే దిగుబడులు లేకపోవ డంతో ఈ ధర కూడా గిట్టుబాటుకాదని రైతులు వాపోతున్నారు. ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడల దాడి, ధరలో హెచ్చుతగ్గులు ఇలా ఏదో కారణంతో మామిడి రైతులు ఏటా నష్టపోతూనే ఉన్నారు. నష్టాలు తప్ప లాభాలు లేకపోవడంతో ఏడాదికేడాది మామిడి సాగు విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలో ఈ ఏడాది పూత ఆలస్యంగా రావడంతో పాటు తామర పురుగు ఉదృతి ఎక్కువై పూత రాలిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దిగుబడి పూర్తిగా పడిపోవడంతో ధర అమాంతం పెరిగింది. పెరుగుతున్న ధరలు చూసి దిగుబడి లేక రైతులు లబోదిబో మంటున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. మూడేళ్లుగా నష్టాలు ఎన్టీఆర్ జిల్లాల్లో పురుగులు, తెగుళ్ల వల్ల మామిడి దిగుబడి మూడేళ్లుగా తగ్గుతూ వస్తోంది. జిల్లాల్లో సారవంతమైన నేలలు అధికంగా ఉండడంతో మామిడి చెట్లు 15 నుంచి 20 అడుగులు ఎత్తు పెరుగుతున్నాయి. దీని వల్లన రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టడానికి వీలు ఉండటంలేదు. అంతే కాకుండా రైతులు పూర్వపు సాగు పద్ధతులకు స్వస్తి చెప్పి మామిడి తోటలకు నీటి తడులు అధికంగా ఇస్తున్నారు. దీంతో నేలలో తేమ శాతం పెరిగి మామిడి చెట్లపై పురుగులు, తెగుళ్లు ఉధృతి ఎక్కువ అవుతోంది. మూడేళ్ల నుంచి జిల్లాలో తామర పురుగు, తేనె మంచు పురుగు, పేను వంటి పురుగుల ఉధృతితో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రెండు టన్నుల లోపే దిగుబడి జిల్లాలో 22,896 హెక్టార్లలో మామిడి సాగవుతుండగా ఎకరానికి రెండు టన్నుల దిగుబడి కూడా వచ్చే అవకాశం లేదని రైతులు పేర్కొంటున్నారు. ప్రకృతి సహకరిస్తే ఎకరానికి నాలుగు నుంచి ఆరు టన్నుల వరకు దిగుబడి వస్తుందని చెబుతున్నారు. ఎకరానికి దుక్కి, ఎరువులు, పురుగుమందులు, కూలీలు ఖర్చులు కలిపి రూ.50 వేల నుంచి రూ.80 వేల వరకు పెట్టుబడి పెట్టిన నేపథ్యంలో పూత రాలిపోయి దిగుబడిలేక తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోతున్నారు. జిల్లాలో గత ఏడాది లక్షా 76వేల టన్నులకు పైగా మామిడి దిగుబడి వచ్చింది. ఈ ఏడాది లక్ష టన్నుల దిగుబడి రావడం కూడా కష్టమేనని అధికారులు అంచనా వేస్తున్నారు. 7 మామిడి తోటలపై మంచు, తామర పురుగు దాడి ఫలితంగా సగానికి తగ్గిపోయిన కాయల దిగుబడి లభ్యతలేక అమాంతం పెరిగిన మామిడి ధర మిట్టగూడెం మార్కెట్లో బంగినపల్లి టన్ను ధర రూ.1.20 లక్షలు న్యూస్రీల్ఎన్టీఆర్ జిల్లాలో మామిడి సాగు వివరాలు జిల్లాలోని పలు మండలాల్లో మామిడి తోటలు సాగులో ఉన్నాయి. మండలాల వారీగా వత్సవాయిలో 165, జగ్గయ్యపేట 295, పెనుగంచిప్రోలు 244, నందిగామ 251, వీరులపాడు 113, మైలవరం 3,353, గంపలగూడెం 616, తిరువూరు 817, ఎ.కొండూరు 2,336, రెడ్డిగూడెం 4,450, విస్సన్నపేట 5,817, జి.కొండూరు 2,324, కంచికచర్ల 125, చందర్లపాడు 20, ఇబ్రహీంపట్నం 18, విజయవాడరూరల్ మండలంలో 1,952 హెక్టార్లలో మామిడి తోటలు సాగులో ఉన్నాయి. మిట్టగూడెంలో టన్ను ధర రూ.1.20 లక్షలు రెడ్డిగూడెం మండలంలో మామిడి కోతలు ప్రారంభమ య్యాయి. మండలంలోని మిట్టగూడెం మ్యాంగో మార్కెట్లో ఆదివారం కాయల విక్రయాలు మొదలయ్యాయి. వ్యాపారులు అధిక ధరలు ఇస్తున్నారు. టన్ను బంగిన పల్లి ధర రూ.1.20 లక్షలు, తోతాపురి రూ.70 వేలు, రసాలు రూ.40 వేల చొప్పున కొనుగోలు చేశారు. మండలంలో 4,450 హెక్టార్లలో మామిడి సాగువుతుండగా రైతులే నేరుగా మామిడి కాయలను బొంబాయి, హైదరాబాద్, నాందేడ్ వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. నూజివీడు తర్వాత రెడ్డిగూడెం మామిడికి జాతీయ మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. -
బాల్య వివాహ రహిత సమాజానికి సమష్టి కృషి
మధురానగర్(విజయవాడసెంట్రల్): బాల్య వివాహ రహిత సమాజం కోసం సమష్టిగా కృషి చేయాల్సిన అవసరముందని, బాల్య వివాహాల దుష్పరిణామాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం నగరంలో ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా విజయవాడ సివిల్ కోర్టు సమీపంలోని వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్, చిల్డ్రన్ హోం ప్రాంగణంలో బాల్య వివాహాల నిర్మూలనపై నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో కలెక్టర్ లక్ష్మీశ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సిగ్నేచర్ క్యాంపయిన్ను ప్రారంభించారు. బాల్య వివాహాలను అడ్డుకునేందుకు చేసిన చట్టాలు, ప్రభుత్వాలు అమలుచేస్తున్న కార్యక్రమాలు, విధానాల పటిష్ట అమల్లో మహిళాభివృద్ధి, విద్య, వైద్య ఆరోగ్యం, పోలీస్ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ అధికారి డి.శ్రీలక్ష్మి, నోడల్ అధికారి సీహెచ్ సాయిగీత, సీడీపీవోలు జ్యోత్స్న, జి.మంగమ్మ, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎం.రాజరాజేశ్వరరావు, అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్లు, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ -
బ్యారక్ మార్చాలన్న వంశీ పిటీషన్పై కౌంటర్కు నోటీసులు
విజయవాడలీగల్: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జిల్లా జైలులో తనను బ్యారక్ మార్చాలని దాఖలు చేసిన పిటీషన్పై కౌంటర్ దాఖలు చేయాలని ఎస్సీ, ఎస్టీ కోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. వంశీ పిటీషన్లో బ్యారక్ను మార్చడం కుదరకపోతే తనకు ఆస్తమా, ఆరోగ్య సమస్యలు ఉన్నందున బ్యారక్లో తనకు తోడుగా మరొకరిని ఉంచాలని న్యాయమూర్తిని కోరిన సంగతి విదితమే. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో 17 వరకు రిమాండ్ గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీని పిటి (ప్రిజనర్ ట్రాన్సిట్) వారెంటు కోరుతూ సీఐడీ పోలీసులు కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ కేసులో వంశీని జిల్లా జైలు నుంచే వర్చువల్గా కోర్టులో హాజరుపరిచారు. వాదనల అనంతరం ఈనెల 17వరకు కోర్టు రిమాండ్ విధించింది. ఇద్దరు నిందితులకు రెండు రోజుల కస్టడీ సత్యవర్థన్ను భయపెట్టి, కిడ్నాప్ చేసిన కేసులో వంశీతో పాటు అరెస్టు అయి రిమాండ్లో ఉన్న వీర్రాజు, వంశీబాబులను పదిరోజులపాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటీషన్ వేశారు. పిటీషన్పై జరిగిన వాదనల అనంతరం ఇరువురిని మంగళ, బుధవారాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలీసు కస్టడీకి అనుమతిస్తూ ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్న పోలీసులు వంశీ బెయిల్ కోరుతూ వేసిన పిటీషన్కు కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించినప్పటికీ, పోలీసులు సమయం కోరుతూ కౌంటర్ దాఖలు చేయకుండా వాయిదా వేస్తూ వస్తున్నారు. నిన్న జరిగిన బెయిల్ పిటీషన్పై జరిగిన విచారణ సందర్భంగా ఈరోజు కౌంటర్ దాఖలుచేయనున్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. -
ముగిసిన బ్రహ్మోత్సవాలు
పెదకళ్లేపల్లి(మోపిదేవి): దక్షిణకాశీగా పేరుగాంచిన పెదకళ్లేపల్లిలో వేంచేసియున్న శ్రీ దుర్గ,పార్వతి సమేత నాగేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. గత నెల 23 నుంచి సోమవారం వరకు స్వామివారి మహాశివరాత్రి, వార్షిక బ్రహ్మోత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సోమవారం రాత్రి ఎని మిది గంటలకు ద్వాదశ ప్రదక్షిణలు నిర్వహించిన అనంతరం పుష్పశయ్యాలంకృత పవళింపు సేవతో ఉత్సవాలు ముగిసినట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. ఉత్సవాలను జయప్రదం చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులసంఘం డైరీ ఆవిష్కరణ చిలకలపూడి(మచిలీపట్నం): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం 2025 డైరీని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ సోమవారం తన చాంబర్లో ఆవిష్కరించారు. ఈ సంద్భంగా ఉద్యోగులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ సహకరించా లన్నారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసి ఉన్నతస్థాయికి ఎదగాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ జిల్లా అధ్యక్షుడు పి.రాము, కార్యదర్శి తోట వరప్రసాద్, సంఘ నాయకుడు ఎస్.రాంబాబు పాల్గొన్నారు. నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు సోమ వారం రూ.లక్ష విరాళం సమర్పించారు. దామోదర్ (తంబి) పేరిట పెనమలూరు మండలం కానూరుకు చెందిన ఎం.శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులు రూ.1,00,116 విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. దామోదర్కు తన వాళ్లు ఎవరూ లేకపోవడంతో తాము చేరదీశామని, ఆయన అమ్మవారి భక్తుడు కావడం, కొంత డబ్బు దాచుకోవడంతో వాటిని అన్నదానానికి విరాళంగా అందజేసినట్లు శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభంవన్టౌన్(విజయవాడపశ్చిమ): ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు సోమ వారం ప్రారంభమయ్యాయి. జిల్లాలో 103 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. 36,392 మంది విద్యార్థులకు 35,813 మంది పరీక్షకు హాజరయ్యారు. 579 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. తొలి రోజు తెలుగు, సంస్కృతం, హిందీ, ఉర్దూ భాషల పరీక్ష జరిగింది. ఇంటర్మీడియెట్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ శారద నగరంలోని పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ, సదుపాయాలను పరిశీ లించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్ఆర్ఆర్ కళాశాల పార్శిల్ విభాగం, స్టోర్రూమ్ను పరిశీలించారు. జిల్లా అధికారి సి.ఎస్.సత్య నారాయణరెడ్డి పాల్గొన్నారు. -
దుర్గమ్మ చీరల కుంభకోణంపై విచారణ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ చీరల కుంభకోణం వ్యవహారంపై సోమవారం విచారణ జరిగింది. మహా మండపం ఐదో అంతస్తులోని చీరల విభాగం కార్యాలయంలో విచారణ జరిగింది. 2018–19లో సుమారు రూ.2 కోట్ల విలువైన చీరలకు సంబంధించి లెక్కలు సరిగా లేవని గతంలో పలు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల్లో నిగ్గు తేల్చేందుకు దేవదాయ శాఖ ఓ ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ కమిటీ సోమవారం దుర్గగుడికి వచ్చి చీరల విభాగంలో పలు రికార్డులను పరిశీలించింది. డెప్యూటీ కమిషనర్ కె.బి.శ్రీనివాస్ నేతృత్వంలోని నలుగురు అధికారులు ఈ విచారణలో పాల్గొన్నారు. ఈ వ్యవహారంలో దేవస్థానం తరఫున విచారణాధికారిగా ఉన్న ఏఈఓ సుధారాణి ప్రత్యేక కమిటీకి తన నివేదిక అందజేశారు. 2018 నుంచి 2023వ సంవత్సరం వరకు చీరల విభాగంలో ఎవరెవరూ విధులు నిర్వహించారు, ఈఓలు ఇచ్చిన ఆదేశాల వివరాలతో కూడిన రికార్డులను ఈ నెల ఏడు, ఎనిమిది తేదీల నాటికి అందుబాటులో ఉంచాలని విచారణ కమిటీ ఆదేశాలు జారీ చేసింది. సుమారు గంట పాటు జరిగిన విచారణలో దేవస్థానానికి చెందిన పలువురు ఉద్యోగులు, సిబ్బంది కమిటీ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. -
కొండపల్లి బొమ్మల కీర్తిని దేశానికి చాటుదాం
ఏపీ టూరిజం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ కొండపల్లి(ఇబ్రహీంపట్నం): కొండపల్లి చెక్క బొమ్మల ఘనకీర్తి, చారిత్రక నేప థ్యాన్ని దేశానికి చాటి చెబుదామని రాష్ట్ర టూరిజం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ పేర్కొన్నారు. కొండపల్లిలోని బొమ్మల కాలనీ, బొమ్మల పరిశ్రమ కేంద్రాన్ని ఆయన సోమవారం పరిశీలించారు. బొమ్మల తయారీదారులతో కొద్దిసేపు ముచ్చటించారు. బొమ్మల తయారీ విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. బొమ్మల తయారీకి అవసరమైన తెల్లపొనికి చెట్లు కనుమరుగయినట్లు తయారీదారులు ఆయనకు వివరించారు. తెల్లపొనికి చెట్లు వనాలు పెంచేందుకు ఏర్పాట్లు చేయాలని కోరారు. బొమ్మల తయారీలో యాంత్రీకరణ పద్ధ తులు అవలంబిస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా అజయ్జైన్ మాట్లాడుతూ.. శని, ఆదివారాల్లో కొండపల్లి బొమ్మల్ని కూడా పర్యాటకులకు చూపించే బాధ్యత పర్యాటక శాఖ తీసుకుంటుందని తెలి పారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకులకు టూరిజం ప్యాకేజీలో భాగంగా అమరావతితో పాటు దుర్గమ్మ ఆలయం, కొండపల్లి ఖిల్లా, కొండపల్లి బొమ్మలు, వాటర్ ఫాల్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొండపల్లి మునిసిపల్ కమిషనర్ రమ్య కీర్తన, ఏపీ టూరిజం శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి ఔషధ మొక్కలపై అవగాహన సదస్సు
