Vizianagaram
-
మా పిల్లల భవిష్యత్తు ఏంటి?
చీపురుపల్లిరూరల్(గరివిడి): గరివిడి వెటర్నరీ కళాశాల ఆవరణలో నెల రోజులపైబడి తమ సమస్యలను, డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ చేపడుతున్న నిరవధిక దీక్షకు విద్యార్థుల తల్లిదండ్రులు మంగళవారం మద్దతు తెలిపారు. కళాశాలకు వీసీఐ గుర్తింపును తీసుకురావాలని, ఎంబీబీఎస్ విద్యార్థుల మాదిరిగానే స్టైఫండ్ను అందించాలన్న న్యాయమైన కోరికలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పిల్లల భవిష్యత్తు ఏమిటో చెప్పాలని కళాశాల అసోసియేట్ డీన్ మక్కేన శ్రీనును ప్రశ్నించారు. నెలల తరబడి తరగతులు బహిష్కరించి నిరవధిక దీక్ష చేస్తున్నా స్పందించకపోవడంపై మండిపడ్డారు. దీనిపై డీన్ స్పందిస్తూ స్టైఫండ్ పెంపుదల అంశం ప్రభుత్వ పరిధిలో ఉందని, కళాశాల నుంచి రిలీవ్ అవుతున్న విద్యార్థులకు ఇతర కళాశాల గుర్తింపుతో బయటకు పంపిస్తామని, విద్యార్థులకు వీసీఐ గుర్తింపులో అన్యాయం జరగదని బదులిచ్చారు. డీన్ను ప్రశ్నించిన పశువైద్య విద్యార్థుల తల్లిదండ్రులు -
జిల్లా పోలీస్ కార్యాలయం మరమ్మతులకు మోక్షం
విజయనగరం క్రైమ్: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం, ఎస్పీ ఆఫీస్ భవనానికి ఎట్టకేలకు మోక్షం లబించింది. ప్రస్తుత ఎస్పీ వకుల్ జిందల్ చొరవతో దాదాపు రూ.3 లక్షల వ్యయంతో పరిపాలన భవనం మరమ్మతులు చేపట్టనున్నారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలో చేపడుతున్న పలు అభివృద్ధి, మరమ్మతు పనులను ఎస్పీ వకుల్ జిందల్ మంగళవారం పరిశీలించారు. అభివృద్ధి, మరమ్మతు పనులను నాణ్యంగా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు. మరమ్మతు పనుల పరిశీలనలో ఎస్పీ వెంట అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు, డీపీఓ ఏఓ పి.శ్రీనివాసరావు, ఎస్బీ సీఐలు ఏవీ లీలారావు, ఆర్వీఆర్కే చౌదరి, మహిళా పీఎస్ సీఐ ఈ.నర్సింహమూర్తి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఎన్.గోపాలనాయుడు, ఆర్ఎస్సై వర ప్రసాద్ పాల్గొన్నారు. -
జూడో రాష్ట్రస్థాయి పోటీలకు కేజీబీవీ విద్యార్థులు
నెల్లిమర్ల: పట్టణంలోని కేజీబీవీ విద్యార్థులు జూడో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.ఈ నెల 15, 16 తేదీల్లో జరగనున్న రాష్ట్రస్థాయి జూనియర్ జూడో పోటీలకు జిల్లా నుంచి మహిళల విభాగంలో ఈ పాఠశాలకు చెందిన జె కావ్య, పి పావని, పి జ్యోత్స్న రాణి, ఎస్.ఢిల్లీశ్వరి, కె భార్గవి, బి.దీపిక, సత్య, అనూష, జయలక్ష్మి ఎంపికై నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ ఉమ తెలిపారు. వారిని పీఈటీ రమణి, ఉపాధ్యాయినులు అభినందించారు.అంతర రాష్ట్ర ఫెన్సింగ్ క్రీడలకు విద్యార్థి ఎంపికవిజయనగరం అర్బన్: కేరళలో ఈ నెల 14 నుంచి 18వ తేదీ వరకు జరిగే ఫెన్సింగ్ క్రీడలో అంతర్ రాష్ట్ర పోటీలకు పట్టణానికి చెందిన సత్య డిగ్రీ/ పీజీ కళాశాల విద్యార్థి కె.పవన్కుమార్ ఎంపికయ్యాడు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవీసాయిదేవమణి మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.ఎంపికై న విద్యార్థిని కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం.శశిభూషణరావు, కళాశాల అధ్యాపకులు అభినందించారు. రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికనెల్లిమర్ల: నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి జరజాపుపేట ఉన్నత పాఠశాల విద్యార్థి మద్దిల మోహనకృష్ణ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ నెల 14వ తేదీ నుంచి కడప జిల్లాలో జరిగే ఉమ్మడి బాలబాలికల చాంపియన్ షిప్ పోటీల్లో జిల్లా జట్టు తరఫున పాల్గొంటాడు. మోహనకృష్ణను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రేవల్ల ఆదినారాయణ, వ్యాయామ ఉపాధ్యాయుడు నడిపేన సూర్యనారాయణ, ఉపాధ్యాయులు అభినందించారు. ఇంటి స్థలం కోసం తల్లి, సోదరుడిపై దాడివిజయనగరం క్రైమ్: విజయనగరం మండలంలోని ముడిదాంలో ఇంటి జాగా కోసం కన్నతల్లిపైనే దాడి చేశాడు ఓ మాజీ ఆర్మీ జవాన్. అలాగే అడ్డువచ్చిన అన్నపైన కూడా దాడికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించి రూరల్ ఎస్సై అశోక్ మంగళవారం రాత్రి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. ముడిదాంకు చెందిన మజ్జి పైడితల్లికి ఇద్దరు కొడుకులు. చాలా రోజుల నుంచి ఇంటి జాగాపై అన్న దమ్ముల మధ్య గొడవలు జరుగుతునే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఆ తగాదా తారస్థాయికి చేరడంతో చిన్నకొడుకు, మాజీ సైనికుడు మజ్జి శివ దుశ్చర్యకు దిగాడు. తనకు ఇంటి జాగా ఇవ్వడం లేదని తల్లి, అన్న కలిసి అన్యాయం చేశారంటూ తల్లి, సోదరుడిపైనే దాడికి దిగాడు. ఇంట్లో ఉన్న ఓ ఆయుధంతో దాడి చేశాడు. ఈ సమాచారం తెలుసుకున్న సమీప బంధువు రూరల్ పోలీసులకు సమాచారం ఇవ్వగా ఎస్సై అశోక్ హుటాహుటిన ఘటనా స్థలికి వెళ్లి వివరాలు సేకరించారు. గాయాలపాలైన అందరినీ విజయనగరం సర్వజన ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. అన్నపై దాడికి పాల్పడిన మాజీ ఆర్మీ జవాన్పై అన్న తాలూకా వారు దాడికి దిగడంతో శివ కూడా హాస్పిటల్ పాలయ్యాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ఎన్నికల సమస్యలపై చర్చకు ఈసీ ఆహ్వానం
చికెన్బ్రాయిలర్ లైవ్ డ్రెస్డ్ స్కిన్లెస్ శ్రీ98 శ్రీ166 176విజయనగరం అర్బన్: జిల్లా ఎన్నికల అధికారి, ఈఆర్ఓ, రాష్ట్ర సీఈఓ స్థాయిలో పరిష్కారం కాని ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సమస్యలు ఉంటే రాజకీయ పార్టీలతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆయా రాజకీయ పార్టీల అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని జాతీయ, రాష్ట్రస్థాయి పార్టీలకు లేఖలు రాసినట్లు ఎన్నికల సంఘం డైరెక్టర్ అనిల్ చందక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజకీయ పార్టీల నేతలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ముగ్గురి అరెస్టుసీతంపేట: గతంలో సారా విక్రయిస్తూ పరారైన ఇద్దరిని అరెస్టు చేసినట్టు ఎస్సై వై.అమ్మన్నాయుడు మంగళవారం తెలిపారు. మండలంలోని ఆనపకాయలగూడ గ్రామానికి చెందిన సిమ్మయ్య సారా విక్రయిస్తుండగా పరారయ్యాడని, ఇప్పుడు పట్టుకున్నామని తెలిపారు. అలాగే ఇటీవల నెల్లిగండి గ్రామానికి చెందిన కె.తేజేశ్వరరావు 30 లీటర్ల సారా విక్రయిస్తూ పరారవడంతో పట్టుకుని ఇద్దరినీ కోర్టులో హాజరుపర్చినట్లు చెప్పారు. దోనుబాయి పోలీస్స్టేషన్ పరిధిలో.. దోనుబాయి పోలీస్ స్టేషన్ పరిధిలో కోసంగి గ్రామంలో 20 లీటర్ల సారా పట్టుకున్నట్టు ఎస్సై అహ్మద్ తెలిపారు. ఈ కేసులో గౌరునాయుడిని అరెస్టుచేశామని చెప్పారు. -
గ్లకోమా వ్యాధిపట్ల అప్రమత్తంగా ఉండాలి
విజయనగరం ఫోర్ట్: గ్లకోమా(నీటికాసులు) వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి సూచించారు. ప్రపంచ గ్లకోమా వారోత్సవాల సందర్భంగా స్థానిక జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద జెండా ఊపి మంగళవారం ఆమె ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్లకోమా అనేది కళ్లకు సంబంధించిన వ్యాధి అని, కంటి డ్రైనేజీ నిర్మాణాలు సరిగా పనిచేయకపోవడం వల్ల కంటి లోపల పీడనం పెరిగి నరానికి హాని కలుగుతుందని తెలిపారు. గ్లకోమా ప్రారంభ దశలో ఎటువంటి లక్షణాలు ఉండకపోవచ్చునన్నారు. క్రమంగా చూపు కోల్పోవచ్చునని హెచ్చరించారు. గ్లకోమా బారిన పడిన చాలామందికి తమకు వ్యాధి ఉందని తెలియదన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ కె.రాణి, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ జీవనరాణి -
పైడితల్లీ పాహిమాం..!
రాజాం/రాజాం సిటీ: ఉత్తరాంధ్రుల ముత్తైదువుగా పేరొందని రాజాం పోలిపల్లి పైడితల్లి జాతర మంగళవారం వైభవంగా సాగింది. చివరి రోజు వేలాదిమంది భక్తులు అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. కొండంపేటకు చెందిన లంకలపల్లి కుటుంబీకులు ఘటాలు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించడంతో జాతర ముగిసింది. తొలిరోజు నుంచే వేల సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. పసుపుకుంకుమలు సమర్పించి కోళ్లు, చీరలు చూపించి మొక్కుబడులు చెల్లించారు. జాతరకు వచ్చే భక్తులకు పలు స్వచ్ఛంద సంస్థలు, వ్యాపారులు, దాతలు సేవలందించారు. తాగునీరు, మజ్జిగ, పులిహోర ప్రసాదాలను అందజేశారు. జాతర సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను అలరించాయి. చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు, రాజాం సీఐలు అశోక్కుమార్, ఉపేంద్ర, ఎస్ఐ జనార్దనరావు తమ సిబ్బందితో కలిసి గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. దేవదాయశాఖ ఈఓ మాధవరావుతో పాటు ఉన్నతాధికారులు, ఆలయ ధర్మకర్తలు, కమిటీ సభ్యులు జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. అట్టహాసంగా పోలిపల్లి పైడితల్లి జాతర చివరిరోజు వేలాదిగా తరలివచ్చిన భక్తులు భక్తుల సేవలో తరించిన స్వచ్ఛంద, వ్యాపార సంస్థలు -
విద్యార్థులకు ఇస్రో పిలుపు
● అంతరిక్షం.. స్పేస్ అప్లికేషన్పై అవగాహన ● 9వ తరగతి విద్యార్థులకు చక్కటి అవకాశం ● మార్చి 23 వరకు దరఖాస్తుల స్వీకరణపాలకొండ రూరల్: విద్యార్థి దశ నుంచి సైన్స్పై మక్కువ చూపుతూ..నూతన ఆవిష్కరణల పట్ల ఉత్సాహం చూపే విద్యార్థులను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రోత్సహిస్తోంది. యువిక (యుంగ్ సైంటిస్ట్)–2025 పేరిట ఉపగ్రహ ప్రయోగాలను తెలుసుకునేందుకు, శాస్త్రవేత్తలతో మాట్లాడేందుకు 9వ తరగతి విద్యార్థులకు అవకాశం కల్పిస్తోంది. లక్ష్యాలు.. ● భారత అంతరిక్ష పరిశోధనలను విద్యార్థులకు పరిచయం చేయడం ● విద్యార్థులను స్పేస్ టెక్నాలజీ వైపు ప్రోత్సహించడం ● అంతరిక్ష పరిశోధకులుగా వారిని సిద్ధం చేయడం దరఖాస్తు చేసే విధానం.. ఈ నెల 23వ తేదీలోగా విద్యార్థులు నాలుగు దశల్లో దరఖాస్తులను పూర్తి చేయాల్సి ఉంటుంది. వచ్చిన దరఖాస్తులను ఏప్రిల్ 7వ తేదీనాటికి వడపోసి ఎంపికై న విద్యార్తుల జాబితాలను విడుదల చేస్తారు. మే నెల 18 నుంచి విద్యార్థులను ఆహ్వానిస్తారు. 19 నుంచి 30వ తేదీ వరకూ యువికా–25 కార్యక్రమం చేపడతారు. మే 31న ముగింపు కార్యక్రమం జరుగతుంది. అదే రోజు ప్రతిభ కనపర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తారు. ఎంపికై న విద్యార్థులకు ప్రయాణ, భోజన, వసతి ఏర్పాట్లును ఇస్రో పూర్తి ఉచితంగా అందజేస్తుంది. ఎంపికై న విద్యార్థులను మే నెలలో 14 రోజులు ఇస్రోకు చెందిన స్పెస్ సెంటర్లకు తీసుకువెళ్తారు. అక్కడి వింతలు, విశేషాలు, సప్తగహ కూటమి తదితర అంశాలపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తారు.భావిశాస్త్ర వేత్తలకు ప్రోత్సాహం భావిశాస్త్రవేత్తలను ప్రోత్సహించేందుకు ఇస్రో చేపడుతున్న యువికా కార్యక్రామాన్ని అర్హతగల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. సంబంధిత పాఠశాలల సైన్స్ ఉపాధ్యాయులు పిల్లలకు సహకరించాలి. జిల్లా పరిధిలో డీవీఈఓలు, ఎంఈఓలు ఈ విషయంపై వారి పరిధిలో యంత్రాంగాన్ని చైతన్యపర్చాలి. పెద్ద సంఖ్యలో విద్యార్థులతో దరఖాస్తు చేయించాలి. – ఎన్.తిరుపతినాయుడు, జిల్లా విద్యాశాఖాధికారి, పార్వతీపురం మన్యం ఎవరు అర్హులు ● ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న 9వ తరగతి విద్యార్థులు ● ఆన్లైన్ పరీక్షలో ప్రతిభ కనపర్చిన విద్యార్ధులు ● 8వ తరగతిలో సాధించిన మార్కుల్లో 50 శాతం, మూడేళ్లలో పాఠశాల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహించిన సైన్స్ వైజ్ఞానిక ప్రదర్శనల్లో పాల్గొంటే వాటి ఆధారంగా 2 నుంచి 10 శాతం, ఆన్లైన్ క్విజ్ పోటీల్లో చూపించిన ప్రతిభకు 10 శాతం వెయిటేజీ అందిస్తారు. ఎన్సీసీ, స్కౌట్, గైడ్స్ విభాగాల్లో ఉంటే 5 శాతం, పల్లె ప్రాంతాలకు చెందినవారికి 15 శాతం ప్రాధాన్యం కల్పిస్తారు.జిల్లావ్యాప్తంగా సంసిద్ధం గతంలో నిర్వహించిన అనేక సైన్స్ ఎగ్జిబీషన్లు, పోటీ పరీక్షల్లో మన జిల్లా విద్యార్థులు సత్తాచాటి జాతీయ స్థాయిలో వారి ప్రదర్శనలతో అబ్బురపర్చారు. ఇదే స్ఫూర్తితో పెద్ద సంఖ్యలో అర్హత గత విద్యార్థులను సిద్ధం చేస్తున్నాం. ఇప్పటికే 40 వరకూ దరఖాస్తులను ఆన్లైన్లో రిజిస్టర్ చేశారు. ప్రస్తుత వేసవి సెలవుల్లో సమయం వృథా కాకుండా ఈ పర్యటనలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. – జి.లక్ష్మణరావు, జిల్లా సైన్స్ అధికారి, పార్వతీపురం మన్యం -
తల్లీ.. నీకు ఎంత కష్టమొచ్చింది..!
కన్నీటి రోదన శ్రావణి, సిద్ధులను ఒడ్డుకు చేర్చిన అనంతరం పోలీసులకు ఫోన్లో సమాచారం ఇస్తున్న యువకుడు జన్ని జగన్మోహన్(చిన్ని) వంగర: ఓ వైపు మానసిక స్థితి సరిగాలేక దూరంగా ఉంటున్న భర్త.. మరోవైపు పెద్దవారవుతున్న పిల్లల బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత.. అన్నింటికీ తల్లిదండ్రులపైనే ఆధారపడాల్సిన పరిస్థితులు.. ఆ తల్లిని మనోవేదనకు గురిచేశాయి. ఆర్థికంగా, మానసికంగా కుంగదీశాయి. నవమసాలు మోసి కనీపెంచిన పిల్లలను బలవంతంగా లాక్కొచ్చి కాలువలో దూకి ప్రాణాలు తీసుకునేంత స్థాయికి దిగజార్చాయి. ఓ యువకుడి సాహసంతో ఈ ప్రమాదంలో తల్లీ, కుమారుడు ప్రాణాలతో బయటపడగా.. కుమార్తె గల్లంతైన విషాదకర ఘటన వంగర మండలం మడ్డువలస కాలువ వద్ద మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వంగర మండలంలోని కింజంగి గ్రామానికి చెందిన గుంట తవుడు, కళావతిల రెండో కుమార్తె శ్రావణికి పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం గంగాడ గ్రామానికి చెందిన కళింగ సుధాకర్తో 11 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి సిద్ధు, సైనీ(7)లు పుట్టిన తరువాత భర్త సుధాకర్ మానసిక స్థితి సరిగా లేకపోవడంతో శ్రావణి కింజంగిలోని తల్లిదండ్రుల చెంతకు చేరింది. ఐదేళ్లుగా తల్లిదండ్రుల వద్దనే ఉంటూ పొందూరులోని ఓ నర్సింగ్ కళాశాలలో ఎనస్తీషియాలో డిప్లమా చేస్తోంది. కుమారుడు సిద్ధు రేగిడి మండలం ఉంగరాడమెట్ట వద్ద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులంలో ఐదో తరగతి, కుమార్తె సైనీ కింజంగి ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. మూడు రోజుల కిందట గరుగుబిల్లి మండలం బురదవెంకటాపురంలోని అక్క సంధ్య ఇంటికి పిల్లలతో కలిసి వెళ్లింది. కుమారుడుని ఉంగరాడమెట్ట వద్ద గురుకులానికి తీసుకెళ్తానని చెప్పి మంగళవారం తిరుగుప్రయాణమైంది. మార్గం మధ్యలో వంగర మండలంలోని మడ్డువలస కుడి ప్రధాన కాలువ వద్దకు మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో చేరుకుని పిల్లలతో కలిసి దూకేసింది. చేపల వేటకు అటువైపుగా వెళ్తున్న సంగాం గ్రామానికి చెందిన యువకుడు జన్ని జగన్మోహన్(చిన్ని) వారిని గమనించి హుటాహుటిన కాలువలోకి దూకి శ్రావణి, సిద్ధులను కాపాడి ఒడ్డుకు చేర్చాడు. బాలికను కాపాడే ప్రయత్నంలో మరోసారి శ్రావణి తనకుమారుడితో కలిసి దూకేయడంతో మళ్లీ ఒడ్డుకు చేర్చాడు. ఇంతలో బాలిక సైనీ నీటిలో కొట్టుకుపోయింది. స్థానికుల సమాచారంతో ఎస్ఐ షేక్శంకర్, వంగర తహసీల్దార్ దిరిశాల ధర్మరాజు, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మడ్డువలస ప్రాజెక్టు అధికారులకు సమాచారం ఇచ్చి కాలువ హెడ్స్లూయీస్ వద్ద గేట్లు మూసివేయించారు. గజఈతగాళ్లు, మత్స్యకారులతో గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి సమయం కావడంతో బాలిక ఆచూకీ లభించలేదు. బాలిక గల్లంతైనట్టు కేసు నమోదు చేశారు. భర్తకు దూరంగా ఉండడం, మానసిక, ఆర్థిక సమస్యలతో ఈ దారుణానికి ఒడిగట్టినట్టు ప్రాథమికంగా నిర్ధారించినట్టు ఎస్ఐ తెలిపారు. నవమాసాలు మోసి కనీపెంచిన ఇద్దరు పిల్లలతో కలిసి శ్రావణి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఘటనతో బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. మడ్డువలస కాలువ వద్దకు చేరుకుని తల్లీ నీకు ఏ కష్టమొచ్చింది.. ఇంత దారుణానికి ఒడిగట్టావంటూ కన్నీరుకార్చారు. మేమంతా నీకు ఉండగా... ఒంటరినని ఎలా భావిస్తావంటూ తల్లిదండ్రులు గుంట తవుడు, కళావతి, బంధువులు విలపించిన తీరు అక్కడివారిని కన్నీరుపెట్టించింది. ఒడ్డుకు సురక్షితంగా చేరి బిక్కుబిక్కుమంటున్న కుమారుడుని చూసి ప్రమాదం నుంచి బయటపడిన ఆ తల్లి సైతం నిశ్చేష్టురాలైంది. కుమార్తె గల్లంతుతో ఆమె మనసు శోకసంద్రమైంది. ఈ హృదయవిదారకర ఘటనతో మడ్డువలస కాలువ పరిసరాలు మౌనందాల్చాయి. -
డీకేటీ రైతులకు అన్యాయం..!
పార్వతీపురంటౌన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమం కోసం వివిధ పథకాలు అమలు చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చాయి. రైతులకు ఆ సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రస్తుతం వివిధ రకాల పద్ధతులను అవలంబిస్తున్నాయి. అయితే భవిష్యత్లో రైతులకు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్, పంటల యోజన బీమా, సబ్సిడీ పరికరాలు, పంట నష్టపరిహారం, ఎరువుల రాయితీ, కనీస మద్దతు ధర తదితర పథకాలను అందించేందుకు ప్రత్యేక కార్డులను అందించనున్నారు. ఇందుకోసం అర్హులైన ప్రతి రైతుకు ఆధార్కార్డు తరహాలో వ్యవసాయ శాఖ ద్వారా 14అంకెల యూఐడీ కేటాయిస్తున్నారు. అయితే ఇప్పటివరకు సొంత పట్టా భూములు ఉన్న రైతుల వివరాలు మాత్రం నమోదు చేసి ఒక యూనిక్ ఐడీని కేటాయిస్తున్నారు. కానీ డీకేటీ పట్టాలు ఉన్న రైతుల వివరాలు నమోదు చేయడం లేదు. ఇందుకు ఆన్లైన్లో అనుమతించడం లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో డీకేటీ రైతులు తమకు పథకాలు, నిధులు అందుతాయో లేదోనన్న ఆందోళనలో ఉన్నారు. కేవలం పట్టాదారులకే నమోదు చేస్తారా? జిల్లాలో గల 15 మండలాల్లో గడిచిన రెండు వారాలుగా అన్ని గ్రామాల్లో రైతులకు యూనిక్ ఐడీ నంబర్ కేటాయింపు కోసం వ్యవసాయ సిబ్బంది గ్రామాల్లో పర్యటిస్తున్నారు. రైతుల వద్దకు వెళ్లి వారి భూమి పాస్బుక్లు, ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ ద్వారా ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేసి యూనిక్ ఐడీ కేటాయిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని రైతుసేవా కేంద్రాల్లో కూడా నమోదు ప్రక్రియ జరుగుతోంది. కానీ డీకేటీ రైతులకు మాత్రం ఆన్లైన్లో నమోదు అవడం లేదంటూ చెప్పి పంపించేస్తున్నారు. కేవలం పట్టాదారులకే నమోదు చేస్తారా? అంటూ డీకేటీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో డీకేటీ రైతుల వివరాలు యూనిక్ ఐడీ కోసం డీకేటీ భూములున్న ఏ ఒక్క రైతుకు ఆన్లైన్లో వివరాలు నమోదు చేసేందుకు అనుమతి ఇవ్వడం లేదు. జిల్లాలో పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏల పరిధిలో 24,245 మంది రైతులు డీకేటీ పట్టాలు కలిగి ఉన్నారు. రెండు ఐటీడీఏల పరిధిలో 36,483 మంది రైతులు నమోదు కావాల్సి ఉంది. ఆ రైతులందరూ యూనిక్ ఐడీ కార్డులు మాకు ఇవ్వరా? కార్డు ద్వారా సంక్షేమ పథకాలు అందిస్తే మా పరిస్థితి ఏమిటి అంటూ అధికారులను ప్రశ్నిస్తున్నారు.అనుమతి వస్తే నమోదు చేస్తాం ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే, వెబ్సైట్లో ఆప్షన్ వచ్చిన వెంటనే డీకేటీ రైతుల వివరాలు నమోదు చేస్తాం. ప్రస్తుతం సొంత పట్టాదారులకు సంబంధించి యూనిక్ ఐడీలను అప్లోడ్ చేస్తున్నాం. త్వరలోనే అనుమతి వస్తుందని సమాచారం. త్వరలో వారివి కూడా యూనిక్ ఐడీల నమోదు ప్రక్రియ చేపడతాం. – రాబర్ట్పాల్, జిల్లా వ్యవసాయశాఖాధికారి, పార్వతీపురం మన్యం ఫార్మర్ రిజిస్ట్రేషన్లో సొంత పట్టాదారులకే నమోదు వారికే యూనిక్ ఐడీల కేటాయింపు డీకేటీ రైతులకు నమోదు అవదంటున్న అధికారులు ఆందోళనలో రైతులు -
దార్శనిక పత్రాల రూపకల్పనకు కసరత్తు
విజయనగరం అర్బన్: వికసిత్ భారత్–2047 లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్ర, జిల్లాల సత్వర అభివృద్ధి కోసం స్వర్ణాంధ్ర పేరుతో దార్శనికపత్రాలు రూపొందిస్తున్నట్టు కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. నియోజకవర్గాల వారీగా అభివృద్ధి సాధనకు దార్శనిక పత్రాలను రూపొందించాలని సంకల్పించామన్నారు. ఆయా నియోజకవర్గాల పరిధిలో అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకొని స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఆయా శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధుల సూచనలు, సలహాలతో నియోజకవర్గ అభివృద్ధికి అనుగుణంగా దార్శనిక పత్రాలను రూపొందించేందుకు కసరత్తు ప్రారంభించామన్నారు. జిల్లాలోని మంత్రులు, ఎంపీలు, శాసనసభ్యులు, మండలి సభ్యులు, జెడ్పీ చైర్మన్, కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధుల సూచనలు, సలహాలు స్వీకరించేందుకు ఈ నెల 15న కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10.30 గంటలకు సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. 15న సలహాలు, సూచనల స్వీకరణకు సమావేశం -
23న వయోజనులకు అక్షరాస్య అర్హత పరీక్ష
విజయనగరం అర్బన్: జిల్లాలో ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా శిక్షణ పొందిన వయోజనులకు అక్షరాస్య అర్హత పరీక్ష (ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ అసెస్మెంట్ టెస్ట్)ను ఈ నెల 23న జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తామని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. తన చాంబర్లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో పరీక్ష నిర్వహణపై జిల్లా అధికారులకు పలు సూచనలు చేశారు. ఉల్లాస్ కార్యక్రమంలో జిల్లాలో 48 వేల మంది అక్షరాస్యత కోర్సుపై శిక్షణ పొందారని, వీరి అర్హత పరీక్ష కోసం జిల్లా వ్యాప్తంగా 875 పాఠశాలల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశామన్నారు. పరీక్షను ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో నచ్చిన సమయంలో 3 గంటల పాటు నిర్వహించాలన్నారు. పరీక్షల నిర్వహణకు ఇన్విజిలేటర్లుగా అర్హత కలిగిన అంగన్వాడీ టీచర్లను నియమించాలని అధికారులకు సూచించారు. పరీక్షల పరిశీలకులుగా డీఆర్డీఏ ఏపీఎంలను నియమించాలన్నారు. వీరి పరీక్ష అనంతరం జవాబు పత్రాలు, రిజిస్ట్రేషన్ పత్రాలు, హాజరు పత్రాలు, మార్క్స్ అవార్డు సీట్లు నిర్దేశిత ప్రొఫార్మాలో ఎక్సెల్ షీట్లో అప్లోడ్ చేయాలని సూచించారు. సమావేశంలో వయోజన విద్య డీడీ అల్లు సోమేశ్వరరావు, ఐసీడీసీ ఇన్చార్జి పీడీ ప్రసన్న, డీఆర్డీఏ ఏపీడీ సావిత్రి, వయోజన విద్యాశాఖ ఏపీఓ ధనలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య నిర్వహణ -
పాముకాటుకు గురై ఫీల్డ్ అసిస్టెంట్ మృతి
రామభద్రపురం: మండలంలోని నాయుడువలసకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ పాము కాటుకు గురై చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటనపై కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ ఆర్నిపల్లి సత్యనారాయణ(36) గ్రామంలోని మామిడితోటలో ఉపాధి కూలీలు వారం రోజులుగా చేసిన ఉపాధి పనుల కొలతలు వేసేందుకు శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో వెళ్తుండగా తోటలో ఆకులు ఎక్కువగా ఉండడంతో ఆకుల కింద పాము ఉందన్న విషయం తెలుసుకోలేక కాలితో మట్టేశాడు. దీంతో ఆకుల కింద ఉన్న పాము కాటు వేయడంతో స్థానికులు మెరుగైన చికిత్స కోసం విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి 11 గంటల సమయంలో మృతిచెందాడు. మృతుని భార్య గత రెండేళ్ల క్రితం మృతి చెందింది. పెద్ద పాప జ్యోతి ఇంటర్మీడియట్ మొదటి ఏడాది పరీక్షలు రాస్తోంది. రెండవ పాన నిఖిత 7 వ తరగతి చదువుతోంది. తల్లిదండ్రులిద్దరూ చనిపోవడంతో పిల్లలిద్దరూ దిక్కులేని వారయ్యారు. -
15తో ముగియనున్న చెరకు క్రషింగ్
రేగిడి: మండలంలోని సంకిలి గ్రామం వద్ద ఉన్న ఈఐడీ ప్యారీ చక్కెర కర్మాగారంలో చెరకు క్రషింగ్ ఈ నెల 15తో ముగియనుందని యాజమాన్య ప్రతినిధులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024–25 సంవత్సరానికి 3.25లక్షల మెట్రిక్ టన్నుల చెరకు క్రషింగ్ చేసినట్టు పేర్కొన్నారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం ప్రాంతాల నుంచి మిగులు చెరకును ఈ నెల 15లోగా కర్మాగారానికి తరలించేందుకు రైతులు ముందుకు రావాలని కోరారు. చెరకు క్రషింగ్కు సహకరించిన రైతులు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధి హామీ పనుల పరిశీలన గజపతినగరం రూరల్/దత్తిరాజేరు: గజపతినగరం మండలంలోని పట్రువాడ, చిట్టేయవలస, దత్తిరాజేరు మండలంలోని ఇంగిలాపల్లి, గొభ్యాం గ్రామాల్లో జరుగుతున్న ఉపాధిహామీ పనులను ఎన్ఆర్ఈజీఎస్ డైరెక్టర్ షణ్ముక్ కుమార్ మంగళవారం పరిశీలించారు. ఫారం పాండ్లు, ఫిష్ పాండ్ల నిర్మాణంపై వేతనదారులకు పలు సూచనలిచ్చారు. వేతనదారులకు రోజుకు రూ.300 వేతనం తక్కువ కాకుండా పనులు కల్పించాలని ఫీల్డు అసిస్టెంట్లను ఆదేశించారు. ఉపాధిహామీ పనులతో సాగునీటి వనరులను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట కాలుష్య నింయత్రణాధికారి గోపీచంద్, డ్వామా పీడీ శారదాదేవి, అడిషనల్ కమిషనర్ శివప్రసాద్, ఎంపీడీఓలు కల్యాణి, రాజేంద్రప్రసాద్ ఏపీడీ రమామణి, ఏపీఓలు చప్పరామారావు, అప్పలనాయుడు ఉన్నారు. -
ఉద్యోగమూ లేదు.. భృతీ అందదు..
నా పేరు రెల్లి జగదీష్ కుమార్. బీటెక్ పూర్తిచేశాను. బొబ్బిలిలో నివసిస్తున్నాను. చంద్రబాబు ప్రభుత్వం యువత కోసం ఎంఎస్ఎంఈలను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. మరో పక్క ఉద్యోగాలని ఊదరగొట్టింది. నేటికి ఒక్క ఉద్యోగ అవకాశమూ కల్పించలేదు. నిరుద్యోగభృతి ఇవ్వడంలేదు. ఓటేసేవారిని మోసం చేశారు.. నా పేరు ఐ.స్వర్ణ. మాది పూసపాటిరేగ గ్రామం. నేను డిగ్రీ వరకు చదివాను. ఉపాధి అవకాశాలు లేకపోవడంతో కిరాణా షాపింగ్ మాల్లో పనిచేస్తున్నా ను. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది సమీపిస్తున్నా నిరుద్యోగులకు జాబ్క్యాలెండర్ రీలీజ్ చేయలేదు. ఏటా రిలీజ్ చేస్తామన్న జ్యాబ్ క్యాలెండర్ ఏమైనట్టు?. నిరుద్యోగ భృతి కింద 3 వేలు ఇస్తా మని ఎన్నికలలో హామీ ఇచ్చి నెరవేర్చకపోవడం విచారకరం. నమ్మి ఓటు వేస్తే మోసం చేశారు. ●బుద్ధి చెబుతాం.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు, ఉన్నత విద్యావంతులకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చి పదినెలలైనా నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడం దారుణం. నిరుద్యోగులను మోసం చేసిన ప్రభుత్వానికి బుద్ధిచెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. – ఇ.శంకర్, వంగర, దత్తిరాజేరు -
●పేదలకు మరింత భారం
ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడంతో తల్లిదండ్రులపై మరింత భారం పడుతోంది. ప్రభుత్వమే న్యాయం చేయాలి. పేదలు ఒక్కసారి డబ్బులు కట్టాలంటే కష్టమే. ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఫీజు మొత్తం ఒక్కసారి కట్టలేక విద్యార్థులంతా ఆందోళనకు గురవుతున్నారు. హాస్టల్ ఫీజుతోపాటు రీయింబర్స్మెంటు చెల్లించాలంటే తలకు మించిన భారమవుతోంది. ఫీజు విషయంలో ప్రభుత్వమే బాధ్యత వహించాలి. – సి.హెచ్.అజయ్, విద్యార్థి, విజయనగరం ●ఉద్యోగాలేవీ? ఎంఎస్ఎంఈ పరిశ్రమ స్థాపించి 5 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకొస్తామన్నారు. ఇంటికి ఒక పారిశ్రామిక వేత్తను తయారు చేస్తానన్నారు. ఇప్పుడు సర్వేల పేరుతో కాలయాపన చేస్తున్నారు. కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష కోసం ఎదురుచూస్తున్నాం. తక్షణమే పరీక్ష తేదీ ప్రకటించాలి. – సుంకర సత్యనారాయణ, నిరుద్యోగి, నరవ, విజయనగరం ●కర్ణాటకకు వెళ్లిపోతున్నాం కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఉద్యోగాలు ఇస్తారు... లేకుంటే కనీసం నిరుద్యో గ భృతి వస్తుందని, స్వయం ఉపాధి చూసుకుందామని అనుకున్నాను. డిగ్రీ పూర్తిచేసి ఖాళీగా ఉండలేక, కర్ణాటక రాష్ట్రంలో కంపెనీల్లో పనినిమిత్తం వెళ్తున్నాం. ఏటా పండగకు రావడం, ఒక నెల ఉండడం మళ్లీ వెళ్లడం చేస్తున్నాను. స్థానికంగా మంచి ఉపాధి అవకాశాలు ఉంటే బాగుండేది. అటువంటి కార్యక్రమాలకు ప్రభుత్వం ఆలోచన చేయడంలేదు. కనీసం నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడంలేదు. రాయితీ రుణాల ప్రసక్తే లేదు. నాలాంటి నిరుద్యోగ యువత చాలా ఇబ్బంది పడుతోంది. వలసల్లో బతుకును ఈడ్చుతున్నారు. – వావిలపల్లి నాగరాజు, చిన్నయ్యపేట, సంతకవిటి మండలం ●దగా చేస్తున్నారు కూటమి నేతలు అధికారంలోకి రావడానికి అడ్డగోలుగా అబద్ధాలు చెప్పారు. నిరుద్యోగ భృతి, ఏటా లక్షల ఉద్యోగాలు అంటూ ఊరించారు. తీరా మోసం చేశాం. – బి.రవితేజ, నిరుద్యోగి, ఎస్.కోట -
పోక్సోకేసులో నిందితుడికి 25 ఏళ్ల జైలు శిక్ష
విజయనగరం క్రైమ్: పోక్సో కేసులో ఓ నిందితుడికి 25 ఏళ్ల జైలు శిక్ష, రూ.10వేలు జరిమానా విధిస్తూ విజయనగరం పోక్సో ప్రత్యేక కోర్టు జడ్జి కె.నాగమణి తీర్పు ఇచ్చినట్టు ఎస్పీ వకుల్జిందల్ తెలిపారు. కేసు వివరాలను సోమవారం వెల్లడించారు. గతేడాది అక్టోబర్ 27 ఓ శుభకార్యంలో పాల్గొనేందుకు అనకాపల్లికి చెందిన ఓ కుటుంబం తమ మూడున్నరేళ్ల పాపతో హాజరయ్యారు. గంట్యాడ మండలం కొటారుబిల్లికి చెందిన విసినిగిరి రవి (31) బాలికను సమీపంలోని టింబర్ డిపో పక్కకు తీసుకెళ్లి లైంగిక దాడికి ప్రయత్నించాడు. బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై అదే రోజు విజయనగరం మహిళా పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఎన్.పద్మావతి పోక్సో కేసు నమోదుచేశారు. విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీస్ బృందం నిందితుడిని అదుపులోకి తీసుకుంది. అభియోగపత్రం కోర్టులో దాఖలు చేసి సాక్షులను సకాలంలో హాజరుపర్చింది. నేరం రుజువుకావడంతో శిక్ష పడింది. కేసులో చురుగ్గా పనిచేసిన పోలీస్ బృందాన్ని ఎస్పీ అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. మరుపల్లిలో సిరిమాను సంబరం గజపతినగరం మండలం మరుపల్లి గ్రామంలో సోమవారం నిర్వహించిన ఎల్లారమ్మ తల్లి సిరిమానోత్సవం సంబరంగా సాగింది. ఆలయ ప్రధాన పూజారి రుద్రాక్షల సత్యనారాయణ రూపంలో తిరువీధుల్లోకి వచ్చిన అమ్మవారిని చూసి భక్తులు పులకించిపోయారు. ఎల్లారమ్మా.. కాపాడాలమ్మా అంటూ ప్రార్థించారు. తల్లి ఆశీస్సులు అందుకున్నారు. సర్పంచ్ లెంక రామలక్ష్మి, గ్రామపెద్దల ఆధ్వర్యంలో సాగిన ఉత్సవంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు విధులు నిర్వహించారు. – గజపతినగరం రూరల్ మాకొద్దీ మద్యం షాపు సంతకవిటి మండలం వాసుదేవపట్నం పంచాయతీ పరిధిలోని పోతులజగ్గుపేట గ్రామంలో మద్యం షాపు ఏర్పాటును మహిళలు సోమవారం అడ్డుకున్నారు. గీత కార్మికుల ప్రత్యేక రిజర్వేషన్ కోటాలో ఎస్.కోట మండలానికి చెందిన జి.పావని సంతకవిటి మండలంలో వైన్షాప్ను దక్కించుకున్నారు. దీనిని పోతులజగ్గుపేటలో ఏర్పాటుకు పూనుకోవడంతో మహిళలు ఆందోళనకు దిగారు. మా గ్రామంలో మద్యం చిచ్చుపెట్టొద్దంటూ నినదించారు. సాయంత్రం వరకు దుకాణం వద్దనే బైఠాయించారు. ‘బాబూ’.. మా గ్రామంలోని 250 మంది ప్రశాంతంగా జీవిస్తున్నారని, మద్యం దుకాణం ఏర్పాటుచేసి కుటుంబాలను చిందరవందర చేయొద్దన్నారు. సర్పంచ్, గ్రామస్తుల సమ్మతిలేకుండా దుకాణం ఏర్పాటుచేయడం చట్టవిరుద్ధమని, అవసరమైతే చట్టపరంగా పోరాటం చేస్తామన్నారు. – సంతకవిటి -
ధారపర్తిని దగా చేసిందెవరు..?