మధురానగర్(విజయవాడసెంట్రల్): ఆంధ్రప్రదేశ్ ఔషధ, సుగంధ మొక్కల బోర్డు ముఖ్య కార్యనిర్వహణ అధికారి డాక్టర్ మంజుల డీ హోసమని ఆదేశాల మేరకు సోమవారం గాంధీనగర్లో రాష్ట్రస్థాయి ఔషధ మొక్కల పంటల కొనుగోలుదారులు, అమ్మకం దారుల అవగాహన సదస్సు జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆయుష్ డిపార్ట్మెంట్, హోమియోపతి అదనపు డైరెక్టర్ డాక్టర్ సుజాత, ఏపీఈడీఏ సంస్థ ప్రాంతీయ డైరెక్టర్ పెద్ద స్వామి, సీనియర్ సైంటిస్ట్ కేవీఎన్ సత్య శ్రీనివాస్, డాక్టర్ బృందావనం, కళ్యాణ్ బాయి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు రైతులకు, ఔషధ మొక్కల పంటలను ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవాలో వివరించారు. ఔషధ మొక్కల స్టాల్ ని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి రైతులకు అర్థమయ్యే రీతిలో తెలియజేశారు. రైతులు పండించే పంటలపై మార్కెటింగ్ చేసుకునే సదుపాయం కూడా కల్పించినట్లు చెప్పారు. ఔషధ మొక్కల సాగు, పంటలు పండించే విధానంతోనే అత్యధిక దిగుబడి సాధించి లాభాలు పొందవచ్చని రైతులకు సూచించారు. జాతీయ ఔషధ మొక్కల బోర్డు, న్యూఢిల్లీ వారి సహకారంతో అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్లు ఆయుష్ శాఖ అదనపు డైరెక్టర్ డాక్టర్ సుజాత స్పష్టం చేశారు. కార్యక్రమంలో భాగంగా శిక్షణ పొందిన రైతులు, అమ్మకందారులకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మెడిసినల్ అండ్ ఆటోమేటిక్ ప్లాంట్ బోర్డు సిబ్బంది పాల్గొన్నారు. -
రీయింబర్స్ ఓ మిఽథ్య... కార్మికుల వ్యధ
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఈఎస్ఐ చందాదారులకు నగదు రహిత వైద్యంతో పాటు, అత్యవసర సమయంలో పొందిన వైద్యానికి రీయింబర్స్మెంట్ పొందే సదుపాయం కూడా ఉంది. కానీ ఇది కేవలం ప్రకటనలకే పరిమితమవుతోంది. రీయింబర్స్మెంట్ కోసం వచ్చిన ఫైళ్లు డైరెక్టరేట్ కార్యాలయంలో గుట్టలుగా పడి ఉంటున్నట్లు పలువురు కార్మికులు చెబుతున్నారు. ఆస్పత్రి ఖర్చులకు సంబంధించిన బిల్లులను డిస్పెన్సరీల ద్వారా పంపడమే కానీ, రీయింబర్స్మెంట్ రావడం లేదంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈఎస్ఐలో రీయింబర్స్మెంట్ పథకం ఫార్సుగా మారిందంటున్నారు. నిబంధనలు ఇలా... నగదు రహిత వైద్యం పొందలేని చందాదారులు ప్రైవేటు ఆస్పత్రుల్లో డబ్బులు చెల్లించి వైద్యం పొందిన సందర్భంగా, ఆ ఖర్చులు రీయింబర్స్మెంట్ పొందే అవకాశం ఉంది. ఈఎస్ఐ ఆస్పత్రి నాలుగు జిల్లాలకు విజయవాడలోనే ఉంది. ప్రకాశం జిల్లాకు చెందిన వాళ్లు కూడా చికిత్స కోసం ఇక్కడికే రావాల్సి ఉంది. అయితే అత్యవసర పరిస్థితుల్లో స్థానికంగా ఉన్న ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈఎస్ఐ రిఫరల్ ఆస్పత్రి అయితే, అక్కడి నుంచి లెటర్ తెస్తే నగదు రహిత వైద్యం పొందేందుకు విజయవాడలోని ఈఎస్ఐ ఆస్పత్రి అధికారులు అనుమతి ఇస్తారు. ఈఎస్ఐ రిఫరల్ ఆస్పత్రి కాని పక్షంలో డబ్బులు చెల్లించి వైద్యం పొందాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలా అనేక మంది ఈఎస్ఐ చందా దారులు నగదు రహిత వైద్యం పొందలేక డబ్బులు చెల్లించి వైద్యం పొందుతున్నారు. నగదు రహిత వైద్యంలోనూ... ఈఎస్ఐ ఆస్పత్రి నుంచి నగదు రహిత వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రులకు రిఫర్ చేసిన రోగుల నుంచి కూడా వారు ఎంతోకొంత వసూలు చేస్తున్నారు. ఈఎస్ఐ ప్యాకేజీలు తక్కువగా ఉంటాయని, అంతేకాకుండా కొన్ని రకాల చికిత్సలు కవర్ కావంటూ అందిన కాడికి వసూలు చేస్తున్నారు. దీంతో చేసేది లేక, ఆస్పత్రి వాళ్లు అడిగినంత చెల్లిస్తూ వైద్యం పొందుతున్నారు. కనీసం ఈఎస్ఐ రిఫరల్ కేసులకు వైద్యం ఎలా అందుతుంది, డబ్బులు ఏమైనా వసూలు చేస్తున్నారా అని పర్యవేక్షించే వారు కూడా లేకపోవడం దురదృష్టకరం. ఈఎస్ఐలో ఏళ్లు గడుస్తున్నా చెల్లింపులు లేని వైనం గుట్టలుగా రీయింబర్స్మెంట్ ఫైళ్లు కేవలం ప్రకటనలకే పరిమితం అప్పుల్లో కూరుకుపోతున్న కార్మికులు మా వద్ద పెండింగ్ లేవు ఈఎస్ఐ చందాదారులకు రీయింబర్స్మెంట్ ఫైల్స్ మా వద్దకు వచ్చినవన్నీ క్లియర్ చేశాము. గతంలో ఫైల్స్ డైరెక్టరేట్కు వెళ్లేవి, ఇప్పుడు ఆస్పత్రులకు వస్తున్నాయి. వీలయినంత త్వరగా క్లియర్ చేస్తున్నాం. – డాక్టర్ వి.జ్యోతి, సూపరింటెండెంట్, ఈఎస్ఐ ఆస్పత్రి -
బిందు సేద్యం, మల్చింగ్తో రైతులకు మేలు
కంకిపాడు: బిందు సేద్యం, మల్చింగ్ ప్రక్రియలతో రైతులకు మేలు చేకూరుతుందని ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ డి.సుధారాణి సూచించారు. మండలంలోని ప్రొద్దుటూరు గ్రామంలోని వ్యవసాయ క్షేత్రాలను ఉద్యాన, వ్యవసాయశాఖ అధికారులు, రైతులతో కలిసి సోమవారం వారు సందర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ యాజమాన్య చర్యలు, పైరు ఎదుగుదల ఆశించిన దిగుబడుల సాధనలో కీలకం అవుతాయన్నారు. సాగు ఖర్చులు తగ్గించుకుంటూ నూతన విధానాలను అవలంబించాలని సూచించారు. శాస్త్రవేత్త డాక్టర్ వి.మంజువాణి మాట్లాడుతూ బిందు సేద్యం, మల్చింగ్తో రైతులకు అధిక లాభాలు ఉన్నాయన్నారు. నీరు 40 శాతం–70 శాతం వరకూ ఆదా అవుతుందన్నారు. మొక్కల ఉత్పాదకత, నాణ్యతకు దోహదపడుతుందన్నారు. కలుపు సమస్య, ఎరువు ఖర్చు 30 శాతం ఆదా అవుతుందన్నారు. మల్చింగ్తో నేల నాణ్యత వృద్ధి చెంది ఆశించిన దిగుబడులు లభిస్తాయన్నారు. కంకిపాడు ఉద్యానశాఖ అధికారి చందు జోసఫ్ సుందరం మాట్లాడుతూ చిన్న, సన్నకారు రైతులకు 90 శాతం సబ్సిడీపై బిందు సేద్యం యూనిట్ లభిస్తుందన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి పీఎం కిరణ్, వీఏఏ విజయ్, రైతులు పాల్గొన్నారు. ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ డి.సుధారాణి, శాస్త్రవేత్త డాక్టర్ వి.మంజువాణి -
కారు ఢీకొని వ్యక్తి మృతి
కంకిపాడు: కారు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని ప్రొద్దుటూరు పరిధిలో విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారిపై సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని ప్రొద్దుటూరు పరిధిలోని శరత్ చంద్ర అకాడమీ ఎదురుగా జాతీయ రహదారి దాటుతున్న వ్యక్తి (40)ని ఉయ్యూరు నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో రోడ్డు దాటుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడు తాడిగడప వాసిగా సమాచారం. మృతుడికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదని ఎస్ఐ డి.సందీప్ తెలిపారు. మార్కులు సరిగా రాలేదని విద్యార్థ్ధిని ఆత్మహత్య చిట్టినగర్(విజయవాడపశ్చిమ): పరీక్షలలో మార్కులు సరిగా రాలేదని మానసికంగా కుంగిపోయిన విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఘటనపై విద్యార్థిని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వించిపేట గాంధీబొమ్మ సెంటర్కు చెందిన శాన్నం నాగమణి, చలపతిబాబు దంపతులకు ఇద్దరు సంతానం. చలపతిబాబు ఆటో నడుపుకొని జీవనం సాగిస్తుంటాడు. కుమార్తె డీనా వైష్ణవి(20) పీబీ సిద్ధార్థ కాలేజీలో బీకాం సెకండ్ ఇయర్ చదువుతోంది. మూడో సెమిస్టర్ ఫలితాలు శనివారం వచ్చాయి. ఆ ఫలితాలలో మార్కులు తక్కువ రావడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో మానసికంగా కుంగిపోయిన వైష్ణవి సోమవారం ఉదయం ఇంట్లో ఫ్యాన్కు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బయటకు వెళ్లి వచ్చిన తల్లి ఇంట్లో తలుపులు తెరిచేందుకు ప్రయత్నించగా తెరుచుకోలేదు. దీంతో బలవంతంగా తలుపు తెరిచి చూసేసరికి లోపల వైష్ణవి ఉరికి వేలాడుతూ కనిపించింది. వెంటనే కిందకు దింపిన తండ్రి చలపతిబాబు తన ఆటోలోనే కుమార్తెను ప్రభుత్వాసుపత్రికి తరలించాడు. అప్పటికే వైష్ణవి మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. ఘటనపై మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలు ప్రారంభం
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఇంటర్మీడియెట్ పరీక్షలు సోమవారం జిల్లాలో ప్రారంభమయ్యాయి. తొలి రోజు 2379 మంది విద్యార్థులను కేటాయించగా అందులో 1887 మంది హాజరయ్యారు. జిల్లాలో 17 కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహించారు. అందులో ఒకటి జిల్లా జైలులోనూ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నగరంలోని ఏపీఎస్ఆర్ఎంసీ హైస్కూల్, గాంధీజీ హైస్కూల్, నందిగామలోని జెడ్పీ హైస్కూల్, శ్రీ విద్యా హైస్కూల్ పరీక్ష కేంద్రాలను డీఈవో సుబ్బారావు ఆకస్మికంగా తనిఖీ చేసి పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తిరువూరు, జగ్గయ్యపేట, విజయవాడ పరీక్ష కేంద్రాలను సందర్శించారు. -
మహిళా శక్తిని చాటేలా మహిళా దినోత్సవం
మధురానగర్(విజయవాడసెంట్రల్): మహిళా శక్తిని, యుక్తిని చాటిచెప్పేలా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించేలా అధికారులు కృషి చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయిలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాల సన్నద్ధతపై చర్చించేందుకు కలెక్టర్ లక్ష్మీశ సోమవారం కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాలతో సహా వివిధ రంగాల్లో మహిళామణులు సాధించిన విజయాలను గుర్తించి, గౌరవించేందుకు.. వారిని స్ఫూర్తిగా తీసుకొని మరింత మంది సమగ్రాభివృద్ధి దిశగా ముందడుగు వేసేలా ప్రోత్సహించేందుకు ఏటా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ వేడుకలను విజయవంతం చేసేందుకు గ్రామీణాభివృద్ధి, పురపాలక, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, మహిళా శిశు సంక్షేమ శాఖ, వ్యవసాయం తదితర వివిధ శాఖల అధికారులు ఆయా శాఖల వారీగా మహిళా కేంద్రీకృత కార్యక్రమాల నిర్వహణకు సిద్ధం కావాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యక్రమాల చేయూతతో పారిశ్రామికవేత్తలుగా రాణిస్తున్న మహిళామణులతో స్ఫూర్తిదాయక ప్రసంగాలు ఏర్పాటు చేయాలన్నారు. అభివృద్ధి పథంలో నడుస్తున్న స్వయం సహాయక సంఘాలు, వాటి సభ్యులను గుర్తించాలన్నారు. పీఎం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ (పీఎంఈజీపీ), పీఎం విశ్వకర్మ యోజన వంటి ప్రస్తుతం అమల్లో ఉన్న పథకాల ద్వారా రుణాల మంజూరు పత్రాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. బ్యాంకు లింకేజీ రుణాలు, ఉన్నతి (పీఎం అజయ్), లఖ్పతి దీదీ తదితర కార్యక్రమాలకు సంబంధించి ఆర్థిక సహాయ పంపిణీ కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయాలన్నారు. మహిళా సాధికారతను ప్రతిబింబించేలా వివిధ శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇప్పటికే గ్రౌండింగ్ అయిన యూనిట్లను ఆర్థికంగా ప్రగతి పథంలో పయనించేందుకు చేయిపట్టి నడిపించేలా సరైన మార్గనిర్దేశనం చేయాలని అన్నారు. మహిళల భద్రత కూడా అత్యంత ప్రాధాన్య అంశం కాబట్టి ఆ దిశగా వినూత్న ఆలోచనలతో కార్యక్రమాల అమలుకు చొరవ తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. స్వీయ రక్షణపై మహిళలకు అవగాహన కల్పించే కార్యక్రమాలపైనా దృష్టి సారించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ శుభం నోఖ్వాల్, డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, పీవో–యూసీడీ వెంకటరత్నం, డీఎంహెచ్వో డాక్టర్ మాచర్ల సుహాసిని, ఐసీడీఎస్ పీడీ డి.శ్రీలక్ష్మి, ఎల్డీఎం కె.ప్రియాంక, డీఐపీఆర్వో యు.సురేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. పారిశ్రామికంగా రాణిస్తున్న మహిళా మణులతో స్ఫూర్తిదాయక ప్రసంగాలు సమన్వయ శాఖల అధికారులకు కలెక్టర్ లక్ష్మీశ ఆదేశాలు -
వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్య
మోత్కూరు: ప్రేమించిన యువకుడి వేధింపులు తాళలేక బాలిక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల కేంద్రంలో సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని విజయవాడకు చెందిన బాలిక ఇంటర్మీడియెట్ ఫస్టియర్ చదువుతోంది. ఆమెకు సోషల్ మీడియా ద్వారా మోత్కూరుకు చెందిన కందుకూరి మున్నాతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. డిసెంబర్ 30వ తేదీన సదరు బాలిక కాలేజీకి వెళ్తున్నానని తల్లిదండ్రులకు చెప్పి మోత్కూరుకు చేరుకుంది. అప్పటి నుంచి ఓ ఇంటిని అద్దెకు తీసుకొని సదరు బాలిక, మున్నా సహజీవనం చేస్తున్నారు. బాలిక ఫోన్లో తన తల్లితో అప్పుడప్పుడు మాట్లాడుతూ తాను బాగానే ఉన్నానని, తాను మున్నా అనే యువకుడిని ప్రేమిస్తున్నానని, అతడిని వివాహం చేసుకునేందుకు వచ్చానని తెలియజేసేది. కానీ తాను ఉంటున్న చిరునామాను మాత్రం తల్లిదండ్రులకు వెల్లడించలేదు. ఆదివారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో సదరు బాలిక తన తల్లికి వీడియో కాల్ చేసి రూ.15వేలు కావాలని ఏడుస్తూ అడిగింది. ఎందుకమ్మా అని కూతురుని తల్లి ప్రశ్నించగా.. ‘మీ అమ్మ దగ్గర డబ్బులు తీసుకురావాలని మున్నా తనను కొట్టాడని తల్లికి వివరించింది’. ఈ క్రమంలో అదే రోజు రాత్రి 8గంటల సమయంలో అద్దెకు ఉంటున్న ఇంట్లో సీలింగ్ ఫ్యాన్కు చున్నీతో ఉరేసుకుని బాలిక ఆత్మహత్య చేసుకుంది. తనను మున్నా వేధిస్తున్న విషయాలన్నీ బాలిక సూసైడ్ నోట్లో పేర్కొంది. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ డి. నాగరాజు తెలిపారు. మున్నా అనే యువకుడు తన కుమార్తెను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాడని, ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బుల కోసం తీవ్రంగా కొట్టి అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాలిక తల్లిదండ్రులు ఆరోపించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. -
చోరీకి పాల్పడిన ఇద్దరు దొంగలు అరెస్ట్
హనుమాన్జంక్షన్ రూరల్: బాపులపాడు మండలం కానుమోలులో ఇటీవల జరిగిన చోరీ కేసుకు సంబంధించి ఇద్దరు దొంగలను హనుమాన్జంక్షన్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. గ్రామానికి చెందిన వీఆర్ఏ గద్దె విక్టర్ కుటుంబ సభ్యులతో కలిసి పొరుగూరు వెళ్లగా ఆయన ఇంట్లో గత నెల 24న చోరీ జరిగింది. బీరువాలోని రూ.65 వేల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలను అపహరించారు. ఈ ఘటనపై వీఆర్ఏ విక్టర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయటంతో క్లూస్ టీం ద్వారా దొంగల వేలిముద్రలను సేకరించారు. పాత నేరస్తులే చోరీకి పాల్పడినట్లుగా నిర్థారించారు. ఆ వేలి ముద్రల ఆధారంగా నిందితులు కొఠారు శ్రీనివాస్ (కాకినాడ), షేక్ మున్నా (ఏలూరు)లను సోమవారం హనుమాన్జంక్షన్ ఎస్ఐ–2 నరసింహమూర్తి అరెస్ట్ చేశారు. వారి నుంచి చోరీ చేసిన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. -
ఖాతాదారుల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం
ఎస్బీఐ నార్త్ జోన్ రీజనల్ మేనేజర్ రాఘవరావు కంకిపాడు: బ్యాంకు ఖాతాదారుల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విజయవాడ నార్త్ జోన్ రీజనల్ మేనేజర్ ఆర్.రాఘవరావు అన్నారు. రీజనల్ కార్యాలయ ఆదేశాలతో ఎస్బీఐ కంకిపాడు బ్రాంచ్ కార్యాలయ ప్రాంగణంలో ఆదివారం మెగా గృహ రుణ మేళా నిర్వహించారు. 100 మంది ఖాతాదారులు గృహ రుణ మేళాకు హాజరై వివరాలు తెలుసుకున్నారు. బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఖాతాదారులు తమ ఆస్తులు, వ్యాపారాల వివరాలతో కూడిన డాక్యుమెంట్లను సమర్పించారు. ఈ సందర్భంగా రాఘవరావు మాట్లాడుతూ మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నామన్నారు. సేవలను ఖాతాదారులు వినియోగించుకోవాలని కోరారు. బ్రాంచ్ చీఫ్ మేనేజర్ ఏవీవీఎస్ ప్రకాష్రావు పర్యవేక్షణలో నిర్వహించిన రుణమేళాలో ఫీల్డ్ ఆఫీసర్ ఎన్.సంధ్యారాణి, క్యాష్ ఆఫీసర్ ప్రసాదరావు సిబ్బంది పాల్గొన్నారు. -
కిక్కిరిసిన దుర్గమ్మ సన్నిధి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో ఆదివారం భక్తుల రద్దీ కనిపించింది. భక్తులు, యాత్రికులతో పాటు విద్యార్థులు సైతం పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. తెల్లవారుజామున దుర్గమ్మకు నిర్వహించిన ఖడ్గమాలార్చన, ఉదయం లక్ష కుంకుమార్చన, శ్రీచక్రనవార్చన, చండీహోమం, శాంతి కల్యాణంలో పెద్ద ఎత్తున ఉభయదాతలు, భక్తులు పాల్గొన్నారు. ఉదయం రద్దీ సాధారణంగా ఉన్నా.. 10 గంటల తర్వాత క్రమంగా పెరిగింది. దీంతో సర్వ దర్శనానికి రెండు గంటల సమయం, రూ.100, రూ. 300, రూ. 500 టికెట్టుపై దర్శనానికి గంట సమయం పట్టింది. మధ్యాహ్నం అమ్మవారికి మహా నివేదన సమర్పించేందుకు అరగంట పాటు అన్ని దర్శనాలు నిలిపివేయగా, రద్దీ మరింత పెరిగింది. మహా నివేదన అనంతరం 12.20 గంటలకు దర్శనం తిరిగి ప్రారంభం కాగా, మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు రద్దీ కొనసాగింది. రద్దీ నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో భక్తులు ఇబ్బందులకు గురి కాకుండా, త్వరితగతిన అమ్మవారి దర్శనం అయ్యేలా ఆలయ ఏఈవోలు, సూపరింటెండెంట్లు క్యూలైన్లను పర్యవేక్షించారు. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవలో ఉభయదాతలు, భక్తులు పాల్గొన్నారు. అద్దాల మండపంలో పవళింపు సేవ.. మహా శివరాత్రిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై శ్రీ గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి వార్లకు ఆదివారం పవళింపు సేవ నిర్వహించారు. ఆదివారం సాయంత్రం స్వామి వారికి పంచహారతుల సేవ అనంతరం ఉత్సవమూర్తులకు ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం అద్దాల మండపంలో పవళింపు సేవ జరిపించారు. ఆలయ అర్చకులు, వేద పండితులు సేవలో పాల్గొన్నారు. -
ముగిసిన ఎడ్ల పూటీ లాగుడు పోటీలు
నందిగామ రూరల్: మండలంలోని దాములూరు కూడలి సంగమేశ్వర స్వామి వారి ఆలయ ఆవరణలో కల్యాణోత్సవాల సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయిలో నిర్వహించిన ఎడ్ల పూటీ లాగుడు పోటీలు శనివారం అర్ధరాత్రితో ముగిశాయి. సీనియర్ విభాగంలో జరిగిన పూటీ లాగుడు పోటీలకు 14 జతల ఎడ్లు పాల్గొన్నట్లు రైతు కమిటీ సభ్యులు తెలిపారు. ఎనిమిది నిమిషాల వ్యవధి, ఆరుగురు వ్యక్తులతో రెండు క్వింటాళ్ల దూరాన్ని లాగేందుకు ఎడ్ల జతలు పోటీ పడ్డాయి. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం పగడంవారిపాలెంకు చెందిన కేవీ రెడ్డి ఎడ్ల జత ఎనిమిది నిమిషాల వ్యవధిలో 3,110 అడుగుల దూరాన్ని లాగి ప్రథమ స్థానంలో నిలవగా.. బాపట్ల జిల్లా వేటపాలేంకు చెందిన మునగయ్య ఎడ్ల జత 2,727 అడుగులు, బాపట్ల జిల్లా ముత్తాయపాలెంకు చెందిన వెంకట మణికంఠ ఎడ్ల జత 2,659 అడుగులు, ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం మోగులూరుకు చెందిన షేక్ హజ ఎడ్ల జత 2,458 అడుగులు, బాపట్ల జిల్లా ఆవులదొండివారిపాలెంకు చెందిన గోగినేని కార్తీక్ ఎడ్ల జత 2,447 అడుగులు లాగి వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాలలో నిలిచాయి. విజేతలకు వరుసగా రూ. 30 వేలు, 25వేలు, 20వేలు, 15 వేలు, 10 వేలను బహుమతిగా అందజేశారు. సీఐ వైవీఎల్ నాయు డు, సర్పంచ్ గాదెల వెంకట రామారావు, రైతు కమిటీ సభ్యులు గింజుపల్లి శ్రీనివాసరావు, చెరుకూరు సాంబశివరావు, వట్టికొండ చంద్రమోహన్, తులసీరావు, సిద్ధార్థ వీరబాబు పాల్గొన్నారు. -
ఆరోగ్యశ్రీకి అనారోగ్యం
● నెట్వర్క్ ఆస్పత్రులకు బిల్లులు ఇవ్వని ప్రభుత్వం ● వైద్యం చేయలేమని చేతులెత్తేస్తున్న ఆస్పత్రులు ● ఉమ్మడి కృష్ణా జిల్లాలో రోగుల అవస్థలు ఆరోగ్యశ్రీని పటిష్టంగా అమలు చేయాలి పేదలకు సంజీవని లాంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలి. నెట్వర్క్ ఆస్పత్రులకు పెండింగ్ ఉన్న బిల్లులన్నీ చెల్లించాలి. గత ఏడాది ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిననాడు ఉన్న పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడం దుర్మార్గం. ప్రభుత్వ వైఖరితో నెట్వర్క్ ఆస్పత్రులు ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితికి చేరుకున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించాలి. – డాక్టర్ మెహబూబ్ షేక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ వైద్య విభాగంఆరోగ్యశ్రీలో వైద్యం చేయడం లేదు గతంలో తెల్లకార్డు తీసుకుని ఆస్పత్రికి వెళితే రూపాయి ఖర్చు లేకుండా అన్నీ ఉచితంగా చేసేవాళ్లు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయి వచ్చిన తర్వాత కూడా రోగి అకౌంట్లో డబ్బులు పడేవి. ఇప్పుడు ఆ డబ్బులు రావడం లేదు. వైద్యం కూడా పూర్తి ఉచితంగా చేయడం లేదు. కార్డు తీసుకుని ఆస్పత్రికి వెళితే కొంత మీరు డబ్బులు కట్టాలని అడుగుతున్నారు. అదేమంటే ప్రభుత్వం మాకు డబ్బులు ఇవ్వడం లేదు. ఏమి చేయమంటారు అంటున్నారు. – వేములకొండ విష్ణు, జి. కొండూరులబ్బీపేట(విజయవాడతూర్పు): కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తోంది. ఎన్టీఆర్ వైద్య సేవగా పేరు మార్చిన సర్కారు దానిని ఏమార్చుతోంది. పేదలకు వైద్యం అందించిన ఆస్పత్రులకు బిల్లులు చెల్లించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో వైద్యం చేసేందుకు ఆస్పత్రుల యాజమాన్యాలు ఇష్టపడటం లేదు. ఇప్పటికే రెండు నెలల క్రితం ఈహెచ్ఎస్ సేవలు నిలిపివేసిన నెట్వర్క్ ఆస్పత్రులు పేదలను ఇబ్బంది పెట్టకూడదని మానవతా దృక్పథంతో సేవలు అందిస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం ఆరోగ్యశ్రీని ఎత్తేసి, ఇన్సూరెన్స్ ప్రవేశపెట్టడానికి బిల్లులు పెండింగ్లో ఉంచింది. ఒక్కో ఆస్పత్రిలో రూ.రెండు నుంచి రూ.3 కోట్ల వరకూ బిల్లులు రావాల్సి ఉండటంతో వైద్యం చేయలేమంటూ చేతులెత్తేస్తున్నారు. దీంతో నిరుపేద రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇవే నిదర్శనం.. ● ఉయ్యూరుకు చెందిన 38 ఏళ్ల వెంకటేశ్వర్లు ద్విచక్ర వాహనంపై వెళుతూ స్పీడ్బ్రేకర్ వద్ద అదుపు తప్పి కింద పడ్డాడు. దీంతో ఎడమ మోకీలు లిగమెంటు తెగింది. దానికి రీ కన్స్ట్రక్షన్ సర్జరీ కోసం నగరం బయట ఉన్న ఓ ఆస్పత్రికి వెళ్లాడు. ముందుగా రూ.45 వేలు చెల్లించి ఆస్పత్రిలో చేరితే ఆరోగ్యశ్రీలో సర్జరీ చేస్తామన్నారు. కష్టపడి పనిచేసుకునే వాళ్లం అంత కట్టలేమని వెళ్లిపోయారు. ● రామవరప్పాడుకు చెందిన ఓ విశ్రాంత ఉద్యోగికి మోకీలు అరిగిపోయింది. దానిని రీప్లేస్మెంట్ కోసం నగరంలోని ఆస్పత్రులన్నీ తిరిగినా ప్రయోజనం లేదు. ఈహెచ్ఎస్లో చేయలేమంటూ ఆస్పత్రుల యాజమాన్యాలు చేతులెత్తేశారు. చివరికి ఓ ఆస్పత్రికి వెళ్లగా రూ.60 వేలు అదనంగా కడితే చేస్తామన్నారు. ఇలా వీరిద్దరే కాదు ఇప్పుడు ఆరోగ్యశ్రీలో చికిత్స పొందాలంటే ఎంతోకొంత ఆస్పత్రికి చెల్లించుకోవాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది. డబ్బులు చెల్లించలేమంటే చికిత్స చేయలేమని ఆస్పత్రుల యాజమాన్యాలు నిర్మొహమాటంగా చెప్పేస్తున్నాయి. గతంలో ఇలా.. గత ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ పథకంలో రోగుల వద్ద డబ్బులు వసూలు చేయాలంటేనే ఆస్పత్రుల వారు భయపడేవారు. అందుకు జిల్లాస్థాయిలో మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించడమే కారణం. ఒకవేళ ఏదైనా ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీలో రోగి వద్ద డబ్బులు కట్టించుకున్నట్లు ఆరోపణలు వస్తే విచారణ చేసి నిర్ధారణ అయితే డబ్బులు కట్టించుకున్న మొత్తానికి పదిరెట్లు అపరాధ రుసుం కింద వసూలు చేసే వారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ప్రస్తుతం ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులపై పర్యవేక్షణను కూటమి ప్రభుత్వం గాలికొదిలేసింది. ఈ పథకాన్ని నిర్వీర్యం చేయడంలో భాగంగానే అలా వ్యవహరిస్తున్నట్లు పలువురు చెబుతున్నారు. కొత్తగా తీసుకురావాలనుకుంటున్న ఇన్సూరెన్స్ స్కీమ్ను ఇప్పటికే నెట్వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఒకవేళ దాన్ని తీసుకు వస్తే ముందుగా తమతో చర్చించాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే ప్రభుత్వం అవేమి పట్టించుకోవడం లేదు. దీంతో పేదలకు వైద్యం అందని పరిస్థితి నెలకొంది. -
పట్టభిషేకం ఎవరికో!