శృంగవరపుకోట: అభంశుభం తెలియని గిరిజన తల్లుల గర్భశోకం..ఎవరి పాపం. తీవ్రమైన జ్వరాలు, వంటిపై దద్దుర్లుతో ఆస్పత్రి పాలైన చిన్నారుల తల్లుల శోకానికి, పాపానికి కారణం ఎవరన్న విషయమై వైద్యాధికారులు ఇంతవరకూ చెప్పలేదు. ఎస్.కోట మండలంలోని ధారపర్తి పంచాయతీ గిరిశిఖర గ్రామాల్లోని చిన్నారులు ఇటీవల తీవ్రజ్వరం, దద్దుర్లుతో ప్రాణాపాయ స్థితిలో స్థానిక ఏరియా ఆస్పత్రిలో చేరారు. ఏరియా ఆస్పత్రి వైద్యులు పరిస్థితిని చక్కదిద్దినా, డబ్ల్యూహెచ్ఓ సపోర్టింగ్ టీమ్ సభ్యుడు చెనగపాడు గ్రామంలో పర్యటించి ఇచ్చిన రిపోర్టుతో తీగలాగితే డొంక కదిలినట్లు, వైద్యసిబ్బంది కట్టు కథ బయటికొచ్చింది. పిల్లల్లో తట్టు, పొంగు వ్యాధుల నివారణకు ఇచ్చే ఎంఆర్ వ్యాక్సిన్ సకాలంలో ఇవ్వక పోవడం వల్లనే జ్వరాలు, దద్దుర్లు వచ్చాయని, ఇవి తట్టు లక్షణాలేనన్న నిజం బయటకు వచ్చింది. దీంతో గత వారం రోజులుగా వైద్యారోగ్యశాఖ అధికారులు, క్షేత్రసిబ్బంది కొండపైకి పరుగులు తీస్తూ, ఈ వ్యవహారం నుంచి బయట పడేందుకు మల్లగుల్లాలు పడుతున్నారు. ఎంసీపీ కార్డులు మాయం చేసి, ఎంఆర్ వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్లో భాగంగా కనిపించిన వారందరికీ వ్యాక్సిన్లు వేస్తున్నారు. ఇంతవరకూ వైరాలజీ ల్యాబ్ రిపోర్టులు ఏం చెప్పాయో తేల్చలేదు. దారపర్తి ఘటనపై విచారణకు ఆదేశించలేదు. దారపర్తిలో జ్వరాలకు కారకులైన క్షేత్రస్థాయి సిబ్బందిపై ఇంతవరకూ చర్యలు తీసుకోలేదు. ఇంతవరకూ 18మంది చిన్నారులు జ్వరం, దద్దుర్లతో ఎస్.కోట ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందారు. మరో 14మంది చిన్నారుల శాంపిల్స్ వైరాలజీ ల్యాబ్కు పంపారు. కాగా శాంపిల్ రిపోర్టులు బయట పెట్టలేదు. మరో 12మంది చిన్నారులు జ్వరాలు తదితర సమస్యలతో చికిత్స తీసుకున్నారు. చర్యల కోసం డిమాండ్ పిల్లలకు వ్యాక్సిన్ వేయకుండా వారి ప్రాణాలతో చెలగాటం అడుతున్న క్షేత్రస్థాయి వైద్యసిబ్బందిపై కలెక్టర్ తక్షణం చర్యలు తీసుకోవాలని ఏపీ గిరిజన సంఘ నేతలు డిమాండ్ చేశారు. అంతరించిందనుకున్న తట్టు వ్యాధి వైద్యసిబ్బంది నిర్లక్ష్యంతో తిరిగి పురుడు పోసుకోవడం ప్రభుత్వానికే సిగ్గు చేటని మండిపడ్డారు. గతంలో చిన్నారులు చనిపోతే కనీస విచారణ లేకుండా జిల్లా అధికారులు చేతులు తుడిచేసుకున్నారని ధ్వజమెత్తారు. వైద్యాధికారులు వదిలేసినా, తాము ఈ విషయాన్ని వదిలిపెట్టబోమన్నారు. ఈ వ్యవహారంలో జిల్లా అధికారుల నుంచి ఫీల్డ్స్టాఫ్ వరకూ అందరూ భాగస్వాములేనని మండిపడ్డారు. ల్యాబ్ రిపోర్టులు ఎక్కడ..? బాధ్యులపై చర్యలకు గిరిజన సంఘం డిమాండ్ -
నిరసన హోరు
అంగన్వాడీ ఉద్యోగులు.. ఆటో డ్రైవర్లు.. రైతులు.. విశ్వహిందూపరిషత్ ప్రతినిధుల ఆందోళనలతో కలెక్టరేట్ దద్దరిల్లింది. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరంటూ అంగన్వాడీలు నినదించారు. చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. మోసపూరిత గ్రాట్యుటీ ప్రకటనపై నిరసన తెలిపారు. ప్రైవేటు ఫిట్నెస్ సెంటర్ ఎత్తేయాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.15000 అందజేయాలని ఆటోడ్రైవర్లు ధర్నా చేశారు. హిందువులపై దాడులను అరికట్టాలని విశ్వహిందూపరిషత్ ప్రతినిధులు, నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో అన్యాయం చేయద్దంటూ రైతులు ఆందోళన చేశారు. కలెక్టర్కు సోమవారం వినతిపత్రాలు అందజేశారు. ఫిట్నెస్ కేంద్రాన్ని ఎత్తేయాలి విజయనగరం జిల్లా గుర్ల మండలం అచ్చుతాపురం వద్ద వేదాంత మల్టీ నేషనల్ కంపెనీ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రైవేటు ఫిట్నెస్ (బ్రేక్) సెంటర్ను తక్షణమే ఎత్తివేయాలని ఆల్ ఇండియా రోడ్డు ట్రాన్స్ఫోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్, విజయదుర్గ ఆటో వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం చేయాల్సిన పనులను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించడంపై ఆటోడ్రైవర్లతో కలిసి అచ్చుతాపురంతోపాటు, కలెక్టరేట్ వద్ద సోమవారం పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఫిట్నెస్, రెన్యు వల్, పొల్యూషన్, రిజిస్ట్రేషన్ వంటివి ఆర్డీఓ కార్యాలయంలోనే జరగాల న్నారు. బ్రేక్ చేయాలంటే రూ.3 వేల నుంచి రూ.4వేలు ఖర్చవుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. కుటుంబాన్ని పోషించే బతుకుబండి ఫొటోలను పోలీసులతో తీయించి ఫైన్లు వేయడం రాష్ట్ర ప్రభుత్వానికి తగదన్నారు. ఎన్నికల హామీ మేరకు తక్షణమే రూ.15000 ప్రతి డ్రైవర్ ఖాతాల్లో జమచేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) శ్రీనివాసమూర్తికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు కె.సురేష్, పాపారావు, రామునాయుడు, సత్యంకృష్ణ, అప్పలరాజు రెడ్డి, నారాయణరావు, దాలినాయుడు తదితరులు పాల్గొన్నారు. – విజయనగరం గంటస్తంభం/గుర్ల -
సమస్యల పరిష్కారంలో జాప్యం తగదు
● పీజీఆర్ఎస్కు 136 వినతులుపార్వతీపురంటౌన్: పీజీఆర్ఎస్ ద్వారా అందిన వినతులపై అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కారం ఉండాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ఆయన కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో 136 మంది అర్జీదారుల నుంచి వినతులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలు త్వరితగతిన పరిష్కారం కావాలని కోరారు. అర్జీదారుల విజ్ఞప్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పారదర్శకంగా విచారణ చేపట్టి అర్జీదారులను న్యాయం చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. దిగువస్థాయి అధికారులను పంపి మొక్కుబడిగా పరిష్కారం చేస్తే ఉపేక్షించమని హెచ్చరించారు. పీజీఆర్ఎస్లో అందిన వినతుల్లో కొన్ని.. ● పాచిపెంట మండలం కీరంగి నుంచి గ్రామ సర్పంచ్ లచ్చయ్య అర్జీని అందిస్తూ తమ మండల పరిధిలో చెక్డ్యామ్లు పాడైనందున వ్యవసాయానికి సాగునీరు అందడం లేదని చెక్డ్యాంలు మరమ్మతులు చేపట్టాలని కోరారు. ● పాలకొండ మండలం వాటపాగు నుంచి ఆర్.దుర్గాప్రసాదరావు దరఖాస్తులు అందిస్తూ తమ గ్రామంలో సర్వే నంబర్ 42–37లో తన వాటాగా సంక్రమించిన భూమిలోని ఐదు సెంట్లు జి. గౌరునాయుడు కబ్జా చేశారని తనకు న్యాయం చేయాలని కోరాడు. ● సాలూరు మండలం పెద్దవలస గ్రామానికి చెందిన కె.బంగార్రాజు తమ గ్రామంలో తన భూమి అన్యాక్రాంతమైందని, న్యాయం చేయాలని కోరాడు. ● జియ్యమ్మవలస మండలం చినమేరంగి గ్రామానికి చెందిన సాయిగీత వ్యవసాయ డిప్లమో చేసి ఖాళీగా ఉన్నానని తనకు ఉద్యోగం ఇప్పించాలని కోరింది. కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాత్సవ, ఇన్చార్జ్ జేసీ హేమలత, ఎస్డీసీ పి. ధర్మచంద్రారెడ్డి, జిల్లా వ్యవసాయశాఖాధికారి రాబర్ట్పాల్, పశుసంవర్ధకశాఖాధికారి మన్మథరావు, డ్వామాపీడీ కె.రామచంద్రరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సకాలంలో సమస్యల పరిష్కారానికి చర్యలు పార్వతీపురం రూరల్: సకాలంలో ఫిర్యాదు దారుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుని ప్రజలతో జవాబుదారీగా వ్యవహరించాలని పోలీస్ అధికారులను ఎస్పీ మాధవ్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి నిర్వహించారు. ఈ పరిష్కార వేదికకు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదు దారుల నుంచి అర్జీలను స్వీకరించి నేరుగా ఎస్పీ వారితో మాట్లాడుతూ సమస్యలను అడిగి తెలుసుకుని క్షుణ్ణంగా పరిశీలించారు. కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, తల్లిదండ్రుల వేదింపులు, భర్త/అత్తారింటి వేదింపులు, భూ–ఆస్తి వివాదాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీలు, ఆన్లైన్ మోసాలు, ప్రేమపేరుతో వంచన వంటి పలు సమస్యలపై ఫిర్యాదు దారులు ఎస్పీకి విన్నవించారు. వారి సమస్యలపై సంబంధిత పోలీసు అధికారులతో ఎస్పీ స్వయంగా ఫోన్లో మాట్లాడి ఫిర్యాదు అంశాలను పరిశీలించి వాటి పూర్వాపరాలపై విచారణ చేసి ఫిర్యాదులు వాస్తవాలు అయినట్లైతే చట్టపరమైన చర్యలు తక్షణమే చేపట్టాలని ఆదేశించారు. ఐటీడీఏ గ్రీవెన్స్ సెల్కు 61 వినతులు సీతంపేట: ఐటీడీఏ కార్యాలయంలో పీఓ సి.యశ్వంత్కుమార్ రెడ్డి సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 61 వినతులు వచ్చాయి. ఈతమానుగూడ గ్రామానికి చెందిన ఎస్.సింహాచలం వైద్యశాఖలో ఉద్యోగం ఇప్పించాలని కోరారు. ఎర్రకువ్వారి గ్రామానికి చెందిన త్రినాథ్ అడ్వెంచర్ పార్కులో షాపుపెట్టుకోవడానికి అనుమతి ఇప్పించాలని విన్నవించాడు. కుశిమి గ్రామస్తుడు నిమ్మక వరహాలు గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ గ్రామంలో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశాడు. డెప్పిగూడ గ్రామస్తురాలు నిమ్మక కల్యాణి కమ్యూనిటీ హెల్త్ వర్కర్ జాబ్ ఇప్పించాలని వినతిపత్రం అందజేసింది. కార్యక్రమంలో ఈఈ రమాదేవి, పీహెచ్వో ఎస్వీ గణేష్, డిప్యూటీ ఈవో ప్రసన్నకుమార్, పశుసంవర్థకశాఖ ఎ.డి శ్రీనివాసరావు, సీడీపీఓ రంగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
పార్వతీపుం మన్యం జిల్లా అంతటా గ్లకోమా సదస్సులు
ఈ వ్యాధి వచ్చినట్లు గుర్తించిన వెంటనే కంటి ఒత్తిడిని తగ్గించడమే దీనికి ప్రధాన చికిత్స. దీర్ఘకాలిక నియంత్రణ ఇచ్చే కంటి చుక్కల మందు, మాత్రల వాడకం చాలా ముఖ్యం. కొన్ని సందర్భాల్లో శస్త్ర చికిత్స కూడా చేయవలసి వస్తుంది. క్రమం తప్పకుండా నేత్ర పరీక్షలు చేయించుకోవాలి. గ్లకోమాను ముందుగా గుర్తిస్తే వైద్యం ద్వారా కళ్లను కాపాడుకోవచ్చు. జిల్లా అంతటా ప్రత్యేక గ్లకోమా అవగాహన సదస్సులు, ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తాం. – నగేష్ రెడ్డి, కంటి వెలుగు నేత్ర వైద్యాధికారి, పార్వతీపురం ● -
ఇంటర్మీడియట్ ‘ద్వితీయ’ పరీక్షకు 372మంది గైర్హాజరు
పార్వతీపురంటౌన్: పార్వతీపురం మన్యం జిల్లాలో సోమవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షకు 372మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీవీఈఓ మంజులవీణా తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా 34 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించామని 7,880 మందికి గాను 7508 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. అందులో జనరల్ సబ్జెక్టు జువాలజీ–2 పరీక్షకు 4954 మంది హాజరు కావాల్సి ఉండగా 4812 మంది విద్యార్థులు హాజరయ్యారని పేర్కొన్నారు. ఒకేషనల్–2 పరీక్షకు 2926మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 2696 మంది హాజరయ్యారని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘనలు కాని, మాస్కాపీయింగ్గాని జరగకుండా చర్యలు చేపట్టామన్నారు. ఫ్లయింగ్, సిటింగ్ స్క్వాడ్లు, బల్క్ మెంబర్లు పరీక్షలను పర్యవేక్షించారని, పరీక్షలు సీసీ కెమెరా లైవ్ స్ట్రీమింగ్ ప్రత్యేక పర్యవేక్షణలో నిర్వహించినట్లు వివరించారు. కరాటేలో రెండు గోల్డ్ మెడల్స్సీతంపేట: ఈనెల 9న విజయనగరంలోని రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన అంతర్ జిల్లా స్థాయి కరాటే పోటీల్లో సీతంపేట మండలంలోని అచ్చిబ గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు గోల్డ్మెడల్స్ సాధించారు. గ్రామానికి చెందిన కె.దీపక్, ఎన్.హర్షలు బంగారు పతకాలు సాధించడంతో గ్రామస్తులు వారిని సోమవారం అభినందించారు. కారును ఢీ కొన్న లారీ●● కారు డ్రైవర్ మృతి ● మరో ఇద్దరికి గాయాలు గరుగుబిల్లి: పార్వతీపురం–పాలకొండ ప్రధాన రహదారిలో సుంకి జంక్షన్ వద్ద పార్వతీపురం నుంచి గుమ్మలక్ష్మీపురం వెళ్తున్న కారును ఖడ్గవలస నుంచి పార్వతీపురం వెళ్తున్న కర్రలలోడ్తో ఉన్న లారీ బలంగా ఢీ కొట్టడంతో జరిగిన ప్రమాదంలో కారు ముందుబాగం నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో కారు డ్రైవర్ కుండింగి హరి ప్రసాద్ (29) కారులో తన సీటు, స్టీరింగ్ మధ్య ఇరుక్కోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే కారులో ఉన్న లవాల గౌరీశంకర్, బిడ్డిక శ్రీనులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ మేరకు 108కు సమాచారం అందించగా ఘటనా స్థలానికి హుటాహుటిన వచ్చి క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి చికిత్సకోసం తరలించింది. సమాచారం మేరకు ఎస్సై పి.రమేష్నాయుడు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుని కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. -
పీజీఆర్ఎస్కు పోటెత్తిన అర్జీదారులు
విజయనగరం అర్బన్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు అర్జీదారులు పోటెత్తారు. ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత పునఃప్రారంభించిన ఈ కార్యక్రమానికి అధికసంఖ్యలో వినతులు అందాయి. కలెక్టర్ డాక్టర బీఆర్అంబేడ్కర్, ఇన్చార్జ్ జేసీ ఎస్.శ్రీనివాసమూర్తి, కేఆర్ఆర్సీ ఎస్డీసీ మురళి వినతులను స్వీకరించగా ఈ వారం మొత్తం 231 అర్జీలు వచ్చాయి. తప్పుగా ఎండార్స్మెంట్ ఇస్తే క్రమశిక్షణ చర్యలు పీజీఆర్ఎస్లో ప్రజల నుంచి అందిన వినతులకు ఏ విధమైన పరిష్కారం చూపిస్తున్నదీ సంబంధిత అర్జీదారుకు ఆయా ప్రభుత్వ శాఖలు తప్పనిసరిగా తెలియజేయాల్సి ఉంటుందని కలెక్టర్ డాక్టర్ బీఆర్ డాక్టర్ అంబేడ్కర్ అధికారులకు స్పష్టం చేశారు. వినతుల పరిష్కారంలో తప్పుగా ఎండార్స్మెంట్ ఇచ్చి పరిష్కరించినట్లు పేర్కొంటే ఆయా అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. ఇప్పటికే తప్పుగా ఎండార్స్మెంట్ ఇచ్చిన 33 మంది అధికారులకు మెమోలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఎస్పీ గ్రీవెన్స్ సెల్కు 37 ఫిర్యాదులు విజయనగరం క్రైమ్: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 37 ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు ఎస్పీ వకుల్ జిందల్ బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. స్వీకరించిన ఫిర్యాదుల్లో భూతగాదాలకు సంబంధించి 11, కుటుంబ కలహాలకు సంబంధించి 3, మోసాలకు పాల్పడినట్లు 10, ఇతర అంశాలకు సంబంధించి 13 ఫిర్యాదులు ఉన్నాయి. సంబంధిత అధికారులు ఫిర్యాదు అంశాలను పరిశీలించి, వాటి పూర్వాపరాలను విచారణ చేసి, ఫిర్యాదు అంశాలు వాస్తవమైనట్లయితే చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని సంబంధిత పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎస్బీ సీఐలు ఏవీ లీలారావు, ఆర్వీఆర్కే చౌదరి, డీసీఆర్బీ ఎస్సై రాజేష్, సిబ్బంది కృష్ణ, షణ్ముఖ్ తదితరులు పాల్గొన్నారు. వినతులను స్వీకరించిన కలెక్టర్ అంబేద్కర్ -
ముందుచూపు తప్పనిసరి
● గ్లకోమాపై నిర్లక్ష్యం.. కంటి చూపుపై ప్రభావం ● వ్యాధి బారినపడకుండా జాగ్రత్తలు అవసరం ● వైద్యుల సూచనలు తప్పనిసరి. ● 40 ఏళ్లు దాటితే రెండేళ్ల కోసారి నేత్ర పరీక్షలు చేయించుకోవాలి. ● ఈ నెల 15వరకు గ్లకోమా వారోత్సవాలుగ్లకోమా నివారణకు చర్యలు.. ● గ్లకోమా వ్యాధి కుటుంబ చరిత్ర కలవారు ముప్పై సంవత్సరాల వయసు నుంచే సమగ్ర నేత్ర పరీక్షలు(దృష్టి పరీక్ష, కంటిలో ఒత్తిడి, ఫంగస్ ద్వారా రెటీనా పరీక్షలు, క్షేత్ర దృష్టి పరీక్షలు) చేయించుకోవాలి. ● 40 సంవత్సరాలు వయసు దాటిన తరువాత క్రమం తప్పకుండా రెండేళ్లకు ఒకసారి సమగ్రంగా నేత్ర పరీక్షలు చేయించుకోవాలి. ● వైద్యుల సలహా మేరకు మాత్రమే స్టెరాయిడ్ మందులు లేదా కంటి చుక్కల మందు వాడాలి. ● కంటి గాయాలను నిర్లక్ష్యం చేయకుండా నేత్ర నిపుణుల పర్యవేక్షణలో చికిత్స పొందాలి. ● గ్లకోమా వ్యాధి నిర్ధారణ జరిగినప్పుడు నేత్ర నిపుణుల సలహా, సూచనల ప్రకారం నేత్ర పరీక్షలు చేసుకోవడం, మందులు వాడడం చేయాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా శాశ్వత అంధత్వం వస్తుంది.రాజాం సిటీ/పార్వతీపురంటౌన్: సృష్టిలో ప్రకృతి అందాలను వీక్షించాలంటే కంటి చూపు తప్పనిసరి. జ్ఞానేంద్రియాలన్నింటిలోను కంటి చూపు చాలా ప్రాధాన్యం కలిగి ఉంటుంది. మనిషి పుట్టిన నాటి నుంచి మరణించేవరకు మంచి దృష్టితో జీవించాలని కోరుకుంటాడు. అయితే కంటి ఆరోగ్యం, కంటి దృష్టిపై అవగాహనలేక చాలా మంది అంధత్వం బారిన పడుతున్నారు. కంటి శుక్లాలు, కంటి వక్రీభవన దృష్టి లోపాలు, గ్లకోమా వంటివి అంధత్వానికి ప్రధాన కారణం. గ్లకోమాను నీటి కాసులుగా కూడా పిలుస్తారు. గ్లకోమా వ్యాధితో ఒక్కసారి దృష్టిని కోల్పోతే తిరిగి పొందలేము. 40 ఏళ్లు పైబడిన వారిలో 1.12 శాతం గ్లకోమా వ్యాధితో బాదపడుతున్నవారే అధికం. ఈ వ్యాధి మనకంటిలోని ఆప్టిక్ నాడికి నష్టం కలిగించడం ద్వారా దృష్టిని క్రమక్రమంగా క్షీణించేలా చేస్తుంది. గ్లకోమాలో సాధారణంగా ప్రారంభదశలో ఎటువంటి లక్షణాలు కనిపించవు. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా చాపకింద నీరులా ఈ వ్యాధి వ్యాప్తి చెంది శాశ్వత అంధత్వానికి దారితీస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా మార్చి 9 నుంచి 15 వరకు ప్రపంచ గ్లకోమా వారోత్సవాలు జిల్లా అంధత్వ నివారణ సంస్థ నిర్వహిస్తుంటుంది. ఈ ఏడాది ‘గ్లకోమా రహిత ప్రపంచం కోసం ఐక్యమవుదాం’ అనే నినాదంతో కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. తద్వారా ఈ వ్యాధి వల్ల సంక్రమించే అంధత్వాన్ని నివారించవచ్చు.● -
పరారీలో ఉన్న నిందితుడి అరెస్టు
శృంగవరపుకోట: గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితుడిగా ఉండి పోలీసులు కళ్లు గప్పి తిరుగుతున్న గంజాయి స్మగ్లర్ను సోమవారం ఉదయం అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్లు ఎస్.కోట సీఐ వి.నారాయణమూర్తి చెప్పారు. 2023లో హోండాసిటీ కారులో 60కిలోల గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన కేసులో అనంతగిరి మండలం, డుంబ్రి గూడ గ్రామానికి చెందిన కె.శ్యామ్ ప్రధాన నిందితుడన్నారు. గతంలో చాకచక్యంగా తప్పించుకుని పరా రై తిరుగుతున్న శ్యామ్ను సోమవారం తమకు అందిన సమాచారంతో నిఘా వేసి స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద అదుపులోకి తీసుకున్నట్లు సీఐ చెప్పారు. -
నేటి నుంచి వేంకటేశ్వరుని కల్యాణోత్సవం
డెంకాడ: చింతలవలస ఐదవ ఏపీఎస్పీ బెటాలియన్ వద్ద ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో వేంచేసి ఉన్న వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవానికి ఆలయ కమిటీ ఏర్పాట్లు పూర్తి చేసింది. స్వామివారి 41వ వార్షిక కల్యాణ మహోత్సవాలు ఈ నెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకూ శ్రీనివాసుని కల్యాణ ఉత్సవాలు జరుగుతాయని ఆలయ కమిటీ తెలిపింది. 9వ తేదీ ఉదయం నుంచి స్వామివారి కల్యాణ ఉత్సవ పూజలు ప్రారంభమై సాయంత్రం 4.30 గంటలకు శ్రీవారి తిరువీధి ఉత్సవం జరుగుతుందని వివరించారు. 10వ తేదీన సాయంత్రం 6.30 గంటలకు వేదపండితుల ఆధ్వర్యంలో శ్రీవారి కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. 11వ తేదీ సాయంత్రం 7 గంటలకు ఆలయ ప్రాంగణంలో ఉన్న కోనేరులో తెప్పోత్సవం కన్నుల పండువగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్న సమారాధన జరుగుతుందని కమిటీ తెలిపింది. భక్తులు పాల్గొని స్వామి ప్రసాదాన్ని స్వీకరించాలని వారు కోరారు. ఉత్సవంలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయన్నారు. ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ కమిటీ -
రాజీతోనే కేసుల పరిష్కారం
పార్వతీపురం టౌన్: రాజీతోనే ఎక్కువ శాతం కేసులు పరిష్కారం అవుతాయని రెండవ అదనపు జిల్లా జడ్జి ఎస్.దామోదరరావు అన్నారు. స్థానిక జిల్లా కోర్టుల సముదాయంలో శనివారం ఏర్పాటు చేసిన మెగా లోక్ అదాలత్తో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసులు పరిష్కారానికి ఇరువర్గాల సభ్యుల రాజీ ఎంతో అవసరమని తెలిపారు. వివాదాలు ఒకసారి ప్రారంభం అయితే జీవితాంతం కొనసాగుతాయని, వాటిని సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కక్షిదారులకు విజ్ఞప్తి చేశారు. సంవత్సరాల తరబడి కేసుల వెంట వెళ్లేకన్నా రాజీ మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు. న్యాయ స్థానాల్లో పెండింగ్లో వున్న కేసుల సంఖ్యను తగ్గించుకోవడానికి, వ్యాజ్యాలకు ముందు దశలోనే వివాదాలను పరిష్కరించడానికి న్యాయస్థానాలు లోక్ అదాలత్ను తీసుకువచ్చాయన్నారు. జిల్లాలో నిర్వహించిన లోక్ అదాలత్లో మోటార్ వెహికల్ యాక్సిడెంట్లు 6, దావాలు 22, ప్రోనోట్ దావాలు 7, టైటిల్ దావాలు 5, ఫైనల్ డిక్రిపిటిషన్ 1, ఎకై ్సజ్ కేసులు 5, చెక్కు బౌన్స్ కేసులు 5, కుటుంబ తగాదాలు 4, ఎస్టీసీ కేసులు 272, ప్రీ లిటిగేషన్ కేసులు 4, క్రిమినల్ కాంఫౌండ్ బుల్ కేసులు 53 పరస్పర అంగీకారంతో రాజీ చేయడం జరిగిందని తెలిపా రు. కార్యక్రమంలో అదనపు జ్యుడిషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ సౌమ్య జోిస్పిన్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్ఎస్ రావు, అదనపు పీపీ చంద్రకుమార్, న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు. -
పాపపశ్చాత్తాప పూజలు
బాడంగి మండలం కోడూరులోని కోడూరుమాత చర్చిలో క్రైస్తవులు పాపపశ్చాత్తాప పూజలను శనివారం నిర్వహించారు. ఏడు శనివారాలు శిలువ చెంతకు కార్యక్రమంలో భాగంగా తొలుత కోడూరు మాతను దర్శించుకున్నారు. కొవ్వొత్తులు వెలిగించి, టెంకాయలు కొట్టి ప్రార్థనలు చేశారు. మొక్కులు తీర్చుకున్నారు. పాపాపశ్చాత్తాప యాత్రలో పాల్గొన్నారు. ఫాదర్ యుగల్కుమార్ వినిపించిన క్రీస్తు సందేశాలు, బైబిల్ వాక్యాలను శ్రద్ధగా విన్నారు. – బాడంగి -
హెల్త్సిటీలో రక్త రుగ్మతల కేంద్రం ప్రారంభం
ఆరిలోవ: హెల్త్సిటీ యునిక్ ఆస్పత్రిలో మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో రక్త రుగ్మతుల కేంద్రం అందుబాటులోకి వచ్చింది. ఈ కేంద్రాన్ని హెమటాలజీ పితామహుడు డాక్టర్ మామ్మెన్ చాందీ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో సికిల్ సెల్, తలసేమియాతో బాధపడుతున్న వారు ఎక్కువగా ఉన్నారన్నారు. అలాంటి వారికి ఈ కేంద్రం ఉపయోగపడుతుందన్నారు. పేదలకు వైద్యం అందుబాటులో ఉండే విధంగా ఈ కేంద్రాన్ని నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ కేంద్రం విశాఖలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఊన్న మురళీకృష్ణను అభినందించారు. నిమ్స్ మెడికల్ ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ సదాశివుడు మాట్లాడుతూ విశాఖలో రక్త రుగ్మతుల కేంద్రం ఏర్పాటు చేయడం వల్ల ఆరోగ్య సంరక్షణలో కీలక ముందుడుగు పడిందన్నారు. దీర్ఘకాలిక వ్యాధులు ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయన్నారు. అలాంటి సమస్యల నివారణకు ఈ కేంద్రం అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. మేనేజింగ్ డైరెక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ ఏపీతోపాటు ఒడిశా, చత్తీస్గఢ్లలో ఎక్కడా రక్త వ్యాధులను సమగ్రంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా హెమటాలజీ కేంద్రం లేదన్నారు. ఈ లోటును భర్తీ చేయడానికి ఇక్కడ సమగ్ర రక్త రుగ్మతల కేంద్రం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పలువురు ఆంకాలజీ విభాగం వైద్యులు పాల్గొన్నారు. -
త్రుటిలో తప్పిన ప్రమాదం
పాలకొండ రూరల్: నిత్యం రద్ధీగా ఉండే స్థానిక ప్రధాన మార్కెట్కు ఆనుకుని ఉన్న జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రహరీ గోడ ఒక్కసారిగా నేలకొరిగింది. నెలలో రెండవ శనివారం పాఠశాలకు సెలవు కావటం, గోడకు మరోవైపు ఉన్న మార్కెట్లో ఆ సమయంలో ఎవ్వరూ లేకపోవటంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఉన్నట్లుండి పెద్ద శబ్ధంతో ఈ భారీ గోడ కూలటంతో చుట్టపక్కల వారు అక్కడి చేరుకుని పరిస్థితిని పాఠశాల యాజమాన్యానికి తెలియజేశారు. ఈ ఘటనతో ఎటువంటి సమస్య తలెత్తకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న పాఠశాల హెచ్ఎం బి.శ్రీదేవి శాఖాపరమైన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామన్నారు. -
క్రీడాకారులకు అభినందనలు
విజయనగరం: గత నెలలో మంగళగిరిలో జరిగిన 7వ పారా రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన జిల్లాకు చెందిన క్రీడాకారులను పలువురు ప్రజాప్రతినిధులు శనివారం అభినందించారు. నగరంలోని రాజీవ్ క్రీడామైదానం ప్రాంగణంలో గల జిల్లా క్రీడాప్రాధికార సంస్థ కార్యాలయంలో జరిగన కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అతిధి గజపతిరాజులు క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అతిధి గజపతిరాజు మాట్లాడుతూ.. ప్రతిభకు వైకల్యం అడ్డుకాదన్న విషయాన్ని పారా క్రీడాకారులు నిరూపిస్తున్నారని, ఇతర క్రీడాకారులకు ఏ మాత్రం తీసిపోని విధంగా మెడల్స్ సాధించడమే కాకుండా రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లాను రెండో స్థానంలో నిలపడం అభినందనీయమన్నారు. భవిష్యత్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. అనంతరం విజేతలకు మెడల్స్ వేసి, మెరిట్ సర్టిఫికెట్స్ అందజేశారు. కార్యక్రమంలో తూర్పుకాపు కార్పొరేషన్ చైర్పర్సన్ పాలవలస యశస్విని, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి వెంకటేశ్వరరావు, పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్, తదితరులు పాల్గొన్నారు. -
వేడుకలోనూ రాజకీయ వేషాలు!
అదేదో రాజకీయ పార్టీ కార్యక్రమం కాదు. అలాగని ఓ రాజకీయ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమం అసలే కాదు. ప్రభుత్వ కార్యాలయంలో మున్సిపల్, మెప్మా అధికారులు సంయుక్తంగా నిర్వహించిన మహిళా దినోత్సవంలో జనసేన పార్టీ కండువాలు వేసుకుని కొందరు మహిళా కార్యకర్తలు హల్చల్ చేశారు. వీరిని చూసిన మున్సిపల్ చైర్మన్ ఎస్వీ మురళీ కృష్ణారెడ్డి అవాక్కయ్యారు. కాసేపు పక్కకు తప్పుకున్నారు. కండువాలు తీయకుండానే మున్సిపల్ కమిషనర్ రామలక్ష్మిని మున్సిపల్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో సత్కరించడం గమనార్హం. విషయాన్ని తాపీగా తెలుసుకున్న మెప్మా టీపీఆర్వో జగన్మోహనరావు మహిళలు వేసుకున్న కండువాలను తీయించినట్టు సమాచారం. – బొబ్బిలి -
నేటి నుంచి వేంకటేశ్వరుని కల్యాణోత్సవం
డెంకాడ: చింతలవలస ఐదవ ఏపీఎస్పీ బెటాలియన్ వద్ద ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో వేంచేసి ఉన్న వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవానికి ఆలయ కమిటీ ఏర్పాట్లు పూర్తి చేసింది. స్వామివారి 41వ వార్షిక కల్యాణ మహోత్సవాలు ఈ నెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకూ శ్రీనివాసుని కల్యాణ ఉత్సవాలు జరుగుతాయని ఆలయ కమిటీ తెలిపింది. 9వ తేదీ ఉదయం నుంచి స్వామివారి కల్యాణ ఉత్సవ పూజలు ప్రారంభమై సాయంత్రం 4.30 గంటలకు శ్రీవారి తిరువీధి ఉత్సవం జరుగుతుందని వివరించారు. 10వ తేదీన సాయంత్రం 6.30 గంటలకు వేదపండితుల ఆధ్వర్యంలో శ్రీవారి కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. 11వ తేదీ సాయంత్రం 7 గంటలకు ఆలయ ప్రాంగణంలో ఉన్న కోనేరులో తెప్పోత్సవం కన్నుల పండువగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్న సమారాధన జరుగుతుందని కమిటీ తెలిపింది. భక్తులు పాల్గొని స్వామి ప్రసాదాన్ని స్వీకరించాలని వారు కోరారు. ఉత్సవంలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయన్నారు. ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ కమిటీ -
లోక్ అదాలత్లో..6,677 కేసుల పరిష్కారం
విజయనగరం లీగల్: ఉమ్మడి విజయనగరం జిల్లాలోని విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు, శృంగవరపుకోట, చీపురుపల్లి, గజపతినగరం, కొత్తవలస, కురుపాం కోర్టులలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లలో 6,677 కేసులు పరిష్కరించినట్టు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయికళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. రాజీయే రాజమార్గమని తెలిపారు. మోటారు ప్రమాద బీమా క్లైమ్లకు సంబంధించిన కేసులో రూ.70 లక్షల పరిహారాన్ని అందజేసినట్టు వెల్లడించారు. సుమారు రూ.35 కోట్ల ఆస్తులకు సంబంధించిన (విలువైన) కేసులు పరిష్కారమయ్యాయన్నారు. 10,500 మంది కక్షిదారులు ప్రయోజనం పొందినట్టు తెలిపారు. లోక్ అదాలత్లలో వివిధ కోర్టుల న్యాయమూర్తులు, జడ్జిలు బి.అప్పలస్వామి, ఎన్.పద్మావతి, కె.నాగమణి, టి.వి.రాజేష్కుమార్, బీహెచ్వీ లక్ష్మీకుమారి, ఎల్.దేవీరత్నకుమారి, బి.రమ్య, పి.బుజ్జి, ఎమ్.శ్రీనివాసరావు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎ.హరీష్ తదితరులు పాల్గొన్నారు. -
గడ్డి ట్రాక్టర్ను ఢీకొన్న గుర్తు తెలియని లారీ
కొత్తవలస : మండలంలోని అరకు – విశాఖ జాతీయ రహదారిలో నిమ్మలపాలెం జంక్షన్ సమీపంలో గల సూర్య ఐటీఐ వద్ద ముందు వెళ్తున్న గడ్డి ట్రాక్టర్ను వెనుక నుంచి గుర్తు తెలియని లారీ శనివారం ఢీకొట్టింది. ఎల్.కోట మండలం కళ్లేపల్లి నుంచి వరి గడ్డితో ట్రాక్టర్పై నుంచి కొత్తవలస వెళ్తుండగా వెనుక నుంచి అతి వేగంగా గుర్తు తెలియని లారీ వచ్చి ఢీకొట్టింది. దీంతో గడ్డి లోడుతో ఉన్న ట్రాక్టర్ బోల్తా పడింది. ట్రాక్టర్ డ్రైవర్ తెరుకునే లోపే లారీ అతివేగంగా తప్పించుకుపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. జేసీబీ సాయంతో గడ్డి ట్రాక్టర్ను రోడ్డు సేఫ్టీ పోలీస్లు దగ్గరుండి పక్కకు తొలిగించారు. గడ్డి ట్రాక్టర్ దగ్ధం గజపతినగరం రూరల్: మండలంలోని గంగచోళ్లపెంట గ్రామంలో శనివారం జరిగిన అగ్ని ప్రమాదంలో విద్యుత్ వైర్లుకు గడ్డి ట్రాక్టరు తగలడంతో దగ్ధమైంది. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కనకల సూర్యనారాయణకు చెందిన ట్రాక్టరులో ఎండు గడ్డిని ఎక్కించి తీసుకువెళ్తుండగా మార్గ మద్యలో ఉన్న విద్యుత్ వైర్లు తగలడంతో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు వ్యాపించి గడ్డితో పాటు ట్రాక్టరు పూర్తిగా కాలిపోయింది. ప్రమాద సంఘటన విషయాన్ని గజపతినగరం అగ్ని మాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో అగ్ని మాపక సిబ్బంది వాహనంతో వచ్చి మంటలను అదుపు చేశారు. అప్పటికే ట్రాక్టరు పూర్తిగా కాలి పోయింది. కుల దూషణపై అట్రాసిటీ కేసు బొండపల్లి: మండలంలోని కొత్తపాలెం సచివాలయం వెల్ఫేర్ సహాయకుడుగా పని చేస్తున్న ఉద్యోగిపై కుల దూషణ చేసినట్లు ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు నిర్వహించి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ యు.మహేష్ తెలిపారు. ఈ నెల 1న సామాజిక భద్రత పింఛన్లను పంపిణీ చేసేందుకు యడ్లపాలెం గ్రామానికి చెందిన వెల్ఫేర్ సహాయకుడు గొర్లె సతీష్కుమార్ వెళ్లాడు. మజ్జి అప్పయ్యమ్మ ఇంటికి పింఛన్ ఇచ్చేందుకు వెళ్లగా సెల్ సిగ్నల్స్ పని చేయకపోవడంతో పక్క ఇంటికి వెళ్లి పింఛన్ అందించడానికి వెళ్లాడు. ఈ క్రమంలో మా అమ్మకు పింఛన్ ఇవ్వకుండా పక్క ఇంటికి ఎందుకెళ్లావు? అని అప్పయ్యమ్మ కుమారుడు బంగారునాయుడు కులం పేరిట దూషించినట్టు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ డీఎస్పీ వీరాకుమార్ దర్యాప్తు నిర్వహించి కేసు నమోదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు పార్వతీపురం రూరల్: పార్వతీపురం పట్టణంలో గల ఎస్ఎన్పీ కాలనీకి చెందిన జె.సత్తిరాజు ఈ నెల 5వ తేదీన ఉదయం 6గంటలకు తన రోజువారీ పనుల నిమిత్తం బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో భార్య సౌజన్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేసినట్టు పట్టణ ఎస్ఐ గోవిందరావు శనివారం తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ చెప్పారు. గడ్డి మందు తాగి వ్యక్తి మృతి మక్కువ : మండలంలోని పాయకపాడు గ్రామానికి చెందిన సామంతుల స్వామినాయుడు (29) మనస్తాపంతో గడ్డి మందు తాగి, వైద్య చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్వామినాయుడు ఈ నెల 6వ తేదీన ఉదయం ఇంటి వద్ద గడ్డి మందు తాగడంతో స్థానికులు గమనించి మక్కువలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రధమ చికిత్స చేసి మెరుగైన వైద్యం నిమిత్తం విజయనగరం మహారాజ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. గత కొంతకాలంగా ఏ పని చేయకుండా ఖాళీగా ఉండడంతో కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన స్వామినాయుడు గడ్డి మందు తాగాడు. మృతుడికి వివాహమై ఏడాదైంది. భార్య శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్ఐ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. -
రాజీతోనే కేసుల పరిష్కారం
పార్వతీపురం టౌన్: రాజీతోనే ఎక్కువ శాతం కేసులు పరిష్కారం అవుతాయని రెండవ అదనపు జిల్లా జడ్జి ఎస్.దామోదరరావు అన్నారు. స్థానిక జిల్లా కోర్టుల సముదాయంలో శనివారం ఏర్పాటు చేసిన మెగా లోక్ అదాలత్తో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసులు పరిష్కారానికి ఇరువర్గాల సభ్యుల రాజీ ఎంతో అవసరమని తెలిపారు. వివాదాలు ఒకసారి ప్రారంభం అయితే జీవితాంతం కొనసాగుతాయని, వాటిని సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కక్షిదారులకు విజ్ఞప్తి చేశారు. సంవత్సరాల తరబడి కేసుల వెంట వెళ్లేకన్నా రాజీ మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు. న్యాయ స్థానాల్లో పెండింగ్లో వున్న కేసుల సంఖ్యను తగ్గించుకోవడానికి, వ్యాజ్యాలకు ముందు దశలోనే వివాదాలను పరిష్కరించడానికి న్యాయస్థానాలు లోక్ అదాలత్ను తీసుకువచ్చాయన్నారు. జిల్లాలో నిర్వహించిన లోక్ అదాలత్లో మోటార్ వెహికల్ యాక్సిడెంట్లు 6, దావాలు 22, ప్రోనోట్ దావాలు 7, టైటిల్ దావాలు 5, ఫైనల్ డిక్రిపిటిషన్ 1, ఎకై ్సజ్ కేసులు 5, చెక్కు బౌన్స్ కేసులు 5, కుటుంబ తగాదాలు 4, ఎస్టీసీ కేసులు 272, ప్రీ లిటిగేషన్ కేసులు 4, క్రిమినల్ కాంఫౌండ్ బుల్ కేసులు 53 పరస్పర అంగీకారంతో రాజీ చేయడం జరిగిందని తెలిపా రు. కార్యక్రమంలో అదనపు జ్యుడిషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ సౌమ్య జోిస్పిన్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్ఎస్ రావు, అదనపు పీపీ చంద్రకుమార్, న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు. -
ఎన్డీఏకు ఎంపికై న విద్యార్థులకు సత్కారం
విజయనగరం రూరల్: కోరుకొండ సైనిక పాఠశాలలో విద్యనభ్యసించి, సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (ఎస్ఎస్బీ) నిర్వహించిన ఎంపిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి, జాతీయ రక్షణ అకాడమీ (ఎన్డీఏ)లో చేరనున్న 8 మంది విద్యార్థులను కోరుకొండ సైనిక పాఠశాలలో శనివారం ఘనంగా సత్కరించారు. పాఠశాల ప్రిన్సిపాల్, గ్రూప్ కెప్టెన్ ఎస్ఎస్ శాస్త్రి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మాట్లాడుతూ 63 ఏళ్ల పాఠశాల చరిత్రలో దేశానికి 744 మందికి పైగా రక్షణ అధికారులను అందించిన ఘనత కోరుకొండ సైనిక పాఠశాల సాధించడం గర్వకారణమని అన్నారు. దేశ రక్షణ రంగంలో ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ విభాగాల్లో అనేక మంది పాఠశాల పూర్వ విద్యార్థులు వివిధ హోదాల్లో సేవలు అందించారని, ప్రస్తుతం అందిస్తున్నారని అన్నారు. ఎన్డీఏ, ఐఎన్ఏలో చేరడమే లక్ష్యంగా పాఠశాలలో శిక్షణ అందించడం జరుగుతుందన్నారు. సీనియర్లను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు అనుకున్న లక్ష్యాలను సాధించాలని కోరారు. విద్యార్థుల విజయాల్లో భాగమైన అధికారులు, ఉపాధ్యాయ సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఎన్డీఏకు ఎంపికై న విద్యార్థులు శిరీష్ శాస్త్రి, వర్షిత్ వర్థన్, వై.తేజేశ్వర్, చల్ల కృష్ణకుమార్, రూపేశ్ రోణంకి, ఎం.రోహిత్కుమార్, ఎస్.గీత్పవన్, కె.భార్గవ్లను సత్కరించి అభినందించి జ్ఞాపికలను అందించారు. కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపాల్, వింగ్ కమాండర్ కిరణ్ వి.పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు ఎన్.రామకృష్ణ, అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. -
మన్యం సహజ రైతు ఉత్పత్తిదారుల కంపెనీకి జాతీయ అవార్డు
సీతంపేట: మన్యం సహజ రైతు ఉత్పత్తిదారుల కంపెనీకి జాతీయ స్థాయి అవార్డు లభించింది. ఈ మేరకు అవార్డును కేరళ రాష్ట్రంలోని త్రిశూర్లో శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆర్బీఐ ప్రతినిధి సతీష్ కె.మల్హోత్ర, ఈఎస్ఏఎఫ్ ఫౌండర్ పాల్ జోషెఫ్ చేతుల మీదుగా రూ.లక్ష నగదు బహుమతి, ప్రశంసా పత్రాన్ని ఆర్ట్స్ డైరెక్టర్ నూక సన్యాసిరావు, మన్యం సహజ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ సీఈఓ బెండి శంకరరావు అందుకున్నారు. ఆర్ట్స్ నేతృత్వంలో మన్యంలోని గిరిజన రైతులు సహజ ఉత్పత్తులను సాగు చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. తాజాగా జాతీయ స్థాయిలో ఈ అవార్డు రావడం పట్ల పలువురు అభినందించారు. -
ప్రజలకు అత్యుత్తమ సేవలందించాలి : ఎస్పీ
పార్వతీపురం రూరల్: అనంతపురం పోలీసు శిక్షణ కళాశాలలో శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం గుంటూరు, కర్నూల్ రేంజ్కు సంబంధించిన 35మంది ప్రొబేషనరీ ఎస్ఐలను ప్రాక్టికల్ శిక్షణ నిమిత్తం పార్వతీపురం మన్యం జిల్లాకు కేటాయించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు శాఖ కార్యాలయంలో శిక్షణ నిమిత్తం వచ్చిన ఎస్ఐలు ఎస్పీ మాధవ్రెడ్డిని మర్యాదపూర్వకంగా శనివారం కలిశారు. ఈ నేపథ్యంలో ఎస్పీ వారితో మాట్లాడుతూ ప్రజలకు పోలీసు శాఖ ద్వారా అత్యుత్తమ సేవలందించాలన్నారు. విధి నిర్వహణలో నిర్భయంగా, నిష్పక్షపాతంగా, క్రమ శిక్షణ, నిజాయితీ, పారదర్శకత, జవాబుదారీతనంగా సేవలందించాలన్నారు. ప్రతీ ఒక్కరు ఈ శిక్షణలో టెక్నాలజీని ఉపయోగించి ఉత్తమ ఫలితాలను రాబట్టి పోలీసు శాఖ ప్రజలకు మరింత సేవలందించేలా చూడాలని సూచించారు. ఫిర్యాదుదారులతో మృదు స్వభావంతో మెలగాలన్నారు. ఎఫ్ఐఆర్ దర్యాప్తుకు సంబంధించిన రికార్డులు రాయడం గురించి క్షుణ్ణంగా తెలుసుకొని, కేసులను ఏ విధంగా ఛేదించాలి, సీసీటీఎన్ఎస్, డ్రోన్స్ను ఉపయోగించడం, పెట్రోలింగ్, సీసీ కెమెరాలను ఉపయోగించు విధానం, పహారా బీట్ గురించి ఎన్డీపీఎస్ కేసులలో చేయాల్సిన విధులు, కేసు డైరీ రాయడం, నేర స్థల పరిశీలన, పోలీసు బందోబస్తు ఏ విధంగా నిర్వహించాలో క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఏ విధమైన అనుమానాలు వ్యక్తమైనా సీనియర్ అధికారులను అడిగి తెలుసుకొని నివృత్తి చేసుకోవాలని ఎస్పీ సూచించారు. ఈ సందర్భంగా వారికి క్షేత్ర స్థాయిలో నిర్వహించాల్సిన విధులపై అవగాహన కల్పించేందుకు జిల్లాలో ఉన్న పలు పోలీసుస్టేషన్లకు కేటాయించారు. -
నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం
స్కాట్లాండ్లో జరిగిన కామన్వెల్త్ పోటీల్లో మత్స సంతోషి(ఫైల్) ఆడపిల్ల అంటే.. ‘ఆడే’ ఉండిపోవాలా..? ఫలానా పనికే పరిమితం కావాలా..? కట్టుబాట్ల బందిఖానాలో బందీ అయిపోవాలా..? ఎవరన్నారు.. సృష్టికి మూలం, అవనిలో సగం.. ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం.. ఇలా ‘ఆమె’ కోసం ఎన్ని చెప్పినా, ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ రంగం.. ఈ రంగమన్న తేడా లేదు. పురుషులు చేసే ప్రతి పనినీ సమర్థంగా చేయగలిగే స్థాయికి చేరుకుంది నేటి ఆధునిక మహిళ. ‘సమానత్వమన్న’ పదానికి అర్థం చెబుతోంది. తన శక్తి అపరిమితం.. తన సహనం, తెగువ అనితర సాధ్యం. మధ్యమధ్యలో ఎక్కడో రాబందులు.. తన ఉనికికి అడ్డొస్తున్నా, తన భవితను చిదిమేస్తున్నా.. వెరవక, వెనకడుగు వేయక.. ధైర్యంగా ముందడుగు వేస్తోంది.. నేటి మన ధైర్య లక్ష్మి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కొంతమంది వనితల విజయగాథలు, వివిధ రంగాల పురోగతిలో వెన్నెముఖగా నిలుస్తున్న మహిళల ప్రస్థానానికి ‘సాక్షి’ అక్షర రూపం. – విజయనగరం ఫోర్ట్/నెల్లిమర్ల రూరల్ ● కుటుంబానికి అండగా.. నా పేరు సూరాడ కొర్లమ్మ. మాది తీరప్రాంతమైన చింతపల్లి గ్రామం. సముద్రంలో భర్త రాములు, కుటుంబ సభ్యులు వేటసాగించి తీరానికి చేర్చిన చేపలను గ్రామాల్లో విక్రయిస్తాను. కుటుంబ జీవనోపాధికి అండగా నిలుస్తున్నా. కుటుంబంలో ఎటువంటి ఆపద వచ్చినా తట్టుకొనే శక్తి ఉంది. అనుకుంటే సాధించగలం నాన్న జ్యూట్మిల్లు కార్మికుడు. అమ్మది కూలిపని. నాతో పాటు ఇద్దరు అక్కలు, అన్నయ్యను సాకేందుకు ఆర్థిక ఇబ్బందులు పడేవారు. అప్పుడప్పుడు మేము కూడా కూలి పనులకు వెళ్లేవారం. ఇంట్లో పేదరికాన్ని చూశాను. గ్రామంలో నా స్నేహితులు క్రీడల్లో శిక్షణకు వెళ్తుంటే చూస్తూ ఉండేదాన్ని. క్రీడల్లో ప్రావీణ్యాన్ని సంపాదిస్తే ఉన్నత స్థాయికి చేరవచ్చన్న ఉపాధ్యాయుల మాటతో కొండవెలగాడలోనే తొలుత వెయిట్ లిఫ్టింగ్లో శిక్షణ పొందాను. మొదటి ప్రయత్నంలోనే జిల్లా స్థాయి పోటీల్లో బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నాను. గ్రామీణ జాతీయ పోటీల్లో సత్తా చాటాను. అప్పటి నుంచి నాలో కసి పెరిగినా ఆర్థిక స్థోమత లేని కారణంగా నిరాశ చెందేదాన్ని. ఓ సారి మణిపూర్లో జాతీయస్థాయి పోటీలకు వెళ్లేందుకు రూ.5వేలు అవసరమయ్యాయి. డబ్బులు లేక అవకాశాన్ని వదులుకుంటున్నా అని దిగులు చెందుతుండగా మా పెద్ద అక్క రాజీ తన చెవిదిద్దులను అమ్మేసి నన్ను పోటీలకు పంపించారు. ఎలాగైనా పోయిన బంగారాన్ని సాధించాలనుకున్నా... అనుకున్నట్లే బంగారు పతకంతో తిరిగొచ్చా. ఇప్పటివరుకు దక్షిణాఫ్రికా, థాయ్లాండ్, మలేసియా, సింగపూర్, చైనా దేశాల్లోని వేదికలపై బహుమతులు సాధించాను. కామన్వెల్త్లో వచ్చిన కాంస్యంతో పాటు 16 అంతర్జాతీయ పతకాలొచ్చాయి. క్రీడాకోటాలో రైల్వేలో టీటీగా ఉద్యోగం వచ్చింది. మహిళలు తలచుకుంటే ఏదైనా సాధించవచ్చు. ప్రయత్నంతో ముందుకు సాగాలి. – మత్స సంతోషి, అంతర్జాతీయ వెయిట్లిఫ్టిర్, కొండవెలగాడ గ్రామం వేటకు వెన్నెముకగా... విజయనగరం జిల్లాలోని పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లో సుమారు 27 కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతం విస్తరించి ఉంది. 21వేల (ప్రత్యక్షంగా ఆరువేలు, పరోక్షంగా 15 వేలు) మంది మత్స్యకారులకు చేపల వేటే జీవనాధారం. మగవారు సముద్రంలో చేపలు వేటాడి తీరానికి చేర్చగా... వాటిని విక్రయించే బాధ్యతను మత్స్యకార మహిళలు భుజానకెత్తుకుంటారు. సుమారు 540 మంది మహిళలు చేపల అమ్మకంతో కుటుంబానికి, వేటకు వెన్నెముకగా నిలుస్తున్నారు. – పూసపాటిరేగ -
నేడే జాతీయ లోక్ అదాలత్
విజయనగరం లీగల్: జాతీయ న్యాయ సేవ అధికార సంస్థ న్యూఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశాలతో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కల్యాణ్ చక్రవర్తి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా 21 లోక్ అదాలత్ బెంచీలను ఏర్పాటు చేశామని తెలిపారు. రాజీ పడదగిన క్రిమినల్ కేసులను, మోటార్ ప్రమాద బీమా కేసులు, బ్యాంకు కేసులు, చెక్కుబౌన్స్ కేసులు, మనీ కేసులు, ప్రాంసరీ నోట్ కేసులు, ఎలక్ట్రిసిటీ కేసులు, ఎకై ్సజ్ కేసులు, ల్యాండ్ కేసులు, కుటుంబ తగాదాలు వాటర్ కేసులు, మున్సిపాలిటీ కేసులు, ప్రి లిటిగేషన్ కేసులు, ఇరుపార్టీల అనుమతితో రాజీ మార్గంలో శాశ్వత పరిస్కారం చేసుకోవచ్చునన్నారు. కక్షిదారులు, ప్రజలు శనివారం జరగనున్న జాతీయ లోక్అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. -
3.25 లక్షల మెట్రిక్ టన్నుల చెరకు క్రషింగ్
రేగిడి: మండలంలోని సంకిలి వద్ద ఉన్న ఈఐడీ చక్కెర కర్మాగారంలో 3.25 లక్షల మెట్రిక్ టన్నుల చెరకు క్రషింగ్ పూర్తయినట్టు కర్మాగారం జనరల్ మేనేజర్ వెంకటసూర్యనారాయణ తెలిపారు. స్థానిక విలేకరులతో ఆయన శుక్రవారం మాట్లాడారు. విజయనగరంతో పాటు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల నుంచి చెరకును కర్మాగారానికి తరలించామన్నారు. చెరకు తరలించిన వారంరోజుల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమచేస్తున్నట్లు వివరించారు. చిన్నారులకు వ్యాక్సినేషన్ శృంగవరపుకోట: మండలంలోని ధారపర్తి పంచాయతీలో జ్వరాలు, వంటిపై దద్దుర్లతో గత కొద్ది రోజులుగా చిన్నారులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఇటీవల డబ్ల్యూహెచ్ఓ సపోర్టింగ్ టీమ్ సభ్యుడు పంచాయతీ పరిధిలోని చెలకపాడు గ్రామానికి వచ్చి జ్వరాలతో బాధపడుతున్న చిన్నారులను పరీక్షించి వెళ్లారు. పిల్లలకు సకాలంలో వ్యాధినిరోధక టీకాలు వేయకపోవడమే కారణమని ప్రాథమికంగా నిర్ధారించడంతో వైద్యారోగ్యశాఖ సిబ్బంది దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. గిరిజన గూడలకు చేరుకుని పిల్లలకు శుక్రవారం వ్యాక్సిన్లు వేశారు. వాస్తవంగా ప్రతి శనివారం, బుధవారం వ్యాక్సిన్లు వేయాలి. జ్వరాల తాకిడి, దద్దుర్ల వ్యాప్తి అధికం కావడంతో వ్యాక్సినేషన్ డే నిర్వహించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ జీవనరాణి బొడ్డపాడు, శెనగపాడు, పల్లపుదుంగాడ గ్రామాల్లో వ్యాక్సినేషన్ తీరును పరిశీలించారు. డీఐఓ ఆర్.అచ్యుతమణి మరికొన్ని గ్రామాలను సందర్శించారు. జ్వరాల వ్యాప్తిపై ఆరా తీశారు. సారా నిర్మూలనకు ‘నవోదయం 2.0 విజయనగరం క్రైమ్: సారా నిర్మూలనకు ‘నవోదయం 2.0’ కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఉమ్మడి విజయనగరం జిల్లా ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ పైడి రామచంద్రరావు తెలిపారు. విజయనగరం ప్రదీప్నగరలోని ఎకై ్సజ్శాఖ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయనగరం జిల్లాలో 26, పార్వతీపురం మన్యం జిల్లాలో 137 గ్రామాలను సారా ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించామన్నారు. ఒక్కో ఎక్సైజ్ అధికారికి రెండు నుంచి మూడు గ్రామాలు దత్తత ఇచ్చి ఆయా గ్రామాల్లో సారా నిర్మూలనకు కృషిచేస్తామని చెప్పారు. దీనికోసం సర్పంచ్, వీఆర్వో, పంచాయతీ సెక్రటరీ, స్థానిక ఎకై ్సజ్ అధికారి, మహిళా సంఘాల సభ్యులతో గ్రామ కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. మండల స్థాయి కమిటీలో తహసీల్దార్, ఎంపీడీఓ, ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్, ఎస్ఐ, ఎఫ్ఆర్ఓ, జిల్లా స్థాయి కమిటీలో కలెక్టర్, ఎస్పీ, జిల్లా ఎకై ్సజ్ అధికారి, అటవీ అధికారి ఉంటారని చెప్పారు. వ్యవస్థీకృత నేరాలకు పాల్పడిన వారిపై పీడీ యాక్ట్ అమలుచేస్తామని హెచ్చరించారు. గతేడాది అక్టోబర్ నుంచి విజయనగరం, పార్వతీపురం(మన్యం) జిల్లాల్లో 360 కేసులు నమోదుచేసి 210 మందిని అరెస్టు చేశామన్నారు. సారా తయారు చేసినా, నిల్వ ఉంచినా, రవాణా చేసినా, విక్రయించినా టోల్ ఫ్రీ నంబర్ 14405కి, విజయనగరం కంట్రోల్ రూమ్నంబర్ 08922 274865, పార్వతీపురం కంట్రోల్ రూమ్ నంబర్– 08963222778కి సమాచారం అందజేయాలని కోరారు. ఆయా వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. -
అన్నిరంగాల్లోనూ మహిళలు రాణించాలి
నేటి మహిళలందరూ ప్రతి రంగంలోనూ రాణించాలి. ఉన్నతమైన లక్ష్యాలతో ముందుకు వెళ్లాలి. భవిష్యత్తుకు మార్గం వేయాలి. కుటుంబసభ్యుల ప్రోత్సాహం తప్పనిసరిగా ఉండాలి. కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసే విషయంలో మహిళలు నైపుణ్యం ఎలా ప్రదర్శిస్తారో..ఉద్యోగ విషయంలోనూ ఎటువంటి పరిస్ధితినైనా సమర్ధవంతంగా ఎదుర్కొని దానికి చక్కటి పరిష్కారం చూపించ గలుగుతారు. వృత్తిపట్ల నిబద్ధతతో పనిచేయగలుగుతారు. మహిళా మణులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. – కె.శిరీష, జిల్లా దేవాదాయశాఖ అధికారిణి, విజయనగరం ఆత్మవిశ్వాసమే ఆభరణంమహిళకు ఆత్మవిశ్వాసమే అసలైన ఆభరణం. మొక్కవోని కార్యదీక్ష, ఓర్పు, నేర్పు, శక్తియుక్తి వంటి లక్షణాలే తరగని ఆభరణాలు. మగవారికి మకుటమై మణిమాణిక్యమై మనుగడకే మణిదీపమై వెలుగులీనే వేగుచుక్క నేటి మహిళ. విధివంచితలైనా, విజయభేరి మోగించే నేటిమహిళ పురషుల కన్నా మహాశక్తి కలది.సమాజంలోని ఆటుపోట్లను ఎదుర్కొని ముందడుగు వేసే ప్రతిమహిళకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. – కోరుపోలు కళావతి, ప్రముఖ రచయిత్రి, విజయనగరం -
10న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్మేళా
సాలూరు: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో ఈ నెల 10న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జాబ్మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ ఉషశ్రీ, జేకేసీ కో ఆర్డినేటర్ రాంబాబులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. దివిస్ ల్యాబొరేటరిస్ లిమిటెడ్ హైదరాబాద్, విశాఖపట్నం, కాకినాడ సమీపంలో ఉన్న బల్క్డ్రగ్ ప్రొడక్షన్ విభాగంలో పనిచేసేందుకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారని పేర్కొన్నారు. ట్రైనీ సూపర్వైజర్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లకు బీఎస్సీ కెమిస్ట్రీ, బీఫార్మశీ, బీటెక్(కెమికల్). ఎంఎస్సీ (ఆర్గానిక్ కెమిస్ట్రి),అనలిటికల్ కెమిస్ట్రీ, ఎం ఫార్మశీ చేసిన వారు అర్హులని తెలిపారు.పై కోర్సులు పూర్తిచేసిన లేదా ఆఖరి సంవత్సరం చివరి సెమిస్టర్ చదువుతున్న అభ్యర్థులు ఒరిజనల్ సర్టిఫికెట్స్, జిరాక్స్లను తీసుకుని ఇంటర్వూకు హాజరు కావాలని సూచించారు. డీఎస్సీ, ఎస్జీటీకి ఆన్లైన్లో ఉచిత శిక్షణవిజయనగరం టౌన్: వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆఽంధ్రప్రదేశ్ ఆదేశాల మేరకు డీఎస్సీ, ఎస్జీటీ పరీక్షకు అర్హులైన జిల్లాకు చెందిన బీసీ, ఈడబ్ల్యూఎస్, ఈబీసీ వర్గాలకు చెందిన అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో ఉచిత శిక్షణకు దరఖాస్తులు కోరుతున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జి.పెంటోజీరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 10వతేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. అభ్యర్థుల వార్షిక ఆదాయం రూ.రెండు లక్షల లోపు ఉండాలని స్పష్టం చేశారు. ఉచిత ఆన్లైన్ శిక్షణకు డిగ్రీ మార్క్లిస్ట్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, నేటివిటీ, డీఎస్సీకి ఎంపికై న టెట్ మార్క్స్, జిరాక్స్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు రెండు దరఖాస్తుతో జతచేయాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఫోన్ 9603557333, 9177726454 నంబర్లను సంప్రదించాలని కోరారు. సేవా పతకాలు అందజేసిన కమాండెంట్ మల్లికా గార్గ్డెంకాడ: ఉత్కృష్ఠ, అతి ఉత్కృష్ఠ సేవా పతకాలను ఐదవ ఏపీఎస్పీ బెటాలియన్ పోలీస్అధికారులు, సిబ్బందికి కమాండెంట్ మల్లికా గార్గ్ అందజేశారు. చింతలవలస ఐదవ ఏపీఎస్పీ బెటాలియన్లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో 2019లో 12, 2020లో 9, 2023లో 13 ఉత్కృష్ఠ సేవా పతకాలకు ఎంపికై న బెటాలియన్ పోలీస్ అధికారులు, సిబ్బందికి కమాండెంట్ చేతుల మీదుగా అందజేశారు. అలాగే 2019వ సంవత్సరంలో 7, 2020లో 4, 2023లో 7 అతి ఉత్కృష్ఠ పతకాలను అందజేశారు. పదిమందికి యాంత్రిక్ సేవా పతకాలను అందించారు. కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ డి.వెంకటేశ్వరరావు,అసిస్టెంట్ కమాండెంట్లు పి.సత్తిబాబు,ఎస్.బాపూజీ, డీవీ రమణమూర్తి,, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
41 గ్యాస్ సిలిండర్ల సీజ్
విజయనగరం ఫోర్ట్: జిల్లాలో డొమెస్టిక్ సిలిండర్లను అక్రమంగా వాడుతున్న హోటల్స్, రెస్టారెంట్స్, ఫాస్ట్ఫుడ్ సెంటర్స్పై సివిల్ సప్లయిస్ అధికారులు శుక్రవారం ఆకస్మికంగా దాడులు చేశారు. సివిల్ సప్లయిస్ డిప్యూటీ తహసీల్దార్లు రెండు బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించారు. విజయనగరం, డెంకాడ, గజపతినగరం మండలాల్లో 8 చోట్ల 6ఎ కేసులు నమెదు చేసి 25 సిలిండర్లు సీజ్ చేశారు. అదేవిధంగా చీపురుపల్లి, రాజాం, గరివిడి మండలాల్లో 7 చోట్ల ఏడు 6 ఎ కేసులు నమోదు చేసి 16 సిలిండర్లను సీజ్ చేశారు. -
నైపుణ్యాలు కలిగిన యువతతో గ్రామీణాభివృద్ధి
విజయనగరం అర్బన్: నైపుణ్యాలు కలిగిన యువతతో గ్రామీణాభివృద్ధి సాధించవచ్చని కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ టీవీ కట్టిమణి అన్నారు. వర్సిటీలో ‘ఎంటర్ ప్రెన్యూర్ షిప్ ద్వారా గ్రామీణాభివృద్ధి సాధికారపరచడం’ అనే అంశంపై శుక్రవారం జరిగిన సదస్సును ఆయన ప్రారంభించారు. గ్రామీణాభివృద్ధిలో వ్యవస్థాపకత ప్రాముఖ్యతను తెలియజేశారు. నైపుణ్య అభివృద్ధి, స్థిరమైన పద్ధతులతో జనాభాను శక్తివంతంచేసే సహాయక కార్యక్రమాలకు వర్సిటీ ప్రాధాన్యమిస్తోందన్నారు. ప్రొఫెసర్ విఘ్నకాంత్ ఎస్.చాట్పల్లి మాట్లాడుతూ జీవనోపాధి మార్గాలను మెరుగుపరుచుకునేందుకు వ్యవస్థాపక వ్యూహాలను గ్రామీణ యువత అనుసరించాలన్నారు. కార్యక్రమంలో స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ (ఎస్ఎంఎస్) డీన్, ప్రొఫెసర్ జితేంద్రమోహన్ మిశ్రా, బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం అధిపతి డాక్టర్ ఎ.వి.అప్పసాబా పాల్గొన్నారు. గిరిజన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ టి.వి.కట్టిమణి -
బైక్పైనుంచి జారి పడి వ్యక్తి మృతి
జియ్యమ్మవలస రూరల్: మండలంలోని అలమండ పంచాయతీ నీలకంఠాపురం గ్రామానికి చెందిన కొండగొర్రి నాగేశ్వరరావు(46) బైక్పై నుంచి జారిపడి మృతి చెందాడు. ఈ మేరకు చినమేరంగి ఎస్సై పి.అనీష్ తెలిపిన వివరాల మేరకు నీలకంఠాపురం గ్రామానికి చెందిన నిమ్మక శంకర్రావు తన బైక్పై అదే గ్రామానికి చెందిన కొండగొర్రి నాగేశ్వరరావు, పాలక లాలిబాబులను ఎక్కించుకుని గురువారం రాత్రి గుమ్మలక్ష్మీపురం మండలం బొద్దిడి గ్రామదేవత పండగకు వెళ్తున్నాడు. ఆ సమయంలో మార్గమధ్యంలో బైక్పై నుంచి జారిపడిన నాగేశ్వరరావుకు తీవ్ర గాయాలు కావడంతో 108 సహాయంతో పార్వతీపురం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. మితిమీరిన వేగంతో వెళ్లడంతోనే ప్రమాదం జరిగిందని, ప్రమాదంలో తమ చిన్నాన్న మృతి చెందాడని కొండగొర్రి అప్పారావు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. చికిత్స పొందుతూ వ్యక్తి...భోగాపురం: ఈనెల 5వ తేదీన మండంలోని రావివలస ట్రంపెట్ వంతెన కింద ఆగి ఉన్న లారీని ఢీకొని గాయపడిన జోతేంద్ర నారాయణ పాండే(41) చికిత్స పొందుతూ మృతిచెందాడు. విశాఖపట్నానికి చెందిన జోతేంద్ర పాండేను గాయాల పాలైన అనంతరం తగరపువలస ఎన్ఆర్ఐ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్చారు. మృతుడి తండ్రి హరినారాయణ పాండే ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ ఎన్వీ ప్రభాకర్ తెలిపారు. -
● కథానాయిక.. కిలారి లక్ష్మి..
కిలారి లక్ష్మి.. పౌరాణిక నాటక రంగంలో ప్రతిభ చూపుతూ తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. రాజాం పట్టణం వస్త్రపురి కాలనీలో నివసిస్తున్న లక్ష్మి 27 ఏళ్లుగా కళామతల్లి సేవలో తరిస్తున్నారు. సీ్త్ర, పురుష పాత్రలలో నటించి మహిళా లోకానికే వన్నెతెస్తున్నారు. తల్లి లలితాదేవి కూడా కళాకారిణే. చంద్రమతి, సీత, లీలావతి వంటి పాత్రలు వేసేవారు. 5,200లకు పైగా పౌరాణిక నాటక ప్రదర్శనలు ఇచ్చిన లక్ష్మి 6 వేలకు పైగా సత్కారాలు, సన్మానాలు దక్కాయి. – రాజాం -
మార్చి 12లోగా వ్యవసాయ పరికరాలకోసం దరఖాస్తు
పార్వతీపురం: వ్యవసాయ యాంత్రికరణలో భాగంగా రైతులకు ఆధునిక వ్యవసాయ పరికరాల కోసం రైతు సేవా కేంద్రాల్లో ఈనెల 12లోగా దరఖాస్తు చేసుకుని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా వ్యవసాయాధికారి కె.రాబర్ట్పాల్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మాట్లాడుతూ 2024–25 సంవత్సరానికి గాను రైతులకు 50శాతం సబ్సిడీపై వ్యవసాయ పరికరాలను సరఫరా చేసేందుకు పార్వతీపురం మన్యం జిల్లాకు రూ.2.47కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపారు. బ్యాటరీ స్ప్రేయర్లు, ఫుట్ స్ప్రేయర్లు, తైవాన్ స్ప్రేయర్లు, ట్రాక్టర్ దుక్కు, దమ్ము సెట్లు, రోటోవేటర్లు, పవర్ వీడర్లు, పవర్ టిల్లర్లను అందించనున్నట్లు చెప్పారు. గత ఐదేళ్లుగా వ్యవసాయశాఖ నుంచి సబ్సిడీ ద్వారా పరికరాలు పొందని ఎస్సీ,ఎస్టీ, సన్న, చిన్నకారు మహిళా రైతులు అర్హులన్నారు. ఆర్ఓఎఫ్ఆర్ భూములను సాగుచేస్తున్న రైతులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఏపీ స్టేట్ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్ఏఐడీసీ) రైతులతో చర్చించి పరికరాల ధరలను నిర్ణయించి లబ్ధిదారులకు అందించనున్నామని చెప్పారు. ఆసక్తిగల రైతులు వినియోగించుకోవాలని కోరారు. -
● ఆడపిల్ల ఓ అదృష్టం
ఆడపిల్ల పుట్టిందంటే ప్రతి కుటుంబం సంతోషించాలి. లక్ష్మీదేవి పుట్టిందని ఆనంద పడాలి. మహిళల పట్ల అక్కడక్కడ వివక్ష ఉంది. ఇది పోవాలి. ప్రాథమిక విద్య చదువుతున్నప్పటి నుంచి డాక్టర్ కావాలన్నది నా కోరిక. మా నాన్న విద్యావంతుడు కావడంతో కోరిక తగ్గట్టుగా వైద్యవిద్యను చదివించారు. మరో ఇద్దరు చెల్లెళ్లను కూడా ఉన్నత చదువులు చదివించారు. ముగ్గురం ఆడపిల్లలమే అయినా మగ పిల్లలతో సమానంగా రాణించేలా ప్రోత్సహించారు. తల్లిదండ్రుల కష్టాన్ని వమ్ముచేయకుండా ముగ్గురం క్రమశిక్షణ, పట్టుదలతో చదివాం. మేము చదువుకునే రోజుల్లో 125 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు 85 మంది పురుషులు ఉంటే 40 మంది మాత్రమే మహిళలు ఉండేవారు. నేడు ఎక్కువ మంది బాలికలే వైద్య విద్యను అభ్యసించడం శుభపరిణామం. భుజం తట్టి ప్రోత్సహిస్తే మహిళలు పురుషులు కంటే గొప్పగా రాణిస్తారు. ఊయలను ఊపే స్థాయి నుంచి మహిళలు తారాస్థాయికి ఎదిగారు. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. – డాక్టర్ జి.వి.రాజ్యలక్ష్మి, డీసీహెచ్ఎస్ -
ఆయుధ భాండాగారంగా బాడంగి ఎయిర్స్ట్రిప్
బాడంగి: విజయనగరం జిల్లా బాడంగి సమీపంలోని బ్రిటిష్ కాలంనాటి ఎయిర్స్ట్రిప్ను విశాఖ నావికాదళ శాఖ ఆయుధ భాండాగారంగా తీర్చిదిద్దేందుకు ఆలోచన చేస్తున్నట్టు నావికాదళ జూనియర్ మేనేజర్, వర్క్స్సెక్షన్ ఆఫీసర్ పి.చైతన్య తెలిపారు. ఆర్డీఓ రామ్మోహన్రావుతో కలిసి శుక్రవారం సంబంధిత భూములు పరిశీలించారు. ఆయుధ భాండాగారం ఏర్పాటుకు ప్రస్తుతం నావికాదళానికి చెందిన భూమితో పాటు మరో 1613.63 ఎకరాలు అవసరమన్నారు. ఇక్కడ నావెల్ ట్రైనింగ్ పరికరాలు, యుద్ధసామగ్రిని నిల్వ చేస్తామన్నారు. దీనిని నావెల్ ఫీడ్రికై ్వర్ మెంట్ జోన్గా పిలుస్తామని చెప్పారు. ఇక్కడికి డొంకినవలస రైల్వేస్టేషన్ దగ్గరగా ఉన్నందున విడిపనిముట్లు సరఫరాకు వీలుంటుందన్నారు. రైల్వేస్టేషన్ వరకు ప్రత్యేక రోడ్డును నిర్మిస్తామని, ఇది స్థానిక ప్రజలకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. ఎయిర్స్ట్రిప్ నుంచి నేరుగా పాల్తేరు హైస్కూల్ వరకు రెవెన్యూశాఖ గుర్తించిన భూములను పరిశీలించారు. హైస్కుల్కు ప్రత్యామ్నాయ స్థలం కేటాయించి కొత్త భవనాలు నిర్మిస్తామని చెప్పారు. ముగడ, మల్లంపేట, పాల్తేరు, పూడివలస, కోడూరు, రామంచద్రాపురం, మల్లంపేట గ్రామాలకు చెందిన 1585 ఎకరాల భూములను గుర్తించామన్నారు. వీటిలో ప్రభుత్వ, డీ పట్టా, మాగాణి, మెట్ట భూములు, ప్రభుత్వేతర భూములు కలిసి ఉన్నాయన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సుధాకర్, సర్వేయర్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. నావికాదళ సెక్షన్ ఆిఫీసర్ చైతన్య ఆర్డీఓతో కలిసి భూముల పరిశీలన -
విద్యార్థినులకు లఘుచిత్ర ప్రదర్శన
పార్వతీపురం రూరల్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్శాఖ ఆధ్వర్యంలో విద్యార్థినులకు మహిళల గౌరవాన్ని పెంపొందించే లఘు చిత్రాలను జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో సంబంధిత స్టేషన్ల సిబ్బంది ద్వారా శుక్రవారం ప్రదర్శించినట్లు ఎస్పీ మాధవ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు సామాజిక, ఆర్థిక, క్రీడ, రాజకీయ రంగాల్లో సాధించిన ప్రగతిని గురించి విద్యార్థులకు వివరించి మహిళల హక్కులు, వారి శక్తి, సమానత్వం, మానసిక స్థైర్యం, స్వీయ రక్షణ సామర్థ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా పలు కార్యక్రమాలను గత ఏడు రోజులుగా నిర్వహించామని చెప్పారు. మహిళా చట్టాలు, పోక్సో యాక్ట్, ర్యాగింగ్, ఈవ్టీజింగ్, గుట్టచ్, బ్యాడ్టచ్, సామాజిక మాధ్యమాలు, సైబర్ నేరాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తల పరమైన అంశాలపై పోలీస్శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. పోలీసుశాఖ మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని పోలీస్సిబ్బంది సహాయ సేవలు 24/7 ఉంటాయన్నారు. అత్యవసర సమయాల్లో హెల్ప్లైన్ నంబర్లు చైల్డ్హెల్లైన్ 1098, ఉమెన్ హెల్లైన్ 181, పోలీస్ హెల్లైన్ 100/112 సైబర్ నేరాల హెల్ప్లైన్ 1930 నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి -
ప్రజా సమస్యల పరిష్కార కోసమే చైతన్యయాత్రలు
విజయనగరం గంటస్తంభం: సీపీఎం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించ తలపెట్టిన ప్రజాచైతన్య యాత్రల్లో ప్రజాసమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి పోరాటాలు చేస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన స్థానిక ఎల్బీజీ భవన్లో జరిగిన కార్యక్రమంలో కరప్రత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సైకిల్యాత్రగా విజయనగరం నుంచి బయలుదేరి మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటించి ప్రజలను కలిసి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుంటామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. మండలాలు, పట్టణ ప్రాంతాల్లో పాదయాత్రలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టి 10 నెలలు గడిచినా ఉపాధి కల్పనపై చిత్తశుద్ధి లేదని, ధరలు అదుపులో ఉండడం లేదన్నారు. మరోవైపు కరెంట్ చార్జీల భారం విపరీతంగా ప్రజలపై వేస్తున్నారని విమర్శించారు. సూపర్సిక్స్ గురించి గొప్పగా చెప్పడం తప్ప ఏ ఒక్క హామీ అమలు చేయకపోగా, సంక్షేమ పథకాల్లో కోత విధిస్తున్నారన్నారు. విజయనగరం జిల్లాలో కూడా తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, వేసవి తీవ్రత పెరగకుండానే తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. ప్రజలను చైతన్య పరుస్తూ తమయాత్రలు 17 వ తేదీ వరకు జరుగుతాయని తెలియజేశారు. ప్రజలంతా తమ సమస్యలను సీపీఎం దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రజాసమస్యల పరిష్కారానికి ఈనెల 22 నుంచి 28 వరకు వివిధ రూపాల్లో ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు. అయినా ప్రభుత్వం స్పందించకపోతే ఏప్రిల్, మే నెలల్లో సమరశీల పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ -
టేకు, మామిడి, జీడిచెట్లు దగ్ధం
బలిజిపేట: మండలంలోని మిర్తివలస గ్రామసమీపంలో మిర్తివలస, తుమరాడ రెవెన్యూ పరిధిలో ఉండే టేకు, మామిడి, జీడితోటల్లో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించడంతో చెట్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో 18మంది రైతులకు చెందిన సుమారు 2,580టేకుచెట్లు, 307మామిడి, 170జీడి చెట్లు కాలిపోయాయని రైతులు తెలిపారు. ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన కావడంతో మంటలు ఆర్పేందుకు అవకాశం లేకవడంతో చెట్లు కాలిపోయాయని రైతులు వాపోయారు. రెవెన్యూ సిబ్బంది నష్టాన్ని అంచనా వేశారని రైతులు తెలిపారు. ఈ ప్రమాదంలో డొక్కర రాము, ప్రగడ సోములయ్య, సాలీల సుశీల, శ్రీరాములు, పోలిరాజు, పైడితల్లి, ఈశ్వరరావు, గుడుపూరు గణపతి, జి.లక్ష్మణ, ఎం.పైడిరాజు, పి.రామారావు, జి.అచ్చియ్య, పైడయ్య, ఆర్.తిరుపతి, ఎస్.శివకృష్ణ, గంగయ్య, జి.సత్యం, ఎస్.సత్యం, మజ్జియ్య తదితరుల రైతులకు సంబంధించిన తోటల్లోని చెట్లు దగ్థమయ్యాయి. దీనిపై ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని బాధిత రైతులు కోరుతున్నారు. -
ఇష్టారాజ్యంగా కంకర తరలింపు
సాలూరు రూరల్: మండలంలోని నెలిపర్తి పంచాయతీ బట్టివలస గ్రామం వెళ్లే దారిలో గడిచిన 5 రోజులుగా అక్రమంగా కంకర తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ విషయం రెవెన్యూ అధికారులకు తెలిసినప్పటికీ కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.ఈ వ్వవహరంలో అక్రమ కంకర తవ్వకం దారులకు తెలుగుతమ్ముళ్లు అండగా ఉన్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెవెన్యూలో ఉన్నతాధికారులను సైతం వారు మేనేజ్ చేస్తామని అక్రమార్కులకు భరోసా ఇస్తున్నట్లు పలువురు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. కంకర తవ్వకాల్లో జేసీబీతో పాటు సుమారు 10నుంచి 15 ట్రాక్టర్లు రవాణాలో వినియోగిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం నుంచి విజయనగరం జిల్లా రామభద్రపురం మండలానికి కంకర రవాణా చేస్తున్నారు. కనీసం ఎలాంటి అనుమతులు లేకుండా ఇంత బహిరంగంగా పక్క జిల్లాకు కంకర రవాణా జరుగుతున్నా ఇంతవరకు అధికారులు పట్టించుకోకపోవడం వెనుక కంకర అక్రమ తవ్వకాలను ఏమేరకు రెవెన్యూ అధికారులు ప్రోత్సహిస్తున్నారో అర్థమవుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా రెవెన్యూ అధికారులు ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పట్టించుకోని రెవెన్యూ అధికారులు -
● సేవాభావమే డాక్టర్ను చేసింది
నాకు చిన్నప్పుడు నుంచి డాక్టర్ చదివి ప్రజలకు సేవ చేయాలనే కోరిక ఉండేది. దానిని తల్లిదండ్రులకు చెబితే వైద్య విద్య అభ్యసించేందుకు కావాల్సిన సహకారాన్ని అందించారు. డాక్టర్గా పీహెచ్సీ, సీహెచ్సీల్లో ప్రజలకు సేవలందించగలిగాను. అది నా జీవితానికి ఎంతో సంతృప్తి నిచ్చింది. డీఎంహెచ్ఓగా విధులు నిర్వహించేందుకు భర్త, పిల్లలు ఎంతోగానో సహకారం అందిస్తున్నారు. ఆడ పిల్లలను, అమ్మతనాన్ని కాపాడుకోవాలి. సామాజికంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా మహిళలను ముందుకు నడిపించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. మహిళ బాగుంటేనే ఆ కుటుంబం బాగుంటుంది. మహిళలు చిన్నచిన్న ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదు. ఆడపిల్ల, మగ పిల్లవాడు అనే తేడా లేకుండా ఇద్దరినీ సమానంగా చూడాలి. వారికి ఇష్టమైన రంగంలో ప్రోత్సహించాలి. – డాక్టర్ ఎస్.జీవనరాణి, డీఎంహెచ్ఓ -
మహిళా క్రీడాపోటీలతో ఆనందం
విజయనగరం అర్బన్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీఎన్జీవో జిల్లా మహిళా విభాగం ఆధ్వర్యంలో స్థానిక రాజీవ్ స్టేడియంలో శుక్రవారం జరిగిన క్రీడా పోటీలు మహిళా ఉద్యోగుల్లో ఆనందం నింపాయి. తొలుత పోటీలను విజయనగరం ఆర్డీఓ దాట్ల కీర్తి గాల్లో బెలూన్లు ఎగరవేసి జెండా ఊపి ప్రారంభించారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేసిన మహిళా ఉద్యోగులు అధికసంఖ్యలో ఉత్సాహవంతంగా పాల్గొని పోటీల్లో ప్రతిభ చూపారు. కబడ్డీ, ఖోఖో, టెన్నికాయిట్, షటిల్ బాడ్మింటన్, మ్యూజికల్ చైర్ తదితర క్రీడల్లో అధిక సంఖ్యలో మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. పోటీలను కె.భాను, పి.అదిలక్ష్మి, వి.సౌదామిని, ఎస్.విజయలక్ష్మి, పి.భారతీదేవి, అనురాధ నిర్వహించారు. కార్యక్రమంలో ఎన్జీవో రాష్ట్ర ఉపాధ్యక్షుడు డీవీరమణ, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు టి.శ్రీధర్బాబు, ఎ.సురేష్, జీవీఆర్ఎస్కిశోర్, వై.ఆనంద్కుమార్, గోపీనాథ్, జిల్లా కోశాధికారి ఎస్వీసుధాకర్, ఎ.కనకరాజు, ఎల్.తవుడు, కేవీశ్రీను, జిల్లా మహిళా విభాగం చైర్పర్సన్ కె.ఆదిలక్ష్మి, ఆర్.శ్రీసప్న, కె.రాధిక, మహిళా కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్
విజయనగరం: విద్యార్థి దశలో క్రీడల్లో రాణించిన వారికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.శ్రీనివాసమూర్తి, జిల్లా విద్యాశాఖ అధికారి యు.మాణిక్యం నాయుడులు పేర్కొన్నారు. జాతీయస్థాయిలో జరిగిన స్కూల్గేమ్స్ పోటీల్లో రాష్ట్ర జట్టుకు విజయనగరం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన 28 మంది క్రీడాకారులకు శుక్రవారం సర్టిఫికెట్లు ప్రదానం చేసారు. స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో జిల్లా నుంచి ఖోఖో, కబడ్డీ, స్విమ్మింగ్, సాఫ్ట్బాల్, బేస్బాల్, సైక్లింగ్, తైక్వాండో, రెజ్లింగ్ పోటీల్లో రాష్ట్ర జట్లలో 28 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వారిని ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారితో పాటు, విద్యాశాఖ అధికారులు అభినందించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ క్రీడల ద్వారా మంచి భవిష్యత్ అందిపుచ్చుకోవచ్చన్నారు. జాతీయస్థాయి సర్టిఫికెట్తో ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచి భవిష్యత్ ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో హెచ్ఎం అసోసియేషన్ కార్యదర్శి సన్యాసిరాజు, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం కార్యదర్శి ఎన్.వెంకటనాయుడు, ఎస్ జీఎఫ్ జిల్లా కార్యదర్శి కె.కృష్ణంరాజు, వ్యాయామ ఉపాధ్యాయులు కేవీఎఎస్ రాజు, చంద్రశేఖర్, సూర్యారావు, తౌడుబాబు, సత్యనారాయణ, అప్పలనాయుడు, శ్రీను, టి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. జాతీయ స్కూల్గేమ్స్లో పాల్గొన్న క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం -
అన్నింటా సమాన అవకాశాలు
నేడు ఆడపిల్లలకు అన్నింటా సమాన అవకాశాలు లభిస్తున్నాయి. వీటిని అందిపుచ్చుకోవాలి. అనుకువగా ఉంటూ సమాజానికి సేవచేయగలిగే సామర్థ్యాలను పెంపొందించుకోవాలి. వైద్యసేవలతో అధికమంది ఆదరణ పొందవచ్చనే ఉద్దేశంతో వైద్యకోర్సులో చేరాను. వివిధ ఆరోగ్య సమస్యలతో వచ్చే వారికి ప్రేమ, ఆప్యాయతలతో సేవలు అందిస్తే వారిలో కలిగే సంతోషం వెలకట్టలేనిది.– బడగల మనస్విని, వైద్య విద్యార్థిని, ప్రభుత్వ వైద్య కళాశాల, విజయనగరం -
జ్వరాలకు కారణాలు విశ్లేషించాలి
శృంగవరపుకోట: మండలంలోని ధారపర్తి పంచాయతీ పరిధిలో జ్వరాలు విజృంభిస్తున్నాయన్న వార్తపై రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు స్పందించారు. ఎస్.కోట ఏరియా ఆస్పత్రికి గురువారం చేరుకుని జ్వరాలతో చికిత్స పొందుతున్న గిరిజన చిన్నారులను పరామర్శించారు. వారి తల్లిదండ్రులతో మాట్లాడి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. వైద్యసేవలపై ఆరా తీశారు. జ్వరాలకు కారణాలు అన్వేషించి నివారణ చర్యలను వేగవంతంగా చేపట్టాలని వైద్యులకు సూచించారు. ఆయన వెంట ఎస్టీ కమిషన్ మెంబర్ కొర్రా రామలక్ష్మి ఉన్నారు. రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డీవీజీ శంకరరావు -
రేపు జాతీయ లోక్ అదాలత్
విజయనగరం లీగల్: ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఈ నెల 8న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు బి.సాయికళ్యాణ్ చక్రవర్తి కోరారు. రాజీపడదగిన క్రిమినల్ కేసులు, మోటారు ప్రమాద బీమా, బ్యాంకు చెక్కు బౌన్స్ కేసులు, ప్రాంసరీ నోట్, ఎలక్ట్రిసిటీ, ప్రీ లిటిగేషన్ కేసులను రాజీ మార్గంలో పరిష్కరించుకోవాలని గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గురుకులాల్లో ప్రవేశాలకు గడువు పెంపు విజయనగరం అర్బన్: ఉమ్మడి విజయనగరం జిల్లాలోని ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశ దరఖాస్తుకు ఈ నెల 13 వరకు గడువు పెంచినట్టు గురుకులాల సమన్వయకర్త శంబాన రూపవతి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఐదోతరగతి, ఇంటర్మీడియట్లో ప్రవేశాలకు ‘ఏపీపీఆర్ఏజీసీఈటీ.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఐఎన్’ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్లకు ప్రశంసలు విజయనగరం అర్బన్: జిల్లా కేంద్రం నుంచి ప్రయాగ్రాజ్లో జరిగిన మహా కుంభమేళాకు వెళ్లిన భక్తులకు సురక్షిత ప్రయాణ సేవలందించిన ఆర్టీసీ బస్సు డ్రైవర్లను జిల్లా ప్రజా రవాణా అధికారి సీహెచ్ అప్పలనారాయణ అభినందించారు. ప్రయాణికుల విశేష ఆదరణ పొందిన ఐదుగురు డ్రైవర్లకు జ్ఞాపికలు, బహుమతులను ఆర్టీసీ డీపో ప్రాంగణంలో గురువారం అందజేశారు. కుంభమేళాకు నడిపిన ఐదు బస్సుల నుంచి రూ.12లక్షల వరకు ఆదాయం సమకూరిందని డిపో మేనేజర్ జె.శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో డీపీ సీఐ ఆదినారాయణ, డిపో సూపర్వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు. సజావుగా మద్యం షాపుల లాటరీ ప్రక్రియ విజయనగరం అర్బన్: జిల్లాలో గీత/సొండి కులాలకు కేటాయించిన మద్యంషాపుల కోటా లాటరీ ప్రక్రియ విజయనగరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం సజావుగా సాగింది. జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.శ్రీనివాసమూర్తి సమక్షంలో సంబంధిత కులాల కోటాగా 16 షాపులను కేటాయించారు. షాపుల కోసం 308 దరఖాస్తులు నమోదు కాగా వీటి ఫీజుల రూపంలో రూ.6.16 కోట్లు లభించిందని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి బి.శ్రీనాధుడు తెలిపారు. 16 మద్యం షాపులకు మొదటి విడత లైసెన్స్ఫీజు రూపంలో రూ.84.50 లక్షల ఆదాయం వచ్చిందన్నారు. ఈ నెల 8 నుంచి పీ–4 సర్వే విజయనగరం అర్బన్: పబ్లిక్ ప్రైవేటు పీపుల్స్ పార్టిసిపేషన్ (పీ–4) సర్వేను ఈ నెల 8 నుంచి 18వ తేదీ వరకు జరుగుతుందని కలెక్టర్ డా.బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. సచివాలయ, గ్రామ స్థాయిలో పనిచేసే సిబ్బంది సర్వేలో పాల్గొంటారని, ఎంపీడీఓలు పర్యవేక్షణ అధికారులుగా వ్యవహరించాలని సూచించారు. కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి ఆధ్వర్యంలో పీ–4 సర్వేపై ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, మండల ప్రత్యేకాధికారులకు గురువారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జీరో పేదరికమే లక్ష్యంగా ప్రభుత్వం పీ–4 కార్యక్రమాన్ని తలపెట్టిందన్నారు. పేదరికంలో ఉన్న 20 శాతం మందికి వివిధ రకాలుగా తోడ్పాటునందిస్తుందన్నారు. ఈ నెల 21, 22తేదీల్లో గ్రామ సభలను నిర్వహించి, 27వ తేదీన తుది నివేదిక అందజేయాలని, ఉగాది సందర్భంగా 30న ముఖ్యమంత్రి చంద్రబాబు పాలసీని ప్రారంభిస్తారని తెలిపారు. సమావేశంలో డీఆర్వో శ్రీనివాసమూర్తి పాల్గొన్నారు. -
కుక్కల దాడిలో 10 మేక పిల్లల మృత్యువాత
మెంటాడ: మండలంలోని లోతుగెడ్డ గ్రామంలో కర్రి అక్కయ్యకు చెందిన 10 మేక పిల్లలు కుక్కల దాడిలో మృత్యువాత పడ్డాయి. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన అక్కయ్య పిట్టాడ గ్రామానికి మేకల మందను మేత కోసం తీసుకువెళ్లి మేక పిల్లలను గూడులో ఉంచాడు. ఆ గూడుపై కుక్కలు దాడి చేసి 10 మేక పిల్లలును చంపివేశాయి. మృతి చెందిన మేక పిల్లల విలువ సుమారు 50 వేల రుపాయలు ఉంటుందని ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నాడు,సెంచూరియన్లో ఘనంగా జాతీయ ఫార్మసీ విద్యా దినోత్సవంనెల్లిమర్ల రూరల్: మండలంలోని టెక్కలి సెంచూరియన్ విశ్వ విద్యాలయంలో జాతీయ ఫార్మసీ విద్యా దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఔషధ విద్యకు పునాది వేసిన ప్రొఫెసర్ మహాదేవ్ లాల్ ష్రాఫ్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్ర పఠానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వీసీ ప్రొఫెసర్ ప్రశాంత కుమార్ మహంతి మాట్లాడుతూ ఈ ఏడాది ఫార్మా, పార్మసీ ప్రాక్టీస్లో వ్యవస్థాపక స్టార్టప్లు ప్రోత్సహించడమే ప్రధాన అజెండాగా ప్రభుత్వం పేర్కొందని, ఆ దిశగా విద్యార్ధులు సన్నద్ధం కావాలని సూచించారు. శిక్షణ ప్రారంభం రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి శాఖ ఆదేశాల మేరకు సెంచూరియన్లో రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్యామ్ప్రసాద్ గురువారం ప్రారంభించారు. గ్రామీణ యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకువెళ్తున్నామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ పల్లవి, డిప్యూటీ రిజిస్ట్రార్ వర్మ, డీన్ అనిల్ కుమార్ పాల్గొన్నారు. -
ఏపీసీ పరిశోధనకు పేటెంట్ హక్కు
విజయనగరం అర్బన్: జిల్లా సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు సమన్వయకర్త (ఏపీసీ) డాక్టర్ ఎ.రామారావు రూపొందించిన ‘పోలిమర్ పుల్లీ డ్రైవెన్ సెట్రీప్యూగల్ పంపు’నకు కేంద్ర ప్రభుత్వ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ శాఖ నుంచి పేటెంట్ హక్కు లభించింది. ఈ మేరకు ఆ శాఖ నుంచి ధ్రువీకరణ పత్రం అందినట్టు తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామారావు వెల్లడించారు. డాక్టర్ ఎన్టీఆర్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్ యూనివర్సిటీలో పీహెచ్డీ కోర్సుగా 2014 నుంచి 2017 సంవత్సరం వరకు పరిశోధించిన ఆ పరికరానికి పేటెంట్ హక్కు లభించిందని వివరించారు. పూర్తిగా ప్లాస్టిక్ వినియోగంతో తక్కువ బరువు, తక్కువ వ్యయంతో పదేళ్లపాటు శ్రమించి పంపింగ్ పరికరాన్ని తయారుచేసినట్టు తెలిపారు. పరికరానికి 20 సంవత్సరాలకు పేటెంట్ హక్కు లభించిందన్నారు. అనంతరం కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ను కలిసి అభినందనలు అందుకున్నారు. -
చల్లని తల్లి ఎల్లారమ్మ
శృంగవరపుకోట: ‘ఎంత చల్లని తల్లి ఎల్లారమ్మ.. బ్రాహ్మణ పిల్లవే బంగారు బొమ్మ.. మర్రి ఆకుల పానుపే మా అమ్మకి.. వింజామరలు వీచరే మా తల్లికి.’ అంటూ జముకుల పాటల మధ్య ఎల్లారమ్మ గంభీరంగా కదిలింది. మూడు రోజుల ఎల్లారమ్మ జాతరకు ఊరూవాడ ఏకం అయ్యింది. జామి గ్రామం కాస్త జనసంద్రమైంది. ఎటు చూసినా భక్తుల కోలాహలం.. ఆధ్యాత్మిక వాతావరణం.. సాంబ్రాణి పరిమళం.. అమ్మను చూడాలన్న ఆర్తితో జనంకదిలి రాగా ఎల్లారమ్మ జాతర జన జాతరను తలపించింది. గురువారం నిర్వహించిన అమ్మవారి తొలేళ్ల ఉత్సవం అంగరంగా వైభవంగా సాగింది. డప్పుల మోతల నడుమ కళారూపాలు కదిలాయి. సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను అలరించాయి. ముహూర్తం ప్రకారం.. జామి చుక్కవీధిలో ఉన్న గద్దె ఇంటి వద్ద ఎల్లారమ్మ తల్లి ప్రభను ముహూర్తం ప్రకారం రాత్రి 10.30 గంటలకు గద్దెదించారు. అమ్మవారికి పూజాధికాలు నిర్వహించి చీరసారెలు సమర్పించారు. తల్లి ఊరే గింపునకు అంకురార్పణ చేశారు. జముకుల పాట నడుమ ఎల్లారమ్మ తిరువీధి సాగింది. అర్చకులు, బ్రాహ్మణులు, గ్రామస్తులు అమ్మవారికి పూజలు చేసి, చీర సారెలు, పసుపు, కుంకుమలు సమర్పించారు. అమ్మవారి తిరువీధి ఆలయం వరకు వేడుకగా సాగింది. వేకువజామును 3 గంటలకు అమ్మవారు ఆలయానికి చేరుకునేవేళ బాణసంచా వెలుగులు భక్తులను ఆకట్టుకున్నాయి. జంతు బలులు లేని జాతర... ఎల్లారమ్మ తల్లి జాతరలో ఎటువంటి జంతు బలులు ఇవ్వరు. దర్శనానికి వచ్చే భక్తులు పడికట్టు ఇస్తారు. బియ్యం, ఉలవలు, పెసలు, పసుపు–కుంకుమలు, కర్ర భరిణెలు పడిగా కట్టుకొచ్చి అమ్మవారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని గ్రామ పెద్దలు తెలిపారు. జముకుల పాటతో జాతర ఆరంభం తెల్లవార్లూ జాతరే జాతర -
పోక్సో కేసు నమోదు
బొండపల్లి: మండలంలోని ఒక గ్రామానికి చెందిన బాలుడు మరో గ్రామానికి చెందిన బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు బాధిత బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై యు.మహేష్ తెలిపారు. బాలికతో పాటు బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు నిర్వహించి కేసు నమోదు చేసినట్లు చెప్పారు. హోమ్గార్డు కుటుంబానికి పోలీస్ శాఖ ‘చేయూతవిజయనగరం క్రైమ్: జిల్లా పోలీస్శాఖలో పని చేసి, ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన హోమ్గార్డు కుటుంబానికి పోలీస్ శాఖ చేయూత అందించింది. ఈ మేరకు ఎస్పీ వకుల్ జిందల్ తన కార్యాలయంలో గురువారం హోమ్ గార్డు కుటుంబానికి సుమారు రూ.3 లక్షల చెక్కును అందజేశారు. ఏడాది పొడవునా హోమ్గార్డు సిబ్బంది పోగు చేసిన ఒక్క రోజు డ్యూటీ అలవెన్స్ చెక్కును జిల్లా పోలీసు కార్యాలయంలో హోంగార్డు భార్య వి.సత్యవతికి ఎస్పీ అందజేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, హోమ్గార్డ్స్ ఇన్చార్జ్ ఆర్ఐ ఆర్.రమేష్ కుమార్, డీపీఓ సూపరింటెండెంట్ ఏఎస్వీ ప్రభాకరరావు, పోలీసు కుటుంబసభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
కార్డు రాదు.. సరుకులు అందవు