గుంటూరు ఎడ్యుకేషన్: శాసనమండలి కృష్ణా– గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కళాశాల(ఏసీ)లోని కౌంటింగ్ కేంద్రంలో భద్రపరచిన బ్యాలెట్ బాక్సుల్లో అభ్యర్థుల భవితవ్యం నిక్షిప్తమైంది. సోమవారం ఉద యం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆదివారం ఏసీ కళాశాలలోని కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపుపై సిబ్బందికి పలు సూచన లు, సలహాలు అందజేశారు. అనంతరం జేసీ ఏ.భార్గ వ్ తేజతో కలిసి మీడియాతో నాగలక్ష్మి మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘ ఆదేశాల మేరకు ఓట్ల లెక్కింపు చేపడుతున్నామని, ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని ఆమె తెలిపారు. ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన అనంతరం అన్ని జిల్లాల బ్యాలెట్ బాక్సులు కౌంటింగ్ జరిగే ఏసీ కళాశాలలోని స్ట్రాంగ్ రూములో భద్రపర్చినట్లు చెప్పారు. పోలింగ్ 69.57 శాతంగా నమోదైన దృష్ట్యా దాదాపు 2.41 లక్షల ఓట్లు లెక్కించాల్సి ఉందన్నారు. 28 టేబుళ్లు ఏర్పాటు ఇందుకు 28 టేబుళ్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బ్యాలెట్ పేపర్, మొదటి ప్రాధాన్యత ఓట్లు విధానంతో లెక్కింపు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రక్రియ ప్రకారం కౌంటింగ్ సుమారు రెండు నుంచి మూడు రోజులు జరిగే అవకాశం ఉందన్నారు. ప్రాథమికంగా కౌంటింగ్ మొదటి రౌండ్లో పోలింగ్ బూత్ల వారీగా పోలైన ఓట్లను సరిచూసుకొని మిక్సింగ్ చేస్తారన్నారు. తదుపరి చెల్లుబాటయ్యే ఓట్లను పరిశీలించి, మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కించడం జరుగుతుందన్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు పూర్తి అయ్యే సమయానికి నిర్దేశించిన కోటా ఓట్లు వచ్చిన అభ్యర్థిని గెలుపొందినట్టు ప్రకటిస్తారన్నారు. అభ్యర్థులు ఎవరికీ నిర్దేశిత స్థాయిలో ఓట్లు రాకపోతే ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను ఎలిమినేట్ చేస్తూ వారికి వచ్చిన తదుపరి ప్రాధాన్యత ఓట్లను ఇతర అభ్యర్థులకు పంచుతూ కౌంటింగ్ నిర్వహిస్తామన్నారు. నేడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు గుంటూరు ఏసీ కళాశాలలో పూర్తయిన ఏర్పాట్లు వివరాలు వెల్లడించిన గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మూడు షిఫ్టుల్లో 750 మందికి విధులు.. ఓట్లు లెక్కింపు కోసం మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహించేలా 750 మంది సిబ్బందికి వివిధ విధులను కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు. అభ్యర్థులు సైతం ఏజెంట్లను మూడు షిఫ్టుల్లో నియమించుకునేలా అవకాశం కల్పించామన్నారు. కౌంటింగ్ ప్రదేశం మొత్తం మూడంచెల పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని, గుర్తింపు కార్డు లేకుండా ఏ ఒక్కరిని కౌంటింగ్ ప్రాంతానికి అనుమతించబోమన్నారు. అదే విధంగా కౌంటింగ్ హాల్లోకి సెల్ఫోన్లు అనుమతించరని, పూర్తిస్థాయిలో తనిఖీ చేసిన తర్వాతే కౌంటింగ్ హాల్లోకి ఏజెంట్లను, కౌంటింగ్ సిబ్బందిని అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియాకు తెలియజేసేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు. వీటితో పాటు అవసరమైన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశామన్నారు. -
ప్రైవేటుతో మిలాఖత్!
● నిబంధనలకు తిలోదకాలిస్తూ నియామకాలు ● చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులుగా ప్రైవేటు కళాశాలల అధ్యాపకుల నియామకం ● ఆయా కళాశాలలు సెంటర్లుగా ఉన్నచోటే వారికి విధులు ● ఇష్టారీతిన వ్యవహరిస్తున్న ఇంటర్మీడియెట్ అధికారులుమళ్లీ పరిశీలిస్తాం.. ఇంటర్ బోర్డు నిబంధనల మేరకు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులను నియమించాం. నియమితులైన వారంతా ఎయిడెడ్ కళాశాలలకు చెందిన వారని అనుకుంటున్నా. అయినా ఒకసారి పరిశీలించి.. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే చర్యలు తీసుకుంటాం. అవసరమయితే వారిని తొలగించి వేరే వారిని నియమిస్తాం. ప్రస్తుతం పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా నిర్వహించడానికి అన్ని చర్యలు చేపట్టాం. – వీవీ సుబ్బారావు, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినర్, ఇంటర్మీడియెట్ పెడన: గత కొన్ని రోజులుగా ఇంటర్మీడియెట్ ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. ప్రైవేటు కళాశాలలకు మేలు చేసే విధంగా వారు తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. ఇటీవల ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్స్ పరీక్ష ఎటువంటి సామగ్రి.. పరికరాలు లేని చోట నిర్వహించి ముక్కున వేలేసుకునేలా చేశారు. ఇప్పుడు ప్రారంభమైన ఇంటర్ పరీక్షలకు సంబంధించిన నియామకాల్లోనూ అవకతవకలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. పరీక్ష కేంద్రాల్లో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటు అధికారులను నియమించే విషయంలో ప్రైవేటు కళాశాలలకు దాసోహమయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏకంగా ప్రైవేటు కళాశాలలో(అన్ ఎయిడెడ్) పనిచేసే అధ్యాపకులను చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులుగా నియమించడమే కాకుండా.. వీరిని పరీక్ష కేంద్రాలుగా ఉన్న పలు ప్రైవేటు పాఠశాలల్లో విధులకు కేటాయించడం వివాదాస్పదమవుతోంది. నిబంధనలు ఇవి.. ఇంటర్మీడియెట్ పరీక్ష కేంద్రాలలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులను నియమించాలంటే కొన్ని నియమ నిబంధనలను ఇంటర్ బోర్డు స్పష్టంగా పేర్కొంది. ఎగ్జామ్స్ హ్యాండ్ బుక్ కూడా ప్రింట్ చేయించి ఉన్నతాధికారులకు పంపించారు. అందులోని పొందుపరిచిన వివరాల మేరకు.. ● ప్రభుత్వ కళాశాల జూనియర్ లెక్చరర్ సీనియార్టీ ఉన్న వారిని నియమించాలి. ● వీరు లేకపోతే ఎయిడెడ్ కళాశాలలో ఎయిడెడ్ లెక్చరర్ లేదా రెగ్యులర్ లెక్చరర్కు విధులు కేటాయించాలి. ఏపీఆర్జేసీ, ఏపీటీడబ్ల్యూర్జేసీ కంపోజిట్ కళాశాలల వారిని నియమించాలి. ● వీరు కూడా లేకపోతే ప్రభుత్వ కళాశాలలో రెగ్యులర్ ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్లకు విధులు కేటాయించాలి. ● వీరు కూడా లేకపోతే ప్రభుత్వ కళాశాలలో మినిమమ్ టైమ్ స్కేల్పై పనిచేసే వారిని నియమించాలి. ● వీరు కూడా లేకపోతే మూడేళ్లు సీనియర్టీ ఉన్న కాంట్రాక్టు అధ్యాపకులను నియమించాలి. ● వీరంతా లేకపోతే ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహించే స్కూలు అసిస్టెంట్ కేడర్వారిని చీఫ్ సూపరింటెండెంట్లుగా, డిపార్ట్మెంటు అధికారులుగా నియమించాలి. ● కానీ అందుకు విరుద్ధంగా ప్రైవేటు కళాశాలలకు చెందిన వారిని నియమించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.అడిగిన చోట విధులు.. అవనిగడ్డ, మొవ్వ, పామర్రు, చల్లపల్లి కళాశాలలో విధులు నిర్వహించేవారు మచిలీపట్నం నుంచే నిత్యం రాకపోకలు చేస్తుంటారు. వీరందరికీ మచిలీపట్నంలోనే పరీక్షల విధులు కేటాయించడం గమనార్హం. ఎవరు, ఎక్కడికి వెళతారంటూ చీఫ్ సూపరిండెంట్లకు, డిపార్ట్మెంటు అధికారులకు అవకాశం కల్పించడమే కాకుండా చివరకు ఇన్విజిలేటర్ విధులు కూడా వారు కోరుకున్న చోటకు సదరు అధికారులను ప్రసన్నం చేయించుకోవడం ద్వారా చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. -
న్యాయమూర్తుల నివాస భవనాలు ప్రారంభం
గుడివాడ టౌన్: స్థానిక పోస్టాఫీస్ రోడ్లోని కోర్టు ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన న్యాయమూర్తుల నివాస భవనాలను కృష్ణాజిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ స్పెషల్ జడ్జి అరుణ సారిక ఆదివారం ప్రారంభించారు. న్యాయమూర్తులకు అధునాతన సౌకర్యాలతో నివాసాలు ఏర్పాటు చేయాలనే సంకల్పంతో వీటిని నిర్మించామని ఆమె తెలిపారు. కార్యక్రమంలో 11వ అదనపు జిల్లా జడ్జి జి. సుబ్రహ్మణ్యం, సీనియర్ సివిల్ జడ్జి వాసుదేవ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొడాలి హరినాథ్, సెక్రటరీ ఎం. నటరాజ్, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో పవళింపు సేవ పెదకల్లేపల్లి(మోపిదేవి): దక్షిణకాశీగా పేరుగాంచిన పెదకళ్లేపల్లిలో వేంచేసియున్న శ్రీ దుర్గా, పార్వతీ సమేత నాగేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. అందులో భాగంగా ఆదివారం ఉదయం ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు శంకర మంచి భాస్కర విజయకుమార్, బుద్ధు నాగవరప్రసాద్ బ్రహ్మత్వంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి 8 గంటలకు ద్వాదశ ప్రదక్షిణలు చేసిన అనంతరం భక్తిశ్రద్ధలతో సంప్రదాయ బద్ధంగా స్వామివారి పుష్పశయ్యాలంకృత పవళింపు సేవను వేదపండితులు నిర్వహించారు. ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులు స్వామివార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ‘ఏపీ హంస’ క్రీడా పోటీలు ప్రారంభం లబ్బీపేట(విజయవాడతూర్పు): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధప్రదేశ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్(ఏపీ హంస) ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రభుత్వాస్పత్రి, సిద్ధార్థ వైద్య కళాశాలలో పనిచేసే మహిళా ఉద్యోగులకు వైద్య కళాశాల ప్రాంగణంలో పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో పెద్ద ఎత్తున మహిళా ఉద్యోగులు భాగస్వాములవుతున్నారు. వారికి టగ్ ఆఫ్ వార్, షాట్ పుట్, లెమన్ స్పూన్, స్పీడ్ వాకింగ్, మ్యూజికల్ చైర్స్, స్కిప్పింగ్, హ్యాండ్ బాల్ వంటి పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలను ఉమ్మడి కృష్ణాజిల్లా ఏపీ హంస అధ్యక్షుడు వినుకొల్లు రామకృష్ణ పర్యవేక్షిస్తుండగా, కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణా సహాధ్యక్షుడు సత్యనారాయణ బాబు, జాయింట్ సెక్రెటరీ పిచ్చేశ్వరరావు, రాష్ట్ర కమిటీ జాయింట్ జనరల్ సెక్రెటరీ జాన్ హెన్రీ తదితరులు పాల్గొన్నారు. విద్యారంగానికి నిధులు పెంచాలి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విద్యారంగానికి బడ్జెట్లో 20 శాతం నిధులు కేటాయించాలని పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ఎండీ రఫీ డిమాండ్ చేశారు. స్థానిక పీడీఎస్యూ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యారంగానికి కేంద్ర బడ్జెట్లో 30శాతం, రాష్ట్ర బడ్జెట్లో 20శాతం, జీడీపీలో 6శాతం కేటాయించాలన్నారు. కూటమి ప్రభుత్వం బడ్జెట్లో విద్యారంగానికి నిధులు కేటాయించినట్లు గొప్ప లు చెప్పుకుంటుందన్నారు. కానీ విద్యారంగంపై చిన్న చూపు చూస్తోందన్నారు. బడ్జెట్లో సంక్షేమ హాస్టళ్లు, విశ్వవిద్యాలయాల ప్రస్తావన లేకపోవడం శోచనీయమన్నారు. కూటమి ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగులను దగా చేసిందన్నారు. నిరుద్యోగ భృతి ఊసే ఎత్తలేదన్నారు. ప్రధాన కార్యదర్శి ఎస్. కిరణ్కుమార్ పాల్గొన్నారు. -
విక్రయించిన పసికందు గుర్తింపు
విజయవాడస్పోర్ట్స్: పిల్లలను అమ్ముకుని సొమ్ము చేసుకునే విజయవాడ ముఠా విక్రయించిన పసికందును ఎన్టీఆర్ జిల్లా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అరెస్టయిన ఈ ముఠా నుంచి సేకరించిన సమాచారంతో రాజమండ్రిలో ఉన్న పసికందును కొనుగోలు చేసిన వ్యక్తుల నుంచి ఆదివారం పోలీసులు వారి చేతుల్లోకి తీసుకున్నారు. ఢిల్లీ, అహ్మదాబాద్ నుంచి నెలలు నిండని పసికందులను తీసుకొచ్చి విజయవాడ పరిసరప్రాంతాల్లో విక్రయిస్తున్న ముఠా సభ్యులు సరోజిని, షేక్ ఫరీనా, షేక్ సైదాబీ, కరుణశ్రీ, శిరీషలను ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ఈ నెల ఒకటో తేదీన విజయవాడలోని ప్రకాష్నగర్లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. విక్రయించేందుకు ఢిల్లీ, అహ్మదాబాద్ నుంచి నలుగురు చంటి బిడ్డలను ఈ ముఠా విజయవాడకు తీసుకొచ్చింది. పోలీసులు అరెస్ట్ చేయడానికి ముందే ఓ మగ బిడ్డను ఈ ముఠా విక్రయించే సింది. అరెస్ట్ సమయానికి ఈ ముఠా వద్ద ఉన్న ముగ్గురు పసికందులను శనివారం పోలీసులు వారి చేతుల్లోకి తీసుకున్నారు. అయితే విక్రయించిన బిడ్డ ఆచూకీ కోసం తమదైన శైలిలో విచారణ చేపట్టిన అనంతరం బిడ్డను కొనుగోలు చేసిన వారి వివరాలను ఈ ముఠా పోలీసులకు వివరించింది. దీంతో టాస్క్ఫోర్స్ ఏసీపీ కె.లతాకుమారి, మహిళా పీఎస్ సిబ్బంది హుటాహుటిన రాజమండ్రిలోని సీతానగరం చేరుకుని బిడ్డను గుర్తించి రెస్క్యూ చేశారు. ఈ పసికందును మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించినట్లు ఎన్టీఆర్ జిల్లా సీపీ ఎస్.వి.రాజశేఖరబాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
ఆయనొస్తే అన్నీ బందే!
ఉయ్యూరు రూరల్: ఆయన వస్తే అన్ని బంద్ చేయాలి... వచ్చే రహదారిలో గుంతలు లేకుండా సక్రమంగా యుద్ధప్రాతిపదికన అభివృద్ధి చేయాలి.. ఇది ఉయ్యూరులో ఆదివారం సీఎం చంద్రబాబు రాకతో అధికారులు, పోలీసు యంత్రాంగం హడావుడిగా విధులు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్ కుమార్తె నిశ్చితార్థ మహోత్సవానికి అతిథిగా సీఎం చంద్రబాబు, పలువురు మంత్రులతో కలిసి ఉయ్యూరు విచ్చేశారు. ఈ క్రమంలో ఆయన వచ్చే ప్రధాన రహదారి గుంతలమయంగా మారడంతో ఆర్అండ్బీ అధికారులు యుద్ధప్రాతిపదికన స్పీడ్ బ్రేకర్లు తొలగించి గుంతలను పూడ్చి చేతులు దులుపుతున్నారు. దీనికి తోడు పోలీసు అధికారులు శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని నెపంతో ముందస్తు చర్యలో భాగంగా ఆ రహదారి వెంట ఉన్న చిన్న, చిన్న షాపులను, టీ స్టాళ్లను మూయించేశారు. దీంతో పలువురు చిరు వ్యాపారులు. రోజువారీలు కట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చిందని వాపోతున్నారు. ఆయన వస్తే అన్ని బందే అనే రీతిలో అధికార యంత్రాంగం విధులు నిర్వహించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు. రహదారికి నూతన హంగులు -
ఉలిక్కిపడిన జగ్గయ్యపేట!
● వరుస కత్తిపోట్లు, దాడులు ● పేటవాసుల్లో భయాందోళన ● పోలీసు చర్యలేవి.. జగ్గయ్యపేట అర్బన్: ప్రాచీన పర్యాటక కేంద్రంగా, ఆధ్యాత్మిక కేంద్రంగా కొనసాగుతున్న జగ్గయ్యపేట ఉలిక్కిపడుతోంది. దీనికి కారణం ఈ ప్రాంతంలో వరుస హత్యలు జరగడం.. మాదకద్రవ్యాల నిషాలో యువత మునిగిపోవడమే. ఈ క్రమంలోనే రెండు నెలల వ్యవధిలోనే సుమారు ఆరుగురు కత్తిపోట్లకు గురవ్వగా వారిలో ఇద్దరు మృతి చెందారు. ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండగా, ముగ్గురు కత్తిపోట్ల గాయాలతో చికిత్స పొందుతున్నారు. గత ఫిబ్రవరి 27వ తేదీ రాత్రి ఎల్లమ్మతల్లి జాతరలో డీజే వద్ద ఏర్పడిన స్వల్ప ఘర్షణ చివరికి కత్తులతో దాడికి దారి తీసింది. శాంతినగర్లోని దుర్గాదేవి, కాళిమాత ఆలయాల పూజారిగా పనిచేస్తున్న చెరువుబజారుకు చెందిన బత్తుల శ్రీనును ప్రత్యర్థి యువకులు మద్యం, గంజాయి మత్తులో కోడి కత్తితో గొంతు కోశారు. గత నెల 28వ తేదీన ఉదయం సత్యనారాయణపురంలో మరొక కత్తిపోట్ల సంఘటన జరిగింది. అదే రోజు సాయినగర్లో ఓ భార్యపై భర్తపై కొబ్బరిబొండాల కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. పోలీసుల వైఫల్యం అంటున్న ప్రజలు ఇటీవల పట్టణంలో తరచూ నేరాలు, ఘోరాలు, హత్యలు, దాడులు జరుగుతున్నా వాటిని నివారించడంలో పట్టణ పోలీసులు విఫలమయ్యారని ప్రజలు ఆరోపిస్తున్నారు. గంజాయి వంటి మత్తుపదార్థాలకు యువత బానిసలుగా మారి ఇలా జరుగుతున్నాయా...లేక క్రైమ్ను పోలీసులు కంట్రోల్ చేయలేక హత్యలు, దాడులు జరుగుతున్నాయా అనే విమర్శలు వస్తున్నాయి. మాదక ద్రవ్యాల విక్రయాలు, అమ్మకాలు పట్టణంలో జరగకుండా చూడటంలో విఫలమయ్యారని ఆరోపిస్తున్నారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లలో చోరీలు యథేచ్ఛగా జరుగుతుండటంతో ఇటీవల విష్ణుప్రియనగర్లో ఇళ్ల వద్ద ఏర్పాచేసిన సీసీ కెమెరాలను కూడ దొంగలు ఎత్తుకుపోయారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి నేరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. -
మచిలీపట్నం కళాకారులకు అవకాశమిస్తా
సినీరచయిత బెజవాడ ప్రసన్నకుమార్ మచిలీపట్నం టౌన్: రానున్న రోజుల్లో బందరు కళాకారులకు అవకాశమిస్తానని సినీరచయిత బెజవాడ ప్రసన్నకుమార్ తెలిపారు. ప్రసన్నకుమార్ స్వయంగా కథ, స్క్రీన్ ప్లే చేసిన చిత్రం మజాకా సినిమా ప్రమోషన్లో భాగంగా ఆయన ఆదివారం స్వగ్రామమైన మచిలీపట్నంలో ప్రేక్షకులతో కలిసి సినిమా వీక్షించారు. త్వరలో పెద్ద హీరోలతో సినిమా ప్రారభించబోతున్నానని ప్రసన్నకుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ శివరాత్రి రోజు మజాకా సినిమా రిలీజ్ అయిందని, సినిమాను ప్రేక్షకులు పెద్ద హిట్ చేసి అదరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. సినిమా రిలీజ్ అనంతరం తిరుపతిలో స్వామి వారిని దర్శించి మచిలీపట్నంలో స్నేహితులతో కలిసి సినిమా చూడటం ఆనందాన్ని కలిగించిందన్నారు. కొద్దిరోజుల్లోనే మాస్ మహరాజా రవితేజతో సినిమా చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ప్రసన్నకుమార్ను పలువురు కళాకారులు, మీడియా ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. -
ఖాతాదారుల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం
ఎస్బీఐ నార్త్ జోన్ రీజనల్ మేనేజర్ రాఘవరావు కంకిపాడు: బ్యాంకు ఖాతాదారుల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విజయవాడ నార్త్ జోన్ రీజనల్ మేనేజర్ ఆర్.రాఘవరావు అన్నారు. రీజనల్ కార్యాలయ ఆదేశాలతో ఎస్బీఐ కంకిపాడు బ్రాంచ్ కార్యాలయ ప్రాంగణంలో ఆదివారం మెగా గృహ రుణ మేళా నిర్వహించారు. 100 మంది ఖాతాదారులు గృహ రుణ మేళాకు హాజరై వివరాలు తెలుసుకున్నారు. బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఖాతాదారులు తమ ఆస్తులు, వ్యాపారాల వివరాలతో కూడిన డాక్యుమెంట్లను సమర్పించారు. ఈ సందర్భంగా రాఘవరావు మాట్లాడుతూ మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నామన్నారు. సేవలను ఖాతాదారులు వినియోగించుకోవాలని కోరారు. బ్రాంచ్ చీఫ్ మేనేజర్ ఏవీవీఎస్ ప్రకాష్రావు పర్యవేక్షణలో నిర్వహించిన రుణమేళాలో ఫీల్డ్ ఆఫీసర్ ఎన్.సంధ్యారాణి, క్యాష్ ఆఫీసర్ ప్రసాదరావు సిబ్బంది పాల్గొన్నారు. -
నిడమానూరులో వివాహిత హత్య
● వివాహేతర సంబంధమే కారణం ● గొంతుకు చున్నీ బిగించి హత్య చేసిన ప్రియుడు ● అదుపులోకి తీసుకున్న పటమట పోలీసులు రామవరప్పాడు: వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. క్షణికావేశంలో జరిగిన ఘటనతో ముగ్గురు చిన్నారులకు అమ్మ ప్రేమ దూరమైంది. విజయవాడరూరల్ మండలం నిడమానూరులో శనివారం అర్ధరాత్రి జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిడమానూరు నెహ్రూనగర్లో నివసించే పెదాల కావ్య, పెదాల ప్రకాష్రావు భార్యాభర్తలు. వీరికి వివాహమై తొమ్మిదేళ్లైంది. ముగ్గురు ఆడ పిల్లలు సంతానం. ప్రకాష్ వంట మేస్త్రి. కావ్య గతంలో నగరంలోని ఓ హాస్పిటల్లో ఆయాగా పని చేసింది. ఆ సమయంలో నిడమానూరుకు చెందిన ఓ సంఘ నాయకుడు లాం వాసుతో పరిచయమైంది. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. కావ్యకు వివాహమైనా వీరి సంబంధం కొనసాగింది. మూడు నెలల క్రితం కావ్య పిల్లలతో కలిసి వాసుతో ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఇది తెలిసిన కావ్య కుటుంబ సభ్యులు వీరిని పట్టుకుని ఇంటికి తీసుకొచ్చారు. పెద్ద మనుషుల మధ్య పంచాయతీ పెట్టి సమస్యను పరిష్కరించారు. అప్పటి నుంచి వాసును కావ్య దూరం పెట్టింది. దీంతో ఆమెను అతను తరచూ వేధించేవాడు. కావ్య భర్త ప్రకాష్ కుమార్ ఇంటిలో లేడనే విషయాన్ని తెలుసుకున్న వాసు శనివారం అర్ధరాత్రి కావ్య ఇంటికి వచ్చాడు. గతంలో మాదిరిగా తనతో ఉండాలని, మాట్లాడాలని బలవంతపెట్టాడు. దీనికి కావ్య నిరాకరించడంతో వీరి మధ్య గొడవ జరిగింది. క్షణికావేశంలో కావ్య మెడకు చున్నీ బిగించి వాసు హత్య చేశాడు. ఘటనను చూసిన పిల్లలు కేకలు వేయడంతో పరారయ్యాడు. ఈ అలికిడికి బయట పడుకున్న ఆమె తాత .. కావ్య చలనం లేకుండా పడి ఉండటం చూసి బంధువులకు విషయం తెలియజేశాడు. సమాచారం అందుకున్న పటమట సీఐ పవన్ కిషోర్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్య చేసిన లాం వాసును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. -
నిజాయతీతో సేవలందించాలి