రైస్ కార్డు... పేద, మధ్య తరగతి కుటుంబాలకు అతి విలువైనది. రేషన్ సరుకులతో పాటు పిల్లల చదువులకు ఆర్థిక సాయం, ప్రభుత్వ రాయితీలు మంజూరుకు ఆ కార్డే ఆధారం. ఏడాదిగా కొత్త కార్డులు మంజూరు కాక.. పిల్లల పేర్లు కార్డులో చేర్పించే అవకాశం లేక.. ప్రభుత్వ ప్రయోజనాలు అందక పేద ప్రజలు మనోవేదన చెందుతున్నారు. గత ప్రభుత్వం ఆరు నెలలకోసారి కొత్త కార్డులు మంజూరు చేసేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడిచినా ఒక్క కార్డు కూడా మంజూరు చేయకపోవడంపై మండిపడుతున్నారు. మంచి చేస్తామని చెప్పి ముంచేస్తోందని విమర్శిస్తున్నారు. విజయనగరం ఫోర్ట్: ప్రజా సంక్షేమమే ప్రధానమన్నారు.. సూపర్ సిక్స్తో ఊరించారు.. హామీల వర్షం కురిపించారు.. తీరా అధికారంలోకి వచ్చాక ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తున్నారంటూ కూటమి నేతల తీరుపై జనం మండిపడుతున్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆధారమైన రైస్కార్డుల మంజూరులో ప్రభుత్వ అలసత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. దరఖాస్తు చేసుకుని నెలలు తరబడుతున్నా కొత్తకార్డులు మంజూరు చేయకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2024 మార్చి15వ తేదీ వరకు జిల్లాలో కొత్త రైస్కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు, సభ్యులను రైస్ కార్డులో చేర్చడానికి, కార్డులు విభజనకు అవకాశం ఉండేది. సచివాలయంలో దరఖాస్తులు స్వీకరించేవారు. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఒక్క రైస్కార్డు కూడా మంజూరు కాలేదు. వేలాది జంటలు కొత్తకార్డుల కోసం ఎదురుచూస్తున్నా ఫలితం లేకపోయింది. రైస్ కార్డుల్లో కుటుంబ సభ్యులు పేర్లు చేర్పించేందుకు అవకాశం లేకపోవడంతో ఎలాంటి ప్రయోజనాలు అందడం లేదు. దరఖాస్తు చేసిన వెంటనే... గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో కొత్త రైస్ కార్డుల మంజూరు, పిల్లల పేర్లు చేర్పించడం, కార్డుల విభజన కోసం నిరంతరాయంగా దరఖాస్తులు స్వీకరించేది. ప్రతీ ఆరు నెలలకోసారి కొత్త కార్డులు మంజూరు చేసేది. పిల్లల పేర్లు, కార్డుల విభజన పనులు దరఖాస్తు చేసిన వెంటనే సచివాలయ సిబ్బంది అధికారుల దృష్టికి తీసుకెళ్లి చక్కబెట్టేవారు. ఇప్పడు ఆ పరిస్థితి లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్డుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదని వాపోతున్నారు. రేషన్ సరుకుల సరఫరా, ఫీజురీయింబర్స్ మెంట్ వంటి పథకాల భారాన్ని తగ్గించుకునేందుకే కొత్త కార్డులు మంజూరు చేయడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొత్తకార్డులు మంజూరు కాలేదు జిల్లాలో కొత్తగా రైస్ కార్డులు ఎవరికీ మంజూరు కాలేదు. కొత్త రైస్ కార్డు కోసం, రైస్ కార్డులో సభ్యుల పేర్లు చేర్చడానికి ప్రభుత్వం నుంచి ఇంకా ఆప్షన్ రాలేదు. – కె.మధుసూదనరావు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ‘గంట్యాడ మండలం పెదవేమలి గ్రామానికి చెందిన జి.చిన్నమ్మలు 2024 మార్చి 4వ తేదీన రైస్ కార్డు కోసం దరఖాస్తు చేశారు. ఏడాదిగా ఎదురుచూస్తున్నా ఇంతవరకు ఆమెకు రైస్ కార్డు మంజూరు కాలేదు.’ గంట్యాడ మండలానికి చెందిన వి.భీమేశ్వరావు తన భార్య, పిల్లలను రైస్ కార్డులో చేర్చడానికి 2024 ఫిబ్రవరి 7వ తేదీన దరఖాస్తు చేసుకున్నారు. ఇంతవరకు రైస్ కార్డులో అతని కుటుంబ సభ్యుల పేర్లు చేరలేదు. రేషన్ సరుకులు అందడం లేదు. కొత్త కార్డులు మంజూరు చేయని కూటమి ప్రభుత్వం దరఖాస్తు చేసుకునేందుకూ అవకాశం లేని పరిస్థితి జిల్లాలో 10 వేల మంది ఎదురుచూపు సంక్షేమ పథకాలు, చదువు పత్రాలకు ఇబ్బందులు జిల్లా వ్యాప్తంగా సుమారు 10 వేల మంది కొత్త రైస్ కార్డులు, రైస్ కార్డుల విభజన, సభ్యుల పేర్లు చేర్చడం కోసం ఎదురు చూస్తున్నారు. 9 నెలలుగా దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోతోంది. దరఖాస్తు చేసుకునే ఆప్షన్ లేదని సచివాలయ సిబ్బంది చెబుతుండడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. పింఛన్లు, ఇళ్లు, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాల మంజూరు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ తదితర ప్రయోజనాల కోసం రైస్ కార్డు తప్పనిసరని, కార్డుల మంజూరులో కూటమి ప్రభుత్వ అలసత్వం తగదంటూ బహిరంగంగా విమర్శిస్తున్నారు. -
పన్నుల చెల్లింపులో నెల్లిమర్ల ఫస్ట్
పన్నులు చెల్లించాలి స్థానిక సంస్థల అభివృద్ధికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయమే కీలకం. ఆదాయం వస్తేనే అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఆస్కారం ఉంటుంది. ఆర్థిక సంవత్సరం ముగింపు గడువు దగ్గర పడుతోంది. ప్రజలంతా సహకరించి పన్ను బకాయిలు చెల్లించాలి. ఆన్లైన్లోను, మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటర్లలో పన్ను చెల్లించి రసీదు పొందాలి. లేని పక్షంలో మున్సిపల్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటాం. – పల్లి నల్లనయ్య, కమిషనర్, విజయనగరం కార్పొరేషన్● పట్టణాల్లో ఆస్తి పన్ను వసూళ్లలో అధికారులు బిజీ ● 73.96 శాతం వసూళ్లతో నెల్లిమర్ల నగర పంచాయతీ ముందంజ ● నాలుగు పట్టణాల్లో పన్ను డిమాండ్ రూ.51.37 కోట్లు ● ఇప్పటివరకు వసూలైనది రూ.28.56 కోట్లు ● బకాయిదారులకు రెడ్ నోటీసులు జారీ చేస్తున్న యంత్రాంగం ●విజయనగరం: ఆస్తి పన్ను చెల్లింపులో నెల్లిమర్ల నగరపంచాయతీ ప్రజలు జిల్లాలో ముందంజలో ఉన్నారు. ఆర్థిక సంవత్సరం ముగింపు గడువు (మార్చి 31) దగ్గర పడుతుండడంతో ఆస్తి పన్ను వసూళ్లలో కార్పొరేషన్, మున్సిపల్, నగర పంచాయతీ అధికారులు నిమగ్నమయ్యారు. మొండిబకాయిల వసూళ్లే లక్ష్యంగా నోటీసులు జారీ చేస్తున్నారు. పన్నులు చెల్లించి పట్టణాల అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నారు. విజయనగరం జిల్లా పరిధిలోని విజయనగరం కార్పొరేషన్తో పాటు బొబ్బిలి మున్సిపాలిటీ, నెల్లిమర్ల, రాజాం నగర పంచాయతీల్లో 2024–25 ఆర్థిక సంవత్సరానికి డిమాండ్ రూ.51.37 కోట్లు కాగా ఇప్పటివరకు రూ.28.56 కోట్లు వసూలు చేశారు. మొత్తం డిమాండ్లో 55.59 శాతం మున్సిపల్ ఖజానాకు చేరింది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు మొదటి విడత, అక్టోబర్ నుంచి మార్చి వరకు రెండో విడతగా పన్నులు వసూలు చేయడం సహజం. ఇప్పటి వరకు నెల్లిమర్ల నగర పంచాయతీ 73.96 శాతం వసూళ్లు చేసి మొదటి స్థానంలో నిలవగా.. 60.91 శాతం వసూళ్లతో బొబ్బిలి మున్సిపాలిటీ రెండవ స్థానంలో, 59 శాతం వసూళ్లతో రాజాం మూడవ స్థానంలో, 53.95 శాతం వసూళ్లతో విజయనగరం కార్పొరేషన్ చివరి స్థానంలో ఉంది. నీటిపన్ను వసూళ్లలో సైతం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోలేదు. సిబ్బందిపై ఉన్నతాధికారులు ఒత్తిడి పెంచడంతో క్షేత్రస్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి పన్నుల వసూళ్లకు శ్రీకారం చుట్టారు. ● బకాయిదారులపై కొరడా.. ఆర్థిక సంవత్సరం ముగింపు గడువు దగ్గర పడుతుండడంతో పన్నుల వసూలుకు బకాయిదారులపై అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. మొండి బకాయిదారుల జాబితాను సిద్ధంచేసి రెడ్ నోటీసులు జారీ చేస్తున్నారు. అప్పటికీ స్పందించకుంటే ఇంటికి వేసిన తాగునీటి కుళాయి కనెక్షన్లను తొలగిస్తున్నారు. పన్ను బకాయి దారుల జాబితాలను కార్పొరేషన్/మున్సిపల్ కార్యాలయాలతో పాటు అన్ని సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నారు. దీర్ఘకాలికంగా బకాయిపడిన వారి దుకాణాలను సీజ్ చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పన్నుల వసూళ్లపై యంత్రాంగం ఒత్తిడి చేస్తోందన్న చర్చ పట్టణాల్లో సాగుతోంది. -
భూములు లాక్కుని కడుపు కొట్టొద్దు
● బైపాస్ నిర్వాసితుల సమావేశం ● భూమి ధర పెంచాలని రైతుల పట్టు శృంగవరపుకోట: మాకు జీవనాధారమైన భూములు లాక్కుని కడుపు కొట్టకండి. అడిగిన ధర ఇవ్వకుండా మా భూములు లాక్కుంటే మేం ఏం కావాలి. ప్రభుత్వమే భూములు లాక్కుంటామంటే ఎవరికి చెప్పుకోవాలంటూ నిర్వాసిత రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖ–బొడ్డవర జాతీయ రహదారి 516బి రహదారి విస్తరణ, అభివృద్ధి పనుల్లో భాగంగా మండలంలోని కొత్తూరు నుంచి కాపుసోంపురం వరకు కొత్తగా నిర్మాణం చేయనున్న బైపాస్ రహదారి ఏర్పాటులో భూములు కోల్పోతున్న రైతులతో ఆర్డీవో సూచనల మేరకు స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ల్యాండ్ అక్విజిషన్ డీటీలు కె.హరికిరణ్, ఎస్.కోట ఇన్చార్జ్ తహసీల్దార్ కె.భరత్కుమార్ గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డీటీ హరికిరణ్ మాట్లాడుతూ రైతుల నుంచి భూమిని ఐదు కేటగిరిలుగా తీసుకుంటామని, ఎస్ఆర్ఓ నిర్ధారించిన మార్కెట్ఽ ధర కన్నా రెండున్నర రెట్లు అధికంగా చెల్లిస్తామని చెప్పారు. ముందుగా అవార్డు ప్రకటించి, నగదు చెల్లించిన తర్వాత పనులు ప్రారంభిస్తారని రైతుల ప్రశ్నకు బదులు చెప్పారు. దీనిపై పలువురు రైతులు మాట్లాడుతూ ఐదు రెట్లు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇటీవల ప్రభుత్వం, స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖలు ఫిబ్రవరిలో పెంచిన భూముల ధరల ఆధారంగా పరిహారం చెల్లించాలని కోరారు. దీనిపై డీటీ హరికిరణ్ బదులిస్తూ నోటిఫికేషన్ ఇచ్చే తేదీ నాటికి ఉన్న మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం చెల్లిస్తామని, గజాల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నా, ఎస్ఆర్ఓ రికార్డుల్లో గజాల్లో నమోదై ఉంటేనే గజాల్లో చెల్లింపులు చేస్తారని చెప్పారు. రెవెన్యూ రికార్డుల్లో యాజమాన్య హక్కులు ఉన్న వారికే చెల్లింపులు చేస్తారని చెప్పారు. ‘పరిహారం పెంపు అధికారం లేదు మేము జిల్లా అధికారులం కాదు. ఏమీ చేయలేం. మీ వినతులు జిల్లా అధికారులకు వివరిస్తాం అంటూ అధికారులు రైతుల డిమాండ్లకు బదులిచ్చారు. దీంతో రైతులు మాట్లాడుతూ నోటిఫికేషన్ ఇచ్చిన రోజు మాకు చెప్పి ఇచ్చారా? మా ఆస్తి తీసుకుని మా ఉపాధి లాక్కునేటప్పుడు మీ ప్రభుత్వాలు నిర్ణయించిన మార్కెట్ ధర అడిగితే ఇవ్వరా? ఇదెక్కడి న్యాయం, మా కుటుంబాలు ఏం కావాలి అంటూ భోరుమన్నారు. కొందరు రైతులు అధికారులకు దండాలు పెట్టి మాకు న్యాయం చేయండి, మా కడుపులు కొట్టకండి అంటూ మొరపెట్టుకున్నారు. రైతులు తమ అంగీకారం చెప్పకపోవడంతో అసంపూర్తిగానే సమావేశం అయ్యిందని పించారు. సమావేశంలో పలువురు రైతులు, వీఆర్వోలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
నెలాఖరులోగా వక్ఫ్ ఆస్తుల సర్వే
విజయనగరం అర్బన్: జిల్లాలోని వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని, దీనిలో భాగంగా ఈ నెలాఖరులోగా స్థలాల సర్వేను పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. ఈ మేరకు జిల్లా స్థాయి వక్ఫ్ పరిరక్షణ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ చాంబర్లో గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో వక్ఫ్ స్థలాల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వక్ఫ్ స్థలాలు అన్యాక్రాంతం అవకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. జిల్లాలో మైనారిటీ సంక్షేమశాఖ రికార్డుల ప్రకారం మొత్తం 96 వక్ఫ్ స్థలాలను గుర్తించినట్లు చెప్పారు. మొత్తం ఆ స్థలాల వివరాలను వెంటనే సంబంధిత ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లకు అందజేయాలని వక్ఫ్, మైనారిటీ శాఖాధికారులకు సూచించారు. అలాగే ఇవే కాకుండా రెవెన్యూ, టౌన్ రికార్డుల్లో ఉన్న మొత్తం వక్ఫ్ స్థలాల వివరాలను సేకరించి, వాటిని సర్వే చేసి, నమూనా పటాలతో సహా ఈ నెలాఖరుకు అందజేయాలని, అనంతరం ఈ స్థలాల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. డీఆర్ఓ ఎస్.శ్రీనివాసమూర్తి, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు. -
ఓపెన్ హౌస్తో పోలీస్ వ్యవస్థ్ధపై అవగాహన
● ఎస్పీ మాధవ్ రెడ్డి పార్వతీపురం రూరల్: మహిళ సాధికార వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని చాకలి బెలగాంలో ఉన్న పోలీస్శాఖ మల్టీఫంక్షన్ హాల్ ఆవరణంలో గురువారం ఓపెన్ హౌస్ ఫర్ ఉమెన్ కార్యక్రమాన్ని జిల్లా పోలీస్శాఖ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఎస్పీ మాధవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల ఽభద్రతే ప్రాధాన్యంగా పోలీసుశాఖ నిరంతరం పనిచేస్తుందని మార్చి 8వ తేదీన జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురష్కరించుకుని మహిళ సాధికార వారోత్సవాలను పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. పోలీస్శాఖ శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా వినియోగించే ఆయుధాలను, పోలీస్శాఖలో కీలకమైన సాంకేతిక వ్యవస్థను, నేరస్థలంలో సాక్ష్యాలను సేకరించేందుకు క్లూస్టీమ్ ఉపయోగించే పరికరాలు, డాగ్స్క్వాడ్ పనితీరును కార్యక్రమంలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి కళాశాల విద్యార్థినులు, అంగన్వాడీ కార్యకర్తలు, మహిళా పోలీస్సిబ్బంది హాజరయ్యారు. కార్యక్రమంలో ఎస్పీ స్వయంగా కొన్ని ఆయుధాలు వినియోగించే పద్ధతులను మహిళలకు వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన జాగిలాల విన్యాసాలు చూపరులను అబ్బురపరిచాయి. కార్యక్రమంలో ఏఎస్పీ అంకిత సురానా, డీఎస్పీ థామస్ రెడ్డి, ఆర్ఐలు రాంబాబు, నాయుడు, టౌన్ సీఐ మురళీధర్, రూరల్ ఎస్సై సంతోషి, శాఖాపరమైన సిబ్బంది పాల్గొన్నారు. -
దేవదాయశాఖ భూముల పరిరక్షణే ధ్యేయం
● దేవదాయశాఖ జిల్లా సహాయ కార్య నిర్వహణాధికారి శిరీష విజయనగరం టౌన్: జిల్లా వ్యాప్తంగా ఉన్న దేవదాయశాఖ భూముల పరిరక్షణే ధ్యేయమని ఆ శాఖ జిల్లా సహాయ కార్యనిర్వహణాధికారి కె.శిరీష తెలిపారు. విజయనగరంలోని దేవదాయశాఖ కార్యాలయంలో ఆమె గురువారం మాట్లాడారు. జిల్లాలో దేవదాయశాఖ పరిధిలో 9,900 ఎకరాల భూములు ఉన్నాయన్నారు. వాటిలో నాలుగువేల ఎకరాల వరకు ఆక్రమణలో ఉన్నట్టు వెల్లడించారు. శిస్తుల రూపంలో 2వేల ఎకరాల భూములకు రూ.50 లక్షలు, ఆస్తుల లీజుల వల్ల రూ.57 లక్షల ఆదాయం సమకూరుతోందని తెలిపారు. జిల్లాలో 473 ఆలయాల రిజిస్టరై ఉన్నాయని, భూములున్న దేవాలయాలు 313కాగా, 165 ఆలయాలు మాత్రమే కార్యనిర్వహణాధికారుల చేతుల్లో ఉన్నట్టు వెల్లడించారు. జిల్లాలో బొబ్బిలి, రాజాం, ఎస్.కోట, కొత్తవలస, వీరభద్రపేట తదితర ప్రాంతాల్లో పర్యటించి శిస్తులు చెల్లించాలని రైతులకు కట్టామన్నారు. -
నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్కు పేర్లు నమోదు చేసుకోవాలి
పార్వతీపురం: నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు యువత తమ వివరాలను నమోదు చేసుకోవాలని నెహ్రూ యువ కేంద్రం జిల్లా కె. వెంకట్ ఉజ్వల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత దేశ అభివృద్ధిలో యువత భాగస్వామ్యం కావాలని, యువత మేధాశక్తిని ఉపయోగించడంలో ప్రపంచంలో కెల్లా మన దేశం ప్రథమ స్థానంలో ఉండాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంకల్పిస్తున్నట్లు తెలిపారు. 18 నుంచి 25ఏళ్ల వయస్సు కలిగిన వారు ఈ యూత్ పార్లమెంట్ పోటీల్లో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. యువత మై భారత్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని తరువాత ఒక్క నిమిషం నిడివి కలిగిన ‘‘వాట్ డజ్ వికసిత్ భారత్ మీన్ టూ యూ’’ అనే అంశంపై వీడియో చేసి మార్చి 9 అర్ధరాత్రిలోపు మై భారత్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని సూచించారు. స్క్రీనింగ్ చేసి జిల్లా స్థాయిలో ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. జిల్లాస్థాయిలో వన్నేషన్, వన్ ఎలక్షన్, పేవింగ్ ది వేఫర్ వికసిత్ భారత్ అనే అంశంపై మూడు నిమిషాలు మాట్లాడాలని యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు సంస్థ రూపొందించిన వీడియోను వీక్షించేందుకు క్యూఆర్కోడ్ను అందుబాటులో ఉంచినట్లు తెలియజేశారు. -
పోలవరం ప్రధాన కాలువ భూసేకరణకు ఆదేశం
విజయనగరం అర్బన్: ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టులో భాగంగా జిల్లాలో పోలవరం ప్రధాన కాలువ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ డా.బీఆర్ అంబేడ్కర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. తన చాంబర్లో జలవనరుల శాఖ, భూసేకరణ అధికారులతో గురువారం సమీక్షించారు. పోలవరం ప్రధాన కాలువ భూసేకరణ చేయాల్సిన గ్రామాల్లో భూముల విలువలను సేకరించే పనిని వెంటనే చేపట్టాలన్నారు. 59 గ్రామాల్లో 3,314 ఎకరాల భూమి అవసరమని జలవనరులశాఖ గతంలో ప్రతిపాదనలు పంపించిందన్నారు. తాజాగా ఏప్రిల్ 1 నాటికి ఉన్న భూముల ధరల ప్రకారం భూసేకరణకు అయ్యే వ్యయాన్ని అంచనా వేయాలని సూచించారు. భూసేకరణ అధికారులు, సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు ఈఈ ఉమేష్చంద్ర కుమార్, భూసేకరణ అధికారి నూకరాజు, ప్రధాన కాల్వ నిర్మాణ సంస్థ ప్రతినిధి లక్ష్మణప్రసాద్, డీఏఓ పైడిరాజు, తదితరులు పాల్గొన్నారు. -
8న సబ్ జూనియర్ కబడ్డీ జట్ల ఎంపిక
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న సబ్జూనియర్స్ బాల, బాలికల కబడ్డీ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారుల ఎంపిక పోటీలు ఈనెల 8వ తేదీన నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి కేవీ ప్రభావతి గురువారం తెలిపారు. నగరంలోని సిటీ క్లబ్ ఆవరణలో ఆ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఎంపిక పోటీలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఎంపిక పోటీల్లో 16 సంవత్సరాలలోపు వయస్సు కలిగి ఉండి 55 కేజీల బరువు కలిగిన క్రీడాకారులు మాత్రమే పాల్గొనేందుకు అర్హులుగా పేర్కొన్నారు. జిల్లా జట్ల ఎంపికల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఈనెల 14 నుంచి 16వ తేదీ వరకు కడప జిల్లాలో జరగబోయే అంతర్ జిల్లాల పోటీలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం కల్పించనున్నట్లు తెలిపారు. అర్హత, ఆసక్తిగల క్రీడాకారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఫోన్ 9949721949 నంబర్ను సంప్రదిం చాలని కోరారు. గంజాయితో ఇద్దరి అరెస్ట్నెల్లిమర్ల: గంజాయి లావాదేవీలు చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్సై బి.గణేష్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఒడిశాలోని రాయగడ నుంచి గంజాయిని నెల్లిమర్ల పట్టణంలోని చంపావతి నది తీరంలో థామస్ పేట గ్రౌండ్ వద్దకు తరలిస్తున్న వ్యక్తి, దానిని కొనుగోలు చేసిన వ్యక్తిని పట్టుకుని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నెల్లిమర్లకు చెందిన వ్యక్తి గంజాయిని చిన్నచిన్న ప్యాకెట్ల రూపంలో వినియోగ దారులకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. వారిద్దరి దగ్గర సుమారు ఒక కేజీ 160 గ్రాముల గంజాయిని సీజ్ చేసి అరెస్టు చేసినట్లు చెప్పారు. రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతిపార్వతీపురం రూరల్: మండలంలోని జమ్మిడివలస గ్రామానికి చెందిన కర్రి ప్రసాద్(39) రైలు నుంచి ప్రమాదవశాత్తు జారి పడి గురువారం మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించి మృతుడి బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పరీక్ష నిమిత్తం విజయవాడ వెళ్లి తిరిగి స్వగ్రామానికి ట్రైన్లో వస్తుండగా మార్గమధ్యంలో అనకాపల్లి వద్ద ప్రమాదవశాత్తు జారి పడి మృతిచెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మృతుడు ఆర్మీలో పనిచేసి ఉద్యోగ విరమణ చేశాడు. కుటుంబ పెద్దదిక్కును కోల్పోవడంతో కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. రెండు బైక్లు ఢీకొని వ్యక్తి ..రామభద్రపురం: మండలం పరిధిలోని తారాపురం టీకాల లచ్చన్న గుడి వద్ద గురువారం రెండు బైక్లు ఢీ కొని ఒకరు మృతిచెందగా మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రామ్గోపాల్ గౌతం, సాన్వర్ ప్రసాద్ వర్మ స్నేహితులు. వారిద్దరూ కొన్ని నెలల క్రితం జీవనోపాధి కోసం సాలూరుకు వచ్చి కొత్తభవనాలకు పుట్టీలు, సీలింగ్లు వేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఉత్తరప్రదేశ్లోని సొతూరుకు వెళ్తానని బొబ్బిలి రైల్వేస్టేషన్లో డ్రాప్ చేయమని రామ్గోపాల్ను ప్రసాద్ వర్మ కోరడంతో ఇద్దరూ కలిసి ద్విచక్రవాహనంపై బొబ్బిలి రైల్వేస్టేషన్కు బయల్దేరి వెళ్తున్నారు. సరిగ్గా తారాపురం టీకాల లచ్చన్న గుడి వద్దకు వచ్చేసరికి వారికంటే ముందుగా ద్విచక్రవాహనంపై వెళ్తున్న అనకాపల్లి జిల్లా రామవరం గ్రామానికి చెందిన రామదాసు సొంతూరుకు వెళుతూ గుడిలో అమ్మవారిని దర్శించుకుందామని బైక్ స్లో చేశాడు. ఇంతలో వెనకనుంచి వస్తున్న ఇద్దరు స్నేహితులు ముందున్న బైక్ను ఢీకొట్టడంతో బైక్ వెనుక కూర్చున్న ప్రసాద్ వర్మ(42) ప్రమాదవశాత్తు తుళ్లిపోయి రోడ్డు దెబ్బతిన్నాడు. దీంతో తలకు తీవ్రగాయం కాగా, రామ్గోపాల్ గౌతమ్కు, రామదాసుకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమాచారం తెలుసుకున్న ఎస్సై వి.ప్రసాదరావు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రథమ చికిత్స నిమిత్తం గాయపడిన ముగ్గురిని బాడంగి సీహెచ్సీకి తరలించారు. అక్కడికి చేరుకునే సరికి ప్రసాద్ వర్మ మృతిచెందాడని వైద్యులు ధ్రువీకరించారు. ఈ మేరకు ఎస్సై ప్రసాదరావు కేసే నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
నేలమీద నే రాయాలా..!
రామభద్రపురం: పదో తరగతిలో అత్యధిక ఉత్తీర్ణత శాతం కోసం విద్యాశాఖ 100 రోజుల ప్రణాళిక అమలు చేస్తోంది. అందుకనుగుణంగా ఉపాధ్యాయులు సిలబస్ పూర్తి చేశారు. విద్యార్థులు రేయింబవళ్లు కష్టపడి చదువుతున్నారు. అయితే మా పాఠశాల విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించాలి. అందరూ ఉత్తమ మార్కులు పొందాలనే ఆలోచనే తప్ప..విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేందుకు పరీక్ష కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు ఉన్నాయా? లేదా? అని కనీస అలోచన చేయడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. పరీక్షకేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, అంతులేని నిర్లక్ష్యం చూపుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లావాప్తంగా 119 పరీక్ష కేంద్రాల్లో 447 ప్రభుత్వ, ప్రైవేట్ ఉన్నత పాఠశాలలకు చెందిన 22,939 మంది, గతంలో ఫెయిలైన విద్యార్థులు 835 మంది మొత్తం 23,774 మంది పరీక్షలు రాయనున్నారు. పదోతరగతే కీలకం పదో తరగతి ప్రతి విద్యార్థి జీవితంలో ఎంతో కీలకం. పదో తరగతిలో సాధించిన మార్కులే ఉన్నత విద్య, ఉద్యోగాల కోణంలో ప్రతి దశలోనూ పరిగణనలోకి తీసుకుంటున్నారు. అయితే ఉత్తమ మార్కులు సాధించాలంటే పరీక్షల కోసం బాగా చదవాలి. అలాగే చదివింది బాగా రాయాలంటే పరీక్ష రాసే గదిలో ప్రశాంత వాతావరణం ఉండాలి. ఈ నెల 17 నుంచి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ఆరంభం కానున్నాయి. ఈ పరీక్షలను విద్యార్థులు కూర్చుని రాసేందుకు బల్లలు, తాగునీరు, ఆ గదిలో ఫ్యాన్ వంటి కనీస మౌలిక సదుపాయాలు అవసరం. విద్యార్థి పరీక్ష రాసేటప్పుడు ఎంత బాగా సదుపాయం ఉంటే అంత బాగా రాసి ఉత్తమ ఫలితాలు సాధించగలడు. విద్యాలయాలు వందశాతం ఉత్తీర్ణత సాధించాలన్నా..అత్యధిక మార్కులు రావాలన్నా ఆయా పరీక్ష కేంద్రాల్లో వారు పరీక్ష రాసేందుకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాలు ఉండాలి. పలు పరీక్ష కేంద్రాలలో కనీస సదుపాయాలు లేవు. అందుకు నిదర్శనం రామభద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించే పరీక్ష కేంద్రం. ఇక్కడ సుమారు పది తరగతి గదులలో 250 మంది వరకు పరీక్షలు రాయనున్నారు. ఈ కేంద్రంలో విద్యార్థులు కూర్చుని పరీక్ష రాసేందుకు దాదాపు 120 బల్లలు అవసరం. పరీక్షలు ఇంకా పట్టుమని పది రోజులు కూడా లేవు. ఇప్పటివరకు ఒక్క గదిలో కూడా ఒక్క బెంచీ సమకూర్చిన పాపాన పోలేదు. ఒక్కగదిలో కూడా ఫ్యాన్ తిరగడం లేదని విద్యార్థులు చెబుతున్నారు.అలాగే ప్రశ్నపత్రాలు నేడో రేపో పోలీస్ స్టేషన్లకు రానున్నాయి. ఆ ప్రశ్న పత్రాలు భద్రపరిచేందుకు ట్రంకుపెట్టెలు అవసరం. వాటిని ఇప్పటివరకు సమకూర్చనట్లు తెలిసింది.తనిఖీలు తప్ప చర్యలు శూన్యం సమస్యల్లో పదోతరగతి పరీక్షా కేంద్రాలు కూర్చుని రాసేందుకు బల్లలు, తాగేందుకు నీరులేని పరిస్థితి గదులలో ఫ్యాన్లు, బాయ్స్కు బాత్రూమ్ సదుపాయం కరువు జిల్లావ్యాప్తంగా 119 పరీక్ష కేంద్రాలు హాజరుకానున్న విద్యార్థులు 23,774 మంది సమీపిస్తున్న పరీక్షలు విస్తుపోతున్న విద్యార్థులుహెచ్ఎం వసతులు సమకూర్చుతామన్నారు త్రిమెన్ కమిటీ పాఠశాలను సందర్శించి పరీక్షకేంద్రాల మౌలిక సదుపాయాలపై ఆరా తీసింది. అప్పట్లో పరీక్షల సమయానికి తాము సమకూర్చుతామని పాఠశాల హెచ్ఎం కామేశ్వరరావు లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చారు.సమకూర్చాల్సిన బాధ్యత ఆయనదే. ఎ.తిరుమలప్రసాద్, ఎంఈవో, రామభద్రపురంచాలా రోజుల క్రితం త్రిమెన్ కమిటీ వచ్చి పరీక్ష కేంద్రాలను పరిశీలించి వెళ్లింది. అలాగే ఇటీవల పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ తనిఖీచేసి వెళ్లారు. అయితే తనిఖీలు తప్ప తక్షణ చర్యలు లేవు. పరీక్షలు నిర్వహించే బాధ్యత ఎంఈవోలదేనని, వారే మౌలిక వసతులు సమకూర్చుతారని పాఠశాల యాజమాన్యం చూస్తోంది. అలాగే వేరే పాఠశాలల నుంచి 120 బల్లలు తేవడానికి, తిరిగి పంపించడానికి సుమారు రూ.25 వేల వరకు రవాణా ఖర్చులు అవుతున్నాయని, ఆ నిధులు ఎవరిస్తారని భావిస్తున్నట్లు తెలిసింది. పాఠశాల యాజమాన్యమే వసతులు సమకూర్చుతుంది. మాకేటి సంబంధం అన్న భావనలో ఎంఈవోలు ఉన్నట్లు సమాచారం. అయితే పరీక్షలు సమీస్తున్నాయి.ఇప్పటికీ వసతులు సమకూర్చలేదు.ఏమవుతుందో వేచి చూడాలి మరి. -
ఆయుష్శాఖలో సిబ్బంది కొరత
● హోమియో, ఆయుర్వేదం, యూనాని విభాగాల్లో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది అవసరం ● ఇబ్బందులు పడుతున్న రోగులు విజయనగరం ఫోర్ట్: అల్లోపతి వైద్యం చేయించుకోవడానికి కొంతమంది అసక్తి చూపుతుండగా, మరి కొంతమంది ఆయుష్ వైద్యం పట్ల అసక్తి కనబరుస్తున్నారు. అయితే ఆయుష్శాఖలో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది కొరత అధికంగా ఉంది. దీంతో రోగులకు వైద్యసేవలు పూర్తి స్థాయిలో అందడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఆయుష్శాఖ పరిధిలో హోమియో, ఆయుర్వేదం, యునాని, నేచురోపతి విభాగాలు ఉన్నాయి. జిల్లాలో కొన్ని చోట్ల హోమియో డిస్పెన్సరీలు ఉండగా, మరి కొన్ని చోట ఆయుర్వేదం డిస్పెన్సరీలు, యునాని, నేచురోపతి డిస్పెన్సరీలు ఉన్నాయి. వైద్యసిబ్బంది కొరత అధికంగా ఉన్నప్పటికీ కూటమి సర్కార్ ఖాళీలు భర్తీ చేయకుండా అలసత్వం వహిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. హోమియోలో 22 ఖాళీలు హోమియో విభాగంలో 16 డిస్పెన్సరీలు ఉన్నాయి. 16మంది వైద్యులకు గాను 13 మంది ఉన్నారు. మూడు వైద్యాధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాంపౌండర్లు 16 మందికి గాను ఆరుగురు మాత్రమే ఉన్నారు. 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్వీపర్కమ్ స్కావెంజర్ పోస్టులు 16 పోస్టులకు గాను ఏడుగురు ఉన్నారు. 9 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆయుర్వేదంలో.. ఆయుర్వేదం శాఖలో 16 డిస్పెన్సరీలు ఉన్నాయి. 16మంది వైద్యుల పోస్టులకు గాను 15 మంది ఉన్నారు. ఒక వైద్యాధికారి పోస్టు ఖాళీగా ఉంది. కాంపౌండర్ పోస్టులు ఏడుకుగాను ఇద్దరు ఉన్నారు. ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏఎన్ఎం పోస్టులు 8కి గాను ఇద్దరు ఉన్నారు ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అటెండర్ పోస్టులు ఐదుకుగాను ఐదు ఖాళీగా ఉన్నాయి. నర్సింగ్ ఆర్డర్లీ ఏడుకుగాను నలుగురు ఉన్నారు. మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిస్పెన్సరీ మూడు పోస్టులకు మూడు ఖాళీగా ఉన్నాయి. మెటర్నిటీ అసిస్టెంట్ ఒక పోస్టుకు గాను ఒక పోస్టు ఖాళీగా ఉంది నేచురోపతిలో.. నేచురోపతి డిస్పెన్సరీలు మూడు ఉన్నాయి. ముగ్గురు వైద్యులకుగాను ముగ్గురు ఉన్నారు. కాంపౌండర్లు ముగ్గురికి గాను ఒక్కరే ఉన్నారు. రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నర్సింగ్ ఆర్డర్లీ పోస్టులు మూడుకు గాను ఇద్దరు ఉన్నారు. ఒక పోస్టు ఖాళీగా ఉంది. యునానిలో.. యునాని డిస్పెన్సరీలు రెండు ఉన్నాయి. ఇద్దరు వైద్యులకు గాను ఒక్కరే ఉన్నారు. ఒక పోస్టు ఖాళీగా ఉంది. కాంపౌండర్ పోస్టులు రెండుకు గాను ఒక్కరే ఉన్నారు. ఒక పోస్టు ఖాళీగా ఉంది. స్వీపర్ కమ్ స్కావెంజర్ ఒక పోస్టుకుగాను ఒక్కరు ఉన్నారు. ఆయుష్శాఖలో వివిధ వ్యాధులకు చికిత్స ఆయుష్శాఖలో ఉన్న హోమియో, ఆయుర్వేదం, యునాని, నేచురోపతి విభాగాల ద్వారా వివిధ వ్యాధులకు వైద్యసేవలు అందిస్తారు. చర్మవ్యాధులు, పక్షవాతం, కీళ్లవాతం, నడుంనొప్పి, బీపీ, సుగర్, ఊబకాయం, సైనసైటిస్, ఆస్తమా, మూత్ర సంబంధిత, సొరియాసిస్, కామెర్లు తదితర వ్యాధులకు చికిత్స అందజేస్తారు. సిబ్బంది కొరత వాస్తవం ఆయుష్శాఖలో పారామెడికల్ సిబ్బంది కొరత ఉంది. ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలపై నివేదిక ఉన్నతాధికారుల వద్ద ఉంది. డాక్టర్ జి.వరప్రసాద్, సీనియర్ హోమియో వైద్యాధికారి -
కనీస వేతనం చెల్లించాలి
● ఏపీ సమగ్రశిక్ష అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ డిమాండ్ ● జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన విజయనగరం అర్బన్: కనీస వేతనం అందజేయాలని ఏపీ సమగ్రశిక్ష అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా కేజీబీవీల ఎదుట బుధవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఆందోళన చేశారు. సమ్మె ఒప్పందాల మేరకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు. ఈపీఎఫ్ అమలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో వెయిటేజీ, కారుణ్య నియామకాలు, నిర్ధిష్టమైన జాబ్ చార్టు, పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు, గ్రాట్యూటీ అమలు, ప్రతినెలా 1వ తేదీన వేతనాల చెల్లింపు తదితర డిమాండ్లు నెరవేర్చాలన్నారు. దీనికోసం ఈ నెల 11వ తేదీన విజయవాడ కేంద్రంలో నిరసన దీక్ష చేస్తామని ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర చైర్మన్ బి.కాంతారావు తెలిపారు. వివిధ మండలాల్లో చేపట్టిన నిరసనగా రాష్ట్ర కార్యవర్గం సభ్యులు రామకృష్ణ, ఉమామహేశ్వరరావు, లక్ష్మణరావు, శ్రీనివాస్, సతీష్, సర్వేశ్వరరావు, సీఆర్ఎంటీ నాయకులు రామకృష్ణ, కేజీవీబీ రాష్ట్ర నాయుకులు పి.తేజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. నేడు మద్యం షాపుల లాటరీ ● కల్లుగీత, సొండి కులాలకు విజయనగరం జిల్లాలో 16, పార్వతీపురం మన్యం జిల్లాలో నాలుగు షాపులు సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఉభయ విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో కల్లుగీత, సొండి కులాలకు కేటాయించిన 20 మద్యం షాపులకు సంబంధించిన లాటరీ ప్రక్రి య గురువారం నిర్వహించనున్నారు. కూటమి ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత ఇప్పటికే విజయనగరం జిల్లాలో 153, పార్వతీపురం మన్యం జిల్లాలో 52 మద్యం దుకాణాలను ప్రైవేట్ వ్యాపారులకు అప్పగించిన సంగతి తెలిసిందే. వాటికి ఇప్పుడీ 20 అదనం. జిల్లా యూనిట్గా కల్లు గీత, సొండి సామాజికవర్గాల వారికి వీటిని కేటాయించారు. శెట్టిబలిజ, యాత, సెగిడి, శ్రీసైన, సొండి సామాజిక వర్గాలకు చెందినవారు విజయనగరం జిల్లాలోని 16 దుకాణాల్లో కోటా ప్రకారం ఎక్కడివాటికై నా దరఖాస్తు చేసుకోడానికి అవకాశం ఇచ్చారు. అలా 308 దరఖాస్తులు వచ్చా యి. పార్వతీపురం మన్యం జిల్లాలో శ్రీసైన, సెగిడి, సొండి కులస్తులు నాలుగు దుకాణాల్లో కోటా ప్రకారం దరఖాస్తు చేసుకోవడానికి వెసులుబాటు కల్పించారు. దీంతో 60 దరఖాస్తులు దాఖలయ్యాయి. ‘లాటరీ’ ద్వారా కేటాయింపు... జిల్లా యూనిట్గా కోటా ప్రకారం దరఖాస్తు చేసుకోవడానికి ఒక్కో దరఖాస్తుకు రూ.2 లక్షల చొప్పున ప్రభుత్వం ఫీజు నిర్ణయించింది. ఏ4 మద్యం దుకాణాలను లాటరీ పద్ధతిలో కేటాయిస్తారు. ఫిబ్రవరి 6వ తేదీ వరకూ దరఖాస్తులు స్వీకరించారు. గత నెల 10వ తేదీన ఉభయ జిల్లాల్లో లాటరీ తీయడానికి ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో వాయిదా వేశారు. ఆ ప్రక్రియను ఈ నెల 6వ తేదీన నిర్వహించనున్నట్లు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఆఫీసర్ బి.శ్రీనాథుడు తెలిపారు. విజయనగరం జిల్లా లోని దుకాణాలకు సంబంధించి కలెక్టరేట్ కాంప్లెక్స్లోని ఆడిటోరియంలో ఉదయం 9 గంటలకు లాటరీ తీస్తారు. పార్వతీపురం మన్యం జిల్లాలో దరఖాస్తుదారులకు కూడా అదే సమయానికి కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో లాటరీ నిర్వహిస్తారు. శ్రీరాముడే ఆదర్శం ● త్రిదండి చినజియర్ స్వామి పార్వతీపురం: ప్రతి ఒక్కరూ శ్రీరాముడును ఆదర్శంగా తీసుకొని కుటుంబ, రాజ్యవ్యవస్థ ను నిర్వహించాలని త్రిదండి చినజీయరుస్వామి పిలుపునిచ్చారు. సర్వజీవరాశులను పరిరక్షించాల్సిన బాధ్యత మనుషులదేనన్నారు. పార్వతీపురం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వికాస తరంగణి అధ్యక్షుడు యిండుపూరు గున్నేశ్వరరావు అధ్యక్షతన బుధవారం నిర్వహించిన శ్రీరామ పాదుకా పట్టాభిషేకం వైభవంగా సాగింది. కార్యక్రమంలో పాల్గొన్న చినజియర్ స్వామి మాట్లాడుతూ పూర్వం సంప్రదాయలకు విలువ ఇచ్చేవారని, అందుకే వారంతా ఎంతో సుఖసంతోషాలతో జీవించేవారన్నారు. సమాజంలో జీవించే ప్రతిఒక్కరూ మంచిని కోరుకోవాలన్నారు. అనంతరం శ్రీరామ పట్టాభిషేకం పూజలను జరిపారు. భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. -
ముగిసిన కనకమహాలక్ష్మి జాతర
చీపురుపల్లి: భక్తుల కొంగుబంగారం కనకమహాలక్ష్మి అమ్మవారి 27వ జాతర మంగళవారం అర్ధరాత్రితో ముగిసింది. ఈ నెల 2, 3, 4 తేదీల్లో జరిగిన జాతరకు భక్తులు పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకున్నారు. సాంస్కృతిక ప్రదర్శనలు తిలికించేందుకు పెద్దఎత్తున తరలివచ్చారు. అమ్మవారి హుండీల ఆదాయం రూ.24,66,278 కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో హుండీల ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. మూడు రోజుల జాతరలో రూ.24,66,278ల ఆదాయం లభించినట్లు దేవదాయశాఖ ఈఓ బి.శ్రీనివాస్ తెలిపారు. టికెట్ల రూపంలో రూ.10,19,156లు, హుండీల నుంచి రూ.14,47,302లు, ఒక గ్రాము బంగారం, 80 గ్రాముల వెండి లభించిందన్నారు. దేవదాయశాఖ ఇన్స్పెక్టర్ జి.శ్యామ్ప్రసాద్ పర్యవేక్షణలో హుండీల ఆదాయం లెక్కింపు సాగింది. -
అంగన్వాడీ భవనాల్లో మౌలిక వసతులు కల్పించాలి
విజయనగరం ఫోర్ట్: అంగన్వాడీ భవనాల్లో మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ అన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం సాయంత్రం ఐసీడీఎస్ సిబ్బందితో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉండి, టాయిలెట్, విద్యుత్ సరఫరా లేని భవనాల కచ్చితమైన జాబితాను వెంటనే అందించాలని కోరారు. ప్రతి నెలా పిల్లల బరువును నమోదు చేసేటప్పడు కచ్చితంగా నమోదు చేయాలని స్పష్టం చేశారు. తప్పుడు సమాచారం ఇస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి అంగన్వాడీ కేంద్రాన్ని సూపర్వైజర్ తనిఖీ చేసి కార్యకర్త, ఆయా, ఆశ, ఏఎన్ఎంలను దగ్గర పెట్టుకుని పిల్లల బరువు, ఎత్తు నమెదు చేయాలని చెప్పారు. న్నారు. అందరి రిజిస్టర్లు ఒకేవిధంగా ఉండాలని ఆదేశించారు. పిల్లలకు పౌష్టికాహారం అందేలా చూడాలన్నారు. సమావేశంలో ఐసీడీఎస్ ఇన్చార్జి పీడీ ప్రసన్న, డీఎంహెచ్ఓ డాక్టర్ జీవనరాణి, విద్యుత్శాఖ ఎస్ఈ లక్ష్మణరావు, డీపీఓ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ బీఆర్. అంబేడ్కర్ -
వీడని జ్వరాలు
శృంగవరపుకోట: మండలంలోని గిరిశిఖర గ్రామాల చిన్నారులను జ్వరాలు వీడడం లేదు. మందులు వాడుతున్నా తగ్గినట్టే తగ్గి మళ్లీ సోకుతున్నాయంటూ చిన్నారుల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. మంచం పట్టిన చిన్నారులను చూసి తల్లడిల్లుతున్నారు. కొద్దిరోజుల కిందట ధారపర్తి పంచాయతీ పరిధిలోని గిరిజన గ్రామాల్లో వంటిపై పొక్కులు, తీవ్రమైన జ్వరంతో చిన్నారులు మంచం పట్టిన విషయం తెలిసిందే. ఎస్.కోట ఏరియా ఆస్పత్రికి తరలించి వైద్యం అందించడంతో ప్రాణాలు నిలబడ్డాయి. ఇప్పుడు రాయపాలెం, పల్లపుదుంగాడ పొర్లు, మున్నపురాయి గ్రామాల చిన్నారులను జ్వరాలు పట్టిపీడిస్తున్నాయి. రాయిపాలెంలో ముగ్గురు చిన్నారులు మలేరియాతోను, పల్లపుదుంగాడలో ఒక చిన్నారి వంటిపై పొక్కులతో బాధపడుతున్నారు. మందులు వాడుతున్నా జ్వరాలు తగ్గడంలేదంటూ తల్లిదండ్రులు మందుల సీసాలను చూపించి ఆవేదన చెందుతున్నారు. గిరిజనుల్లో ఆందోళన.. చిన్నారుల ఒంటిపై పొక్కులు రావడం, జ్వరాలు సోకడం, మరికొందరు తరచూ జ్వరాల బారిన పడుతుండడంతో తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. వైద్యులు వైద్యశిబిరాలు నిర్వహించి మందులు అందజేస్తున్నా జ్వరాల వ్యాప్తి కట్టడికాకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. జ్వరాలకు కారణం నీరు, గాలి, పర్యావరణ కాలుష్యాలు ఏమైనా కావచ్చని వైద్యులు చెబుతున్నా... స్పష్టమైన కారణం నేటికీ నిర్ధారణ కాలేదు. ఇప్పటికై నా మూలాలు కనుక్కుని వైద్య సేవలు అందించాలని, జ్వరాలను కట్టడిచేయాలని గిరిజన యువకులు కోరుతున్నారు. అస్వస్థతకు గురవుతున్న చిన్నారులు కారణాలపై స్పష్టత కరువు ఆవేదనలో గిరిజన ప్రజలు కంటితుడుపు వైద్యమే... జ్వరాలు, వంటిపై పొక్కులతో చిన్నారులు అవస్థలు పడుతున్నారు. వైద్య బృందాలు వచ్చివెళ్లినా జ్వరాలు మాత్రం తగ్గుముఖం పట్టలేదు. జ్వరాల నివారణకు వైద్యులు చర్యలు తీసుకోవాలి. గిరిశిఖర గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందజేయాలి. – జె.గౌరీష్, ఏపీ గిరిజన సంఘం నేత -
ఆశలు ఆవిరి