ఏలూరు టౌన్: సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు నిర్భయంగా, నిష్పక్షపాతంగా, నిజాయతీతో సేవలందించాలని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్కుమార్ అన్నారు. అనంతపురం పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో శిక్షణ పూర్తిచేసుకున్న ప్రొబేషనరీ సబ్ ఇన్స్పెక్టర్లు ఆదివారం ఏలూరు రేంజ్ కార్యాలయంలో ఐజీని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రొబేషనరీ ఎస్సైలకు ఆయన నియామక ఉత్తర్వులు అందజేశారు. రేంజ్ పరిధిలో 100 మంది (68 మంది పురుషులు, 32 మంది మహిళలు) ఎస్సై శిక్షణ పూర్తిచేసుకోగా జిల్లాల వారీగా ఏలూరు 1, అల్లూరి సీతారామరాజు 4, కాకినాడ జిల్లా 2, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా 1, తూర్పుగోదావరి జిల్లా 15, పశ్చిమగోదావరి జిల్లా 1, కృష్ణా జిల్లా 20, ఎన్టీఆర్ జిల్లా 56 మంది ఉన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలీస్ విధుల్లో పనిచేయటం అదృష్టంగా భావిస్తూ చట్టాలకు లోబడి సత్వర న్యాయం అందించడానికి కృషి చేయాలని ఐజీ పిలుపునిచ్చారు. ముగిసిన జిల్లా స్థాయి క్రీడా పోటీలు గన్నవరం: కేసరపల్లిలోని ఎన్టీఆర్ పశువైద్య కళాశాలలో ఆదివారం హెచ్సీఎల్ ఫౌండేషన్ ఆధ్వర్యాన ఏడో జిల్లా స్థాయి క్రీడా పోటీలను నిర్వహించారు. కృష్ణాజిల్లా వ్యాప్తంగా 20 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్యఅతిథి ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖ అధికారి ఎంవీ సుబ్బారావు క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హెచ్సీఎల్ ఫౌండేషన్ దేశంలో స్పోర్ట్స్ ఫర్ చేంజ్ ప్రోగ్రాంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. విద్యార్థుల శారీరక, మానసిక సామర్థ్యాలను పెంపొందించడం, చురుకైన వ్యాయామంలో భాగస్వామ్యం చేయడం లక్ష్యమన్నారు. అనంతరం అథ్లెటిక్స్, రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్, జావలిన్ త్రో, షాట్పుట్, హ్యాండ్బాల్, హాకీ, బాస్కెట్బాల్, వాలీబాల్, రగ్బీ, ఫుట్బాల్ క్రీడల్లో పోటీల్లో నిర్వహించారు. బాలుర విభాగంలో తోటపల్లిలోని హీల్ ప్యారడైజ్ పాఠశాల, బాలికల విభాగంలో గొడవర్రు జెడ్పీ హైస్కూల్ ఓవరాల్ చాంపియన్షిప్ సాధించాయి. పలువురు హెచ్సీఎల్ ప్రతినిధులు, టెక్నికల్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నారాయణ టాలెంట్ టెస్టు అడ్డుకున్న ఎంఈవో తిరువూరు: ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోని నారాయణ టెక్నో స్కూల్లో ఆదివారం నిర్వహిస్తున్న టాలెంట్ టెస్టును ఎంఈఓ శ్యాంసుందర్ అడ్డుకున్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో అడ్మిషన్స్ కోసం టెస్టు నిర్వహిస్తున్నట్లు ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎంఈఓ తనిఖీ చేశారు. పరీక్ష రాస్తున్న విద్యార్థుల నుంచి ప్రశ్నపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం విద్యార్థులకు బయటకు పంపారు. నిబంధనలకు విరుద్ధంగా టాలెంట్ మైలవరం: మైలవరం నారాయణ హైస్కూల్లో ఆదివారం విద్యార్థులకు టాలెంట్ టెస్టు నిర్వహించారు. విద్యా హక్కు చట్టం ప్రకారం టాలెంట్ టెస్టులను నిర్వహించడంపై నిషేధం ఉంది. ఆ నిబంధనను బేఖాతర్ చేస్తూ స్థానిక నారాయణ స్కూల్ యాజమాన్యం టాలెంట్ నిర్వహించారు. దీనిపై ఎంఈఓ ఎల్.బాలును వివరణ కోరగా తమకు సమాచారం అందిన వెంటనే స్పందించి పాఠశాలకు వెళ్లి విద్యార్థులను ఇళ్లకు పంపించామన్నారు. పాఠశాల యాజమాన్యాన్ని హెచ్చరించామని పేర్కొన్నారు. -
‘ఏపీ శిక్షణ, ఉపాధి’ సమాఖ్య నూతన కార్యవర్గం
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఏపీ శిక్షణ, ఉపాధి అధికారుల సమాఖ్య (ప్రభుత్వ, ప్రయివేటు కళాశాలల్లోని ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ ఆఫీసర్స్)2025–2027 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నామని సమాఖ్య నూతన రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎన్.వి.సురేంద్రబాబు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఎన్నిక చీరాలలోని ఓ హోటల్లో ఆదివారం జరిగిందని పేర్కొన్నారు. కమిటీ ఉపాధ్యక్షుడిగా జి.ప్రకాష్ బాబు, ప్రధాన కార్యదర్శిగా వి.జగదీష్ కుమార్, కోశాధికారిగా డాక్టర్ పి.ఎల్.మాధవరావు ఇతర సభ్యులను ఎన్నుకున్నట్లు తెలిపారు. -
ఆరు ప్రాథమిక స్కూళ్లకు మంగళం?
పెనమలూరు: ప్రభుత్వ పాఠశాలల పునర్వ్యవస్థీకరణలో భాగంగా మండలంలో ఆరు ప్రాథమిక పాఠశాలలకు మంగళం పలకనున్నారు. ఈ మేరకు తీర్మానం చేయవలసిందిగా ప్రభుత్వం ఆయా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలను ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలపై ఎస్ఎంసీలు, తల్లిదండ్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే మండలంలో ప్రాఽథమిక, యూపీ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు మొత్తం 36 ఉన్నాయి. ప్రభుత్వం పాఠశాలలను గ్రేడ్లుగా విభజించటానికి రీస్ట్రక్చరింగ్ ఆఫ్ స్కూల్స్ కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా విద్యార్థులు తక్కువగా ఉన్న ఆరు ప్రాథమిక పాఠశాలలపై అఽధికారులు కన్నేశారు. పాఠశాలలను 1, 2 తరగతులకు ఫౌండేషన్ స్కూల్స్, 60 మందికి పైగా విద్యార్థులు ఉంటే మోడల్ ప్రైమరీ స్కూల్స్(ఎంపీఎస్), 60 మందికి లోపు విద్యార్థులు ఉంటే బేసిక్ స్కూల్(బీపీఎస్)గా విభజిస్తున్నారు. ఇందులో భాగంగా గోసాల, పోరంకి బీజేఆర్ నగర్, యనమలకుదురు మండపం స్కూల్, పెదపులిపాక దళితవాడ స్కూల్, యనమలకుదురు ఇందిరానగర్ స్కూళ్లలో ఉన్న 3,4,5 తరగతులను ఎత్తివేసి వాటిని ఎంపీఎస్, బీపీఎస్లో కలుపుతారు. మండలంలో ఎంపీఎస్ స్కూల్స్ 18, బీపీఎస్ స్కూల్స్ 5గా నిర్ణయించారు. ‘ప్రాథమిక’ విద్యార్థులకు కష్టాలే... విద్యార్థులు తక్కువగా ఉన్నారన్న సాకుతో ఆరు ప్రాథమిక పాఠశాలలను ఇతర పాఠశాలల్లో విలీనం చేయనున్నారు. ఈ కారణంగా గోసాల తెలుగు, పెదపులిపాక దళితవాడ, చోడవరం దళితవాడ, యనమలకుదురు మండపం పాఠశాల, పోరంకి బీజేఆర్నగర్లోని పాఠశాలలో 3,4,5 తరగతులు చదివే విద్యార్థులు చాలా దూర ప్రాంతాల్లో ఉండే పాఠశాలలకు వెళ్లాల్సి వస్తుంది. చాలా సంవత్సరాలుగా పేదలు నివసించే ప్రాంతాల్లో ఉన్న ఈ పాఠశాలల్లో 3,4,5 తరగతులు తొలగించటం తగదని విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎస్ఎంసీ తీర్మానం కోరిన ప్రభుత్వం విద్యార్థులు తక్కువగా ఉన్నారన్న సాకుతో... అభ్యంతరం తెలుపుతున్న తల్లిదండ్రులుచోడవరానికి జిల్లా పరిషత్ పాఠశాల చోడవరం గ్రామంలో నూతనంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏర్పాటయ్యే అవకాశం ఉంది. మండలంలో ఇప్పటికే కానూరు, పోరంకి, యనమలకుదురు, వణుకూరు, తాడిగడప, పెనమలూరు గ్రామాల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. కొత్తగా చోడవరంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వస్తే మండలంలో మొత్తం ఏడు స్కూళ్లు అవుతాయి. చోడవరం పాఠశాల -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాసోమవారం శ్రీ 3 శ్రీ మార్చి శ్రీ 2025‘మీ కోసం’కు విరామం చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజాసమస్యల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఇఫ్తార్ సహరి (సోమ) (మంగళ) విజయవాడ 6.20 5.07 మచిలీపట్నం 6.19 5.04 ముస్లింలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పవిత్ర రంజాన్ మాసం రానే వచ్చింది. నెలవంక కనిపించడంతో ఆదివారం నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయి. శుభప్రదమైన ఈ మాసానికి స్వాగతం పలుకుతూ ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం అంతా కలిసి ఇఫ్తార్ విందు తీసుకున్నారు. ఈ నెలలో ముస్లింలు అల్లాహ్ను ధ్యానిస్తూ.. పుణ్యకార్యాలకే పరిమితమవుతారు. – సాక్షి ఫొటోగ్రాఫర్ విజయవాడ7పవిత్ర మాసం.. ప్రారంభంన్యూస్రీల్ -
హత్య కేసులో నిందితుల అరెస్టు చెరువుబజార్లో జరిగిన ఘటనలో విచారణ
జగ్గయ్యపేట అర్బన్: చెరువు బజార్లో గత నెల 27న జరిగిన హత్య కేసులో నిందితులను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో అరెస్ట్ చేసిన నిందితులను మీడియా ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రూరల్ డీసీపీ మహేశ్వరరాజు పర్యవేక్షణలో, నందిగామ ఏసీపీ తిలక్ ఆధ్వర్యంలో ఘటనా స్థలాన్ని పరిశీలించామన్నారు. అక్కడ సేకరించిన సాంకేతిక ఆధారాలతో దర్యాప్తులో వేగం పెంచినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో తమకు వచ్చిన సమాచారం మేరకు ఆదివారం పద్మావతినగర్ చెక్పోస్ట్ వద్ద ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారణ చేసి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మరొక జువైనెల్ను అదుపులోకి తీసుకున్నామని, జువైనెల్ హోంకు తరలిస్తామని తెలిపారు. చెరువుబజారుకు చెందిన బత్తుల కిషోర్బాబు, బత్తుల వెంకట శివకుమార్, బండి సాయి, బండి రవికుమార్, వేముల జ్వాలా నరసింహరావు, రూపన వినయ్, ఒక జువైనెల్(మైనర్ వ్యక్తి) ఉన్నారు. నిందితులంతా చెరువుబజారుకు చెందిన వారేనని, చెడు వ్యసనాలకు బానిసలయ్యారని తెలిపారు. స్థానికుడు బత్తుల శ్రీను అనే పూజారి వీరి ఆగడాలను అడ్డుకునేవాడని తెలిపారు. దీంతో వారు అతని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారని, ఊరేగింపు సమయంలో ఉద్దేశపూర్వకంగా బత్తుల శ్రీను మేనల్లుడు ఓర్సు నాగబాబుతో గొడవ పెట్టుకున్నారని తెలిపారు. బత్తుల శ్రీను అడ్డురాగా, అందరూ కలిసి వారిని కొట్టి ముందుగా వేసుకున్న పథకం ప్రకారం జేబులో ఉన్న కోడికత్తిని తీసి శ్రీను మెడపై, వెనుక పొడిచారని పేర్కొన్నారు. తర్వాత శ్రీను అన్న బత్తుల వెంకటేశ్వర్లును భుజం మీద పొడిచి అక్కడ నుంచి పారిపోయారని తెలిపారు. సమావేశంలో పేట ఎస్ఐ జి.రాజు, చిల్లకల్లు ఎస్ఐ సూర్యశ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో చిన్నారి దుర్మరణం హనుమాన్జంక్షన్ రూరల్: బాపులపాడు మండలం ఆరుగొలనులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడేళ్ల బాలుడు దుర్మరణం చెందాడు. వివరాల్లోకి వెళ్లితే.. ఏలూరు జిల్లా గుండుగొలనుకు చెందిన చిగురుపాటి నాగరాజు తన భార్య ఇందు, కుమారులు ఏలియాజర్ (12), నోహాల్ పాల్ (7)తో కలిసి బైక్పై గుడివాడలోని ఓ చర్చికి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో మార్గమధ్యంలో ఆరుగొలను వద్ద రోడ్డుపై ఆగి ఉన్న లారీని తప్పించబోతూ ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును అదుపు తప్పి ఢీకొట్టారు. బైక్పై ముందు కూర్చున్న చిన్న కుమారుడు చిగురుపాటి నోహల్ పాల్(7) తీవ్ర గాయాల పాలై ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందాడు. ఇది చూపరులను కలిచి వేసింది. కళ్ల ఎదుటే కన్నకొడుకు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చిన్నారి నోహల్పాల్ మృతదేహానికి గుడివాడ ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. హనుమాన్జంక్షన్–2 ఎస్ఐ నరసింహమూర్తి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహిళా ఉద్యోగులకు ఆటల పోటీలు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఏపీ ఎన్జీఓ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు ఏపీ ఎన్జీఓ మహిళా విభాగం రాష్ట్ర చైర్పర్సన్ వి.నిర్మలకుమారి తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గాంధీనగర్లోని ఎన్జీఓ హోమ్లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆటల పోటీల కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్మలకుమారి మాట్లాడుతూ.. ఇందిరాగాంధీ స్టేడియం వేదికగా జరిగే పోటీలను క్రీడాశాఖ మంత్రి ఎం.రాంప్రసాద్రెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు. ఈ నెల 4,5, 6 తేదీల్లో పలు విభాగాల్లో పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. 8వ తేదీ ఎన్జీఓ హోంలో మహిళా దినోత్సవ మహాసభ జరుగుతుందని వివరించారు. సమావేశంలో మహిళా కమిటీ కన్వీనర్ ఎం.రాజలక్ష్మి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి బి.జానకి, రాష్ట్ర కార్యదర్శి బి.తులసి రత్నం తదితరులు పాల్గొన్నారు. -