సాక్షి ప్రతినిధి, విజయనగరం: శాసనసభకు వెళ్లడానికి వీలుగా టికెట్ ఇవ్వనప్పుడు కనీసం శాసనమండలికై నా వెళ్లి ‘అధ్యక్షా...’ అనడానికి అవకాశం వస్తుందని ఆశించిన స్థానిక టీడీపీ నాయకులకు నిరాశే ఎదురైంది. ఎప్పటివలే ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తన మోసపూరిత మార్కురాజకీయం చూపించారు. సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను ఊరించి ఉసూరుమనిపించినట్టే .. పార్టీ నాయకులను ఎన్నికల్లో వాడుకుని ఇప్పుడు వదిలేశారు. దీనిపై ఆ పార్టీ నాయకుల అనుచరగణం భగ్గుమంటోంది. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎమ్మెల్సీ ఆశ చూపించి అన్యాయం చేశారని మండిపడుతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక తొలిసారి ఎమ్మెల్యేల కోటాలో ఐదు ఎమ్మెల్సీ సీట్లను గెలుచుకునే అవకాశం వచ్చింది. దీంతో తమకు అవకాశం వస్తుందని విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పలువురు టీడీపీ స్థానిక నాయకులు ఆశలు పెట్టుకున్నారు. గతంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల కాలంలో ఏ కోటాలో ఎమ్మెల్సీలను పంపడానికి అవకాశం వచ్చినా ఉత్తరాంధ్రకు పెద్దపీట వేసేవారు. అలా.. విజయనగరం జిల్లా నుంచి డాక్టర్ పెనుమత్స సురేష్బాబు, ఇందుకూరి రఘురాజు శాసనమండలిలో అడుగుపెట్టడానికి అవకాశం వచ్చింది. సురేష్బాబుకై తే రెండోసారి కూడా ఎమ్మెల్సీ పదవి దక్కింది. అలాగే చంద్రబాబు కూడా తమకు అవకాశం ఇవ్వకపోతారా? అని ఆశించిన ఉభయ జిల్లాల నాయకులకు ఆశాభంగమైంది. ఒక అవకాశం ఇవ్వకపోతారా అని అధిష్టానం వద్ద విశ్వ ప్రయత్నాలు చేసినా తుదకు ఆశావహుల జాబితాలోనూ వారిని పరిగణనలోకి తీసుకోకపోవడం గమనార్హం. ఊరించి.. ఉసూరుమనిపించి... గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ టికెట్ వస్తుందని కర్రోతు బంగార్రాజు, గొంప కృష్ణ, కిమిడి నాగార్జున, బొబ్బిలి చిరంజీవులు, ఆర్పీ భంజ్దేవ్, తెంటు లక్ష్మునాయుడు, కేఏ నాయుడు, కావలి గ్రీష్మ... ఇలా పలువురు నాయకులు తమ నియోజకవర్గాల్లో పట్టు పెంచుకున్నారు. టికెట్ ఇవ్వకపోతే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎక్కడ టీడీపీ అభ్యర్థులకు దెబ్బ కొడతారోనని ఊహించిన చంద్రబాబు... వారందర్నీ ‘ఎమ్మెల్సీ’ ఆశల పల్లకి ఎక్కించారు. వారంతా మనసు మార్చుకొని పార్టీలో తమ పోటీదారులకు మద్దతు పలికారు. ఎలాగో గెలిచి పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో వారంతా అధిష్టానం తమకు ఇచ్చిన హామీ నెరవేర్చుతుందని ఆశించారు. నామినేటెడ్ పదవులతో సరి... ఎమ్మెల్యే అవదామనుకున్న కర్రోతు బంగార్రాజు తనకు కనీసం ఎమ్మెల్సీ పదవి వస్తుందని ఆశించారు. కానీ ఆయనకు నామినేటెడ్ పదవి ఇవ్వడంతో మిన్నకుండక తప్పలేదు. ఆర్పీ భంజ్దేవ్, తెంటు లక్ష్మునాయుడు, కావలి గ్రీష్మలతో పాటు బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావుకు కూడా నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు. అలా వారు కూడా ఎమ్మెల్సీ సీటు ఆశించకుండా నీళ్లు చల్లేశారు. ఇక మిగిలింది గొంప కృష్ణ, కిమిడి నాగార్జున, బొబ్బిలి చిరంజీవులతో పాటు మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు. తమకు నామినేటెడ్ పదవి ఇవ్వలేదంటే ఎమ్మెల్సీ సీటు వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. అధిష్టానం వద్ద విశ్వప్రయత్నాలు చేసినా చివరకు వారి పేర్లు పరిశీలనలోకై నా తీసుకోలేదని తెలిసి మౌనంగా ఉండిపోయారు. ‘కొల్ల’కై తే ఇప్పటికీ నిరాశే... టీడీపీ అధిష్టానం హామీ ఇచ్చిందంటే ఎమ్మెల్సీ పదవి ఎంతవరకూ వస్తుందో టీడీపీ సీనియర్ నాయకుడు కొల్ల అప్పలనాయుడే ఓ ఉదాహరణ. రాజాం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని సంతకవిటి మండలంలో తూర్పుకాపు సామాజికవర్గానికి చెందిన ఆయన గతంలో ఎంపీపీగా మూడు పర్యాయాలు పనిచేశారు. మరో రెండు దఫాలు తన అనుచరులను ఎంపీపీ పదవిలో కూర్చోబెట్టారు. తన భార్యను కూడా జెడ్పీటీసీగా ఒక పర్యాయం గెలిపించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన్ను వాడుకొనే ఉద్దేశంతో చంద్రబాబు తాయిలం వేశారు. శ్రీకాకుళం జిల్లాపరిషత్ చైర్మన్ను చేస్తానని ఆశ చూపించారు. తీరా టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొండిచేయి చూపించారు. చౌదరి బాబ్జీ భార్య చౌదరి ధనలక్ష్మికి చంద్రబాబు ఆ పదవి కట్టబెట్టారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన కొల్ల అప్పలనాయుడిని బుజ్జగించడానికి చంద్రబాబు ఎమ్మెల్సీ అస్త్రం ఉపయోగించారు. 2017 ఫిబ్రవరిలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. అప్పుడు టీడీపీ టికెట్ తనకు ఇస్తారని ఆశించిన కొల్లకు చంద్రబాబు మళ్లీ జెల్లకొట్టారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వలస వచ్చిన శత్రుచర్ల విజయరామరాజుకు ఆ టికెట్ ఇచ్చేశారు. దీంతో రెబెల్గా బరిలోకి దిగేందుకు కొల్ల అప్పలనాయుడు సిద్ధమయ్యారు. నాడు శ్రీకాకుళం జిల్లా ఇన్చార్జి మంత్రిగానున్న పరిటాల సునీత, ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు హుటాహుటిన కొల్ల స్వగ్రామం మామిడిపల్లి వెళ్లి మరీ ఆయనను బుజ్జగించారు. నామినేటెడ్ పదవి ఇస్తామని, సముచిత స్థానం కల్పిస్తామని హామీల వర్షం కురిపించారు. ఆ తర్వాత రెండేళ్ల పాటు టీడీపీ అధికారంలో ఉన్నా కొల్ల కల నెరవేరలేదు. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా కొల్లను కనీసం పట్టించుకోలేదు. అలా ఆయన ‘ఎమ్మెల్సీ’ ఆశ ఇప్పటికీ నెరవేర లేదు. అదీ చంద్రబాబు మార్క్ రాజకీయం. అధ్యక్షా.. అనాలనుకున్న టీడీపీ నాయకుల ఆశలపై నీళ్లు ఉమ్మడి విజయనగరం నుంచి ఏ ఒక్కరికీ దక్కని ఎమ్మెల్సీ సీటు సార్వత్రిక ఎన్నికల్లో రెబెల్స్కు చంద్రబాబు గట్టి హామీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీ పదవిపై స్థానిక నాయకుల ఆశలు ఐదు ఖాళీల్లో అవకాశమిస్తారని అధిష్టానం వద్ద ప్రయత్నాలు కనీసం పరిశీలన జాబితాలోనూ పేరు లేకపోవడంతో నిరాశ! -
నేటి నుంచి జామి ఎల్లారమ్మ జాతర
శృంగవరపుకోట: భక్తుల కొంగుబంగారం జామి ఎల్లారమ్మ జాతరకు సర్వం సిద్ధమైంది. గురువారం నుంచి మూడురోజుల పాటు జరగనున్న జాతరకు జిల్లా యంత్రాంగం, దేవదాయశాఖ, ఆలయ కమి టీ సభ్యులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఏటా మహాశివరాత్రి తర్వాత 9వ రోజున వచ్చే అష్టమినాడు ఎల్లారమ్మ పండుగ నిర్వహించడం ఆనవాయితీ. అమ్మవారి ఘటాలను గద్దె ఇంటి నుంచి ముహూర్తానికి ప్రధాన ఆలయానికి తీసుకెళ్తారు. గురువారం అమ్మవారి తొలేళ్ల ఉత్సవం, శుక్రవారం పెద్ద తీర్థం నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. జాతరకు పెద్దసంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో క్యూలు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 200 మంది పోలీసులతో బందోబస్తు విధులు నిర్వహిస్తామని ఎస్ఐ వీరజానార్దన్ తెలిపారు. భక్తుల రాకపోకలకు అనువుగా ట్రాఫిక్ ఆంక్షలు విధించామన్నారు. ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు -
ముందస్తు అరెస్టులు
బొబ్బిలి: ఆశ వర్కర్ల ఆవేదన గళం వినిపించకుండా నొక్కేసే చర్యలకు కూటమి ప్రభుత్వం ఉపక్రమించింది. ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 6న విజయవాడలో నిర్వహించే ధర్నాకు ఎవరూ తరలివెళ్లకుండా ముందస్తు అరెస్టులకు ఆదేశాలిచ్చింది. ఈ క్రమంలో సీపీఎం నాయకులు ఎ.సురేష్, బలస శ్రీనివాసరావును పోలీసులు అరెస్టుచేసి బొబ్బిలి స్టేషన్కు తరలించారు. ఇది సరైన విధానం కాదని, ఉద్యమాలను అణచలేరని, పరిష్కారం ఒక్కటే మార్గమని నాయకులు ఉద్ఘాటించారు. పోలీస్ స్టేషన్లో సీపీఎం నాయకులు శ్రీనివాసరావు, సురేష్ -
మెనూ అమలు చేయకుంటే చర్యలు
లక్కవరపుకోట: సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హాస్టల్స్లో ప్రభుత్వం సూచించిన మెనూ కచ్చి తంగా అమలుచేయాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని ఆ శాఖ డీడీ బి.రామానందం హెచ్చరించారు. ఎల్.కోట ఎస్సీ బాలుర వసతిగృహ విద్యా ర్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ‘ఆరుబయట స్నానం.. నేలపైనే నిద్ర’ అనే శీర్షికన ‘సాక్షి’లో బుధవారం ప్రచురితమైన వార్తకు సాంఘిక సంక్షేమశాఖ డీడీ స్పందించారు. వసతి గృహాన్ని పరిశీలించారు. హాస్టల్లో మెనూ అమలు, సౌకర్యాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాలు, పండ్లు ఇవ్వడంలేదని, మెనూ అమలుచేయడంలేదని డీడీకి విద్యార్థులు తెలిపారు. మంచినీటి ట్యాంక్ పగిలిపోయి నెలలు గడుస్తున్నా మరమ్మతులు చేయించకపోవడంపై వార్డెన్ కొల్లు గౌరినాయుడుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. డీడీ దగ్గరుండి కొత్త వాటర్ ట్యాంక్ను, వంట చేసేందుకు అనువుగా పొయ్యిని ఏర్పాటుచేయించారు. మెనూలో పొందుపర్చిన వంటలను కచ్చితంగా వడ్డించాల్సిందేనని, లేదంటే నేరుగా ఫోన్చేసి తెలియజేయాలని విద్యార్థులకు తన ఫోన్నంబర్ను ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడు తూ వసతిగృహ సమస్యలను గుర్తించామని, మెనూ అమలుతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు కృషిచేస్తామన్నారు. వసతిగృహ నిర్వహణలో నిర్లక్ష్యం, మెనూ చార్టు అమలుచేయకపోవడంపై హాస్టల్ వార్డెన్కు షోకాజ్ నోటీస్ జారీచేశామన్నారు. నివేదికను కలెక్టర్కు అందజేసి తదపరి చర్యలు తీసుకుంటామని డీడీ తెలిపారు. సాంఘిక సంక్షేమశాఖ డీడీ రామానందం ఎల్.కోట ఎస్సీ బాలుర వసతిగృహం సందర్శన మెనూ అమలు, సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్న డీడీ హాస్టల్ వార్డెన్కు షోకాజ్ నోటీస్ జారీ -
ఆరోగ్యమే మహాభాగ్యం
విజయనగరం అర్బన్: ఆరోగ్యమే మహాభాగ్యమని, విద్యార్థినులు విద్యాబుద్ధులతో పాటు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని జేఎన్టీయూ ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ డి.రాజ్యలక్ష్మి సూచించారు. యూనివర్సిటీ ‘మహిళా సాధికారత మరియు ఫిర్యాదుల విభాగం’ ఆధ్వర్యంలో వర్సిటీలో బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. విద్యార్థి దశ నుంచి ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువులో రాణించగలమన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ దేవిమాధవి మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన జీవనానికి మంచి ఆహారపు అలవాట్లు దోహదపడతాయని తెలిపారు. అనంతరం మహిళా ఆరోగ్యం అంశంగా నినాదాలుచేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ జి.జయసుమ, బి.నళిని, వివిధ విభాగాల మహిళా అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు. జేఎన్టీయూ జీవీ ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ రాజ్యలక్ష్మి ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం -
జాతీయ జెండాకు అవమానం
విజయనగరం: విజయనగరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాకు ఘోర అవమానం జరిగింది. సిద్ధాంతాలకు పేటెంట్ మా నాయకుడు అని చెప్పుకుని తిరిగే జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు తమ కార్యాలయంలోనే జాతీయ పతాకాన్ని అవమానకర రీతిలో మూలనపడేయడమే కాకుండా జెండాపై తాగిన టీ కప్పులు వేయడం ఘోర తప్పిదమని కార్యాలయానికి విచ్చేసిన పలువురు పేర్కొన్నారు. ఈ నెల 14న జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్టీ నాయకులు పాలవలస యశస్వి, పడాల అరుణ, గురాన అయ్యలు మంగళవారం విలేకరుల సమా వేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ఉన్న బీరువా పక్కన జాతీయ పతాకాన్ని మూలనపడేసి ఉన్న విషయాన్ని అక్కడికి విచ్చేసిన జనసేన కార్యకర్తలు చూడడమే కాకుండా వాటిపై తాగిన టీ కప్పును పడేయడం అవమానకరమని పలువురు పేర్కొంటున్నారు. జాతీయ పతాకాన్ని అవమానించిన జనసేన నాయకులు, కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. జనసేన కార్యాలయంలో మూలన పడేసిన జెండాపై తాగి పడేసిన టీ గ్లాసులు -
వేతన వ్యత్యాసాలు లేకుండా చూడాలి
విజయనగరం అర్బన్: ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ సిబ్బందికి వేతన సదుపాయా లు కల్పించాలని ఆర్టీసీ ఎన్ఎంయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎస్.రాజేష్కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన జోనల్ మహాసభలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వంలో విలీనమైన ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు. నైట్ అవుట్ అలవెన్స్లు, పెన్షన్, పీఎఫ్ అధికంగా ఇప్పించాలని డిమాండ్ చేశారు. 1/2019 సర్క్యులర్ను తిరిగి యథాతథంగా అమలుచేయాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి పీవీవీ మోహన్, జోనల్ కమిటీకి నూతనంగా ఎన్నికై న బీఎస్ రాములు, జోనల్ అధ్యక్ష కార్యదర్శులు ప్రదీప్ కుమార్, ఎంవీఆర్ మూర్తి, జిల్లా కార్యదర్శి పీజీ రాఫిల్, జోన్ పరిధిలోని 18 డిపోల అధ్యక్ష, కార్యదర్శులు, మహిళాఉద్యోగులు పాల్గొన్నారు. ఆర్టీసీ ఎన్ఎంయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి రాజేష్కుమార్ -
ఆరుబయట స్నానం..నేలపైనే నిద్ర!
ఆరుబయట తాటిపూడి పైప్లైన్ నుంచి వచ్చిన నీటితో స్నానాలు చేస్తున్న విద్యార్థులుసరిగా భోజనం పెట్టడం లేదు హాస్టల్లో సక్రమంగా భోజనం పెట్టడం లేదు. తరచూ అస్వస్థతకు గురవుతు న్నాం. అందుకే తల్లిదండ్రులు ఇంటి వద్ద నుంచే మమ్మలను స్కూల్కు వెళ్లమంటున్నారు. నైట్ వాచ్మన్ రోజూ మా స్కూల్ వద్దకు వచ్చి మాతో బయోమెట్రిక్ను వేయించుకుంటున్నారు. – జి.యోగేంద్ర, 7వ తరగతి, జి.రాంజీ 8వ తరగతి, ఏపీ మూడల్ స్కూల్ ఎవరూ పట్టించుకోలేదు మెనూ బాగోలేదని హాస్టల్కు వచ్చిన ప్రతీ అధికారికి చెబుతున్నాం. ఎవరూ పట్టించుకోవడం లేదు. 7 నెలల నుంచి పాలు ఇవ్వడం లేదు. పండ్లూ లేవు. మా సమస్య ఎవరికి చెప్పుకోవాలి. – కె.తరుణ్, వి.రామచైతన్య నీరులేక ఇబ్బందులు పడుతున్నాం హాస్టల్లోని వాటర్ట్యాంక్ పగిలిపోయింది. నాటి నుంచి స్నానాలకు నీళ్లు లేవు. తాటిపూడి పైప్లైన్ నుంచి నీరు వచ్చిన సమయంలోనే స్నానం చేయాలి. కాస్త ఆలస్యమైనా ఆ పూట స్నానం లేనట్లే. మంచాలు కూడా లేవు. కిందనే పడుకుంటున్నాం. మా వార్డెన్ పగటిపూట హాస్టల్కు రావడం లేదు. – పి.వెంకట్రాది, జె.మోక్షత్సాయి లక్కవరపుకోట: వారందరూ పేదకుటుంబాలకు చెందిన పిల్లలు. తమ భవితను బంగారుమయం చేసుకోవాలని తలచారు. ఎల్.కోట సాంఘిక సంక్షేమ వసతిగృహంలో చేరి స్థానికంగా ఉన్న ఏపీ మోడల్ స్కూల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్నారు. వారిని సమస్యలు చుట్టుముట్టాయి. వసతి గృహంలో కనీస సదుపాయాలు కరువయ్యాయి. చదువుకునేందుకు ఆహ్లాదకర వాతావరణం లేకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. వార్డెన్ పర్యవేక్షణ లేదు. ఆయన హాస్టల్కు ఎప్పుడు వస్తారో తెలియదు. మెనూ చార్టు గోడలకే పరిమితమవుతోంది. కంచంలో భోజనం చూసి చిన్నారులు ఆందోళన చేయని రోజు లేదు. హాస్టల్కు వచ్చే ప్రతి అధికారికి గోడు వినిపిస్తున్నా పట్టించుకునేవారే కరువయ్యారన్నది వారి వాదన. 50 విద్యార్థుల్లో కొందరు సమస్యల నడుమే చదువులు సాగిస్తుండగా.. సుమారు 20 మంది వారి ఇళ్ల నుంచే పాఠశాలలకు వెళ్తున్నారు. వీరి భోజనం బిల్లు కాజేసేందుకు వార్డెన్ సూచనలతో వాచ్మన్ ప్రతిరోజూ పాఠశాలల వద్ద కాపుకాసి బయోమెట్రిక్ నమోదుచేస్తుండడం గమనార్హం. ● అమలుకాని మెనూ.. వసతిగృహంలో మెనూ సరిగా అమలుకావడంలేదని విద్యార్థులు చెబుతున్నారు. ప్రతిరోజు ఉదయం 7 గంటలకు పాలు ఇవ్వాల్సి ఉన్నా గత 7 నెలల నుంచి అమలుకావడం లేదు. స్నాక్స్ పరిస్థితీ అంతే. వారానికి రెండు రోజులు మాత్రమే గుడ్డు భోజనం పెడుతున్నారు. గుడ్లు సైతం ఉడికీ ఉడకనివి పెడుతున్నారని చిన్నారులు వాపోతున్నారు. ● కానరాని సదుపాయాలు... హాస్టల్లో ఐదు నెలల కిందట స్లాబ్పైన గల నీటి ట్యాంక్ పగిలిపోయింది. అంతే.. నీటికి తిప్పలు తప్పడం లేదని చిన్నారులు వాపోతున్నారు. తాటిపూడి నుంచి వచ్చిన నీటితో ఆరుబయట స్నానాలు చేస్తున్నారు. విద్యార్థులకు సరిపడా మంచాలు లేకపోవడంతో కటిక నేలపైనే నిద్రిస్తున్నారు. హాస్టల్లో అన్నీ వాచమన్ చూస్తున్నారని, రాత్రిపూట మాత్రమే వార్డెన్ వచ్చి వెళ్తారని చిన్నారులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని వార్డెన్ కొల్లు గౌరినాయుడును వివరణ కోరేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేరు. జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి బి.రామానందం వద్ద హాస్టల్ దుస్థితిని ప్రస్తావించగా ఇది వరకే హాస్టల్లో పిల్లల ఇబ్బందులు మా దృష్టికి వచ్చాయన్నారు. బుధ వారం హాస్టల్ను పరిశీలించి మెనూ సక్రమంగా అమలయ్యేలా చూస్తానని, విద్యార్థులకు సౌక ర్యాలు మెరుగు పరుస్తామని తెలిపారు. -
జాతీయ జెండాకు అవమానం
విజయనగరం: విజయనగరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాకు ఘోర అవమానం జరిగింది. సిద్ధాంతాలకు పేటెంట్ మా నాయకుడు అని చెప్పుకుని తిరిగే జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు తమ కార్యాలయంలోనే జాతీయ పతాకాన్ని అవమానకర రీతిలో మూలనపడేయడమే కాకుండా జెండాపై తాగిన టీ కప్పులు వేయడం ఘోర తప్పిదమని కార్యాలయానికి విచ్చేసిన పలువురు పేర్కొన్నారు. ఈ నెల 14న జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్టీ నాయకులు పాలవలస యశస్వి, పడాల అరుణ, గురాన అయ్యలు మంగళవారం విలేకరుల సమా వేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ఉన్న బీరువా పక్కన జాతీయ పతాకాన్ని మూలనపడేసి ఉన్న విషయాన్ని అక్కడికి విచ్చేసిన జనసేన కార్యకర్తలు చూడడమే కాకుండా వాటిపై తాగిన టీ కప్పును పడేయడం అవమానకరమని పలువురు పేర్కొంటున్నారు. జాతీయ పతాకాన్ని అవమానించిన జనసేన నాయకులు, కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. జనసేన కార్యాలయంలో మూలన పడేసిన జెండాపై తాగి పడేసిన టీ గ్లాసులు -
గాదె గెలుపుతో సంబరాలు
మెరకముడిదాం: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గాదె శ్రీనివాసులునాయుడు గెలుపుతో పీఆర్టీయూ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ ఆధ్యక్షుడు ఆల్తిరాంబాబు, పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు మంగళవారం కేక్ కట్ చేశారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి గాదె శ్రీనివాసులునాయుడు అనుభవం దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆర్.సింహాద్రి, ఆల్తి శ్రీహరి, టి.వి.వి.ఎల్.నరసింహం, సత్తారు రమణ, తదితరులు పాల్గొన్నారు. మేధావుల తీర్పు... కూటమికి ఓ గుణపాఠం ● గెలిచిన అభ్యర్థులు మా పార్టీ వారేనని చెప్పుకోవడం సిగ్గుచేటు ●● కూటమి నాయకుల తీరుచూసి నవ్యుకుంటున్న మేధావివర్గం ● మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర సాలూరు రూరల్: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేధావులు ఇచ్చిన తీర్పు కూటమి ప్రజావ్యతిరేక పాలనకు చెంపపెట్టు అని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర అన్నారు. సాలూరు పట్టణంలోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్సీ అభ్యర్థి పాకలపాటి రఘవర్మను గెలిపించాలంటూ ఊరూరా తిరుగుతూ, గురువులపై ఒత్తిడి తెచ్చిన కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలకు తగిన గుణపాఠం చెప్పారన్నారు. మేధావుల తీర్పును సామాన్యులు సైతం స్వాగతిస్తున్నారన్నారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రివి అర్థంలేని మాటలుగా పేర్కొన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన గాదె శ్రీనివాసులునాయుడు తమవాడే అంటూ ప్రకటించడాన్ని చూసి మేధావివర్గం నవ్యుకుంటోందన్నారు. 9 నెలల పాలనలో ఉపాధ్యాయుల పీఆర్సీ, ఈఆర్, పెండింగ్ బిల్లుల వంటి సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం కనీసం చొరవ చూపకపోవడంతో తగ్గిన బుద్ధిచెప్పారన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు ప్రజాసేవలో ఉత్సాహంగా ఉండాలని, కూటమి పాలనపై వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేధావుల తీర్పు తేటతెల్లం చేసిందన్నారు. ప్రభుత్వ తీరుపై నిరసన కొమరాడ: జంఝావతి రిజర్వాయర్ ఆధునికీకరణ పనులకు బడ్జెట్లో కనీస స్థాయిలో నిధు లు కేటాయించకపోవడంపై ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మరిశర్ల మాలతీ కృష్ణమూర్తి నాయుడు మండిపడ్డారు. ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. దీనికి నిరసనగా జంఝావతి రబ్బర్డ్యాం వద్ద మంగళవారం ఒంటికాలిపై నిల్చొని నిరసన తెలిపారు. ముందుగా నదికి పుష్పాభిషేకం చేశారు. జంఝావతికి నిధులు తేవడంలో ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు విఫలమయ్యారన్నారు. ఒడిశాతో ఉన్న సమస్యను పరిష్కరించలేకపోవడం విచారకరమన్నారు. రిజర్వాయర్ పూర్తిస్థాయిలో నిర్మితమై తే ఈ ప్రాంత రైతులకు మేలు జరుగుతుందన్నారు. వలసలు తగ్గముఖం పడతాయని పేర్కొన్నారు. -
మాదకద్రవ్యాల నిర్మూలనకు ఈగల్ టీమ్స్
విజయనగరం క్రైమ్: మాదక ద్రవ్యాల నిర్మూలనకు అన్ని విద్యా సంస్థల్లోనూ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈగల్ టీమ్స్ను ఏర్పాటుచేయాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన నార్కోటిక్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. మాదక ద్రవ్యాలవల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించాలన్నారు. జిల్లాలో ని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్, కళాశాలలు, ఇంజినీరింగ్, మెడికల్, ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాల ల్లో ‘సంకల్పం’ కింద డ్రగ్స్ వినియోగం, వాటివల్ల కలిగే దుష్ప్రభావాలను ప్రచారం చేయాలన్నారు. ప్రతిరోజూ ప్రార్థన నిర్వహించే సమయంలో ఉపాధ్యాయులు 10 నిమిషాలపాటు డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరించాలన్నారు. డీ అడిక్షన్ సెంటర్ పనిచేసేందుకు అవసరమైన ప్రతిపాదనలు తయారుచేసి అందజేయాలని కోరారు. డ్రగ్స్ నియంత్రణకు పోలీస్, డ్రగ్స్ విభాగం సంయుక్తంగా దాడులు నిర్వహించాలని ఆదేశించారు. ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా గంజాయిసాగు లేదన్నారు. ఏఎస్ఆర్, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి గంజాయి రవాణా జరుగుతుందన్నారు. దీనిని కట్టడిచేసేందుకు ఐదు పోలీస్ చెక్ పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. గంజాయి వ్యాపారంతో ఆస్తులు కూడబెట్టిన నిందితుడికి చెందిన రూ.1.96 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్చేశామన్నారు. ఇప్పటికే జిల్లాలో లక్షా 18 వేల మంది విద్యార్థులకు అవగాహన కల్పించామని తెలిపారు. పోలీస్ శాఖ చేపట్టిన కార్యక్రమాలు, ప్రగతిని ఎస్పీ వకుల్జిందల్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. సమావేశంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డీఆర్టీఓ శ్రీనివాసరావు, విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు, బొబ్బిలి డీఎస్సీ జి.భవ్యారెడ్డి, ఆర్డీఓలు పాల్గొన్నారు. -
రేషన్ కష్టాలు..!
21 చోట్ల ఆపరేటర్ల రాజీనామా జిల్లాలో 370 ఎండీయూ వాహనాలు ఉన్నాయి. 21 చోట్ల ఆపరేటర్లు రాజీనామా చేశారు. అక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా డీలర్ల ద్వారా సరుకులు సరఫరా చేస్తున్నాం. మిగిలిన చోట్ల ఎండీయూ వాహనాలతో సరుకులు అందజేస్తున్నాం. – కె.మధుసూదనరావు, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి●విజయనగరం ఫోర్ట్: రేషన్ సరుకుల పంపిణీలో మళ్లీ పాతరోజులు వచ్చే సమయం దగ్గర పడింది. నిత్యావసర సరుకుల కోసం గంటలు, రోజుల తరబడి క్యూ కట్టాల్సిందే. పని మానుకుని సరుకుల కోసం వేచి చూడాల్సిందే. ఇప్పటికే చాలా గ్రామాల ప్రజలకు ఎండీయూ వాహన సేవలు అందడం లేదు. వారంతా రేషన్డిపో వద్దకు వెళ్లి సరుకులు తెచ్చుకుంటున్నారు. వాహన డ్రైవర్లు మానేసిన చోట కొత్తవారిని ప్రభుత్వం నియమించకపోవడమే దీనికి కారణం. గతంలో నడవలేని వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, మంచాలపై ఉన్న వారు రేషన్ సరుకుల కోసం వెళ్లలేకపోయేవారు. సరుకులు విడిపించేవారు కాదు. పేదలందరికీ రేషన్ సరుకులు అందాలన్న ఉద్దేశంతో పాటు స్థానిక యువతకు ఉపాధి చూపాలన్న లక్ష్యంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎండీయూ వాహన సేవలను అందుబాటులోకి తెచ్చింది. పల్లెలు, పట్టణాల్లోని వీధివీధి తిరుగుతూ లబ్ధిదారులకు సరుకులు అందజేసేది. ఇంటిముందరకే వాహనం రావడంతో వృద్ధులు, దీర్ఘకాలిక రోగులు సైతం సులభంగా రేషన్ సరుకులు తీసుకునేవారు. ఇప్పుడు ఈ సేవలపై నిర్లక్ష్యం అలముకుంది. వాహన సేవలు ఒక్కొక్కటిగా దూరమవుతున్నాయి. జిల్లాలో 370 ఎండీయూ వాహనాలు... జిల్లాలో ఎండీయూ వాహనాలు 370 ఉన్నాయి. వాటిలో 21 ఎండీయూ ఆపరేటర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బాడంగి మండలం, బొబ్బిలి, దత్తిరాజేరు, డెంకాడ, గంట్యాడ, గుర్ల, కొత్తవలస, ఎల్.కోట, మెరకముడిదాం, పూసపాటిరేగ, రేగిడి ఆముదాలవలసలో ఒక్కొక్కటి చొప్పున, భోగాపురంలో–2, గరివిడిలో–03, ఎస్.కోటలో 03, విజయనగరంలో–2 చొప్పున ఎండీయూ ఆపరేటర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయడంలో కూటమి ప్రభుత్వం జాప్యం చేయడంతో లబ్ధిదారులకు రేషన్ కష్టాలు తప్పడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 5,71,354 రైస్ కార్డుదారులు ఉన్నారు. వీరికి సరుకులు పంపిణీకి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. రేషన్ డిపో వద్ద సరుకులు తీసుకుంటున్న దృశ్యం విజయనగరం మండలం జొన్నవలస గ్రామం. ఇంటిముందుకే వచ్చి సరుకులు ఇచ్చే ఎండీయూ (మొబైల్ డిస్పెన్షరీ యూనిట్) వాహనం రాకపోవడంతో రేషన్ డిపో వద్దకే వెళ్లి లబ్ధిదారులు ప్రతినెలా సరుకులు తీసుకుంటున్నారు. గంట్యాడ మండలంలోని తాటిపూడి, మధుపాడ గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి. జిల్లాలో కొన్నిచోట్ల డిపోలకు వెళ్లి సరుకులు తీసుకోవాల్సిన దుస్థితి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో లబ్ధిదారుల ఇంటివద్దకే రేషన్ జిల్లాలో 370 ఎండీయూ యూనిట్స్ 21 చోట్ల ఎండీయూ ఆపరేటర్ల ఖాళీ భర్తీలో కూటమి ప్రభుత్వం అలసత్వం -
అందరికీ అందుబాటులో ఉంటా
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): వైఎస్సార్సీపీ శ్రేణులందరికీ తాను అన్ని వేళల్లో అందుబాటులో ఉంటానని, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాల్సిన అవసరం ఉందని వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు అన్నారు. అర్ధరాత్రి ఫోన్ చేసి సమస్య ఉందని చెప్పినా స్పందిస్తానని భరోసానిచ్చారు. పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్గా బాధ్యతలు చేపట్టాక తొలిసారి మంగళవారం శ్రీకాకుళంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు, పార్టీశ్రేణులతో సమావేశం నిర్వహించారు. ముందుగా వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. తనను నోటికి వచ్చినట్టు తిట్టిన వారితోనే చంద్రబాబు జతకట్టి ఎన్నికల్లో గెలిచారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అప్పట్లో టీడీపీకి అభ్యర్థులే దొరకలేదని గుర్తు చేశారు. చంద్రబాబు, పవన్ పూటకో విషయం మాట్లాడతారని, 9 నెలలు తిరగకముందే ప్రభుత్వంపై జనం ఆగ్రహంగా ఉన్నారని అన్నారు. అక్రమంగా కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తే భయపడేది లేదని అన్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎన్నికల్లో కూటమి మద్దతిచ్చిన అభ్యర్థి రఘువర్మ ఓడిపోవడంతో ఆయన తమ పార్టీ అభ్యర్థి కాదనడం టీడీపీకి సిగ్గుచేటన్నారు. పొరపాట్లు జరిగితే సరిదిద్దుకునే దమ్మున్న వ్యక్తి జగన్ అని తెలిపారు. పార్టీని స్థాపించిన వారిని వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్న వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జగన్ గెలవడం ఖాయమన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వాన్ని నిలదీయాలని, కూటమి నేతలకు భయపడకుండా ఉండాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం పతనం ఉత్తరాంధ్ర నుంచే ప్రారంభమైందన్నారు. ఓటమిని జీర్ణించుకోలేని పరిస్థితి టీడీపీ నాయకులకు ఉందన్నారు. కార్యక్రమంలో పార్టీనాయకులు పలువురు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు -
వేతన వ్యత్యాసాలు లేకుండా చూడాలి
విజయనగరం అర్బన్: ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ సిబ్బందికి వేతన సదుపాయా లు కల్పించాలని ఆర్టీసీ ఎన్ఎంయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎస్.రాజేష్కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన జోనల్ మహాసభలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వంలో విలీనమైన ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు. నైట్ అవుట్ అలవెన్స్లు, పెన్షన్, పీఎఫ్ అధికంగా ఇప్పించాలని డిమాండ్ చేశారు. 1/2019 సర్క్యులర్ను తిరిగి యథాతథంగా అమలుచేయాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి పీవీవీ మోహన్, జోనల్ కమిటీకి నూతనంగా ఎన్నికై న బీఎస్ రాములు, జోనల్ అధ్యక్ష కార్యదర్శులు ప్రదీప్ కుమార్, ఎంవీఆర్ మూర్తి, జిల్లా కార్యదర్శి పీజీ రాఫిల్, జోన్ పరిధిలోని 18 డిపోల అధ్యక్ష, కార్యదర్శులు, మహిళాఉద్యోగులు పాల్గొన్నారు. ఆర్టీసీ ఎన్ఎంయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి రాజేష్కుమార్ -
ఎడ్ల పరుగు పోటీల్లో వావిలపాడు విజేత
ప్రదర్శనలో పరుగు తీస్తున్న ఎడ్లువేపాడ: మండలంలోని పాటూరు సమీపంలో గాడివారి కళ్లాల వద్ద మంగళవారం సాయంత్రం నిర్వహించిన ఎడ్ల పరుగు ప్రదర్శనలో వావిలపాడుకు చెందిన ఎడ్లు ప్రథమ స్థానంలో నిలిచాయి. కళ్లాల వద్ద అభయాంజనేయ స్వామి తీర్థమహోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీలో 12 ఎడ్లు జతలు పాల్గొన్నాయి. వాటిలో రెండోస్థానంలో వల్లంపూడికి చెందిన ఏడువాక సత్తిబాబు ఎడ్లు, మూడోస్థానంలో తుమ్మికాపల్లికి చెందిన జైదర్శిని ఎడ్లు, నాల్గో స్థానంలో కృష్ణారాయుడుపేటకు చెందిన గుమ్మాలమ్మ తల్లి ఎడ్లు, ఐదోస్థానంలో కలగాడకు చెందిన ఎడ్లు, ఆరోస్థానంలో వావిలపాడుకు చెందిన గండి వెంకటరావు ఎడ్లు నిలిచాయి. విజేతలకు రూ.12వేలు,10వేలు, 8వేలు, 6వేలు, 4 వేలు చొప్పున నగదు బహుమతులను గ్రామపెద్దలు, ఉత్సవ కమిటీ, దాతలు అందజేశారు. స్వామివారికి ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించి మద్యాహ్నా అన్నసమారాధన చేశారు. -
మనోవేదనతో వ్యక్తి మృతి
శృంగవరపుకోట: పట్టణంలోని పుణ్యగిరి రోడ్డులో నివాసం ఉంటున్న వ్యక్తి మనోవేదనతో మృతిచెందాడు. ఈ ఘటనపై ఇరుగుపొరుగు వారు, పోలీసులు ప్రాథమికంగా సేకరించిన వివరాలిలా ఉన్నాయి. నాయీబ్రాహ్మణ కులానికి చెందిన కొరువాడ శ్రీనివాసరావు(43) పట్టణంలోని పుణ్యగిరి రోడ్డులో నివాసం ఉంటున్నాడు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. వేర్వేరు వ్యాపారాల్లో నష్టాలపాలైన శ్రీనివాసరావు కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. మద్యానికి బానిసైన శ్రీనివాసరావు భార్యతో గొడవపడి విడాకుల వరకూ వెళ్లాడు. కోర్టులో వారి విడాకుల కేసు నడుస్తుండడంతో శ్రీనివాసరావు భార్య కుమార్తెతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయి అక్కడే ఉంటోంది. ఈ నేపథ్యంలో శ్రీనివాసరావు కొంతకాలంగా తన ఇంటి మేడ మీది గదిలో ఒంటరిగా ఉంటున్నాడు. మూడు రోజులుగా శ్రీనివాసరావు కనిపించలేదని, బయటకు రాలేదని కింది పోర్షన్లో ఉన్న వారు స్థానికులకు చెప్పడంతో వారు స్థానిక పోలీస్స్టేషన్కు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఇంటికొచ్చి తలుపులు తెరిచి, చూడగా శ్రీనివాసరావు చనిపోయి మంచంపై పడి ఉన్నాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో జిల్లా యువత ప్రతిభ
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరిగిన పవర్ లిఫ్టింగ్ పోటీల్లో విజయనగరం యువత సత్తా చాటారు. ఈనెల 1,2 తేదీల్లో విశాఖ జిల్లా గాజువాకలో జరిగిన పోటీల్లో నగరంలోని బాడీ ఫిట్నెస్ జిమ్లో శిక్షణ పొందుతున్న కె.జగదీష్ 56 కేజీల బెంచ్ ప్రెస్ విభాగంలో 87.5 కేజీల బరువు ఎత్తి బంగారు పతకం, డిడ్లిఫ్ట్లో 195 కేజీల బరువు ఎత్తి మరో బంగారు పతకం దక్కించుకున్నాడు. అంతేకాకుండా సీనియర్ కేటగిరీ విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన జగదీష్ స్ట్రాంగ్ మెన్ టైటిల్ కై వసం చేసుకోవడం విశేషం. ఇదే పోటీల్లో 66 కేజీల విభాగంలో విజయనగరం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎ.రాజా డెడ్లిఫ్ట్లో 205 కేజీల బరువు ఎత్తి బంగారు పతకం సాధించగా..74 కేజీల విభాగంలో ఎం.వెంకటేష్ బెంచ్ ప్రెస్లో 90 కేజీల బరువు ఎత్తి కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను బాడీ ఫిట్నెస్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రెడ్డి శంకరరావు, ప్రధాన కార్యదర్శి కోరాడ శ్రీనివాసరావులు అభినందించారు. భవిష్యత్లో మరిన్ని పతకాలు సాధించి జిల్లా కీర్తి ప్రతిష్టలను చాటి చెప్పాలని ఆకాంక్షించారు. -
అమ్మా..కరుణించమ్మా
● అనుబంధ అమ్మవార్ల దర్శనానికి పోటెత్తిన భక్తులు ● పసుపు, కుంకుమలతో మొక్కులు చెల్లించుకున్న భక్తులు ● కోటదుర్గమ్మ, సంతానలక్ష్మి, అసిరితల్లి, భాగిరేతమ్మ ఆలయాల్లో సందడిచీపురుపల్లి: భక్తుల కష్టాల్లో తోడుంటూ ఆదుకునే అమ్మా కరుణించండి అంటూ పట్టణంలోని అనుబంధ అమ్మవార్లను భక్తులు వేడుకున్నారు. పసుపు, కుంకుమలతో అమ్మవార్లకు మొక్కులు సమర్పించుకున్నారు. తమ కష్టాలు తొలగించండి తల్లీ అంటూ చీరలు చూపిస్తూ అమ్మవార్లకు భక్తి, శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. దీంతో పట్టణంలో అనుబంధ అమ్మవార్లుగా చెప్పుకునే శ్రీ కోటదుర్గమ్మ, శ్రీ సంతానలక్ష్మి, శ్రీ అసిరితల్లి, శ్రీ భాగిరేతమ్మ ఆలయాల్లో భక్తుల సందడితో పాటు ఆధ్యాత్మిక వాతావరణ నెలకొంది. సంప్రదాయం ప్రకారం శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారికి అక్క, చెల్లెళ్లుగా చెప్పుకునే అనుబంధ అమ్మవార్లుగా పట్టణంలో ఉన్న శ్రీ కోటదుర్గమ్మ, శ్రీ సంతోషిమాత, శ్రీ అసిరితల్లి, శ్రీ భాగిరేతమ్మ అమ్మవార్లకు కనక మహాలక్ష్మి జాతర ఉత్సవాల్లో ఆఖరి రోజు భక్తులు ప్రత్యేక పూజలతో బాటు మొక్కులు సమర్పించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగానే మంగళవారం పట్టణంలోని శ్రీ కోటదుర్గమ్మ, సంతానలక్ష్మి, అసిరితల్లి, భాగిరేతమ్మ అమ్మవార్ల ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. మంగళవారం తెల్లవారుజామున 5 గంటల నుంచే అమ్మవార్ల దర్శనానికి భక్తులు క్యూలో బారులు తీరారు. శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని వేడుకున్న మాదిరిగానే పసుపు, కుంకుమలతో పాటు చీరలు మొక్కుతూ తమ కష్టాలు నెరవేర్చాలని అనుబంధ అమ్మవార్లను వేడుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని కొత్తగవిడివీధిలో గల శ్రీ కోటదుర్గమ్మ వారి ఆలయంలో భక్తులు అమ్మవారికి మొక్కులు సమర్పించుకుంటూనే వేపచెట్టు వద్ద పూజలు చేశారు. అలాగే శ్రీ సంతోషిమాత, భాగిరేతమ్మ, అసిరితల్లి ఆలయాల వద్ద భక్తులు తులసి కోటకు పూజలు చేసి అమ్మవారిని వేడుకున్నారు. ఆలయాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టణంలోని శ్రీ కోటదుర్గమ్మవారి ఆలయం వద్ద దర్శనానికి వచ్చే భక్తుల కోసం సిటీకేబుల్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేశారు. అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని పలువురు ప్రముఖులు మంగళవారం దర్శించుకున్నారు. శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా ఆఖరిరోజు మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి, కుమారుడు డా.బొత్స సందీప్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి, డా.బొత్స సందీప్లు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు ఇప్పిలి అనంతం, వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, మీసాల వరహాలు నాయుడు, బెల్లాన వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి
పాలకొండ రూరల్: గ్రామస్థాయిలో పీహెచ్సీల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని పార్వతీపురం మన్యం జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి ఎస్.భాస్కరరావు అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన పాలకొండ మండలంలోని అన్నవరం, ఎం.సింగుపురం పీహెచ్సీలను సందర్శించి అక్కడి డ్రగ్స్టోర్, ల్యాబ్బ్ లతో పాటు రోజువారీ ఓపీ రిజస్టర్లు పరిశీలించారు. ఈ క్రమంలో మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్యకేంద్రం తాజా స్థితిగతులును తెలుసుకున్నారు. ప్రైవేట్ వైద్య కేంద్రాలను సందర్శించిన ఆయన అక్కడి వసతుల గురించి రోగుల దగ్గర ఆరా తీశారు. ప్రభుత్వ వైద్యులు సమయపాలన పాటించాలని, క్షేత్రస్థాయి వైద్యసిబ్బంది గ్రామాల్లో సంచరిస్తూ రోజువారీ నివేదికలు అందించాలని ఆదేశించారు. ప్రస్తుత సీజన్లో విజృంభించే వ్యాధులు, వాటిని అధిగమించేందుకు అవలంబించాల్సిన రోగ నిరోధక విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆయన వెంట యోగేశ్వరరెడ్డి, సన్యాసిరావు, డీఎస్ఓ శంకరావు, వైద్యాధికారులు తేజరత్న రాజ్, వెన్నెల, రవికుమార్, అనిల్కుమార్ తదితరులున్నారు. డీఎంహెచ్ఓ భాస్కరరావు -
పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
పార్వతీపురం టౌన్: గరుగుబిల్లి మండలం ఉద్దవోలు గ్రామానికి చెందిన నాగళ్ల సింహాచలం(55) పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు, ఈ ఘటనపై పార్వతీపురం జిల్లా ఆస్పత్రి అవుట్పోస్ట్ పోలీసులు మంగళవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొమరాడ మండలం కళ్లికోట గ్రామానికి చెందిన గౌరీ శంకరరావు దగ్గర గొర్రెల కాపరిగా సింహాచలం పనిచేస్తున్నాడు. సింహాచలం కుమారుడు విశాఖపట్నంలో పనిచేస్తున్నాడు. కుమారుడికి ఎన్ని మార్లు ఫోన్ చేసినా స్పందన లేకకోవడంతో మనస్తాపం చెంది సోమవారం సాయంత్రం గుమడ గ్రామ సమీపంలో ఉన్న ఇటుకబట్టీల వద్దకు వెళ్లి పురుగు మందు తాగేశాడు. గమనించిన యజమాని గౌరీశంకరరావు వెంటనే తన మోటార్ సైకిల్పై పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తీసుకు రావడంతో వైద్యులు చికిత్స అందజేస్తుండగా మంగళవారం ఉదయం మృతిచెందాడు. గరుగుబిల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అవుట్పోస్టు ఏఎస్సై నిమ్మకాయల భాస్కరరావు తెలిపారు. ఉరి వేసుకుని వ్యక్తి.. సాలూరు: పట్టణంలోని దుర్గానవీధిలో నివాసముంటున్న షేక్ ఖలీల్ (29)ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఫిర్యాదు అందిందని సీఐ అప్పలనాయుడు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన మాట్లాడుతూ, సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో షేక్ ఖలీల్ ఫ్యాన్కు ఉరివేసుకున్నట్లు మృతుడి భార్య షేక్ భువనేశ్వరి ఫిర్యాదులో పేర్కొన్న మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నామన్నారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి పార్వతీపురం రూరల్: మండలంలోని పార్వతీపురం–నర్సిపురం రహదారి పరిధిలో ఈనెల 2న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన కొల్లి బాలాజీ (34) విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. ఈ మేరకు మృతుడి భార్య రూరల్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బి.సంతోషి తెలిపారు. -
ఇంటర్ ఫస్ట్ఇయర్ పరీక్షకు 562 మంది గైర్హాజరు
పార్వతీపురంటౌన్: పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలకు 562మంది గైర్హాజరైనట్లు డీవీఈఓ మంజుల వీణ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆమె పట్టణంలోని పలు పరీక్షాకేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 34 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 9437 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 8875మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. పరీక్షల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, మాస్కాపీయింగ్ జరగకుండా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. సిటింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్, బల్క్మెంబర్లు పరీక్షలను పర్యవేక్షించారన్నారు. పరీక్షలన్నీ నిత్యం సీసీ కెమెరాల లైవ్స్ట్రీమింగ్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎటువంటి మా్స్కాపీయింగ్ నమోదు కాలేదని స్పష్టం చేశారు. డీవీఈఓ మంజుల వీణ -
ఎల్లమ్మ గుడిలో హుండీని విరగ్గొట్టిన దుండగులు
గంట్యాడ: మండలంలోని నరవ గ్రామంలో ఉన్న ఎల్లమ్మ గుడిలో హుండీని సోమవారం రాత్రి దుండగులు విరగ్గొట్టారు. అందులో ఉన్న డబ్బులను దొంగిలించారు. అయితే ఈవిషయంపై పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అందలేదు. డ్రోన్ సహాయంతో జూదరుల అరెస్టుపార్వతీపురం రూరల్: పట్టణంలోని బూరాడ వీధిలో పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద రూ.1560లు నగదును స్వాధీనం చేసుకున్నట్లు టౌన్ ఎస్సై ఎం.గోవింద తెలిపారు. మంగళవారం పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలు నిరోధించేందుకు డ్రోన్ కెమెరాను వినియోగించిన సందర్భంలో పేకాట ఆడుతున్న దృశ్యాన్ని గుర్తించి పేకాట శిబిరం వద్దకు వెళ్లి జూదరులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు చెప్పారు. -
పుష్పాలంకరణలో పైడితల్లి
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ ఆధ్వర్యంలో అమ్మవారికి వేకువజామునుంచి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్లు శాస్త్రోక్తంగా నిత్య పూజాదికాలు చేశారు. మహిళలు, పెద్దలు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమలు సమర్పించి మొక్కుబడి చెల్లించుకున్నారు. ఘటాలను సమర్పించారు. కార్యక్రమాలను ఆలయ ఇన్చార్జ్ ఈఓ కెఎన్వీడీవీ .ప్రసాద్ పర్యవేక్షించారు. -
ఎందుకంత ప్రేమంట..!