పోలీసులకే సవాల్ గా మారిన వరుస చోరీలు
నందిగామ: ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో వరుస దొంగతనాలు పోలీసులకు సవాల్ గా మారాయి. వరుస దోపిడీలతో కలకలం రేపుతున్న దొంగలు.. భారీగా నగదు, బంగారం చోరీ చేస్తూ ప్రజల్ని హడలెత్తిస్తున్నారు. ఇంట్లో ఎవరూ లేని ఇళ్లనే ప్రధానంగా టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్నారు దొంగలు. నందిగామ మండలం లింగాలపాడు గ్రామంలో కనిశెట్టి గాంధీ ఇంట్లో రూ. 3 లక్షల విలువగల బంగారాన్ని, రూ. 45 వేల రూపాయల్ని దోచుకెళ్లారు దొంగలు. చందర్లపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలో రెండు ఇళ్లల్లో లక్షా 50 వేల నగదు చోరీ చేశారు దొంగలు.చందర్లపాడు మండలంప కాండ్రపాడులో ఇళ్లలో సైతం దొంగలు చోరీకి పాల్పడ్డారు. చిన్న వెంకటరెడ్డి ఇంటిలో రూ. 12 లక్షల విలువగల బంగారం, రూ. 15 వేల నగదు చోరీ చేశారు. మహేశ్వర్ రెడ్డి ఇంటిలో రూ. 1 లక్ష 50 వేలు విలువగల బంగారం చోరీ చేశారు. నందిగామ ప్రాంతంలో ఒక్కరోజే రూ. 20 లక్షల రూపాయల విలువగల బంగారం, నగదు చోరీ చేశారు. నందిగామ పరిసర ప్రాంతాల్లో వరుస చోరీలు జరుగుతుండటంతో ప్రజలు భయాందోళనలకు గురౌతున్నారు. -
న్యాయ విద్యార్థులు ప్రతి అంశాన్ని అధ్యయనం చేయాలి
కృష్ణలంక(విజయవాడతూర్పు): న్యాయ విద్యార్థులు ప్రతి అంశాన్ని ఆధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని, సామాజిక ఇంజినీర్లుగా వారి కర్తవ్యాలను విలువలతో నిర్వహించాలని ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్ అన్నారు. గవర్నర్పేటలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో ఏఐఎల్యూ ఆధ్వర్యంలో శనివారం న్యాయ విద్యార్థుల రాష్ట్ర సదస్సు జరిగింది. ముఖ్య అతిథి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ నూతనంగా వచ్చిన చట్టాలను అధ్యయనం చేయాలని, వస్తున్న మార్పులను పరిగణలోకి తీసుకుని సమాజ హితానికి ఎలా ఉపయోగపడాలో ఆలోచించాలన్నారు. ఏఐఎల్యూ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎస్.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ న్యాయ విద్యార్థులు వారి చదువుతో పాటుగా, సామాజిక బాధ్యతను కూడా నిర్వర్తించాలన్నారు. న్యాయవాదులు సంపాదన కంటే సామాజిక బాధ్యతకే ప్రాధాన్యమివ్వాలన్నారు. వీఐటీ యూనివర్సిటీ లా స్కూల్ డీన్, డాక్టర్ చక్యా బెనర్జీ మాట్లాడుతూ ప్రస్తుతం మారుతున్న పరిస్థితుల్లో రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయన్నారు. రాజ్యాంగ పరిరక్షణకు జరిగే ఉద్యమాలలో న్యాయ విద్యార్థులు భాగస్వామ్యం కావాలని సూచించారు. కార్యక్రమంలో సిద్ధార్థ న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సీహెచ్ దివాకర్బాబు, గుంటూరు జె.సి.న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి.హెచ్.సుధాకర్ బాబు తదితరులు మాట్లాడారు. -
న్యాయ విద్యార్థులు ప్రతి అంశాన్ని అధ్యయనం చేయాలి
కృష్ణలంక(విజయవాడతూర్పు): న్యాయ విద్యార్థులు ప్రతి అంశాన్ని ఆధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని, సామాజిక ఇంజినీర్లుగా వారి కర్తవ్యాలను విలువలతో నిర్వహించాలని ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్ అన్నారు. గవర్నర్పేటలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో ఏఐఎల్యూ ఆధ్వర్యంలో శనివారం న్యాయ విద్యార్థుల రాష్ట్ర సదస్సు జరిగింది. ముఖ్య అతిథి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ నూతనంగా వచ్చిన చట్టాలను అధ్యయనం చేయాలని, వస్తున్న మార్పులను పరిగణలోకి తీసుకుని సమాజ హితానికి ఎలా ఉపయోగపడాలో ఆలోచించాలన్నారు. ఏఐఎల్యూ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎస్.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ న్యాయ విద్యార్థులు వారి చదువుతో పాటుగా, సామాజిక బాధ్యతను కూడా నిర్వర్తించాలన్నారు. న్యాయవాదులు సంపాదన కంటే సామాజిక బాధ్యతకే ప్రాధాన్యమివ్వాలన్నారు. వీఐటీ యూనివర్సిటీ లా స్కూల్ డీన్, డాక్టర్ చక్యా బెనర్జీ మాట్లాడుతూ ప్రస్తుతం మారుతున్న పరిస్థితుల్లో రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయన్నారు. రాజ్యాంగ పరిరక్షణకు జరిగే ఉద్యమాలలో న్యాయ విద్యార్థులు భాగస్వామ్యం కావాలని సూచించారు. కార్యక్రమంలో సిద్ధార్థ న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సీహెచ్ దివాకర్బాబు, గుంటూరు జె.సి.న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి.హెచ్.సుధాకర్ బాబు తదితరులు మాట్లాడారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాఆదివారం శ్రీ 2 శ్రీ మార్చి శ్రీ 2025–8లోuసాక్షి ప్రతినిధి, విజయవాడ: కోటా బియ్యాన్ని తెలుగు తమ్ముళ్లు బొక్కేస్తున్నారు. వాటాలు వేసుకుని మరీ అక్రమ దందా సాగిస్తున్నారు. నియోజకవర్గానికి ఓ ముఠాగా ఏర్పడి రేషన్ బియ్యం మాఫియాను నడుపుతున్నారు. ఆయా నియోజకవర్గ ప్రజాప్రతినిధులు నెలవారీ మూమూళ్లు తీసుకుని రేషన్ మాఫియాకు పచ్చ జెండా ఊపుతున్నారు. ఫలితంగా రేషన్ బియ్యం పక్కదారిపడుతోంది. బియ్యం పంపిణీచేసే వాహనాల వద్దే డబ్బు కావాలా.. బియ్యం కావాలా అంటూ రైస్కార్డు లబ్ధిదారులను మాఫియా నిర్వాహకులు అడుగుతున్నారు. డబ్బు కావాలనే వారికి కిలోకు రూ.10 చొప్పున ఇచ్చి బియ్యం సేకరిస్తున్నారు. వారు కొంత లాభం తీసుకుని, నియోజకవర్గం మొత్తానికి బియ్యం మాఫియాగా వ్యవహరిస్తున్న వారికి విక్రయిస్తున్నారు. ఇందుకు ఒప్పందాలు సైతం కుదుర్చుకుంటున్నారు. చౌకబియ్యం పక్కదారి పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. గతంలో రేషన్ పంపిణీ సమయంలో వలంటీర్తోపాటు ఆర్ఐ సిబ్బంది ఉండి బియ్యం, ఇతర నిత్యావసర సరుకుల పంపిణీని పర్యవేక్షించేవారు. కూటమి అధికారంలోకి వచ్చాక సచివాలయ వ్యవస్థకు తూట్లు పొడిచి రేషన్ మాఫియాకు అండగా నిలుస్తోంది. బియ్యం, ఇతర సరుకుల పంపిణీ సక్రమంగా జరిగిందా? లేదా? అని పరిశీలించటంతోపాటు బియ్యం అక్రమ రవాణాపై నిఘా పెట్టాల్సిన పౌర సరఫరాల శాఖ, విజిలెన్స్, పోలీసు, రెవెన్యూ ఉన్నతాధికారులు పూర్తిగా చేతులు ఎత్తేశారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నా మామూళ్ల మత్తులో జోగుతూ తమకేమీ పట్టదన్నట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో జిల్లాలో రేషన్ మాఫియా ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండాపోయింది. విజయవాడ నగరంలో 2,65,928 బియ్యం కార్డులు ఉన్నాయి. ప్రతి నెలా 2,39,335 మంది (90 శాతం)లబ్ధిదారులు రేషన్ బియ్యం తీసుకుంటున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇందులో దాదాపు 60 నుంచి 70 శాతానికి పైగా బియ్యం పక్కదారి పడుతోందని సమాచారం. విజయవాడ సెంట్రల్ ప్రజాప్రతినిధికి నెలకు రూ.7 లక్షలు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో రేషన్ మాఫియాకు అడ్డూఅదుపు లేకుండాపోయింది. ఈ నియోజకవర్గంలో గతంలో 63వ డివిజన్కు చెందిన ఓ వ్యక్తి రేషన్ మాఫియా నడిపేవాడు. అయితే ఆ వ్యక్తిని కాదని 59వ డివిజన్కు చెందిన వ్యక్తికి నియోజకవర్గ ప్రజాప్రతినిధి రేషన్ బియ్యం దందాను అప్పజెప్పారు. ఆ వ్యక్తి నెలకు రూ.7 లక్షల చొప్పున ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. అంతేకాదు రెండు నెలల అడ్వాన్స్గా రూ.14 లక్షలు జేబులో వేసుకున్నారు. గతంలో దందానడిపిన వ్యక్తికి, ఇప్పుడు దందా దక్కించుకున్న వ్యక్తి ఇద్దరూ టీడీపీకి చెందిన వారే. వారిద్దరి మధ్య ఇప్పుడు అంతర్గత పోరు నడుస్తోంది. తాజాగా నియోజకవర్గ ప్రజాప్రతినిధి సూచించిన వ్యక్తికి మద్దతుగా నియోజకవర్గంలోని డీలర్ల నుంచి బియ్యం సేకరించేందుకు ముగ్గురు వ్యక్తులు రంగంలోకి దిగారు. 63 డివిజన్ చెందిన, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్లలో అవినీతి పాల్పడిన వ్యక్తి, ప్రజాప్రతినిధికి రైట్ లెఫ్ట్గా ‘కొండ’ల ఉండే మరో వ్యక్తి, రేషన్ డీలర్ల రాష్ట్ర సంఘం నేత ముగ్గురు లాబీయింగ్ చేస్తున్నారు. వారికి రేషన్ మాఫియా నడిపే వ్యక్తి పది శాతం వాటా ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారని సమాచారం. మొత్తం మీద పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని వదలకుండా వాటాలు పంచుకుని దండుకోవటం నియోజకవర్గంలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ● విజయవాడ పశ్చిమ నియోజకవర్గంతోపాటు, గొల్లపూడి, వైఎస్సార్ కాలనీ, జూపూడి పంచాయతీ పరిధిలో రేషన్ బియ్యాన్ని గొల్లపూడికి చెందిన ఓ టీడీపీ నేత సేకరించి, అక్రమ రవాణా చేస్తున్నారు. ● నందిగామ నియోజకవర్గంలోని చందర్లపాడు, నందిగామ మండలాలకు చెందిన రేషన్ బియ్యాన్ని చందర్లపాడు గ్రామానికి టీడీపీ నేతకు అప్పజెప్పారు. వీరులపాడు, కంచిర్ల మండలాల రేషన్ మాఫియాను వీరులపాడు మండలం చట్టన్నవరం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు నడుపుతున్నారు. ఇద్దరు మాఫియా నిర్వాహకుల నుంచి నియోజకవర్గ ప్రజాప్రతినిధికి నెలకు రూ.3 లక్షల చొప్పున రూ.6 లక్షల వాటా అందుతోందని సమాచారం. ● జగ్గయ్యపేట పట్టణంలోని ఓ కార్పొరేటర్, వత్సవాయి మండలం లింగాల గ్రామానికి చెందిన ప్రముఖ రేషన్ మాఫియా నిర్వాహకుడు జగ్గయ్యపేట నియోజకవర్గం మొత్తానికి రేషన్ బియ్యం దందా సాగిస్తున్నారు. నియోజకవర్గ ప్రజాప్రతినిధికి నెలనెలా రూ.5 లక్షలకు పైగా ముట్టజెబుతున్నారు. ● మైలవరం నియోజకవర్గంలో ముఖ్య ప్రజాప్రతినిధి అనుచరుడిగా చెలామణీ అవుతున్న వ్యక్తి విస్సన్నపేటలో నివసిస్తూ రేషన్ మాఫియా నడిపిస్తున్నారు. ప్రజాప్రతినిధి బావమరిదికి ఇతను పెద్ద ఎత్తున ముడుపులు ఇస్తున్నట్లు టీడీపీ వర్గాలే పేర్కొంటున్నాయి. ● తిరువూరు నియోజకవర్గంలో విచ్చల విడిగా రేషన్ బియ్యం అక్రమ రవాణా సాగుతోంది. దీని వెనుక ప్రజాప్రతినిధి అండదండలు ఉన్నట్లు నియోజకవర్గంలో విమర్శలు వినిపిస్తున్నాయి.