● ఒకే ఊరికి 30 గోకులాలు మంజూరుగోకులాల నిర్మాణానికి ఎంతెంత? రెండు ఆవులు ఉంటే.. రూ.1లక్షా30వేలు నాలుగు ఆవులకు రూ.1లక్షా80వేలు ఆరు ఆవులకు రూ.2లక్షల 30వేలు ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 90శాతం రైతులకు నిధులు ఇవ్వగా పది శాతం మాత్రమే రైతులు పెట్టుకోవాలిబ్యాంకులో బంగారం పెట్టి గోకులం కట్టాను మినీ గోకులం నిర్మాణానికి రూ.1లక్షా 30వేలు ఖర్చుచేశాను. గోకులం నిర్మాణం పూర్తయినా ఒక్క రూపాయి కూడా బిల్లు ఇవ్వలేదు.నా భార్య బంగారం బ్యాంకులో తాకట్టుపెట్టి నిర్మాణం చేశాను. బిల్లు కోసం ఎదురు చూస్తున్నాను. – లోగిశ సూరప్పడు, లోగిశ గ్రామంగజపతినగరం రూరల్: గ్రామీణ ప్రాంతాల్లోని పశువులను కమ్మలతో కూడిన శాలల్లో ఉంచడం వల్ల అప్పుడప్పుడు అనారోగ్యం పాలవుతున్నాయి. తగిన సదుపాయాలు లేక ఆరోగ్యం పాడై మృత్యువాత పడుతున్నాయి. ఈ సందర్భాలను రాష్ట్ర ప్రభుత్వం గమనించి, ఆసక్తి ఉన్న రైతులకు మినీ గోకులాల నిర్మాణం చేపట్టుకునేందుకు అవకాశం కల్పించింది. ప్రభుత్వం 90శాతం నిధులు మంజూరుచేస్తే స్ధానిక రైతులు పదిశాతం మాత్రమే పెట్టుబడి పెట్టి మినీ గోకులాల నిర్మాణం చేసుకోవచ్చంటూ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో తెలుగు తమ్ముళ్లు తమ గ్రామాల్లో ఆధిపత్యం చెలాయించడం కోసం మినీ గోకులాలు అధికంగా కావాలని నాయకుల వద్దకు సిఫార్సులతో వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో గజపతినగరం మండలంలోని లోగిశ గ్రామ రైతులకు మండలంలో ఏగ్రామానికి లేనంతగా 30గోకులాలు అధికార పార్టీ నేతలు మంజూరు చేయించారు. అయితే దీని వెనుక అదే గ్రామానికి చెందిన మాజీ మండల ప్రజాప్రతినిధి అభీష్టం మేరకు స్థానిక మంత్రి జిల్లాస్ధాయి అధికారులతో మాట్లాడి 30 గోకులాలు మంజూరుచేయించినట్లు సమాచారం. జిల్లాలో ఒక్కో మండలానికి తొలిదశలో 75 గోకులాలు మంజూరైతే ఒక్క గజపతినగరం మండలానికి ఏకంగా 135 గోకులాలు మంజూరు చేశారు. ఇందులో ఒక్క లోగిశ గ్రామానికే 30గోకులాలు మంజూరు చేయడంపై సంబంధిత మాజీ ప్రజాప్రతినిధిపై స్థానిక మంత్రికి కాస్త ప్రేమ ఎక్కువగానే ఉన్నట్లు ఉందని కూటమి ప్రభుత్వానికి చెందిన స్థానిక నాయకులే గుసగుసలాడుకుంటున్నారు. ఇంతకీ 30 గోకులాలు మంజూరైనప్పటికీ అందులో కేవలం ఏడు గోకులాలు మాత్రమే నిర్మాణం పూర్తిచేసుకున్నట్లు సమాచారం. మిగిలిన 23 మంది రైతులు ముందు తాము పెట్టుబడి పెడితే ఆనక బిల్లులు మంజూరు కావడంలో ఆలస్యమైతే ఆర్థిక ఇబ్బందులు పడాల్సి వస్తుందని గోకులాల నిర్మాణానికి ముందుకు రానట్లు సమాచారం.నిధులు రాలేదు నిర్మాణాలు పూర్తయిన గోకులాలన్నింటికి బిల్లులు అప్లోడ్ చేసి ఉంచాం. నిధులు రాగానే బిల్లులు చెల్లింపు చేస్తాం. ఇప్పటివరకూ మండలానికి 135 గోకులాలు మంజూరుకాగా 80 గోకులాల నిర్మాణం పూర్తయింది. లోగిశ గ్రామానికి మంజూరైన 30 గోకులాలు స్ధానిక మంత్రి జిల్లా స్ధాయి అధికారులతో మాట్లాడి మంజూరు చేయించారు. – కల్యాణి, ఎంపీడీఓ, గజపతినగరం మండలం -
ముగిసిన మహాశివరాత్రి ఉత్సవాలు
వంగర: మండల పరిధిలో సంగాంలో వెలిసిన పవిత్ర సంగమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఏడు రోజుల పాటు జరిగిన మహాశివరాత్రి ఉత్సవాలు మంగళవారం ముగిశాయి. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వేలాది మంది భ భక్తులు సువర్ణముఖి, వేగావతి, నాగావళి నదులు కలిసే త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి సంగమేశ్వరస్వామిని దర్శించుకున్నారు. పీటీసీలో న్యాయశాస్త్రంపై విద్యార్థులకు శిక్షణవిజయనగరం క్రైమ్: స్థానిక కంటోన్మెంట్ పోలీస్ శిక్షణ కళాశాలలో న్యూక్రిమినల్ లాస్పై అన్న అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. రెండు రోజుల పాటు జరిగే శిక్షణ కార్యక్రమాన్ని పీటీసీ ప్రిన్సిపాల్ టి.రామచంద్రరాజు మంగళవారం ప్రారంభించారు. క్రిమినల్ ప్రాసీజర్, ఎవిడెన్స్ యాక్ట్, ఇంటరాగేషన్ టెక్నిక్స్ తదితర అంశాలపై పీటీసీ విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. అనంతరం ప్రిన్సిపాల్ చేతుల మీదుగా స్టూడెంట్స్కు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ పి.వి.అప్పారావు, డీఎస్పీ శ్రీకాంత్, డీఎస్పీ రమేష్, పలువురు సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. ట్రైబల్ వెల్ఫేర్ పనులు పరిశీలించిన విజిలెన్స్ ఎస్పీపాచిపెంట: మండలంలోని గురివినాయుడుపేట వద్ద ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్మాణమవుతున్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను శ్రీకాకుళం విజిలెన్స్ ఎస్పీ బర్ల ప్రసాదరావు పరిశీలించారు. ఈ మేరకు మంగళవారం ఆయన పాఠశాల భవన నిర్మాణాన్ని పరిశీలించి పనుల ప్రగతిపై ఆరా తీశారు. ఆమోదం పొందిన ప్లాన్ ప్రకారం నిర్మాణం జరుగుతున్నదీ..లేనిదీ తనిఖీచేస్తున్నామని, నాణ్యత పరీక్షలు చేసిన తరువాత ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామన్నారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఈఈ మణిరాజ్, డీఈ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. యూటీఎఫ్పై బురద జల్లడం తగదుపార్వతీపురంటౌన్: ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి ఓటమిని అంగీకరించకుండా యూటీఎఫ్పై బురద జల్లడం మానుకోవాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.మురళీ మోహనరావు మంత్రి అచ్చెంనాయుడికి సూచించారు. ఈ మేరకు మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలను రాజకీయం చేసి, కూటమి అభ్యర్థి ఓడిపోయిన తరువాత, గెలిచిన వారే మా అభ్యర్థి అనడం..అక్కడితో ఆగకుండా యూటీఎఫ్ ముసుగులో వైఎస్సార్సీపీ పోటీచేసిందనడం వారి రాజకీయ క్రీడలను సంఘాలకు ఆపాదించడం సరికాదన్నారు. ప్రభుత్వం ఏదైనా గానీ ఉపాధ్యాయులకు, విద్యారంగానికి వ్యతిరేకంగా నిర్ణయాలు చేస్తే నిలదీసే తత్వం ఉన్న సంఘం కాబట్టే సుమారు 6వేల ఓట్లు వచ్చాయన్నారు. భవిష్యత్లో నైనా ఇటువంటి చౌకబారు ఆరోపణలు మానుకోవాలని ఆయన హితవు పలికారు. బైక్పైనుంచి జారిపడి యువకుడి మృతిచీపురుపల్లి: పట్టణంలోని ఆంజనేయపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కుడుముల బంగారునాయుడు(32) అనే యువకుడు మృతిచెందాడు. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి హెచ్సీ రమణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గరివిడి మండలంలోని రేగటి గ్రామానికి చెందిన కుడుమల బంగారు నాయుడు, శనపతి రాము కలిసి ద్విచక్ర వాహనంపై చీపురుపల్లిలోని అమ్మవారి జాతరకు వచ్చారు. తిరిగి తమ గ్రామానికి వెళ్తుండగా వాహనం నడుపుతున్న శనపతి రాము ఆంజనేయపురంలో సడన్గా బ్రేక్ వేయడంతో వెనుక కూర్చున్న బంగారునాయుడు ద్విచక్ర వాహనం నుంచి కింద పడిపోగా తలకు బలమైన గాయమైంది. దీంతో తక్షణమే సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వ్యాధులు వ్యాప్తి చెందకుండా చర్యలు
విజయనగరం ఫోర్ట్: వ్యాధులు విజృంభించకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ వైద్యాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం సాయింత్రం సీహెచ్సీ, పీహెచ్సీ వైద్యాధికారులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మలేరియా, డెంగీ, చికెన్గున్యా, అతిసార వంటి వ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందుస్తు నివారణ చర్యలు చేపట్టాలన్నారు. వ్యాధులు విజృంభించకుండా చూడాల్సిన బాధ్యత వైద్యాధికారులపై ఉందన్నారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు అవగాహన కల్పించాలన్నారు. నివేదికలు యాప్లో అప్లోడ్ చేసేటప్పడు ఒకటి, రెండుసార్లు సరిచూసుకోవాలన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ఫీడ్ బ్యాక్ సర్వేలో జిల్లా ర్యాంకు మెరుగుపడాలని, దీని కోసం వైద్య ఆరోగ్య సిబ్బంది నిర్లిప్తతను విడనాడి తమ సేవలను మరింత మెరుగ్గా అందించాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ జీవనరాణి, డీసీహెచ్ఎస్ డాక్టర్ జి.వి.రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. మహిళా దినోత్సవానికి ఏర్పాట్లు మార్చి 8వ తేదీన నిర్వహించే మహిళా దినోత్సవానికి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో రాజీవ్ స్టేడియంలో నిర్వహించే మహిళా దినోత్సవానికి సుమారు 4 వేల మంది మహిళలు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. సుమారు వెయ్యి మందికి ఎన్ఏటీఎస్ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నారు. డీఆర్డీఏ నుంచి రూ.121 కోట్లు, మెప్మా నుంచి రూ.20కోట్లు విలువైన బ్యాంకు లింకేజీని అందజేయాలన్నారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న నలుగురు మహిళలను సన్మానించేందుకు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ ఎ.కళ్యాణచక్రవర్తి, ఐసీడీఎస్ ఇన్చార్జి పీడీ జి.ప్రసన్న, డీఎంహెచ్ఓ, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ -
● గుర్రపు డెక్క.. సాగునీటికి అడ్డుకట్ట
చిత్రంలో గుర్రపుడెక్కతో కనిపిస్తున్నది మడ్డువలస ప్రాజెక్టు ప్రధాన కాలువ. వంగర మండలం నుంచి దాదాపు 55 కిలోమీటర్ల మేర కాలువ విస్తరించి ఉంది. 24,875 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందాలంటే ఈ కాలువే ఆధారం. కాలువను అభివృద్ధి చేయకపోవడంతో ఏటా రైతులకు సాగునీటి కష్టాలు తప్పడం లేదు. సంతకవిటి మండలంలోని శివారు భూములకు సాగునీరు అందడం లేదు. చేతికొచ్చే దశలో పంటలు ఎండిపోయి రైతులు నష్టాలు చవిచూస్తున్నారు. బొద్దూరు–బిల్లాని గ్రామాల మధ్య కాలువలో గుర్రపు డెక్క పేరుకుపోయి సాగునీటికి అడ్డుకట్టగా మారిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ శాఖమంత్రి అచ్చెన్నాయుడు, అధికారులు స్పందించి ప్రస్తుత వేసవి కాలంలో కాలువను అభివృద్ధిచేసి సాగునీటి కష్టాలు తీర్చాలని కోరుతున్నారు. – సంతకవిటి -
వ్యాధులు వ్యాప్తి చెందకుండా చర్యలు
విజయనగరం ఫోర్ట్: వ్యాధులు విజృంభించకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ వైద్యాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం సాయింత్రం సీహెచ్సీ, పీహెచ్సీ వైద్యాధికారులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మలేరియా, డెంగీ, చికెన్గున్యా, అతిసార వంటి వ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందుస్తు నివారణ చర్యలు చేపట్టాలన్నారు. వ్యాధులు విజృంభించకుండా చూడాల్సిన బాధ్యత వైద్యాధికారులపై ఉందన్నారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు అవగాహన కల్పించాలన్నారు. నివేదికలు యాప్లో అప్లోడ్ చేసేటప్పడు ఒకటి, రెండుసార్లు సరిచూసుకోవాలన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ఫీడ్ బ్యాక్ సర్వేలో జిల్లా ర్యాంకు మెరుగుపడాలని, దీని కోసం వైద్య ఆరోగ్య సిబ్బంది నిర్లిప్తతను విడనాడి తమ సేవలను మరింత మెరుగ్గా అందించాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ జీవనరాణి, డీసీహెచ్ఎస్ డాక్టర్ జి.వి.రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. మహిళా దినోత్సవానికి ఏర్పాట్లు మార్చి 8వ తేదీన నిర్వహించే మహిళా దినోత్సవానికి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో రాజీవ్ స్టేడియంలో నిర్వహించే మహిళా దినోత్సవానికి సుమారు 4 వేల మంది మహిళలు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. సుమారు వెయ్యి మందికి ఎన్ఏటీఎస్ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నారు. డీఆర్డీఏ నుంచి రూ.121 కోట్లు, మెప్మా నుంచి రూ.20కోట్లు విలువైన బ్యాంకు లింకేజీని అందజేయాలన్నారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న నలుగురు మహిళలను సన్మానించేందుకు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ ఎ.కళ్యాణచక్రవర్తి, ఐసీడీఎస్ ఇన్చార్జి పీడీ జి.ప్రసన్న, డీఎంహెచ్ఓ, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ -
లింగ నిర్ధారణ చేసేవారిపై కఠిన చర్యలు
విజయనగరం ఫోర్్ట: లింగ నిర్ధారణ చేసేవారితో పాటు, సంబంధిత అంశంపై వాణిజ్య ప్రకటనలు, పోస్టర్లు, హోర్డింగ్లు పెట్టేవారిపై చట్టరీత్యా చర్యలు తప్పవని డీఎంహెచ్ఓ డాక్టర్ జీవనరాణి హెచ్చరించారు. జిల్లా వైద్యశాఖ పరిధిలో నమోదైన ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లు ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా పాటించాలని తెలిపారు. సీసీపీఎన్డీటీ యాక్టును అతిక్రమిస్తే మూడు నుంచి ఐదేళ్ల జైలుశిక్ష, రూ.50 వేలు నుంచి రూ.లక్ష వరకు జరిమానా తప్పదన్నారు. వ్యవసాయ పద్ధతులపై అవగాహన అవసరం ● ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త ఎంవీవీ శ్రీనివాస్ విజయనగరం ఫోర్ట్: వ్యవసాయ పద్ధతులను విద్యార్థులు తెలుసుకోవాలని ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త ఎంవీవీ శ్రీనివాస్ తెలిపారు. ఏరువాక కేంద్రంలో సోమవారం గ్రామీణ వ్యవసాయ అవగాహన అనుభవ కార్యక్రమంలో భాగంగా శిక్షణ పొంతున్న నైరా కళాశాల వ్యవసాయ విద్యార్థులతో సమావేశమయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి రైతులు వివిధ పంటల్లో అవలంభిస్తున్న పద్ధతులను తెలుసుకోవాలన్నారు. వారికి తెలియని విషయాలను తెలియజేయాలన్నారు. సీనియార్టీ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ ● ఈ నెల 10వ తేదీలోపు గడువు ● డీఈఓ యు.మాణిక్యంనాయుడు విజయనగరం అర్బన్: పాఠశాల విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ కింద పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయ/ఉపాధ్యాయుల సాధారణ సీనియారిటీ జాబితాను వెబ్సైట్లో పొందుపరిచామని డీఈఓ యు.మాణిక్యంనాయుడు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయ సమాచార వ్యవస్థ (టీఐఎస్) రూపొందించిన ఈ జాబితాపై ఎలాంటి అభ్యంతరాలున్నా ఈ నెల 10వ తేదీలోగా జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి సమర్పించాలని సూచించారు. అభ్యంతరం చేసే ఉపాధ్యాయుని పూర్తి పేరు, పనిచేస్తున్న కేడర్, అభ్యంతరం చెబుతున్న వివరాలు వివరించాలి. సీనియారిటీ జాబితాలో తప్పిదం ఎక్కడ ఉందో స్పష్టంగా పేర్కొనాలి. ఆధారాలు లేదా సంబంధిత సాక్ష్యాలు విధిగా జతచేయాలి. పూర్తి వివరాల కోసం జిల్లా విద్యాశాఖ కార్యాయంలో సంప్రదించవచ్చని తెలియజేశారు. రోడ్డు పనులకు సహకరించండి ● అటవీశాఖ అధికారులకు ఎస్టీ కమిషన్ చైర్మన్ సూచన విజయనగరం అర్బన్: అల్లూరి జిల్లా అనంతగిరి మండలం చిన్నకోనల గిరిశిఖర గ్రామ రోడ్డు నిర్మాణానికి అటవీశాఖ అధికారులు సహకరించాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు కోరారు. రోడ్డు పనులను అటవీశాఖాధికారులు అడ్డుకుంటున్నారంటూ గిరిజనుల నిరసన తెలపడంపై ఆయన సోమవారం స్పందించారు. నాన్ షెడ్యూల్ ఏరియాలోని రొంపల్లి పంచాయతీ పరిధి కొండశిఖర గ్రామాలైన చిన్నకోనల, భూరిగా, వనిజతో పాటు ఎన్.ఆర్.పురం పంచాయతీ పరిధిలోని మరో ఐదు గ్రామాలను కలుపుతూ వేసే రోడ్డు నిర్మాణంపై అటవీశాఖ అభ్యంతరాలను నివేదిక రూపంలో అందజేయాలని సంబంధిత అధికారులను కోరారు. గిరిజనులకు మౌలిక సదుపాయాల కల్పనపై అలసత్వం వహించరాదన్నారు. బొబ్బిలిలో నిలిచిన గూడ్స్రైలు బొబ్బిలి: సాంకేతిక సమస్య కారణంగా బొబ్బిలి–డొంకినవలస రైల్వేస్టేషన్ల మధ్య ఓ గూడ్స్రైలు సోమవారం సాయంత్రం నిలిచిపోయింది. దీంతో బొబ్బిలి రైల్వేస్టేషన్ మీదుగా ప్రయాణించాల్సిన విశాఖ–కొరాపుట్ రైలుతో పాటు పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గంట కాలం పాటు రైలు అలాగే ఉండిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. స్పందించిన రైల్వే అధికారులు.. కొరాపుట్ రైలుకు వేరే ఇంజిన్ తెప్పించి, ఆ రైలును కదిలించే ప్రయత్నం చేశారు. -
కందిపప్పు కట్..!
విజయనగరం ఫోర్ట్: కూటమి ప్రభుత్వ పాలనలో రేషన్ లబ్ధిదారుల ‘పప్పు’లుడకవిక. పేదలకు సరఫరా చేసే కందిపప్పు సరఫరాకు ఎసరు పెట్టింది. కేవలం బియ్యం, పంచదార సరఫరాకే ప్రజాపంపిణీ వ్యవస్థను పరిమితం చేసింది. ఎన్నికలవేళ అలవికాని హామీలిచ్చిన కూటమి నేతలు గద్దె నెక్కాక ఒక్కొక్కదానిని తుంగలో తొక్కడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మందికి తల్లికి వందనం పేరిట రూ.15 వేలు చొప్పున అందిస్తామని చెప్పారు. విద్యా సంవత్సరం ముగిసిపోతున్నా ఆర్థిక సాయం సున్నాగానే మిగిలింది. రైతు భరోసా పథకాన్ని అన్నదాత సుఖీభవ పథకంగా పేరుమార్చి రైతులకు ఏమార్చారు. పైసా సాయం అందజేయకుండా కష్టాల్లోకి నెట్టారు. మహిళలకు ఉచిత బస్సు సదుపాయం ఉత్తుత్తిదే అని తేల్చేశారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతీ మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఇస్తామని చెప్పారు. ఒక్కరికీ ఇచ్చిన దాఖాలా లేవు. నిరుద్యోగ భృతి ఎండమావిగానే మారింది. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా అన్ని సరుకులు ప్రజలకు అందిస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అందించే సరుకుల్లోనూ కోత విధిస్తూవస్తున్నారు. గత కొద్ది నెలలుగా కందిపప్పులో కోత విధిస్తున్న కూటమి సర్కారు మార్చి నెలకు ఏకంగా మంగళం పాడేయడంపై మండిపడుతున్నారు. ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోని పాలన ఎందుకంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. అమరావతిని కట్టేస్తే పేదల కడుపునిండుతుందా అని ప్రశ్నిస్తున్నారు. పెద్దల లబ్ధికోసం పేదలకు కేటాయించాల్సిన డబ్బులన్నీ రాజధాని నిర్మాణం పేరుతో జేబుల్లోవేసుకుంటున్నారని విమర్శిస్తున్నారు. ఇదీ పరిస్థితి... జిల్లాలో తెలుపు రేషన్కార్డు దారులు 5,71,354 మంది ఉన్నారు. వీరికి నెలకు 571.354 మెట్రిక్ టన్నుల కందిపప్పు అవసరం. నిత్యావసర ధరలు పెరిగిన నేపథ్యంలో పేద, మధ్యతరగతి ప్రజలు జీవనానికి ఇబ్బందులు పడుతున్నారు. బహిరంగ మార్కెట్లో కిలో రూ.180 పలుకుతున్న కందిపప్పును కొనుగోలు చేయడం తలకుమించిన భారంగా మారింది. ప్రభుత్వం స్పందించి గతంలో వలే కిలో రూ.67 చొప్పున రాయితీపై అందజేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. రేషన్ లబ్ధిదారులకు నిలిచిన కందిపప్పు సరఫరా కూటమి ప్రభుత్వ తీరుపై విమర్శల వెల్లువ మార్చినెలకు విడుదలకాని కందిపప్పు జిల్లాలో రైస్కార్డులు 5,71,354 571.354 మెట్రిక్ టన్నుల కందిపప్పు అవసరం లబ్ధిదారులకు బియ్యం, పంచదార మాత్రమే సరఫరా సరఫరా కాలేదు.. రేషన్ కార్డుదారులకు మార్చినెలకు సరఫరా చేసేందుకు కందిపప్పు సరఫరా కాలేదు. జిల్లాకు నెలకు 571.354 మెట్రిక్ టన్నుల కందిపప్పు అవసరం పడుతుంది. ఈ నెల బియ్యం, పంచదార మాత్రమే సరఫరా చేస్తాం. – కె.మధుసూదనరావు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి -
కూటమి ప్రభుత్వానికిచెంపపెట్టు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: టీడీపీ ఎమ్మెల్సీ చిరంజీవి వ్యూహాలు... మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి ముక్తాయింపులు... టీడీపీ ఎమ్మెల్యేలు కళావెంకటరావు, బేబీనాయన, అదితి గజపతిరాజు ఒడ్డిన సర్వశక్తులు, కోళ్ల లలితకుమారి, విజయచంద్ర తదితర కూటమి ఎమ్మెల్యేల సముదాయింపులు, బెదిరింపులు, లాలింపులు, తాయిలాలు, తాలింపులు... ఇవేవీ ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మను గెలిపించలేకపోయాయి. సార్వత్రిక ఎన్నికలను తలపించేలా ప్రతి ఎమ్మెల్యే, మండల స్థాయి నాయకులు ఎంత ప్రచారం చేసినా, చివరకు పోలింగ్ రోజున కేంద్రాల ముందు శిబిరాలు తెరిచి కూర్చున్నా వారి ప్రయత్నాలన్నీ మేధావుల నిర్ణయం ముందు తేలిపోయాయి. అధికారం అప్పగించి తొమ్మిది నెలల్లోనే అరాచకాలతో, అప్రజా స్వామిక పాలన సాగిస్తున్న టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వానికి తమ ఓటుతో బుద్ధి చెప్పా రు. ఒకవైపు పలు ఉపాధ్యాయ సంఘాల ప్రత్యక్ష మద్దతు, వైఎస్సార్సీపీ పరోక్ష మద్దతుతో పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులనాయుడు ఘన విజయం సాధించారు. పీడీఎఫ్ అభ్యర్థి కోరెడ్ల విజయగౌరి కూడా గట్టి పోటీ చేశారు. వీరిద్దరికీ కలిపి ప్రథమ ప్రాధాన్య ఓట్లలో సుమారు 70 శాతం వరకూ రాగా, కూటమి ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డినా ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మకు రమారమి 30 శాతం ఓట్లే దక్కాయి. అధికార దర్పంతో విర్రవీగుతున్న ‘రెడ్బుక్’ ప్రభుత్వానికి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఇచ్చిన తీర్పు ఒక చెంపపెట్టు వంటిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ● మూడోసారి గాదెకు అవకాశం... ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసనమండలి సభ్యునిగా డాక్టర్ గాదె శ్రీనివాసులనాయుడు ఎన్నిక సోమ వారం రాత్రి 10 గంటలకు ఖరారైంది. గతంలో రెండు సార్లు ఉపాధ్యాయ శాసనమండలికి ప్రాతిని ధ్యం వహించిన ఆయనకు ఆరేళ్ల విరామం తర్వాత మరోసారి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయులు అవకాశం ఇచ్చారు. విజయనగరం జిల్లాలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తూ ఉపాధ్యాయ, విద్యారంగంలోని సమస్యలపై పోరాడుతూ వచ్చిన గాదె ఉత్తరాంధ్ర సుపరిచితులు. పీఆర్టీయూ సంఘానికి జిల్లా, రాష్ట్రస్థాయి నాయకత్వం వహించారు. వాస్తవానికి గాదె పూర్వీకులది అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలంలోని జోగింపేట గ్రామం. ఉద్యోగరీత్యా ఆయన తండ్రి వెంకునాయుడు విజయనగరం జిల్లాకు నివాసం వచ్చేశారు. జిల్లా పరిషత్ సీఈవోగా ఉమ్మడి (శ్రీకాకుళం, విజయనగరం) జిల్లాలో పనిచేశారు. అలా జిల్లాతో అనుబంధం ఏర్పడిన శ్రీనివాసులనాయుడు తన పాఠశాల విద్యను విజయనగరం, గజపతినగరం ప్రాంతాల్లోనే సాగించారు. ఉన్నత విద్య విషయానికొస్తే ఆయన ఎమ్మెస్సీ, ఎంటెక్, బీఈడీ, ఎంఏ (ఎడ్యుకేషన్) పూర్తి చేశారు. విద్యారంగంపై పరిశోధన చేశారు. పీహెచ్డీ పట్టాతో డాక్టర్ శ్రీనివాసులనాయుడు అయ్యారు. 2007, 2013 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వరుసగా రెండు దఫాలు ఉత్తరాంధ్ర ఉపాధ్యా య ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఉపాధ్యాయ హక్కుల సాధనలో ఆయన కృషిని ఉపాధ్యాయులు గుర్తించారు. ● ఉపాధ్యాయ సంఘాల మద్దతు... రఘువర్మ పదవీకాలం పూర్తికావడంతో జరిగిన ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరోసారి శ్రీనివాసులనాయు డు బరిలో నిలిచారు. ఆయనకు ఏపీటీఎఫ్ (1938) , ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్), రాష్ట్రీయ ఉపాధ్యాయ సంఘం (ఎస్టీయూ), ఆర్యూపీపీ, బీటీఏ, ఏపీటీయూ (ఎయిడెడ్), ఏపీటీ జీ (ఎయిడెడ్), టీఆర్ఈఐఎల్ఏ, టీఆర్ఈఐటీఏ, జీజీటీఏ, ఏపీజీటీడబ్ల్యూఆర్ఎస్, ఏటీఏ, ఎస్డ బ్ల్యూఈఎఫ్–ఏపీ, ఏపీటీడబ్ల్యూఏహెచ్ఎస్, ఏపీటీ డబ్ల్యూఆర్ఎస్ జూనియర్ కళాశాలలు, ఏపీపీటీ, పీఈటీ, పీడీ, పీటీఎల్ఎఫ్, ఏపీఎంపీఎస్టీయూ తదితర సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఆయన ముచ్చటగా మూడోసారి శాసనమండలిలో అడుగుపెట్టడానికి సహకరించాయి. ఉత్తరాంధ్ర వేదికగా తిరుగుబాటు... కూటమి ప్రభుత్వ అరాచక పాలనకు ఉత్తరాంధ్ర వేదికగా తిరుగుబాటు మొదలైంది. తొలుత ఆ బాధ్యతను మేధావివర్గం భుజానకెత్తుకుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్నడూ కనిపించిన రాజకీయ జోక్యాన్ని కలిసికట్టుగా తిప్పికొట్టారు. ప్రజావ్యతిరేక పాలన సాగిస్తే ఓటుతో బుద్ధిచెబుతారని తెలియజెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుచేయకుండా ప్రజా, ఉద్యోగ వ్యతిరేక పాలన సాగిస్తూ, కక్షపూరిత రాజకీయాలకు తెరతీసిన కూటమి ప్రభుత్వం ఇక రోజులు లెక్కపెట్టుకోవాల్సిందేనన్న సంకేతాన్ని మేధావివర్గం ఇచ్చిందన్న చర్చ పల్లెలు, పట్టణాల్లో జోరందుకుంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాజయం అప్రజాస్వామ్య పాలనపై మేధావుల తీర్పు మరోసారి పెద్దల సభకు గాదె శ్రీనివాసులునాయుడు ఉత్కంఠ పోరులో మూడోసారి ఎమ్మెల్సీగా గెలుపు టీడీపీ, జనసేన నాయకులు సర్వశక్తులు ఒడ్డినా తప్పని రఘువర్మ ఓటమి కూటమి ప్రభుత్వానికి కౌంట్డౌన్ మొదలైంది... టీడీపీ, జనసేన పార్టీలు బలపర్చిన సిట్టింగ్ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ కన్నా ఆయన సమీప ప్రత్యర్థులిద్దరికీ దాదాపు 70 శాతం టీచర్లు మద్దతు పలికారంటే తొమ్మిది నెలల్లోనే ప్రజాభిప్రాయంలో ఎంత మార్పు వచ్చిందో అర్థమవుతోంది. రఘువర్మ తరఫున ఆ పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలు, మంత్రులు ప్రత్యక్షంగా ప్రచారం చేసి, పోలింగ్ కేంద్రాల ముందు స్లిప్పులు పంచినా తీర్పు మాత్రం కూటమి ప్రభుత్వానికి చెంపదెబ్బ కొట్టినట్లు చెప్పారు. ఇక్కడితో కౌంట్డౌన్ మొదలైంది. – మజ్జి శ్రీనివాసరావు, జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మేధావుల తీర్పు విభిన్నం... ఎన్ని ప్రలోభాలు పెట్టినా తాము ఇవ్వదలచుకున్న తీర్పు ఏమిటో ఉత్తరాంధ్ర మేధావులైన టీచర్లు విభిన్నంగా ఇచ్చారు. కేవలం అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే కూటమి ప్రభుత్వం ఎంతటి ప్రజావ్యతిరేకతను మూటగట్టుకుందో ఈ తీర్పును చూస్తే అర్థమవుతుంది. ఈవీఎంలతో గాకుండా బ్యాలెట్తో ఇచ్చిన ఈ తీర్పు అసలైన ప్రజాతీర్పు. – నెక్కల నాయుడుబాబు, కొప్పుల వెలమ కార్పొరేషన్ మాజీ చైర్మన్ -
అపరాధ రుసుం రూ.6,20,000
ఒకేరోజు 62 కేసులు విజయనగరం జిల్లా పోలీసులు సోమవారం వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. రోడ్డు నిబంధనలు పాటించని, వాహన పత్రాలులేని 62 మందిపై కేసులు నమోదు చేశారు. పలువురు వాహనచోదకుల నుంచి ఒకే రోజు రూ.6,20,000లు అపరాధ రుసుం వసూలు చేశారు. ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించాలని, లేదంటే చర్యలు తప్పవని ఎస్పీ వకుల్ జిందల్ హెచ్చరించారు. పోలీస్ తనిఖీలు కొనసాగుతాయన్నారు. మైనర్లకు వాహనాలిచ్చేవారిపైనా కేసులు నమోదు చేస్తామన్నారు. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించరాదన్నారు. బైక్లపై వెళ్లేవారు హెల్పెట్ ధారణ తప్పనిసరన్నారు. – విజయనగరం క్రైమ్ -
క్రీడల్లో మిమ్స్ వైద్య విద్యార్థుల ప్రతిభ
నెల్లిమర్ల: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిర్వహించిన క్రీడాపోటీల్లో నెల్లిమర్లలోని మిమ్స్ హోవియో కళాశాల వైద్య విద్యార్థులు ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు. ఈ మేరకు సోమవారం మిమ్స్ పీఈటీ కె.వెంకటరావు మాట్లాడుతూ ప్రతిపాడు హెల్త్ యూనివర్సిటీ ఏఎస్ఆర్ హోమియో వైద్య కళాశాలలో మూడు రోజులుగా జరుగుతున్న అంతర్ కళాశాల క్రీడా పోటీల్లో మిమ్స్ హోమియో వైద్య విద్యార్థులు ప్రతిభ కనబరిచి ఓవరాల్ చాంపియన్ సాధించారని తెలిపారు. అలాగే పోటీల్లో పురుషులు, మహిళా జట్లు విజేతలుగా నిలిచాయని చెప్పారు. పురుషుల జట్టు క్రికెట్, టేబుల్టెన్నిస్, డిస్కస్త్రో, షాట్పుట్లో బంగారు పతకాలు సాధించగా, మహిళా క్రీడాకారులు వాలీబాల్, త్రోబాల్, బ్యాడ్మింటన్, పరుగుపందెంలో బంగారు పతకాలు సాధించారని వివరించారు. ఈ సందర్భంగా మిమ్స్ చైర్మన్,మేనేజింగ్ ట్రస్టీ అల్లూరి సత్యనారాయణరాజు, మేనేజింగ్ట్రస్టీ డాక్టర్ ప్రవీణ్ వర్మ, డీన్ డాక్టర్ లక్ష్మీకుమార్, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ రఘురాం, అకడమిక్ డైరెక్టర్ డాక్టర్ వేణుగోపాలరావు, సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వరరావు, హోమియోపతి వైద్యకళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీధర్, ఏఓ పి.గణేష్ పతకాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. -
శబ్ద కాలుష్యం నివారించాలి
విజయనగరం ఫోర్ట్: శబ్ద కాలుష్యం నివారించాలని అందుకుగాను డీజేలు వంటి పోగ్రాంలు నిరోధించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ జీవన రాణి అన్నారు. ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద నిర్వహించిన ర్యాలీని జెండా ఊపి సోమవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్న పిల్లలకు సెల్ఫోన్ ఇవ్వకూడదని తెలిపారు. అవసరం మేరకు మాత్రమే సెల్ఫోన్ వినియోగించాలని సూచించారు. మానవుడికి వినికిడి చాలా ప్రధానమైనదన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ కె.రాణి, ఎన్సీడీపీఓ డాక్టర్ వీవీబీ సుబ్రహ్మణ్యం, డీపీఎంఓ డాక్టర్ సూర్యనారాయణ, డీఎంఓ మణి, డాక్టర్ వెంకటేష్, డెమో వి.చిన్నతల్లి తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ జీవన రాణి -
భక్తి మార్గం అనుసరణీయం
● మాజీ ఎంపీ బెల్లానవంగర: ప్రజలు భగవన్మామస్మరణతో మెలిగి భక్తిమార్గాన్ని అనుసరణీయంగా భావించా లని విజయనగరం మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయ న వంగర మండల పరిధి గీతనాపల్లి గ్రామంలో జరుగుతున్న శ్రీరామాలయం పునఃప్రతిష్ట, శ్రీఆంజనేయస్వామి ఆలయం ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ నెయిగాపుల శివరామకృష్ణయ్య, నెయిగాపుల ప్రసాదరావులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎంపీపీ ఉత్తరావెల్లి సురేష్ముఖర్జీ, పార్టీ నాయకులు యలకల వాసునాయుడు, కిమిడి స్వామినాయుడు తదితరులు పాల్గొన్నారు.సెంచూరియన్లో క్యాంపస్ ఇంటర్వ్యూలునెల్లిమర్ల రూరల్: మండలంలోని టెక్కలి సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో నాగ్పూర్కు చెందిన కోడ్ ఎఫ్ సొల్యూషన్స్ సంస్థ సోమవారం క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఫోరెన్సిక్ అనలిస్ట్, ఫోరెన్సిక్ ట్రైనీ, ఇన్వెస్టిగేటర్, క్రైమ్ ఆఫీసర్స్, తదితర ఉద్యోగాలకు ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ శుభం రాజేంద్ర సాహు మాట్లాడుతూ బీఎస్సీ, ఎమ్మెస్సీ పోరెన్సిక్లో మొదటి సంవత్సరం చదివిన విద్యార్థులకు ఇంటర్న్షిప్ కాలంలో రూ.10వేలు స్టైపెండ్ అందిస్తామన్నారు. ఇంటర్న్షిప్ అనంతరం ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పారు. కార్యక్రమంలో హెచ్ఆర్ హెడ్ శుభాంగి నీల్కాంత్ నిఖారే పాల్గొన్నారు.గొర్రెపోతుల పందాలపై పోలీసుల దాడిలక్కవరపుకోట: మండలంలోని ఖాసాపేట గ్రామం సమీపంలో గల తోటల్లో రహస్యంగా నిర్వహిస్తున్న గొర్రెపోతుల పందాలపై ఎస్సై నవీన్పడాల్ ఆధ్వర్యంలో పోలీసులు సోమవారం దాడి చేశారు. ఈ సందర్భంగా పందెం నిర్వహిస్తున్న ఐదుగురు పందెం రాయుళ్లను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.2వేలు, రెండు గొర్రెపోతులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. రోడ్డు ప్రమాదంలో జేఎల్ఎం మృతిచీపురుపల్లి: పట్టణంలోని ఆంజనేయపురం సమీపంలో విజయనగరం–పాలకొండ ప్రధాన రహదారిలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని పేరిపి గ్రామానికి చెందిన కరణం సత్యం(48) మృతిచెందాడు. స్థానికులు అందించిన సమాచారం ప్రకారం పేరిపి గ్రామానికి చెందిన కరణం సత్యం ఆర్ఈసీఎస్లో చీపురుపల్లి మండలంలోని పత్తికాయవలస జూనియర్ లైన్మన్(జెఎల్ఎం)గా పనిచేస్తున్నాడు. అయితే పట్టణంలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో మూడు రోజులు నిరంతర విద్యుత్ సరఫరాలో భాగంగా ఉన్నతాధికారులు జేఎల్ఎంలకు చీపురుపల్లిలో అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో విధి నిర్వహణలో భాగంగానే సత్యం ఆదివారం అర్ధరాత్రి 12 గంటలు దాటిన తరువాత చీపురుపల్లి నుంచి గరివిడి వైపు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న పాలవ్యాన్ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఆయనకు భార్య సుజాత, కుమారుడు ఉన్నారు. పట్టణంలోని ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
డీఏవీ స్కూల్ విద్యార్థి ప్రతిభ
రాజాం సిటీ: స్థానిక డీఏవీ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న హనుమంతు జయాన్ చక్కని ప్రతిభ కనబరిచాడు. హైదరాబాద్కు చెందిన విశ్వం ఎడ్యుటెక్ నిర్వహించిన జిల్లా, రాష్ట్ర స్థాయి, అబాకస్, వేదిక్ మ్యాథ్స్లో ప్రతిభకనబరిచి జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. ఈ నెల 2న జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీలో సీనియర్ విజవలైజింగ్ కేటగిరిలో ద్వితీయ స్థానం సంపాదించాడని పాఠశాల సిబ్బంది తెలిపారు. తన కుమారుడి ప్రతిభపట్ల రాజాం రూరల్ సీఐ హెచ్.ఉపేంద్రరావుతో పాటు కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. -
కార్మికులకు ధన్యవాదాలు
నెల్లిమర్ల: కార్మికుల శాంతియుత పోరాటంతో జూట్మిల్లు తిరిగిందని జూట్మిల్ వర్కర్స్ యూనియన్ నాయకుడు కిల్లంపల్లి రామారావు అన్నారు. ఈ మేరకు సోమవారం మిల్లు తిప్పడానికి యాజమాన్యం నోటీసు జారీచేసి నిర్వహణ పనులు ప్రారంభించిన నేపథ్యంలో ఆయన గేట్మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మికుల శాంతియుత పోరాటం ఫలితంగా మిల్లు తిరుగుతుందన్నారు. అలాగే గడిచిన 9నెలలుగా యాజమాన్యం అక్రమంగా లాకౌట్ చేసి కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసినా కార్మికుల శాంతియుత పోరాటంతో దఫా దఫాలుగా చర్చలు జరిపి ముందుగా బోనస్ సాధించి మిల్లు తిరగడానికి పార్టీల కతీతంగా కార్మికులు ఎంతో సహకరించారంటూ వారికి ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా కార్మికులు ఇదే స్ఫూర్తిని కొనసాగించి సమస్యలు ఎదురైతే భవిష్యత్ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. -
మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దాం
● కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్పార్వతీపురంటౌన్: జిల్లాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మహిళా దినోత్సవం నిర్వహణపై సోమవారం ఆయన కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళా దినోత్సవంలో మహిళలందరినీ భాగస్వామ్యం చేయాలని సూచించారు. ప్రేరణ, సఖి కింద ప్రభుత్వ శాఖల్లో పదవులు అధిరోహించిన మహిళలు, పారిశ్రామిక వేత్తలు, విద్యావేత్తలు, క్రీడలు, వ్యవసాయంలో రాణించిన మహిళలు, సంగీత కళాకారులు, పారిశుద్ధ్యం, ఆశ, వైద్య రంగాలలో విశేష సేవలందించిన మహిళలందరినీ గుర్తించాలని సూచించారు. ఆ మహిళల ద్వారా ఇతరులు ప్రారణ పొందాలని అభిప్రాయపడ్డారు. మహిళల ఎంపికలో పారదర్శకత అవసరం మహిళల ఎంపికలో పారదర్శకత అవసరమని, అన్ని వర్గాలకు అవకాశం కల్పించాలని కలెక్టర్ చెప్పారు. అన్ని నియోజక వర్గాల్లో ఎస్సీ,ఎస్టీ, బీసీ, ఓసీ మిగిలిన అన్ని వర్గాలకు అవకాశం కల్పించాలని, మహిళలు తయారు చేసిన అన్ని రకాల ఉత్పత్తులు, తినుబండారాల స్టాల్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు. జిల్లా అధికార యంత్రాంగం చేపడుతున్న న్యూట్రీకిట్ల పంపిణీ, పాఠశాల స్థాయిలో విద్యార్ధులకు ఏర్పాటు చేసిన భవిత తదితర అంశాలు ఆవిష్కృతం కావాలని పిలుపునిచ్చారు. నేడు హెల్దీ ఉమెన్.. హ్యాపీ ఉమెన్ ఈనెల 4న హెల్దీ ఉమెన్..హ్యాపీ ఉమెన్ పేరిట యోగా, ధ్యానం వంటి కార్యక్రమాలు చేపట్టాలని, మండల స్థాయి విజేతలకు ఈనెల 6వ తేదీన, జిల్లాస్థాయిలో విజేతలకు ఈనెల 7వ తేదీన అవార్డుల ప్రదానం చేపట్టాలని కలెక్టర్ కోరారు. కార్యక్రమంలో డీఆర్ఓ హేమలత, ఐసీడీఎస్ పీడీ టి.కనకదుర్గ, డీఆర్డీఏ పీడీ వై.సత్యంనాయుడు, మెప్మా పీడీ కె.శ్రీనివాసరావు, డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.భాస్కరరావు, పరిశ్రమల మేనేజర్ ఎంవీ కరుణాకర్, డీపీఆర్ఓ ఎల్.రమేష్, నైపుణ్యాభివృద్ధి అధికారి సాయికృష్ణ చైతన్య, డీఎస్డీఓ ఎస్.వెంకటేశ్వర్లు, జిల్లా, మండల మహిళా సమాఖ్య అధ్యక్షులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
శ్రీరామ రామ రామేతి..!