ఉర్దూ పాఠశాలల టైమింగ్ మార్చండి ఇబ్రహీంపట్నం: రంజాన్ మాసంలో ఉర్దూ పాఠశాలల పనివేళలు మార్చాలని ఏఐఐటీఏ, ఉర్దూ జేఏసీ ఆధ్వర్యాన పాఠశాల విద్యా కమిషనర్ విజయరామరాజుకు శనివారం వినతిపత్రం అందజేశారు. రంజాన్ మాసంలో ముస్లిం ఉపాధ్యాయులు ఉపవాసం ఉండటానికి ఉదయం 8నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పాఠశాలల వేళలు మార్చాలన్నారు. పాఠశాల పునర్నిర్మాణంలో భాగంగా ఉర్దూ పాఠశాలలకు ఆంగ్ల మాధ్యం నుంచి మినహాయింపు ఇవ్వాలని, ఉర్దూ కాంప్లెక్స్లను యథావిధిగా కొనసాగించాలని కోరారు. మైనార్టీ విద్యార్థులు ఉన్న స్కూల్స్లో ఉర్దూ ఎస్జీటీని ఏర్పాటు చేయడం, జెడ్పీ పాఠశాలల్లో ప్రథమ భాషగా ఉర్దూ బోధించడానికి ఉర్దూ ఉపాధ్యాయుల నియామకం చేపట్టాలని వినతిపత్రంలో కోరారు. కార్యక్రమంలో జిల్లా ఉర్దూ జేఏసీ ప్రధాన కార్యదర్శి మహ్మద్ ఇర్ఫాన్, ఆల్ ఇండియా ఐడియల్ టీచర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి షేక్ ఇర్ఫాన్ పాల్గొన్నారు. ముగిసిన బ్రహ్మోత్సవాలుఅమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అమరావతిలో వేంచేసియున్న బాలచాముండికా సమేత అమరేశ్వర స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శనివారం పూర్ణాహుతితో ముగిశాయి. తొలుత స్వామివారికి చూర్ణోత్సవంలో భాగంగా ఉత్సవమూర్తులకు స్నపన చేసి నూతన వస్త్రాలంకరణ చేశారు. అనంతరం స్వామివారికి వసంతోత్సవం నిర్వహించారు. ఆలయస్థానాచార్యుడు కౌశిక చంద్రశేఖరశర్మ మాట్లాడుతూ రథోత్సవం పూర్తయిన చూర్ణోత్సవం, వసంతోత్సవం ఆనవాయితీగా వస్తుందన్నారు. పూర్ణాహుతితో పంచాహ్నిక దీక్షతో నిర్వహించే బ్రహ్మోత్సవాలు ముగిశాయన్నారు. ఇఫ్తార్ సహరి (ఆది) (సోమ) విజయవాడ 6.19 5.07 మచిలీపట్నం 6.19 5.05 7 పక్కదారిపడుతున్న చౌక బియ్యం కోటా బియ్యన్ని బొక్కేస్తున్న తమ్ముళ్లు టీడీపీ నేతల కనుసన్నల్లోనే రేషన్ దందా అక్రమాలను పట్టించుకోని అధికారులున్యూస్రీల్కొయ్యూరులో పట్టివేత హనుమాన్జంక్షన్ రూరల్: బాపులపాడు మండలం కొయ్యూరులో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పీడీఎస్ అధికారులు పట్టుకున్నారు. గ్రామానికి చెందిన మల్లవల్లి రాంబాబు, అతని తనయుడు శ్యామ్ కొంతకాలంగా పరిసర గ్రామాల కార్డుదారుల నుంచి రేషన్ బియ్యం సేకరించి, అక్రమంగా తరలిస్తున్నారనే పక్కా సమాచారం అందుకున్న పీడీఎస్ డెప్యూటీ తహసీల్దార్ ప్రధాన్, రెవిన్యూ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మాణ్యం శనివారం తనిఖీలు నిర్వహించారు. దాడిలో 32 బస్తాల రేషన్బియ్యాన్ని అధికారులు గుర్తించారు. అక్రమ వ్యాపారం చేస్తున్న మల్లవల్లి రాంబాబుపై 6ఏ, 7సీ కేసులను నమోదు చేసినట్లు పీడీఎస్ డీటీ ప్రధాన్ తెలిపారు. -
చంటిబిడ్డలను విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
విజయవాడస్పోర్ట్స్: ఢిల్లీ, అహ్మదాబాద్ ప్రాంతాల నుంచి నెలలు నిండని పసికందులను తీసుకొచ్చి విజయవాడ పరిసర ప్రాంతాల్లో సంతానం లేని దంపతులకు విక్రయించి అక్రమంగా సొమ్ము చేసుకుంటున్న ఐదుగురు మహిళలను ఎన్టీఆర్ జిల్లా పోలీస్ యంత్రాంగం అరెస్టు చేసింది. నిందితుల నుంచి ముగ్గురు పసికందులను, ఓ బాబును విక్రయించగా వచ్చిన రూ.4 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు శనివారం విలేకరులకు వెల్లడించారు. ఆయన కథనం మేరకు... పసిబిడ్డల విక్రయాలపై అందిన పక్కా సమాచారంతో టాస్క్ఫోర్స్ ఏడీసీపీ ఎ.శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఏసీపీ కె.లతాకుమారి, నార్త్ ఏసీపీ స్రవంతిరాయ్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్, నున్న పోలీస్ సిబ్బంది నున్న పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రకాష్నగర్లో సోదాలు నిర్వహించారు. ఆ ప్రాంతంలోని చంటి పాపలను విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న నిందితులైన విజయవాడ సితార సెంటర్కు చెందిన బలగం సరోజిని, అజిత్ సింగ్నగర్కు చెందిన షేక్ ఫరీనా, షేక్ సైదాబీ, ప్రకాష్నగర్కు చెందిన కొవ్వరపు కరుణశ్రీ, ప్రకాష్నగర్కు చెందిన పెదాల శిరీషను అదుపులోకి తీసుకున్నారు. వారిలో బలగం సరోజినికి కొన్నేళ్ల క్రితం నగరంలోని ఓ హాస్పిటల్ సమీపంలో విజయలక్ష్మితో పరిచయమైంది. ఆమె సూచన మేరకు సరోజిని పిల్లలు లేని, సంతానలేమితో బాధపడుతున్న మహిళలకు ఎగ్స్ డొనేట్ చేసి తద్వారా వచ్చిన డబ్బులను తీసుకుంది. సులభంగా డబ్బులు వస్తున్న నేపథ్యంలో మరికొంతమంది మహిళలతో ఎగ్స్ డొనేట్ చేయించి కమీషన్ తీసుకునేది. ఈ క్రమంలోనే హైదరాబాద్కి చెందిన ఓ మహిళ సూచన మేరకు పిల్లలను విక్రయించి తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బులు సంపాదించేందుకు సరోజిని సిద్ధపడింది. ఢిల్లీకి చెందిన యువతి ప్రీతికిరణ్, అహ్మదాబాద్కు చెందిన యువకుడు అనిల్ను పరిచయం చేసుకుంది. ప్రీతికిరణ్, అనిల్ ఢిల్లీ, అహ్మదాబాద్ నుంచి విజయవాడకు తీసుకొచ్చిన చంటి బిడ్డలను సరోజిని రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షలకు కొనుగోలు చేసేది. ఈ పిల్లలను ప్రకాష్ నగర్లోని కరుణశ్రీ , పెదాల శిరీష ఇళ్లలో ఉంచేది. అనంతరం సరోజిని పలు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ సంతానం కోసం ఇబ్బందులు పడే దంపతులను గుర్తించేది. వారితో ఆమె వద్ద ఉన్న బిడ్డలను విక్రయించేందుకు బేరం కుదుర్చుకునేది. ఆడ బిడ్డను రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు, మగ బిడ్డను రూ 4 లక్షల నుంచి రూ.5 లక్షలకు విక్రయించేది. బేరం పూర్తయిన తర్వాత కరుణశ్రీ , శిరీష ఇళ్లలో ఉన్న చంటి బిడ్డలను షేక్ ఫరీనా, సైదాబీలు డబ్బులు చెల్లించిన దంపతులకు చేరవేసేవారు. చట్టబద్ధత ప్రకారం పిల్లలను దత్తత తీసుకునేందుకు విముఖత చూపించే దంపతులను సరోజిని టార్గెట్ చేసేది. సరోజిని గతంలో మేడ్పల్లి, ముంబయిలలో పిల్లలను అక్రమంగా విక్రయించిన కేసుల్లో అరెస్ట్ అయి జైలు జీవితం అనుభవించింది. గత ఏడాది ఆగస్ట్ నెలలో జైలు నుంచి విడుదలైంది. జైలు జీవితం అనుభవించిన తర్వాత సైతం ఆమె ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. గడిచిన ఆరు నెలల్లో ఏడుగురు పిల్లలను ఢిల్లీ, అహ్మదాబాద్ చెందిన వ్యక్తుల నుంచి కొనుగోలు చేసింది. ఏలూరు, గుంటూరు ప్రాంతాలకు చెందిన దంపతులకు నలుగురు పిల్లలను అమ్మింది. మరో ముగ్గురు చంటి బిడ్డలను విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న ఈ ముఠాను అత్యంత చాకచక్యంగా అరెస్టు చేసినట్లు పోలీస్ కమిషనర్ చెప్పారు. నిందితులపై బీఎన్ఎస్ 143, 81, 87 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వివరించారు. ఈ కేసును ఛేదించిన టాస్క్ఫోర్స్, లా అండ్ ఆర్డర్ అధికారులు, సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు. సమావేశంలో డీసీపీలు గౌతమి సాలి, కె.జి.వి.సరిత, ఏడీసీపీలు జి.రామకృష్ణ, ఎ.శ్రీనివాసరావు, ఏసీపీలు కె.లతాకుమారి, స్రవంతిరాయ్ పాల్గొన్నారు. ఢిల్లీ, అహ్మదాబాద్ నుంచి పిల్లలను తీసుకొచ్చి విజయవాడలో విక్రయిస్తున్న వైనం ఐదుగురు మహిళలు అరెస్ట్ -
ఆరు ఇళ్లలో చోరీ
చందర్లపాడు(నందిగామ రూరల్): మూడు గ్రామాల్లో ఆరు ఇళ్లలో పట్టపగలు చోరీ జరిగింది. చందర్లపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలో శనివారం మధ్యాహ్న సమయంలో తాళాలు వేసి పొలం పనులకు వెళ్లిన మూడు ఇళ్లలో చోరీ జరిగింది. మారెం హరికృష్ణ నివాసంలో 12 గ్రాముల బంగారం, రూ.36 వేల నగదు, మారెం చిన్న నరసింహారావు ఇంట్లో రూ.80 వేల నగదు, దర్శి జయమ్మ ఇంట్లో 10 గ్రాముల బంగారం, రూ.60 వేల నగదు చోరీకి గురైంది. మూడు ఇళ్లలో ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాల్లో ఉన్న రూ.1.76 లక్షల నగదు, 22 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు సమాచారం. మండలంలోని కాండ్రపాడులో చిన్న వెంకటరెడ్డి నివాసంలో బీరువా పగలగొట్టి రూ.12 లక్షల విలువ చేసే బంగారు నగలు, రూ.15 వేలు నగదు చోరీకి గురవగా మహేశ్వరరెడ్డి ఇంటిలో బీరువాను పగలగొట్టి రూ.1.50 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను అపహరించినట్లు బాధితులు పేర్కొంటున్నారు. నందిగామ మండలం లింగాలపాడు గ్రామంలో కనిశెట్టి గాంధీ ఇంటి, బీరువా తాళాలు పగలగొట్టి బీరువాలోని 42 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.40వేలు నగదు చోరీకి గురైందని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ వైవీఎల్ నాయుడు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
లిడ్ క్యాప్ కార్పొరేషన్కు రూ.300 కోట్లు కేటాయించాలి
చర్మకార సంక్షేమ సంఘం అధ్యక్షుడు బుల్లా రాజారావు జి.కొండూరు: చర్మకారుల కుటుంబాల ఆర్థికాభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చర్మకార సంక్షేమ అభివృద్ధి సంస్థ(లిడ్ క్యాప్)కు కూటమి ప్రభుత్వం రూ.300 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర చర్మకార సంక్షేమ సంఘం అధ్యక్షుడు బుల్లా రాజారావు అన్నారు. జి.కొండూరులో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాజారావు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా లిడ్ క్యాప్కు చెందిన స్థలాలు, భవనాలు అన్యాక్రాంత మవుతున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం స్పందించి కబ్జాకు గురైన స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకొని లిడ్ క్యాప్కు కేటాయించాలని కోరారు. అన్ని జిల్లాల్లో లెదర్ పార్కులను నిర్మించి చర్మకారుల జీవితాలలో వెలుగు నింపాలన్నారు. చర్మకారులు, డప్పు కళాకారులకు ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రూ.2లక్షలను ఆర్థికసాయంగా అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. జి.కొండూరు మండల పరిధి వెల్లటూరు గ్రామంలో మినీ లెదర్ పార్క్ నిర్మాణానికి రెండేళ్ల క్రితం రూ.5.5 కోట్లు నిధులు విడుదలయ్యాయని, పార్కు నిర్మా ణం వెంటనే ప్రారంభించాలన్నారు. కార్య క్రమంలో లిడ్ క్యాప్ పరిరక్షణ సమితి ఉమ్మడి కృష్ణాజిల్లా కార్యదర్శి బట్టపర్తి రాజు, ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు కురగంటి రాంబా బు, రాష్ట్ర చర్మ కార సంక్షేమ సంఘం కార్యదర్శి బుల్లా రాజు పాల్గొన్నారు.