● అజరామరం గుళ్ల సీతారాంపురంలోని ఆలయం ● 500 ఏళ్ల చరిత్ర కలిగిన సీతారాముల ఆలయం ● ఆలయంలో అంగరంగ వైభవంగా డోలోత్సవం నిర్వహణరాజాం నియోజకవర్గంలోని సంతకవిటి మండలంలో గల గుళ్ల సీతారాపురం గ్రామంలో వెలసిన సీతారాముల ఆలయానికి 500 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ ఆలయంలో సీతారాములు స్వయంభూగా వెలిశారు. ఆనాడు ఈ ప్రదేశం నిర్మానుష్యంగా ఉండడంతో ఆలయం నిర్మాణంతో పాటు గ్రామం నిర్మించారు. సీతారాంపురం గ్రామాలు ఎక్కువగా ఉండడంతో గుడి సీతారాంపురంగా ఈ గ్రామాన్ని పిలిచేవారు. కాలక్రమేణా అది గుళ్ల సీతారాంపురంగా రూపాంతరం చెందింది. ఈ ఆలయానికి బొబ్బిలి రాజులు వంశపారంపర్యంగా ధర్మకర్తలుగా కొనసాగుతున్నారు. ఈ ఆలయం మొత్తం రాళ్ల పేర్పుతో నిర్మించిన అద్బుత కట్టడం. ఈ ఆలయంలో గాలిగోపురం దాదాపు 65 అడుగుల పొడవు ఉంటుంది. గాలిగోపురం పైకి ఎక్కితే బొబ్బిలిలోని వేణుగోపాలుని ఆలయం గాలి గోపురం కనిపిస్తుందని ప్రాశస్త్యం. స్వయంభూగా వెలిసిన ఇక్కడి సీతారాములు ఏకాంతవాసంలో ఉన్నట్లు ఏకశిలపై ఉండడం విశేషం. ఏ ఆలయంలో అయినా సీతారాములతో పాటు లక్ష్మణుడు, ఆంజనేయుడు ఉంటారు. కానీ ఈ ఆలయంలో లక్ష్మణుడు, ఆంజనేయుడు, శంఖుచక్రాలు, ధనుర్బాణాలు ఉండవు. ఈ ఆలయం గోడలపై చెక్కిన శిల్పాలు చూపరులను ఆకర్షిస్తున్నాయి. ప్రధాన ఆలయం చుట్టూ బేడాను ఏర్పాటు చేశారు. ఈ బేడాను అనుసరించి ఆళ్వారులు, రాధాకావతులు, రామానుజుల వారు, నమ్మాళ్వాల్, గరుడాళ్వాల్, మానవాళ్ల మహాముని, దాసాంజనేయులకు ప్రత్యేకంగా సన్నిధులను ఏర్పాటు చేశారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం జేష్ఠ శుద్ధ ఏకాదశినాడు ఉదయం రాధాకాంతుల కల్యాణం, రాత్రి సీతారాముల కల్యాణం, శ్రావణ శుద్ధ ఏకాదశి నాడు పవిత్రోత్సవాలు, 30 రోజులపాటు ధనుర్మాస ఉత్సవాలు నిర్వహిస్తామని ఆలయ ప్రధాన అర్చకుడు భోగాపురపు ప్రసాదరావు తెలిపారు. అంగరంగ వైభవంగా డోలా పౌర్ణమి ఫాల్గుణ శుద్ధ పౌర్ణమినాడు(డోలా పౌర్ణమి) స్వామి వారిని ఆంజనేయ వాహనం, సర్ప వాహనంపై ఊరేగింపుగా ఉత్తర ముఖ మంటపానికి వేంచేసి భక్తకోటి అందరికి దర్శన భాగ్యం కల్పిస్తారు. ఇక్కడ స్వామి వారికి ఊంజల్ సేవ చేస్తారు. దీనినే డోలోత్సవం అంటారు. ఆ రోజు నుంచి మూడు రోజుల పాటు డోలాయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ సంవత్సరం కూడా ఏటాలాగానే ఈ నెల 14 నుంచి 16 వరకు డోలాయాత్ర నిర్వహించనున్నారు. ఆలయాని చేరుకోవడమిలా.. రాజాం పట్టణానికి 8 కిలోమీటర్ల దూరం..సంతకవిటి మండకేంద్రానికి 7 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. రాజాం నుంచి బస్సు సౌకర్యం ఉంది. రాజాం నుంచి మందరాడ, సంతకవిటి, మండాకురిటి బస్సు ద్వారా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ఆటోలు కూడా అందుబాటులో ఉంటాయి. -
సునీల్కుమార్పై సస్పెన్షన్ ఎత్తివేయాలి
విజయనగరం టౌన్: దళిత అధికారులపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష పూరిత చర్యలు చేపట్టడం దారుణమని, కూటమి ప్రభుత్వం పలువురు దళిత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పోస్టింగులివ్వకుండా ఉద్దేశపూర్వకంగానే అవమానిస్తోందని, డీజీ ర్యాంకులో ఉన్న పీవీ.సునీల్ కుమార్పై ఉద్దేశపూర్వకంగా కక్షసాధింపు చేపట్టడం విచారకరమని అంబేడ్కర్ ఇండియా మిషన్ ప్రతినిధులు బొంగ భానుమూర్తి, రేగాన శ్రీనివాసరావు, కె.భీమారావు తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు స్థానిక బాలాజీ కూడలి వద్దనున్న అంబేడ్కర్ భవన్లో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2024 జూన్ 12 తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి రాష్ట్రంలో అధికారం చేపట్టిన నాటి నుంచి నేటివరకూ సుమారు తొమ్మిదినెలల కాలంలో రాష్ట్రంలో ఉన్న దళిత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను టార్గెట్ చేస్తూ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని పక్కన పెడుతూ, నారా లోకేష్ తీసుకువచ్చిన రెడ్బుక్ రాజ్యాంగాన్ని అములుచేస్తున్నారని ధ్వజమెత్తారు. దేశంలో ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని మోడీ అమలుచేస్తే, రాష్ట్రంలో లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగం అమలుచేస్తూ తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. సమావేశంలో సోము మురళీమోహన్, పి.ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు. అంబేడ్కర్ ఇండియా మిషన్, దళిత సంఘాల నాయకులు -
5 చోరీ కేసుల్లో నిందితుడి అరెస్టు
● రూ.ఆరు లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనంవిజయనగరం క్రైమ్: విజయనగరం రూరల్ పీఎస్ పరిధి జమ్ములో గత నెల 22న రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి ఇంట్లో జరిగిన దొంగతనం కేసును రూరల్ పోలీసులు ఛేదించారు. ఈ మేరకు సదరు నిందితుడిని రూరల్ పోలీసులు అరెస్టు చేసి నిందితుడి దగ్గర నుంచి సుమారు రూ.ఆరు లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు రూరల్ పీఏస్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ, సీఐ లక్ష్మణరావు, ఎస్సై అశోక్లు ఈ విషయంపై మాట్లాడారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లాకు చెందిన చల్లా ప్రతాప్రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల్లో 5 దొంగతనాలకు పాల్పడ్డాడని చెప్పారు. గత నెల ఫిబ్రవరిలో జమ్ములో రిటైర్డ్ బ్యాంకు ఎంప్లాయి ఇనుగంటి సూర్యనారాయణ తన ఇంటికి తాళం వేసి పెళ్లి నిమిత్తం యలమంచిలి వెళ్లారు. అదే రోజున గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తలుపులు పగులగొట్టి బీరువాలో బంగారు అభరణాలను ఎత్తుకెళ్లారని రూరల్ పోలీస్స్టేషన్లో రిటైర్డ్ బ్యాంకు ఎంప్లాయి ఫిర్యాదు చేశారు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన ఎస్సై అశోక్ సీఐ లక్ష్మణరావు సూచనలతో నిఘా పెట్టగా సోమవారం నగరంలోని విజ్ఞాన భారతి స్కూల్ వద్ద బాబామెట్ట ద్వారకనగర్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ప్రతాప్రెడ్డిని పట్టుకుని విచారణచేయగా దొంగతనం విషయం బయట పడింది. నిందితుడి దగ్గర ఒక బంగారు నెక్లెస్, ఒక హారం, నాలుగున్నర జతల చెవి దిద్దులు, జతగొలుసు, ఒక గోల్డ్ చైన్తో కలిసి మొత్తం రూ.6లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ వివరించారు. -
సంగాం ఆలయంలో భక్తుల రద్దీ
● త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలువంగర: మండల పరిధి సంగాంలో వెలసిన పవిత్ర సంగమేశ్వరస్వామి ఆలయానికి సోమవారం భక్తుల రద్దీ పెరిగింది. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు సోమవారం కావడంతో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చి ఆలయ ప్రాంగణంలో ఉన్న సువర్ణముఖి, వేగావతి, నాగావళి నదులు కలిసే కూడలి(త్రివేణి) సంగమం వద్ద పెద్ద సంఖ్యలో పుణ్యస్నానాలు ఆచరించి సంగమేశ్వరుడిని దర్శించుకున్నారు. పితృదేవతలకు అధిక సంఖ్యలో భక్తులు పిండప్రదానాలు చేశారు. -
మహిళా పోలీస్ సిబ్బందికి యోగా శిక్షణ
విజయనగరం క్రైమ్: స్థానిక కంటోన్మెంట్లో గల పోలీస్ పరేడ్ మైదానంలో మహిళా పోలీస్ సిబ్బందికి జిల్లా పోలీస్ శాఖ యోగ శిక్షణను ఆదివారం అందజేసింది. మహిళా సాధికారత వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్ గ్రౌండ్లో మహిళా పోలీసు సిబ్బందికి ప్రత్యేకంగా యోగా తరగతులను నిర్వహించారు. యోగా అనేది శరీరానికి, మనసుకు, ఆత్మకు శాంతి కలిగించే ప్రాచీనమైన సాధన అని ఎస్పీ వకుల్ జిందల్ ఈ సందర్భంగా అన్నారు. మహిళలు కుటుంబ బాధ్యతలను, ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తూ, హార్మోనల్ సవాళ్లను ఎదుర్కొంటారని, వాటిని అధిగమించడానికి యోగసాధన ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. యోగాతో హార్మోనుల సమతుల్యత సాధించి థైరాయిడ్, ఇతర అనారోగ్య సమస్యలను అధిగమించవచ్చునన్నారు. యోగాతో మహిళల్లో సహనశక్తి పెరుగుతుందని, ఆందోళన, ఒత్తిడి, నిద్ర సమస్యలు తగ్గి, మానసిక ప్రశాంతత పొందవచ్చునన్నారు. నిరంతరం యోగ సాధన చేయడం వల్ల మహిళల్లో ఆలోచన శక్తి, ఏకాగ్రత పెరిగి, పనుల్లో మంచినిర్ణయాలు తీసుకుంటూ, జీవితంలో సమర్థవంతమైన వ్యక్తులుగా రాణిస్తారని అభిప్రాయ పడ్డారు. ప్రతిరోజూ యోగ సాధన చేయడంతో శారీరక, మానసిక ఆనందాన్ని పొందవచ్చునని ఎస్పీ వకుల్ జిందల్ స్పష్టం చేశారు. మహిళా పోలీస్స్టేషన్ సీఐ ఈ.నర్సింహమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ యోగా శిక్షణ తరగతుల్లో ఆర్ఐ ఎన్.గోపాలనాయుడు, ఎస్సైలు పద్మావతి, నరసింగరావు, ఎఆర్ ఎస్సై కె.రమేష్, మహిళా సిబ్బంది పాల్గొన్నారు. -
సంస్కృతి, సంప్రదాయాలు సొంతం చేసుకోవాలి
● మహిళల ఆరోగ్యం కోసం వికాస్ తరంగణి సేవా సంస్థ ● చినజియర్ స్వామిచీపురుపల్లి: ప్రస్తుత సమాజంలో చిన్న వయస్సు నుంచే పెద్దల దగ్గర నుంచి సంస్కృతి, సంప్రదాయాలు తెలుసుకోవడమే కాకుండా సొంతం చేసుకోవాలని వేద గురువు, ఉపదేశకుడు చిన్న జియర్ స్వామి బోధించారు. ఈ మేరకు ఆదివారం చీపురుపల్లిలోని ప్రముఖ వ్యాపారులు అంధవరపు హరి, గోవింద నివాసంలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన స్థానిక రాధామాధవ్ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. పూర్వీకులు పాటించిన సంప్రదాయాలు ప్రతి వ్యక్తి జీవితంపైనా ఎంతో ప్రభావం చూపుతాయన్నారు. పూర్వ సంప్రదాయాలకు ఎంతో గొప్ప విలువ ఉందని అందుకనే పూర్వీకులు పాటించారని తెలిపారు. ప్రస్తుతం ఆ సంప్రదాయాలు తెలియక పిల్లలు తప్పులు చేస్తున్నారని అలాంటప్పుడు పిల్లలను కాకుండా సంప్రదాయాలు నేర్పని తల్లిదండ్రులనే దండించాలని అభిప్రాయ పడ్డారు. సంస్కృతి, సంప్రదాయాలు నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉందన్నారు. సమాజంలో ఉండే ప్రతి ఒక్కరూ మంచిని కోరుకోవాలని అప్పుడే ప్రతి కుటుంబం బాగుంటుందన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉండాలని లేదంటే కుటుంబం రోడ్డున పడుతుందన్నారు. మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ చూపించాలని సూచించారు. న్నారు. ఇటీవల కాలంలో మహిళలను క్యాన్సర్ మహమ్మారి వెంటాడుతోందని, అందుకనే వికాస్ తరంగిణి సేవా సంస్థను 2007లో నెలకొల్పి ఇంతవరకు 30 లక్షల మంది మహిళలకు ఉచితంగా వైద్య సహాయం, అవగాహన కల్పించినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ వికాస్ తరంగిణి సేవా సంస్థకు వలంటీర్లు ఉన్నారని చెప్పారు. మహిళలు అప్రమత్తమై వికాస్ తరంగిణి సేవా సంస్థను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
అమ్మవారికి ఘటాల నివేదన
గరుగుబిల్లి మండలంలోని రావుపల్లి గ్రామంలో శ్రీ గట్టాలమ్మ ఆలయ పునః ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా మహిళలు ఆదివారం ఘటాలతో ఊరేగింపు నిర్వహించారు. ఉదయం 5 గంటలకు మేళతాళాల నడుమ, మంగళ వాయిద్యాలతో పెద్ద సంఖ్యలో మహిళలు ఘటాలతో బారులు తీరారు. ఊరేగింపుగా గట్టాలమ్మ తల్లి ఆలయానికి తరలివెళ్లారు. ఉదయం 11 గంటలకు విగ్రహం, పూర్ణ కలశ ప్రతిష్ఠ మహోత్సవం భక్తుల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ బొంతాడ మహేశ్వరరావు, గ్రామస్తులు పాల్గొన్నారు. – గరుగుబిల్లి -
ఎక్కడి పనులు అక్కడే ఆపండి..!
సాలూరు: వారంతా నిబంధనల ప్రకారం, కాంట్రాక్ట్లు దక్కించుకుని పనులు ప్రారంభించారు. నిర్దేశించిన పనులు చేపట్టే క్రమంలో కొద్ది శాతం పనులు పూర్తయిన తరువాత అధికారులు సదరు కాంట్రాక్టర్లకు షాకింగ్ వార్త చెప్పారు. ఎక్కడిపనులు అక్కడే ఆపివేయాలని, స్థానిక మంత్రిని కలిసి ఆమె అంగీకారం తెలిపిన తరువాతే పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. దీంతో సదరు కాంట్రాక్టర్లు కంగుతున్నారు. ఇది సాలూరు నియోజకవర్గంలో పెద్దగెడ్డ రిజర్వాయర్ కాలువల పూడికతీత పనులు చేస్తున్న కాంట్రాక్టర్ల పరిస్థితి. స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ నుంచి పెద్దగెడ్డ సబ్డివిజన్ పరిధిలో పూడికతీత పనులు చేపట్టడానికి రూ.91.21 లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధులతో ప్రాజెక్టు పరిధిలో ఉన్న కాలువల పూడిక తీత, గోడలు, మదుముల నిర్మాణ పనులకు టెండర్లు ఆహ్వానించారు. ఈ పనులను టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లు దక్కించుకున్నారు. నిబంధనల మేరకు పనులను ప్రారంభించారు. ప్రాజెక్టు పరిధిలో 15 పనులకు సంబంధించి టెండర్లు పిలవగా వాటన్నింటి పనులను అధికారుల ఆదేశాల మేరకు టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించారు. దాదాపు 20 నుంచి 30 శాతం పనులు చేసిన తరువాత కాంట్రాక్టర్లకు పెద్దగెడ్డ అధికారుల నుంచి షాకింగ్ వార్త వినాల్సి వచ్చింది. చేస్తున్న పనులు ఎక్కడివక్కడే నిలిపివేయాలని, మీరంతా స్థానిక మంత్రి గుమ్మడి సంధ్యారాణిని కలవాలని ఆమె చేయమంటేనే పనులు పూర్తిచేయాలని లేకుంటే లేదని స్పష్టం చేశారు. పనులు చేసిన వరకు బిల్లులు చెల్లించండి దీంతో కంగుతున్న కాంట్రాక్టర్లు ఆ పనులను నిలిపివేశారు. పనులు ప్రారంభించకముందే ఏదైనా చెప్పాలని, పనులు చేపట్టిన మధ్య ఇలా చెప్పడం ఏమిటని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. పలువురు కాంట్రాక్టర్లు మంత్రిని కలిసిన తరువాత, నిరాశగా వెనుదిరగడంతో అక్కడ ఏం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. దాదాపు ఎర్త్వర్క్ తదితర పనులు చేపట్టామని కావున చేపట్టిన పనుల వరకు బిల్లుల చెల్లింపులు చేయాలని అధికారులను కాంట్రాక్టర్లు కోరడం కొసమెరుపు. దీనిపై పెద్దగెడ్డ డీఈ శ్రీనివాసరావును వివరణ కోరగా, ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యం ఇవ్వాలంటూ, స్థానిక మంత్రిని కలవాలని కాంట్రాక్టర్లకు చెప్పామన్నారు. అర్ధాంతరంగా నిలిచిపోయిన పెద్దగెడ్డ పూడికతీత పనులు నిలిపివేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించిన అధికారులు మంత్రి అంగీకారం లేకుండా పనులు చేయవద్దని హుకుం -
విజయనగరం
సోమవారం శ్రీ 3 శ్రీ మార్చి శ్రీ 2025ఆదర్శంగా చదువుకుందాం..రా..! నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను చేరువ చేయాలనే సంకల్పంతో 2009వ సంవత్సరంలో ఏపీ మోడల్స్కూల్స్ పేరుతో పాఠశాలలను ప్రారంభించారు. –8లోఅమ్మవారిని దర్శించుకున్న జెడ్పీ చైర్మన్ చీపురుపల్లి: శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి 27వ జాతర మహోత్సవాల్లో భాగంగా పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. మూడు రోజులు జాతరలో భాగంగా తొలి రోజు ఆదివారం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్ సీపీజిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు, పుష్పాంజలి దంపతులు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖ ర్, శ్రీదేవి దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులు అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు వ్యాయామ ఉపాధ్యాయుల సంఘ ఎన్నిక విజయనగరం: జిల్లా వ్యాయామ ఉపాధ్యాయు ల సంఘం అధ్యక్షుడిగా గోపి లక్ష్మణరావు, కార్యదర్శిగా నల్లా వెంకటనాయుడు ఎన్నికయ్యారు. పువ్వాడ స్కూల్లో ఆదివారం జరిగిన జిల్లా వ్యాయామ సంఘ ఎన్నికలలో నూతన కార్యవర్గం ఎన్నికైంది. 251 మంది పీడీ, పీఈటీలు పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల పరిశీలకులుగా రాష్ట్ర నాయకులు ఎంవి.రమణ, సాంబమూర్తి వ్యవహరించారు. కొత్త కార్యవర్గ సభ్యులకు ఉత్తరాంధ్ర జిల్లాల వ్యాయామ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు అభినందనలు తెలిపారు. భక్తి భావంతో ప్రజలు మెలగాలి ● శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి వంగర: ప్రజలు భక్తి భావంతో మెలగాలని విశాఖపట్నం శ్రీశారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి అన్నారు. మండలంలోని గీతనాపల్లి గ్రామంలో జరుగుతున్న శ్రీరామాలయం పునఃప్రతిష్ఠ, ఆంజనే యస్వామి ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమాల్లో ఆది వారం పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పల్లె ప్రజ ల్లో ఆధ్యాత్మిక చింతన అధికంగా ఉంటుందని తెలిపారు. ప్రతిష్ఠ ఉత్సవాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఆధ్మాత్మిక చింతనతో మనశ్శాంతి ఉంటుంద ని, భగవంతుడి సేవలో ప్రజలు తరించాలని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఉత్తరావెల్లి సురేష్ముఖర్జీ, సర్పంచ్ నెయిగాపుల శివరామకృష్ణయ్య, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నీతి మాలిన కూటమి పాలన ● మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి జియ్యమ్మవలస రూరల్: రాష్ట్రంలో కూటమి పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నీతి మాలి న పాలన సాగిస్తున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి ధ్వజమెత్తారు. చినమేరంగిలోని తన కార్యాలయంలో విలేకరులతో ఆమె ఆదివారం మాట్లాడారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలకు, ప్రజలకు ఎలాంటి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమలను చేయొద్దని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం ఒక ముఖ్యమంత్రిగా ఎంత వరకు సబబని ప్రశ్నించారు. ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుగా అనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ప్రజా సంక్షేమ పాల న వైఎస్ జగన్మోహన్రెడ్డికే సాధ్యమన్నారు. అబద్ధపు హామీలతో అడ్డదారిలో అధికారం చేపట్టి నేడు ఇలాంటి వ్యాఖ్యలతో ఏం సాధించాలనుకుంటున్నారో చెప్పాలని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలను వెన క్కి తీసుకోవాలని, ప్రజలకు బహిరంగ క్షమాప ణ చెప్పాలని డిమాండ్ చేశారు. అమ్మవారి దర్శనానికి క్యూలో ఉన్న భక్తులు పసుపు, కుంకుమ సమర్పించుకుంటున్న మహిళలు చీపురుపల్లి: కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి 27వ జాతర మహోత్సవములు ఆదివా రం వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. ఆపదల నుంచి గట్టెక్కించు తల్లీ అంటూ భక్తులు అమ్మవారిని భక్తిశ్రద్దలతో వేడుకున్నారు. ఆది, సోమ, మంగళవారం మూడు రోజుల పాటు జరగనున్న అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా ఆదివారం తెల్లవారుజామున 2 గంటల నుంచి దర్శనా లు ప్రారంభమయ్యాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో క్యూలైన్లు నిండిపోయాయి. మధ్యాహ్నం 1 గంట వరకు క్యూలైన్లు కొనసాగాయి. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి పసుపు, కుంకుమ, చీరలతో మొక్కు లు సమర్పించుకున్నారు. అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో ఉన్న ధ్వజస్తంభంతో పాటు రావి చెట్టు వద్ద మహిళలు పూజలు చేసి దీపాలు వెలిగించారు. మరికొందరు భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. విజయనగరం, విశాఖపట్టణం, రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్తో పాటు ఒడిశా ప్రాంతం నుంచి కూడా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. వీఐపీ పేరుతో యథేచ్ఛగా దర్శనాలు అమ్మవారి జాతరలో తొలి రోజు దర్శనాల విషయంలో భక్తులు నుంచి అసంతృప్తి వ్యక్తమైంది. దేవదాయ శాఖ ఆధ్వర్యంలో రూ.100, రూ.50, రూ.20, రూ.10 టిక్కెట్లును విక్రయించారు. వాటికి సంబంధించి అన్ని క్యూ లైన్లలో భక్తులు టిక్కెట్లు కొనుగోలు చేసుకుని వెళ్తున్నారు. అయితే వీఐపీ దర్శనాల కోసం ఉంచిన గేటు నుంచి సామాన్యులు సైతం పదుల సంఖ్యలో వెళ్తుండడంతో దర్శనాలకు ఆటంకం కలిగిందని పలువురు భక్తులు దేవదాయ శాఖ అధికారులను ప్రశ్నించారు. అధికార కూటమి నాయకులు దగ్గరుండి సామాన్యులను వీఐపీ గేటు నుంచి నేరుగా గర్భగుడికి తీసుకెళ్లి దర్శనాలు చేయించుకున్నారని దీంతో టిక్కెట్లు కొనుగోలు చేసిన తామంతా గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వచ్చిందని భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పట్టించుకోని దేవదాయ, పోలీస్ శాఖలు పక్క గేటు, వెనుక ద్వారం నుంచి దర్శనాలు నిలువరించి టిక్కెట్లు కొనుగోలు చేసుకుని దర్శనాలకు వెళ్లే భక్తులకు అవస్థలు లేకుండా చూడాల్సిన దేవదాయ, పోలీస్ శాఖలు కనీసం చర్యలు చేపట్టలేదనే విమర్శలు భక్తుల నుంచి వినిపించాయి. వీఐపీ గేటు తాళం టీడీపీ కార్యకర్తల చేతికి ఇచ్చి సాధారణ భక్తుల దర్శనాలకు జాప్యం జరిగే విధంగా దేవదాయ, పోలీస్ శాఖలు వ్యవహరించడం ఏమిటని క్యూలైన్లలో భక్తులు పోలీస్ సిబ్బందిని కూడా ప్రశ్నించారు. వీఐపీ గేటు నుంచి అధిక సంఖ్యలో సాధారణ భక్తులను పంపించడం ద్వారా టిక్కెట్లు కొనుగోలు చేసి దర్శనాలకు వెళ్తున్న తమను ఇబ్బందులకు గురి చేయడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. కనీసం మిగిలిన రెండు రోజులైన ఇలాంటి చర్యలను నిలువరించాలని భక్తులు కోరుతున్నారు.విద్యతోనే సమాజాభివృద్ధి విజయనగరం గంటస్తంభం: విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యమని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జేవీఆర్కే ఈశ్వరరావు అన్నారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఫిబ్రవరి 10న నిర్వహించిన ప్రజ్ఞ వికాసం పరీక్ష విజేతలకు జిల్లా పరిషత్ నందు ఆదివారం బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఒత్తిడిని జయించి సత్ఫలితాలు సాధించాలన్నారు. ఉన్నతమైన విద్యను అభ్యసించడం ద్వారా మంచి సమాజ నిర్మాణంలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలన్నారు. పదో తరగతి విద్యార్థుల్లో భయాన్ని పొగొట్టేందుకు ఎస్ఎఫ్ఐ చేసిన కృషి అభినందనీయమన్నారు. విద్యార్థులంతా తమ చదువుల్లో రాణించాలన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి.రాము, సీహెచ్ వెంకటేష్ మాట్లాడుతూ ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా యూటీఎఫ్, ఎస్ఎఫ్ఐ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజ్ఞ వికాసం పరీక్షకు జిల్లా వ్యాప్తంగా ఐదు వేల మంది విద్యార్థులతో నిర్వహించామన్నారు. జిల్లా స్థాయిలో జి.యశ్వంత్, ఎం.పల్లవి, ఎ.లాస్య వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు గెలుచుకున్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో వన్ టౌన్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ప్రసన్నకుమార్, న్యూ సెంట్రల్ స్కూల్ అధినేత రవితేజ, ఎస్ఎఫ్ఐ సంఘ నేతలు ఎం.వెంకీ, రమేష్, జగదీష్, సోమేష్ తదితరులు పాల్గొన్నారు. వీరఘట్టం: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ఫిబ్రవరి 27న జరగ్గా నేడు సోమవారం ఓట్ల లెక్కింపు విశాఖపట్నంలో చేపట్టనున్నారు. పోటీలో పది మంది అభ్యర్థులున్నప్పటికీ ముగ్గురి మధ్యే ప్రధాన పోటీ ఉన్నట్టు పోలింగ్ సరళి స్పష్టం చేసింది. మిగిలిన అభ్యర్థులు కూడా తమ అనుచరులతో ఈ ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వడంతో 2019లో జరిగిన ఎన్నికల కంటే ఈసారి ఓటింగ్ పెరిగింది. ఈ నేపథ్యంలో మొదటి ప్రాధాన్యత ఓట్లు చీలిపోయినట్టు ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. స్పష్టమైన మెజార్టీ ఎవరికీ వచ్చే పరిస్థితి లేదని ఉపాధ్యాయు లు చెబుతున్నారు. రెండు, మూడు ప్రాధాన్యత ఓట్లుపైనే పోటీదారులు ఆశలు పెట్టుకున్నారు. ఇదీ విషయం గత నెల ఫిబ్ర వరి 27న జరిగిన ఉపాధ్యా య ఎమ్మెల్సీ ఎన్నికల్లో 22,493 మంది ఓటర్లకుగాను 20,794 మంది ఉపాధ్యాయులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 92.44 శాతం ఓటింగ్ జరిగింది. పోలింగ్ శాతం పెరగడంతో ప్రధాన అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. మొదటి ప్రాధాన్యత ఓటు చీలి ఉంటుందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందుచే గెలుపునకు కావాల్సిన మొదటి ప్రాధాన్యత ఓట్లు 50% ప్లస్ 1 ఓటు ఎవరికీ వచ్చే పరిస్థితి లేదంటున్నారు. కౌంటింగ్ ఇలా... ●ఉత్తరాంధ్ర జిల్లాల్లోని 123 పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన బ్యాలెట్ బాక్స్ల్లో ఉన్న ఓట్లు అన్నీ కలిపేస్తారు. దీంతో ఓట్లు లెక్కింపు సమయంలో ఏ మండలం నుంచి ఏ జిల్లా నుంచి పోటీదారులకు ఎన్ని ఓట్లు వచ్చాయో ఎవ్వరికీ తెలియదు. ●ఓట్లు లెక్కింపునకు 20 టేబుల్స్ వేస్తారు. మొత్తం ఒకచోట వేసిన ఓట్లును 25 ఓట్లు చొప్పున కట్టలు కడతారు. ఇలా 25 ఓట్లు ఉన్న 40 కట్టలను(1000 ఓట్లు) ఆ ఇరవై టేబుల్స్కు పంచుతారు. ●మొత్తం పోలైన ఓట్లు 20,794 కావున ఇందులో 20 వేల ఓట్లును 25 ఓట్లు చొప్పున 800 కట్టలు కట్టి ఇరవై టేబుల్స్కు సర్దుతారు. మిగిలిన 794 ఓట్లు చివరి టేబుల్కు ఇస్తారు. ●ఈ 20 టేబుల్స్లో తొలుత చెల్లినవి, చెల్లని ఓట్లు వేరు చేస్తారు. మళ్లీ చెల్లిన ఓట్లును 25 చొప్పున కట్టలు కడతారు. ●పోటీ చేసిన అభ్యర్థులు 10 మంది కావడంతో పది ట్రేల్ ఏర్పాటు చేస్తారు. ●ఈ పది ట్రేల్స్లో 25 చొప్పున కట్టిన ఓట్లులో 1వ నంబర్ ఎవరెవరికి వచ్చిందో ఆ ఓట్లును ఆ ట్రేల్స్ లో వేసి వారికి వచ్చిన మొత్తం ఓట్లును లెక్కిస్తారు. గెలుపు ఇలా .. ●మొత్తం చెల్లిన ఓట్లులో మొదటి ప్రాధాన్యత ఓట్లు 50 శాతం ప్లస్ 1 ఓటు వచ్చిన వారిని విజేతగా ప్రకటిస్తారు. ●ఒకే వేళ ఈ మ్యాజిక్ ఫిగర్ రాకపోతే మొత్తం పది మందిలో అందరి కంటే తక్కువ ఓట్లు వచ్చిన చివరి అభ్యర్థి ఓట్లలో 2వ నంబర్ ఎవరెవరికి వచ్చిందో ఆ ఓట్లును మిగిలిన తొమ్మిదిలో ఎంత మందికి వస్తే వారందరికీ సర్దుతారు. చివరి వ్యక్తిని ఎలిమినేట్ చేస్తారు. ●అయినా ఎవరికీ మ్యాజిక్ ఫిగర్ రాకపోతే ఇప్పుడు ఉన్న 9 మందిలో తక్కువ ఓట్లు వచ్చిన ఓట్లులో 3వ నంబర్ ఓటు ఎంత మందికి వస్తే ఆ ఓటును మిగిలిన వారికి సర్దుతారు. తర్వాత చివరి అభ్యర్థిని ఎలిమినేట్ చేస్తారు. ●ఇలా మ్యాజిక్ ఫిగర్ వచ్చేంత వరకు చివరిగా ఉన్న అభ్యర్థుల ఓట్లను మిగిలిన వారికి సర్దుతూ, ఆ అభ్యర్థులను ఎలిమినేట్ చేస్తూ 50 శాతం ప్లస్ 1 ఓటు ఎవరికి వస్తే వారిని రిటర్నింగ్ అధికారి విజేతగా ప్రకటిస్తా రు. అక్కడితో ఎన్నిక తంతు ముగుస్తుంది. న్యూస్రీల్ Ððl¬§ýlsìæ {´ë«§é¯]lÅ™èl Kr$ 50 Ô>™èl… Oò³ºyìl Ð]lõÜ¢ Ñgôæ™èl˘ లేకుంటే 2, 3 ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు మొత్తం ఓట్లు 22,493 పోలైన ఓట్లు 20,794 పోలింగ్ శాతం 92.44 శాతం -
ఆదర్శంగా చదువుకుందాం..రా..!
మెరకముడిదాం మండలం గర్భాం ఆదర్శపాఠశాల మెరకముడిదాం/లక్కవరపుకోట: దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిరుపేద విద్యార్థులకు సైతం కార్పొరేట్ స్థాయి విద్యను చేరువచేయాలనే సంకల్పంతో 2009వ సంవత్సరంలో ఏపీ మోడల్స్కూల్స్ పేరుతో పాఠశాలలను ప్రారంభించారు. ఆయన సత్సంకల్పంతో ప్రారంభించిన ఈ మోడల్ స్కూల్స్ నేడు ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నాయి. మరోవైపు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఏపీ మోడల్ పాఠశాలల్లో ఇంగ్లీష్ భోధన, అలాగే 9 వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ ద్వితీయసంవత్సరం వరకూ ఈ పాఠశాలల్లో చదువుతున్న బాలికలకు పాఠశాలల్లోనే వసతితో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. దరఖాస్తుల ఆహ్వానం విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఉన్న 16 ఆదర్శ పాఠశాలల్లో 2025–2026 విద్యాసంవత్సరానికి సంబంధించి ఆరోతరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా ఈనెల 24 నుంచి మార్చి 31 వరకూ అర్హులైనవారు ఆన్లైన్లో వివరాలను నమోదు చేసుకోవాలని ఆధికారులు సూచిస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థి అర్హతను పరిశీలించి అర్హుడని తేలితే క్రెడిట్, డెబిట్, నెట్బ్యాంకింగ్ కార్డులు ఉపయోగించి గేట్వే ద్వారా రుసుం చెల్లించిన తరువాత జనరల్ నంబర్ కేటాయిస్తారు. ఆ నంబర్ ఆధారం గా వెబ్సైట్లో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.సీఎస్ఈ.ఏపీ.జీవోవీ.ఇన్, ఏపీఎంఎస్.ఏపీజీవోవీ.ఇన అడ్రస్కు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కులాల వారీగా పరీక్ష రుసుం ఓసీ, బీసీ వారికి రూ.150, ఎస్సీ, ఎస్టీలకు రూ.75 చెల్లించాలి. ప్రవేశపరీక్షలో ఓసీ, బీసీ విద్యార్థులకు కనీసం 35 మార్కులు, ఎస్సీ, ఎస్టీలకు 30 రావాలి. ప్రతిభ, మార్కులు, రిజర్వేషన్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ఏప్రిల్ 20 వతేదీన పాఠశాలకు సంబంధించిన ప్రవేశపరీక్ష ఉంటుంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ విద్యాలయాల్లో చదువుకున్న విద్యార్థులు కూడా ఈ పాఠశాలల్లో చేరేందుకు అర్హులు. మోడల్స్కూల్స్లో ప్రవేశాలకు ఆహ్వానం ఉమ్మడి జిల్లాలో 16 పాఠశాల్లో దరఖాస్తుల స్వీకరణ 1600 మంది విద్యార్థులు చేరేందుకు అవకాశం -
ముగిసిన జాతీయ గిరిజన చిత్రకారుల సదస్సు
విజయనగరం అర్బన్: కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం, మాన్సాస్ విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదిచిత్తర నేషనల్ ట్రైబల్ పెయింటర్స్ కాన్క్లేవ్ పేరిట స్థానిక కోటలోని రౌండ్ మహల్లో రెండు రోజులుగా జరుగుతున్న జాతీయ గిరిజన చిత్రకారుల సమ్మేళనం ఆదివారం ముగిసింది. ముగింపు సభలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన రిజిస్ట్రార్ ప్రొఫెసర్ తంత్రవాహి శ్రీనివాసన్ మాట్లాడుతూ ఈ సమ్మేళనంలో 26 రకాల గిరిజన చిత్రకారులు 12 రాష్ట్రాల నుంచి పాల్గొనడం అభినందనీయమన్నారు. సుమారు ఐదు వందల మంది సందర్శకులు చిత్రాలను తిలకించారని పేర్కొన్నారు. సదస్సు విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరూ అభినందనీయులన్నారు. అనంతరం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన చిత్రకారులకు సర్టిఫికెట్లు ప్రధానం చేశారు. ఈ సమ్మేళనం గోండ్, వార్లీ, పిథోర, కోలం, సోహ్రాయ్, ఖోవర్, కోయా, కురుంబా, తంగ్ఖుల్ – నాగా, నాయకపోడు, సవర, సౌరా, మురియా, భిల్ వంటి విభిన్న కళారూపాలకు ప్రాతినిధ్యం వహిస్తూ దేశ వ్యాప్తంగా ఉన్న గిరిజన చిత్రకారులను ఐక్యం చేసిందన్నారు. ప్రొఫెసర్ జితేంద్ర మోహన్ మిశ్రా మాట్లాడుతూ విజయనగరం ప్రజలకు గిరిజన చిత్రాల పట్ల అవగాహన పెంపొందించుకునే అవకాశం వచ్చిందన్నారు. అనంతరం విద్యార్థుల సాంప్రదాయ కళా నృత్యా లు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మహారాజా స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రిన్సిపాల్ డాక్టర్ బీఎస్ఎన్ రాజు, సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ డా.ప్రమాచటర్జీ, డా.అప్పసాబ, డా.వెంకటేశ్వర్లు డా.నగేష్, డా.దేబంజన నాగ్, డా.దివ్య, డా.ఎన్.వి.ఎస్.సూర్యనారాయణ, డా.కుసుమ్, ఇరు సంస్థల విద్యార్థులు పాల్గొన్నారు. -
ధాన్యం కుప్పలు దగ్ధం
దత్తిరాజేరు: మండలంలోని పెదమానాపురంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పటించడంతో దుద్ది రమణ, చుక్క రాము, సబ్బి మంగమ్మ, చిల్ల ఈసు, తదితరులకు చెందిన ధాన్యం కుప్పలు దగ్ధమయ్యాయి. వెంటనే గజపతినగరం ఫైర్స్టేషన్కు గ్రామస్తులు సమాచారం అందించగా వారు వచ్చి మంటలు మంటలను అదుపు చేయడంతో పెనుప్రమాదం జరగలేదని గ్రామపెద్ద రామసత్యం చెప్పారు.సంవత్సరం అంతా తినడానికి ఉంచుకున్న తిండి గింజలు కాలి బూడిదయ్యాయని పేద రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. సతివాడ వైపు ఏనుగుల పయనంభామిని: మండలంలో ఏనుగుల బెడద తీవ్రమైంది. ఆదివారం భామిని మండలంలోని సతివాడ సమీపంలో మొక్కజొన్న తోటలను తినివేస్తూ ఏనుగుల గుంపు పయనమైంది. పాత ఘనసర సమీపంలో తిష్ఠ వేసిన ఏనుగుల గుంపు తివ్వాకొండల వైపు దారిమళ్లినట్లు ఫారెస్టు అదికారులు చెబుతున్నారు.ప్రస్తుతం మొక్కజొన్న పొత్తులు చేతికి అందే సమయంలో తోటలపై ఏనుగులు దాడి చేసి తినివేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. ఏనుగులను పూర్తి స్థాయిలో దారి మళ్లించి కాపాడాలని బాధిత రైతులు కోరుతున్నారు. వైద్యరంగంలో ఎనస్థీషియాదే ప్రధాన పాత్రనెల్లిమర్ల: వైద్య రంగంలో ఎనస్థీసియాదే ప్రధాన పాత్ర అని ఐఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సూరిశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. విజయనగరం మిమ్స్ వైద్య కళాశాలలో న్యూరో అనస్థీషియా సీఎంఈ సదస్సును ఆదివారం నిర్వహించారు. నేషనల్ ఐఎస్ఏ, విజయనగరం సిటీ బ్రాంచ్ సహకారంతో ఈ సదస్సు నిర్వహించగా సుమారు 300 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. సదస్సులో రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అనుభవజ్ఞులైన కన్సల్టెంట్లు పాల్గొని వివిధ అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా కళాశాల అనస్థీషియా విభాగం ఆచార్యులు కె వేంకటేశ్వరరావు మాట్లాడుతూ మిమ్స్ మెడికల్ కళాశాలలో ఎంతో ప్రతిష్టాత్మకంగా సదస్సు నిర్వహించామన్నారు. ఈ సీఎంఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు మత్తువైద్యులకు ఎంతో ఉపకరిస్తుందని అభిప్రాయ పడ్డారు. వైద్యరంగంలో ప్రధానంగా అనస్థీషియాకు సంబంధించి నూతన ఆవిష్కరణలను డాక్టర్ రాకేష్, డాక్టర్ మీనాక్షి సుందరం, డాక్టర్ విష్ణు మహేష్ వంటి ప్రముఖులు తెలియజేసినట్లు చెప్పారు. సాయి శర్వాణీ కాలనీలో చోరీబొబ్బిలి: పట్టణంలోని పాత బొబ్బిలి సమీపంలో గల సాయిశర్వాణీ కాలనీలో శనివారం రాత్రి చోరీ జరిగింది. మాజీ కౌన్సిలర్ పిల్లా రామారావు ఇంట్లో నగదు, ఇంటి నిర్మాణ సామగ్రిని దొంగతనం చేసినట్లు సమాచారం రావడంతో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఇంటి వద్ద ఉన్న సీసీటీవీకి గోనె సంచి కప్పి ఈ చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. దీనిపై ఏఎస్సై బీవీ రమణ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.మూడు డ్రిల్లింగ్ మెషీన్లు, కొంత నగదు పోయినట్లు అనుకుంటున్నా ఇంటి యజమాని విజయవాడ వెళ్లడం వల్ల పూర్తి వివరాలు తెలియరాలేదు. ఆయన వచ్చిన తరువాత ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసే అవకాశముందని ఏఎస్సై తెలిపారు. జూదరుల అరెస్టుపార్వతీపురం రూరల్: పట్టణంలోని రెండుచోట్ల పేకాట స్థావరాలపై దాడులు చేసి 9 మందిని అదుపులోకి తీసుకుని రూ.4,420లు స్వాధీనం చేసుకున్నట్లు టౌన్ ఎస్సై గోవింద తెలిపారు. పట్టణంలోని బుగత వీధిలో పేకాట ఆడుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని రూ.1020, రామాపురం కాలనీలో పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకుని రూ.3,400లు నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై చెప్పారు. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేసి తదుపరి చర్యల నిమిత్తం పార్వతీపురం ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ వద్ద హాజరు పరచనున్నట్లు తెలిపారు. -
మనిషికి వినికిడి ప్రధానం
● 5 నుంచి 10 శాతం మందికి పుట్టుకతో వినికిడి సమస్య ● 10 రోజులు వెంటిలేటర్పై చికిత్స తీసుకున్న శిశువులకు వినికిడి సమస్య వచ్చే అవకాశం ● త్వరగా గుర్తించకపోతే మూగ, చెవిడు బారిన పడే ప్రమాదం విజయనగరం ఫోర్ట్: మానవుడికి కళ్లు ఎంతటి ప్రాధాన్యమైనవో చెవులు కూడా అంతటి ప్రాధాన్యమైనవే. వినికిడి సమస్య ఉంటే ఎదుటివారు ఏం మాట్లాడుతున్నారో తెలియదు. వినికిడి సమస్యను త్వరగా గుర్తించగలగాలి. లేదంటే చెవుడుతో పాటు మూగ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా శిశువులకు పుట్టకతో వినికిడి సమస్య వచ్చే ఆస్కారం ఉంది. సోమవారం ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం. ప్రపంచ జనాభాలో 10 శాతం మంది వినికిడి సమస్యతో బాధపడుతున్నారు. భారతదేశం జనాభాలో 5నుంచి 10 శాతం మంది వినికిడి సమస్యతో బాధపడుతున్నారు. జిల్లాకు సంబంధించి 5 నుంచి 10 శాతం వినికిడి సమస్యతో బాధపడుతున్నారు. అప్పుడే పుట్టిన శిశువులు వారం నుంచి 10 రోజులు వెంటిలేటర్పై చికిత్స పొందే పరిస్థితి ఉంటే వినికిడి సమస్య బారిన పడే అవకాశం ఉంది. 40 ఏళ్లు దాటిన వారు కూడా వినికిడి సమస్య బారిన పడే అవకాశం ఉంది. సమస్యను త్వరగా గుర్తించాలి నవజాత శిశువుల్లో వినికిడి సమస్యను త్వరతిగతిన గుర్తించాలి. త్వరగా గుర్తించకపోతే మూగ, చెవుడు సమస్యల బారిన పడతారు. అదేవిధంగా భాష కూడా అభివృద్ధి చెందదు. పుట్టిన ప్రతి నవజాత శిశువుకు వినికిడి సమస్య ఉందా? లేదా? అని స్క్రీనింగ్ చేయించాలి. స్క్రీనింగ్లో వినికిడి సమస్య ఉన్నట్లు అనిపిస్తే, వినికిడి లోపం ఎంత ఉందో తెలుసుకునేందుకు బెరా టెస్టు చేయించాలి. వినికిడి సమస్యకు కారణాలు: నెలలు నిండకుండా పుట్టిన శిశువులకు వినికిడి సమస్య వచ్చే అవకాశం ఉంది. మేనరికం వివాహం చేసుకునే వారికి పుట్టే శిశువులకు వినికిడి సమస్య వచ్చే అవకాశం ఉంది. జన్యుపరమైన లోపాల వల్ల, క్రోమోజోముల్లో తేడా వల్ల సౌండ్ పొల్యుషన్ వల్ల వినికిడి సమస్య వచ్చే అవకాశం ఉంది. అతిగా సెల్ఫోన్లు వినియోగించడం వల్ల కూడా వినికిడి సమస్య వచ్చే అవకాశం ఉంది. వినికిడి సమస్యలతో అనేక మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు వస్తున్నారు. వినికిడి మెషీన్ల ద్వారా సమస్య కొంతవరకు తీరుతుంది. కొంతమందికి శస్త్రచికిత్సలు చేయడం వల్ల సమస్య తీరుతుంది. పుట్టిన నెల లోపు శిశువులకు స్క్రీనింగ్ చేయించాలి:నవజాత శిశువులకు పుట్టిన నెలలోగా వినికిడి సమస్యను తెలుసుకునేందుకు స్క్రీనింగ్ చేయించాలి. పుట్టిన మూడు నెలల లోపు బెరా టెస్టు చేయించాలి. పుట్టిన ఆరు నెలల లోపు ఆపరేషన్ చేయించడం గాని మెషీన్ పెట్టించడం గానీ చేయాలి. అతిగా సెల్ ఫోన్ వినియోగించకూడదు. వినికిడి సమస్యలను ఎంత త్వరగా గుర్తిస్తే అంతమంచిది. నిర్లక్ష్యం చేస్తే వినికిడి సమస్యతో పాటు మాటలు రాని పరిస్థితి వస్తుంది. డాక్టర్ బి.అజయ్కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఈఎన్టీ విభాగం -
ఎకై ్సజ్ గుట్టు రట్టు అయ్యేనా?
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఎకై ్సజ్ శాఖలో భారీ స్థాయిలో వసూళ్లకు పాల్ప డిన ఓ ఉన్నతాధికారి గురించి గుట్టుగా విచారణ ప్రారంభించినట్లు తెలిసింది. విజయనగరంలోని ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో శనివారం ఉదయం నుంచి విచారణ సాగింది. జిల్లాలో ఒక్కో సర్కిల్ ఇన్స్పెక్టర్ పరిధిలో ఇద్దరేసి మద్యం షాపు లైసెన్స్దారులను రప్పించి విచారణ జరిపారు. ఇదే అదనుగా విచారణలో ఏం చెప్పాలో ఆయా సర్కిల్ ఇన్స్పెక్టర్లు సదరు మద్యం షాపుల లైసెన్స్దారులకు ముందుగానే బెదిరించి మరీ ట్రైనింగ్ ఇచ్చినట్లు తెలిసింది. అలా సదరు ఉన్నతాధికారిపై ఈగ కూడా వాలకుండా జాగ్రత్త పడ్డారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉభయ విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలో మద్యం షాపుల లైసెన్స్దారుల నుంచి మామూళ్లు వసూలు చేసిన వ్యవహారాన్ని గత జనవరి నెలలో ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఎకై ్సజ్ శాఖలో ఓ ఉన్నతాధికారి రెండు జిల్లాలోని సర్కిల్ ఇన్స్పెక్టర్లకు రూ.4 కోట్ల వరకూ వసూలు చేయాలని టార్గెట్ పెట్టిన విషయాన్నీ బహిర్గతం చేసింది. ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం శాఖాపరమైన విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. అందులో భాగంగానే అడిషినల్ డైరెక్టర్ దేవకుమార్ విజయనగరం వచ్చారు. డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలోనే విచారణ ప్రారంభించారు. ఒక్కో సీఐ ఇద్దరేసి చొప్పున మద్యం దుకాణాల లైసెన్స్దారులను తీసుకురావాలని చెప్పడంతో జిల్లా అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. విచారణకు హాజరైన లైసెన్సీలు ఏం చెప్పారనేదే ఇప్పుడు కీలకంగా మారింది. మద్యం షాపు లైసెన్స్దారుల నుంచి అక్రమ వసూళ్లపై ఆరా ఒక్కో సీఐ పరిధిలో ఇద్దరేసి చొప్పున లైసెన్స్దారులకు పిలుపు డీసీ కార్యాలయంలోనే గుట్టుగా విచారణ -
● పింఛన్ కోసం పడిగాపులు
గతంలో ఒకటో తేదీ వచ్చిందంటే లబ్ధిదారుల ఇంటి తలుపుతట్టి వలంటీర్ పింఛన్ డబ్బులు అందజేసేవారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో వలంటీర్ల సేవలు దూరమయ్యాయి. సచివాలయ సిబ్బందే పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. సిబ్బంది తక్కువగా ఉండడంతో పింఛన్ల పంపిణీలో జాప్యం జరుగుతోంది. విజయనగరం జిల్లాలో చాలా చోట్ల శనివారం ఉదయం 8 గంటలైనా పింఛన్లు ఇచ్చేవారు రాకపోవడంతో వృద్ధులు ఎదురుచూశారు. విజయనగరంలోని లెంకవీధి, జొన్నగుడ్డి, కుమ్మర వీధిలో కనిపించిన ఈ చిత్రాలే సజీవ సాక్ష్యం. – సాక్షిఫొటోగ్రాఫర్, విజయనగరం -
ఇంటర్ తొలిరోజు పరీక్ష ప్రశాంతం
విజయనగరం అర్బన్: ఇంటర్మీడియట్ ఫస్టియర్ విద్యార్థులకు తొలిరోజు శనివారం నిర్వహించిన తెలుగు, సంస్కృతం పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 18,686 మంది పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 18,178 మంది హాజరయ్యారు. ఒకేషనల్ కోర్సులో 2,980 మందికి 2,596 మంది హాజరైనట్టు ఆఐఓ మజ్జి ఆదినారాయణ తెలిపారు. కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విజయనగరం పట్టణంలోని పలు ప్రైవేటు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని పరీక్ష కేంద్రాల తనిఖీ చేశారు. అక్కడి వసతులను, వైద్య, తాగునీటి సదుపాయాలను పరిశీలించారు. కొన్ని చోట్ల తరగతి గదుల్లో వెలుగు తక్కువగా ఉండడంతో వెంటనే లైటింగ్ ఏర్పాటు చేయాలని, విద్యార్థుల సీటింగ్ విధానాన్ని మార్చా లని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ కూర్మనాథరావు, జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు కె.అప్పారావు, తదితరులు పాల్గొన్నారు. పలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ అంబేడ్కర్ -
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 98 శాతం ఉత్తీర్ణత
విజయనగరం అర్బన్: డిగ్రీ వార్షిక పరీక్షల్లో విజయనగరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు 98 శాతం ఉత్తీర్ణత సాధించారని కళాశాల ప్రిన్సిపాల్ కే.రేఖ తెలిపారు. ఆంధ్ర యూనివర్సిటీ శనివారం విడుదల చేసిన డిగ్రీ పరీక్షల ఫలితాల వివరాలను ఆమె విలేకరులకు తెలియజేశారు. పరీక్షల్లో బీఏ, బీకామ్ విద్యార్థులు శతశాతం, బీఎస్సీ బీజెడ్సీ విద్యార్థులు 92 శాతం, బీఎస్సీ ఎంపీసీ విద్యార్థులు 88 శాతం ఉత్తీర్ణత సాధించారని చెప్పారు. బీఎస్సీ బీజెడ్సీలో సారికా అనూష 9.2 ఎస్పీజీఏ పాయింట్లు, బీఏలో అభిషేక్ బైద్య, సూర్యనంద ప్రకాష్కు 8.5 ఎస్పీజీఏ పాయింట్లు సాధించారని పేర్కొన్నారు. విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్తో పాటు, అధ్యాపకులు అభినందించారు. -
పుణ్యగిరి ఆదాయం రూ.15,08,067లు
శృంగవరపుకోట: శివరాత్రి జాతర సందర్భగా పుణ్యగిరి దేవస్థానంలోని హుండీల నుంచి రూ.6,14,418లు ఆదాయం సమకూరినట్టు దేవదాయశాఖ అధికారులు తెలిపారు. పుణ్యగిరి శివాలయం, ధారగంగమ్మ ఆలయాల్లోని హుండీల ఆదాయాన్ని శనివారం లెక్కించారు. శివాలయంలోని హుండీల నుంచి రూ. 5,73,327లు, ధారగంగమ్మ ఆలయంలోని హుండీల నుంచి రూ.42,091లు వచ్చిందన్నారు. విశిష్ట దర్శనం టికెట్ల విక్రయంతో రూ.1,46,250లు, శీఘ్రదర్శనం టికెట్ల వల్ల రూ.5,39.560లు, కేశఖండన టికెట్ల అమ్మకంతో రూ.12,840లు, లడ్డూ ప్రసాదాల వల్ల రూ.1,03,095లు, పులిహోర కౌంటర్ నుంచి రూ.67,200లు, విరాళాల రూపంలో రూ.24,706లు కలిపి శివరాత్రి జాతరకు రూ.15,08,067లు ఆదాయం సమకూరిందన్నారు. లెక్కింపు కార్యక్రమాన్ని ఈఓలు కె.నాగేంద్ర, జి.శ్రీనివాస్ పర్యవేక్షించారు. ప్రైవేట్ ఫిట్నెస్ కేంద్రాన్ని ఎత్తివేయాలి విజయనగరం టౌన్: అచ్యుతాపురంలో ఏర్పాటుచేసిన ప్రైవేట్ ఫిట్నెస్ కేంద్రాన్ని వెంటనే ఎత్తివేయాలని ఏఐఎఫ్టీయూ (న్యూ అనుబంధం) ఆధ్వర్యంలో ఆటో కార్మికులు శనివారం ఆందోళన చేశారు. పార్కుగేట్ నుంచి గంటస్తంభం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ విజయదుర్గా ఆటోవర్కర్స్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు నీలాపు అప్పలరాజురెడ్డి, రెడ్డి నారాయణరావు మాట్లాడుతూ ఆర్టీఓ కార్యాలయ పనుల్లో దళారుల ప్రభావం లేకుండా చేయాలని ప్రైవేట్ ఫిట్నెస్ కేంద్రాన్ని ఏర్పాటుచేశామని చెబుతున్నా.. రూ.860ల చలానాతో పాటూ అదనంగా రూ.3,300 చెల్లిస్తే ఫిట్నెస్ లేకపోయినా కంప్యూటర్లో పాస్చేసేస్తున్నారని ఆరోపించారు. డ్రైవర్లను ఇబ్బందులకు గురిచేసే ప్రైవేట్ ఫిట్నెస్ కేంద్రాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ర్యాలీలో చెన్నా ధర్మా, తర్లాడ శ్రీధర్, రాంబాబు, కృష్ణారావు, ఆటోడ్రైవర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
విజ్ఞానం పెంపొందించిన సైన్స్ దినోత్సవం
విజయనగరం అర్బన్: విజయనగరం కంటోన్మెంట్ ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్ దినోత్సవం విద్యార్థుల్లో విజ్ఞానం పెంపొందించింది. ప్రతిభను ప్రదర్శించేందుకు వేదికగా నిలిచింది. ‘ఎంపవరింగ్ ఇండియన్ యూత్ ఫర్ గ్లోబల్ లీడర్ షిప్ ఇన్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ వికసిత్ భారత్’ అనే అంశంపై విద్యార్థులకు జిల్లాస్థాయి క్విజ్, సెమినార్ పోటీలను శనివారం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 27 మండలాల నుంచి క్విజ్ పోటీలకు 63 మంది, సెమినార్ పోటీలకు 25 మంది హాజరయ్యారు. విజేతలకు డీఈఓ యు.మాణిక్యంనాయుడు, ఏపీసీ డాక్టర్ ఎ.రామారావు జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓలు కె.వి.రమణ, కె.మోహనరావు, తదితరులు పాల్గొన్నారు. ● విజేతలు వీరే.. క్విజ్ సీనియర్ విభాగం: ప్రథమ స్థానం: టేకీ అన్నపూర్ణేశ్వరి (బాలికల ఉన్నత పాఠశాల, విజయనగరం), హేమలత (కేజీబీవీ, జామి), బండారు కీర్తన (జెడ్పీహెచ్ఎస్ గుర్ల), సంగిరెడ్డి హైమ (జెడ్పీహెచ్ఎస్ గురడబిల్లి), మద్దిల మోక్ష (జెడ్పీహెచ్ఎస్ అరసాడ). ద్వితీయ స్థానం: సీహెచ్ సూర్యప్రకాష్ (జెడ్పీహెచ్ఎస్ గరివిడి), ఆర్.శివ (ఏపీమోడల్ స్కూల్, మేడపల్లి), జి.నేత్రాదేవి (జెడ్పీహెచ్ఎస్ గుర్ల), ఎల్.నిత్యసారథి (జెడ్పీహెచ్ఎస్, గరివిడి), ఐ.వైష్ణవి (జెడ్పీహెచ్ఎస్, కొట్యాడ). క్విజ్ జూనియర్ విభాగం: ప్రధమ స్థానం: కే.జనని (ఏపీమోడల్ స్కూల్, గర్భాం), ఎల్.ఇందుమతి నాయుడు (జెడ్పీహెచ్ఎస్, అరసాడ). ద్వితీయ స్థానం: జి.మోహిత్ కుమార్ (ఏపీమోడల్ స్కూల్, పెదమేడపల్లి), వై.జ్ఞాన వైష్ణవి (ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాల, గజపతినగరం). సెమినార్ పోటీలు: కె.కీర్తన (కొత్తవలస), ఎం.కీర్తి (తెర్లాం), ఎస్.వైష్ణవి (గంట్యాడ)లు వరుస మూడుస్థానాల్లో నిలిచారు. వి.అవినాష్ (బొబ్బిలి), యు.చరిష్మ (వేపాడ) ప్రోత్సాహక బహుమతి అందుకున్నారు. -
సచివాలయం వద్దే పింఛన్ల పంపిణీ
గజపతినగరం రూరల్: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతినెలా 1వ తేదీన ఇంటింటికీ వెళ్లి వలంటీర్లు పింఛన్లు అందజేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వీధులు, రచ్చబండలు, సచివాలయాల్లోనే పింఛన్లు అందజేస్తున్నారు. మంచంపై ఉన్న వృద్ధులు సైతం అష్టకష్టాలు పడి పింఛన్ల పంపిణీ ప్రదేశానికి రావాల్సి వస్తోంది. గజపతినగరం మండలం కెంగువ గ్రామంలో శనివారం పలువురు లబ్ధిదారులకు సచివాలయంలోనే పింఛన్లు అందజేశారు. ఇదే విషయాన్ని ఎంపీడీఓ కల్యాణి వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందజేయాలని, లబ్ధిదారులు అభీష్టం మేరకు ఒకేచోట ఇవ్వవచ్చన్నారు. సిగ్నల్ లేని ప్రాంతాల్లో సచివాలయంలో కూడా ఇవ్వవచ్చని చెప్పుకొచ్చారు. -
ఉమెన్ హెల్ప్డెస్క్లుగా రిసెప్షన్ కౌంటర్లు
విజయనగరం క్రైమ్: పోలీస్ స్టేషన్లలో ఉన్న రిసెప్షన్ కౌంటర్లు ఇకపై ఉమెన్ హెల్ప్ డెస్క్లుగా మారుస్తున్నట్లు ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఈ మేరకు పోలీస్స్టేషన్లో రిసెప్షనిస్టులుగా విధులు నిర్వహిస్తున్న సిబ్బంది, స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒక్కరోజు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్టేషన్కు వచ్చే బాధితులతో మర్యాదగా నడుచుకోవాలని సూచించారు. ఉమన్ హెల్ప్ డెస్క్లో ఒక మహిళా ఏఎస్సై, హెచ్సీ, మహిళా పీసీలను నియమిస్తామన్నారు. బాధితులు ఫిర్యాదు రాయలేకపోతే సిబ్బందే వారి ఫిర్యాదులను రాయాలని సూచించారు. ఫిర్యాదు తీసుకున్న తర్వాత ఆయా అంశాలను రిసెప్షన్ రిజిస్టర్లో నమోదు చేసి బాధితులకు రశీదు ఇవ్వాలన్నారు. అనంతరం విషయాన్ని స్టేషన్ హౌస్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హెల్ప్ డెస్క్లో నియమించిన సిబ్బంది ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 వరకు అందుబాటులో ఉండాలన్నారు. గొడవల కారణంగా బాధితులు ఎవరైనా తిరిగి ఇంటికి వెళ్లలేని పరిస్థితుల్లో ఉంటే వారిని స్వధార హోమ్, వన్స్టాప్ సెంటర్లో ఆశ్రయం కల్పించాలని సూచించారు. శిక్షణ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, మహిళా పీఎస్ సీఐ ఈ.నర్సింహమూర్తి, వన్స్టాప్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి, వివిధ పోలీస్స్టేషన్లకు చెందిన ఎస్హెచ్ఓలు, హెల్ప్డెస్క్ సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ వకుల్ జిందల్ -
సహనం నేర్పే రంజాన్..
● నేటి నుంచి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం ● నెల రోజుల పాటు కఠిన దీక్షలు, దానధర్మాలు ● ప్రార్థనలకు ముస్తాబైన మసీదులువిజయనగరం టౌన్: యావత్ ప్రపంచంలో ఉన్న ముస్లింలకు అత్యంత పవిత్రమైన, సంతోషాలు పంచే నెల రంజాన్. ఈ నెల అరబీ నెలల వరుస క్రమంలో తొమ్మిదవది. రంజాన్ అంటే కాలిపోవడం, భస్మీపటలమవ్వడం, ఆగిపోవడం అనే అర్థాలను సూచిస్తుంది. రంజాన్ నెలలో తమ పాపాలు, పొరపాట్లు, తప్పిదాలన్నీ కాలిపోయి వాటికి బదులుగా పుణ్యఫలాలు పొందుతామనేది ముస్లింల నమ్మకం. ఈ శుభాల సరోవరం, వరాల వసంతం అయిన రంజాన్ మాసం నెల వంకను చూసిన వెంటనే ప్రారంభమవుతుంది. ఈ నెలకు అల్లాహ్ దృషి్ోట్ల పవిత్రమైన, ప్రత్యేకమైన స్థానముంది. విశ్వాసులకు ఎనలేని సంతోషాలు, పుణ్యాలను అందిస్తుంది ఈ మాసం. ప్రపంచ వ్యాప్తంగా చిన్న పిల్లలు మొదలుకుని వృద్ధుల వరకు ఈ పవిత్రమాసం కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఉంటారు. ఆదివారం నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభించాలని జమాతే ఇస్లామీ హింద్ సంస్థ మతాధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక ప్రార్థనలకు మసీదులన్నీ విద్యుత్ అలంకరణలతో ముస్తాబయ్యాయి. ఆలయ కమిటీల ప్రతినిధులు అర్ధరాత్రి నుంచే ప్రత్యేక ప్రార్థనలు చేపట్టనున్నారు. ఉచితంగా నమాజ్ పుస్తకాల పంపిణీ... రంజాన్ మాసంలో ఉచితంగా నమాజ్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నట్లు పట్టణ ముస్లిం ప్రతినిధి మహమ్మద్ గౌస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపిక చేసిన గ్రామాలు, మండలాల్లో 38 వేల నమాజ్ పుస్తకాలను పంపిణీ చేపట్టనున్నామన్నారు. అవకాశం ఉన్నవారందరూ పుస్తకాలను స్వీకరించాలని కోరారు. -
పర్యాటక రంగ అభివృద్ధికి చర్యలు
సీతంపేట: మన్యంలో పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అన్నారు. ఏజెన్సీలోని పలు పర్యాటక ప్రదేశాలను శనివారం ఆయన సందర్శించారు. జగతపల్లి వ్యూ పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. పర్యాటకులను ఆకర్షించే విధంగా వ్యూ పాయింట్ను తీర్చిదిద్దాలన్నారు. అనంతరం పనుకువలస నర్సరీలో గ్రామదర్శిని కార్యక్రమం ఏర్పాటుకు అవకాశాలను పరిశీలించి ఇక్కడ అనుకూలంగా ఉందన్నారు. గడిగుడ్డిలోని పట్టు పరిశ్రమ యూనిట్ను పరిశీలించారు. పట్టునుంచి దారం తీసే విధానాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అలాగే పెదరామ గ్రా మంలో మల్బరీ తోటలు పెంచే రైతులతో మాట్లాడారు. ఐటీడీఏలోని ముక్కిడిపోలమ్మ జీడి ప్రాసెసింగ్ యూనిట్ పరిశీలించారు. కొండచీపుర్లు, అగరుబత్తి యూనిట్, పసుపు ప్రాసెసింగ్ కేంద్రాలను సందర్శించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ యశ్వంత్కుమార్ రెడ్డి, ఏపీఓ చిన్నబాబు, డీడీ అన్నదొర, ఈఈ రమాదేవి, ఎంపీడీఓ గీతాంజలి, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ శ్యామ్ప్రసాద్ -
ఏడో తేదీ వరకు మహిళా సాధికారత వారోత్సవాలు
విజయనగరం క్రైమ్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి ఒకటో తేదీ నుంచి ఏడు వరకు జిల్లాలో మహిళా సాధికారత వారోత్సవాలు నిర్వహిస్తామని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఈ మేరకు స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్లో విద్యార్థినులు, మహిళల భద్రత.. పోలీస్ విధులపై అవగాహన కల్పించేందుకు ‘ఓపెన్ హౌస్‘ కార్యక్రమాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వారోత్సవాల్లో భాగంగా మెడికల్ క్యాంపులు, వ్యాసరచన, వక్తృ త్వ, చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తామన్నారు. అలాగే ఓపెన్ హౌస్, ర్యాలీ కూడా చేపడతామని చెప్పారు. మహిళల భద్రత, రక్షణ, సమానత్వం, అభివృద్ధి, సాధికారతకు కృషి చేయాలన్న సంకల్పంతో జిల్లా వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. BĶ欫§éÌS ˘ ప్రదర్శన.. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన ఓపెన్హౌస్ కార్యాక్రమంలో భాగంగా పోలీసులు ఆయుధాలు ప్రదర్శించారు. తుపాకులు, బాంబ్ డిస్పోజల్స్ పరికరాలు, పోలీస్ డాగ్స్, డ్రోన్స్, సాంకేతికత, బాడీ వోర్న్ కెమెరాలు, ట్రాఫిక్, కమ్యూనికేషన్ విభాగాల్లో వినియోగిస్తున్న పరికరాలు ప్రదర్శించి, వాటి పనితీరును వివరించారు. అలాగే నేర స్థల పరిశీలనలో క్లూస్ టీమ్ ఆధారాలు, ఫింగర్ ప్రింట్స్ పని తీరుపై ప్రజలు, విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, మహిళా పీఎస్ సీఐ ఈ.నర్సింహమూర్తి, వన్టౌన్ సీఐ ఎస్.శ్రీనివాస్, టూటౌన్ సీఐ టి.శ్రీనివాసరావు, ఆర్ఐలు ఎన్. గోపాలనాయుడు, ఆర్.రమేష్కుమార్, టి.శ్రీనివాసరావు, ఏఆర్, సివిల్ పోలీసు అధికారులు, సిబ్బంది, వివిధ పాఠశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎస్పీ వకుల్ జిందల్ -
అంతా మోసం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ‘చంద్రబాబు సహా టీడీపీ నాయకులది మాటల మాయాజాలం. బడ్జెట్లో అంకెల గారడీ. అరచేతిలో వైకుంఠం చూపించి తీరా అమలు దగ్గరకొచ్చేసరికి సంక్షేమ పథకాలకు ఎగనామం పెట్టడం అలవాటే. శుక్రవారం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్తో అది మరోసారి రుజువైంది’ అని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ధర్మపురిలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్సీపీ నాయకులు నెక్కల నాయుడుబాబు, కె.వి.సూర్యనారాయణరాజు, నరసింహమూర్తితో కలిసి శనివారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బడ్జెట్పై అభిప్రాయం ఆయన మాటల్లోనే... ‘‘టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ పూర్తి నిరాశాజనకంగా ఉంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి అవసరమైన నిధులేవీ అందులో పొందుపర్చలేదు. సూపర్ సిక్స్ హామీలకూ పూర్తి స్థాయిలో నిధులు కేటాయించలేదు. కేవలం ఒక మోసపూరితమైన బడ్జెట్ను అంకెల గారడీ చేసి ప్రవేశపెట్టారు. గత ఏడాది జూన్లో అధికారం చేపట్టిన తర్వాత ఓటాన్ బడ్జెట్తో కాలం నడిపించింది. కేవలం ఎన్నికల హామీలకు ఎగనామం పెట్టాలనే ప్రయత్నాలు అప్పటి నుంచే మొదలయ్యాయి. ఏ ఒక్క ఎన్నికల హామీనీ పూర్తిస్థాయిలో అమలు చేయకపోయినా, క్యాపిటల్ వ్యయంతో అభివృద్ధి పథకాలు అమలుచేయకపోయినా సుమారు లక్షా పది వేల కోట్ల రూపాయలకు పైగా అప్పులు తెచ్చారు. ● సాగునీటి వనరులపైనా చిన్నచూపే సుమారు తోటపల్లి బ్యారేజ్ మిగులు పనులకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో రూ.140 కోట్లతో టెండర్లు పిలిచారు. ప్రభుత్వం మారేటప్పటికే 20 శాతం వరకు పనులు పూర్తి అయ్యాయి. ఇంకా 80 శాతం పనులున్నా ఈ బడ్జెట్లో కేవలం రూ.35 కోట్లు మాత్రమే కేటాయించారు. తారకరామ తీర్థ సాగరం ప్రాజెక్టు పూర్తిచేస్తే భోగాపురం విమానాశ్రయానికి అవసరమైన నీరే కాదు విజయనగరం పట్టణానికి పూర్తిస్థాయిలో తాగునీరు అందించవచ్చు. కానీ అరకొరగా నిధులు కేటాయించారు. ఈ ఏడాది అది పూర్తయ్యే పరిస్థితి లేదు. మరి 2026 నాటికల్లా నీరు రాకుండా ఎయిర్పోర్టును ఎలా ప్రారంభిస్తారు? ఎందుకు ప్రజలను మభ్యపెడతారు? జంఝావతి ప్రాజెక్టు, వెంగళరాయ సాగర్ పూర్తి చేస్తామని టీడీపీ మంత్రులు గొప్పలు చెప్పారు. కానీ బడ్జెట్లో అరకొరగా నిధులే విదిల్చారు. ఇక ఆండ్ర రిజర్వాయర్, తాటిపూడి రిజర్వాయర్లను పూర్తిగా విస్మరించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను ఈ ప్రాంతానికి తీసుకురావాలని గత ప్రభుత్వంలోనే టెండర్లను పిలిచారు. భూసేకరణకు సర్వే కూడా జరిగింది. కానీ బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయించలేదు. విజయనగరం ప్రాంతంలో ట్రైబల్ యూనివర్సిటీ, విశాఖ శివారలో ఐఏఎం శాశ్వత భవనాల నిర్మాణ పనులు పూర్తి చేయాలి. కానీ బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. ఎస్.కోట ప్రాంతంలోని జిందాల్ భూముల్లో ఎంఎస్ఎంఈ పార్కు పెట్టడానికి గత ప్రభుత్వంలోనే నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అన్ని అనుమతులు ఇచ్చారు. కానీ ఇప్పుడు బడ్జెట్లో కూడా వాటి ప్రస్తావన లేదు. చింతపల్లి తీరంలో ఫ్లోటింగ్ జెట్టీ నిర్మాణానికి గత ప్రభుత్వంలోనే టెండర్లు పిలిచారు. దానికి సంబంధించి కూడా ఈ బడ్జెట్లో కేటాయింపులు జరగలేదు. పార్వతీపురంలో మెడికల్ కాలేజీ ప్రస్తావన లేదంటే దానికీ మంగళం పాడేస్తున్నారని అర్థమవుతోంది.’’ రైతులకు మొండిచేయి రాష్ట్రంలో అత్యంత ప్రధానమైన వ్యవసాయ రంగంపై ప్రభుత్వానికి సరైన దృక్కోణమే లేదు. ఏటా ప్రతి రైతు కుటుంబానికి రూ.20 వేలు చొప్పున అన్నదాత సుఖీభవ పథకంలో ఇస్తామని ఊదరగొట్టిన టీడీపీ నాయకులు... ఇప్పుడు ఎక్కడ ఏ రైతులను ఆదుకున్నారో చెప్పలేని పరిస్థితి. రాష్ట్రంలో ఉన్న సుమారు 1.20 కోట్ల మంది ౖరైతులకు ఈ బడ్జెట్లో అరకొర నిధులతోనే సరిపెట్టారు. ఎందుకీ గొప్పలు యువతకు ఉద్యోగాలేవీ... కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను గాలికొదిలేసింది రాష్ట్ర బడ్జెట్లో సూపర్ సిక్స్కూ నిధులు కొరవడ్డాయి యువతకు నిరుద్యోగ భృతి లేదు... ఉద్యోగాలు రావు సాగునీటి ప్రాజెక్టులకూ అరకొరగానే నిధుల కేటాయింపు ఎనిమిది నెలల్లోనే లక్షా 10 వేల కోట్లకు పైగా అప్పులు మీడియా సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు రాష్ట్రానికి ఆదాయ వనరులేమిటో బడ్జెట్లో చూపించలేదు. కేవలం అప్పులతోనే నెట్టుకొచ్చే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. క్యాపిటల్ వ్యయం గురించి ఆర్థిక మంత్రి గొప్పగా చెప్పారు. ప్రభుత్వం అప్పు తెచ్చినా లేదా కొత్త ఆదాయ మార్గాల నుంచి పెట్టుబడులు రప్పించి తద్వారా ఆదాయ వనరులు సమకూర్చేది క్యాపిటల్ వ్యయం. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో క్యాపిటల్ వ్యయంతోనే రామాయపట్నం పోర్టు, మూలపేట పోర్టు, కృష్ణపట్నం పోర్టు సాకారం చేశాం. తీర ప్రాంతంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మత్స్యకారుల కోసం ఫ్లోటింగ్ జెట్టీలు పెట్టాం. అలాంటి అభివృద్ధి పనుల్లో ఈ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇప్పటివరకూ పెట్టలేదు. మరి ఎలా ఆదాయం వస్తుంది? మరోవైపు ప్రభుత్వ ఆస్తుల పరాధీనం లేదా లీజుకు ఇచ్చే కార్యక్రమాన్ని శరవేగంగా తీసుకెళ్తున్నారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలని హామీలిచ్చినా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. దావోస్ వెళ్లి తిరిగొచ్చినా ఒక లక్ష రూపాయల పెట్టుబడి కూడా వచ్చిన దాఖలాల్లేవు. శుక్రవారం ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో కూడా సూపర్ సిక్స్ హామీల నెరవేర్చడానికి అవసరమైన నిధులు కేటాయించకుండా మొండిచేయి చూపించారు. ఆడబిడ్డ నిధి ప్రస్తావన లేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రస్తావనా ఎక్కడా కనబడలేదు. యువతకు ఉద్యోగాలూ లేవు. నిరుద్యోగ భృతి గురించి మరచిపోయినట్లు నటిస్తున్నారు. ఇక బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ అని చెప్పి ఇప్పుడు ఉన్నవాటిలోనే తొలగించే పనిలో ఉన్నారు. అమలుచేసింది ఏమైనా ఉందంటే రెండు నెలల నుంచి అమలుచేస్తున్న ఒకే ఒక్క పథకం భర్త చనిపోతే భార్యకు వితంతు పెన్షన్. కానీ అనేకమంది వితంతువులు పెన్షన్ కోసం ఎదురుచూస్తున్నారు. గ్రామ, వార్డు వలంటీర్లకు రూ.10వేల గౌరవ వేతనం ప్రస్తావనే లేదు. వారిని కూటమి నాయకులు నిలువునా మోసం చేశారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏమీ ఉండదు. ఒకపక్క డీఎస్సీ అన్నారు... జాబ్ క్యాలెండర్ తెస్తామన్నారు... కానీ ఒక్క ఉద్యోగం కూడా కొత్తగా ఇచ్చిన దాఖలాలు లేవు. అసెంబ్లీ వేదికగా గవర్నర్ ప్రసంగంలో 4 లక్షల ఉద్యోగాలు కల్పించామని చెప్పించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేయడం శోచనీయం. -
క్యాంపస్ ఇంటర్వ్యూలు రేపు
బొబ్బిలి: పట్టణంలోని రాజా కాలేజ్లో దివిస్ ల్యాబ్స్ కంపెనీ ప్రతినిధులు సోమవారం క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారని ప్రిన్సిపాల్ సీహెచ్ వీరేంద్రకుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఎస్సీ కెమిస్ట్రీ, ఎమ్మెస్సీ ఆర్గానిక్ లేదా ఎనలటికల్ కెమిస్ట్రీ, బీటెక్ కెమి కల్ ఇంజినీరింగ్, బి ఫార్మసీ కోర్సులు చేసిన పురుష అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. 2000– 2005 సంవత్సరాల మధ్య విద్యార్హత కలిగి ఉండాలన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీలు, బయోడేటా, రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు తీసుకుని నేరుగా కళాశాలలో ఉదయం 9 గంటలకు హాజరుకావాలని కోరారు. యువకుడిపై కేసు నమోదు పార్వతీపురం రూరల్: పట్టణంలోని ఓ కళాశాలలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న ఓ అమ్మాయి ఇంటికి వెళ్లి దాడి చేసిన అబ్బాయిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ కె. మురళీధర్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. పార్వతీపురానికి చెందిన అమ్మాయి తన చుట్టాలబ్బాయితో కొమరాడ మండలంలోని గుంప వెళ్లి వస్తుండగా.. శివిని గ్రామం వద్ద నిందితుడు వాళ్ళిద్దర్నీ అడ్డుకొని తాను ప్రేమించిన అమ్మాయితో నీకేంటి పని అని గద్దిస్తూ చుట్టాలబ్బాయిని బెదిరించాడు. అక్కడితో ఆగకుండా అమ్మాయి ఇంటికి వెళ్లి దుర్భాషలాలడుతూ అమ్మాయిపై చేయి చేసుకున్నాడు. ఈ మేరకు అమ్మాయి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. సేంద్రియ ఎరువు తయారీపై దృష్టి● డీపీఓ వెంకటేశ్వరరావు రాజాం సిటీ: గ్రామాల్లో ఏర్పాటు చేసిన సంపద సృష్టి కేంద్రాల ద్వారా సేంద్రియ ఎరువు తయారీపై దృష్టి సారించాలని డీపీఓ వెంకటేశ్వరరావు అన్నారు. మండల పరిధిలోని సోపేరు గ్రామంలో శనివారం ఆయన పర్యటించి, వర్మీకంపోస్టు తయారీపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో క్లాప్మిత్రలు సేకరించిన తడి, పొడి చెత్తను కేంద్రంలో పూర్తిగా వేరు చేయాలని సూచించారు. తడిచెత్తను బయట ఏర్పాటు చేసిన ఫిట్స్లో వేయాలని, పొడి చెత్తను కేంద్రం లోపల డ్రై ఫిట్స్లో వేయాలన్నారు. ప్రతి ఒక్క పంచాయతీలో సందప సృష్టిపై పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో డీపీఆర్సీ కో ఆర్డినేటర్ పట్నాయక్, ఎంపీడీఓ వి.శ్రీనివాసరావు, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో వృద్ధుడికి గాయాలు రాజాం సిటీ: స్థానిక బొబ్బిలి రోడ్డులోని ఫైర్స్టేషన్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధుడికి గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మున్సిపాల్టీ పరిధి వస్త్రపురి కాలనీకి చెందిన ఆగూరు తిరుపతిరావు అనే వృద్ధుడు సైకిల్పై అమ్మవారి గుడి సమీపంలోని యోగాశ్రమానికి వెళ్తున్నా డు. ఆ సమయంలో వెనుక నుంచి వచ్చిన మో టార్సైక్లిస్ట్ ఢీ కొనడంతో వృద్ధుడికి గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు గమనించి అత డ్ని రాజాం సామాజిక ఆస్పత్రికి తరలించగా.. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్కు రిఫర్ చేశారు. క్షతగాత్రుడి అన్నయ్య ఆగూరు వెంకటరమణ ఇ చ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యా ప్తు చేస్తున్నామని ఎస్సై వై.రవికిరణ్ తెలిపారు. స్వగ్రామానికి ఎంటెక్ విద్యార్థి మృతదేహం ● మూడు రోజుల కిందట సూరత్లో జరిగిన ప్రమాదంలో మృతి నెల్లిమర్ల రూరల్: మండలంలోని పూతికపేట గ్రామానికి చెందిన యువకుడు పత్తిగిడి నాగరాజు (25) గత నెల 27న గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి మృతి చెందాడు. అక్కడి రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని సెల్ఫోన్ ఆధారంగా స్నేహితులకు సమాచారం అందించారు. వెంటనే వారు కుటుంబ సభ్యులకు విషయం చెప్పడంతో హైదరాబాద్లో ఉన్న మృతుడి అన్నయ్య చిరంజీవి సూరత్ వెళ్లి మృతదేహాన్ని స్వగ్రామమైన పూతికపేట గ్రామానికి శనివారం తీసుకువచ్చారు. నాగరాజు ఐదు నెలల కిందటే సూరత్లోని ఎన్ఐటీలో ఎంటెక్ చేసేందుకు వెళ్లాడు. తమ కుమారుడు తరుచూ ఫోన్లో మాట్లాడుతుండేవాడని, ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉండే యువకుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతదేహం స్వగ్రామానికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు, గ్రామస్తులు శోక సంద్రంలో మునిగిపోయారు. -
ఇది మోసపూరిత బడ్జెట్
వంగర: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తి మోసపూరితంగా ఉందని.. ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పిన మాటలకు, ఇప్పుడు బడ్జెట్లో కేటాయింపులకు పొంతనే లేదని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ ఆరోపించారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకపోవడమే కూటమి ప్రభుత్వ ఉద్దేశమని మండిపడ్డారు. మండలంలోని కోనంగిపాడులో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గతేడాది సూపర్ సిక్స్ పథకాల్లో ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని.. ఈ ఏడాది బడ్జెట్లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు అరకొర నిధులు కేటాయించడం చూస్తుంటే.. ఆ పథకాల అమలుపై కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. ఫ్రీ బస్, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి వంటి పథకాలకు కేటాయింపులు లేకపోవడం అన్యాయమన్నారు. 50 ఏళ్లు పైబడిన బీసీలకు పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పారన్నారు. ప్రజలు సీఎం చంద్రబాబును నమ్మి మోసపోయారన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి పేదల పక్షపాతి అని.. పేదల సంక్షేమానికి ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో ఎక్కడా ప్రవేశపెట్టలేదని తెలిపారు. ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ వైద్యసేవగా పేరుమార్చి పథకాన్ని పూర్తిగా నీరుగార్చారని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమానంగా తీసుకెళ్తామని ప్రకటించిన కూటమి ప్రభుత్వం రెవెన్యూ వ్యయం కింద రూ.2.51 లక్షల కోట్లు కేటాయించి, మూలధన వ్యయం కింద కేవలం రూ.40 వేల కోట్ల కేటాయింపులు చేయడమే వారి మాటలకు, చేతలకు పొంతన లేకుండా పోయిందని తెలిపారు. తన మంత్రి పదవిని కాపాడుకునేందుకే పయ్యావుల కేశవ్ బడ్జెట్ సమావేశాల్లో చంద్రబాబు, లోకేష్లను పొగిడే దుస్థితికి దిగజారారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ఉత్తరావెల్లి సురేష్ముఖర్జీ, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ కరణం సుదర్శనరావు, సర్పంచ్లు చందక తాతబాబు, నెయిగాపుల శివరామకృష్ణయ్య, పార్టీ నాయకులు కనగల పారినాయుడు, వేమిరెడ్డి సూర్యనారాయణ, బెవర నూకంనాయుడు, యలకల వాసునాయుడు, తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ -
భిన్నకళా సంప్రదాయాల నిధి.. గిరిజన చిత్రకళ
విజయనగరం అర్బన్: దేశంలో గిరిజన చిత్రకళ.. భిన్న కళా సంప్రదాయాలకు నిధి అని, చిత్రకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని కేంద్రియ గిరిజన యూనివర్సిటీ వీసీ ఫొఫెసర్ టీవీ కట్టిమణి అన్నారు. వర్సిటీ, మాన్సాస్ విద్యాసంస్థలు సంయుక్తంగా ‘నేషనల్ ట్రైబల్ పెయింటర్స్ కాన్క్లేవ్’ పేరుతో రెండు రోజుల పాటు విజయనగరం కోటలోని రౌండ్ మహల్లో నిర్వహించనున్న గిరిజన చిత్రకారుల సమ్మేళనాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశం కళలకు నిలయమని, వివిధ రాష్ట్రాల్లో వివిధ ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, పద్ధతులు, కళలు విస్తరించి ఉంటాయన్నారు. స్వదేశీ కళారూపాలను ప్రోత్సహించడానికి భారతదేశం అంతటా ఉన్న గిరిజన చిత్రకారులను ఒక వేదికపైకి తేవడం సంతోషంగా ఉందన్నారు. గిరిజన చిత్రాలను, కళలను గౌరవించడమే దీని ప్రధాన ఉద్దేశంగా పేర్కొన్నారు. కర్నాటక రాష్ట్రం శివమొగ్గలోని కువెంపు విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ శరత్ అనంతమూర్తి మాట్లాడుతూ భారతీయ విజ్ఞాన వ్యవస్థలో అంతర్భాగమైన గిరిజన కళ ప్రాముఖ్యతను వ్యక్తీకరించి గౌరవించాలన్నారు. తొలుత జ్యోతిప్రజ్వలనలో మాన్సాస్ చైర్మన్ పి.అశోక్గజపతిరాజు, గోండ్ చిత్రకారిణి, ప్రద్మశ్రీ పురస్కార గ్రహీత దుర్గాబాయి పాల్గొన్నారు. ప్రదర్శనలో గోండ్, వార్లీ, పిథోర, కోలం, సోహ్రాయ్, ఖోవర్, కోయా, కురుంబా, తంగ్ఖుల్–నాగా, నాయకపోడు, సవర, సౌరా, మురియా, భిల్ వంటి విభిన్న కళారూపాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో మాన్సాస్ కరస్పాండెంట్ డాక్టర్ కేవీఎల్ రాజు, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ డాక్టర్ బీఎస్ఎన్ రాజు, గిరిజన యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ టి.శ్రీనివాసన్, ప్రొఫెసర్ శరత్ చంద్రబాబు, డాక్టర్ చితేంద్రమోహన్ మిశ్రా, వివిధ విభాగాల డీన్లు, అధిపతులు అనిరుద్కుమార్, వెంకటేశ్వర్లు, నగేష్, దేబంజన నాగ్, కె.దివ్య, ఎన్.వి.ఎస్.సూర్యనారాయణ, ఎం.జి.నాయుడు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం గిరిజన సంప్రదాయక సాంస్కృతిక కార్యక్రమాలతో ఆహుతులను అలరించారు. గిరిజన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ టి.వి.కట్టిమణి జాతీయ గిరిజన చిత్రకారుల సమ్మేళనం -
బాబు మోసం
బడ్జెట్ సాక్షిగా.. కూటమి ప్రభుత్వం తీరని అన్యాయం... మా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజాసంక్షేమ బడ్జెట్ అంటే ఏమిటో అమలుచేసి చూపించింది. ప్రపంచాన్నే వణికించిన కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలోనూ సంక్షేమ పథకాలను నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొనసాగించారు. అంతకన్నా ఎక్కువగా సంక్షేమ పథకాలు ఇస్తామని, సూపర్ సిక్స్ అని ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిన మూడు పార్టీల కూటమి ప్రభుత్వం... బడ్జెట్లో మొండిచేయి చూపిస్తోంది. అన్నివిధాలా వెనుకబడిన ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించి ప్రత్యేక కేటాయింపులు లేవు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం ఇస్తామంటున్నారు కానీ అమలయ్యేవరకూ అనుమానమే. పింఛన్లు కూడా భారీగా కోత పెట్టే ఆలోచనలే కనిపిస్తున్నాయి. – మజ్జి శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ ● కూటమి ప్రభుత్వ వార్షిక బడ్జెట్పై సర్వత్రా విమర్శలు ● సూపర్ సిక్స్ అమలుపై కరిగిపోయిన సామాన్యుల ఆశలు ● 2025–26 పూర్తిస్థాయి బడ్జెట్లో కనిపించని సంక్షేమ పథకాలు ● ప్రస్తావించిన అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలపైనా సందేహాలు ● అమలయ్యేవరకూ చెప్పలేమంటున్న ప్రజానీకం ● అన్నీ కంటితుడుపు కేటాయింపులేనని పెదవి విరుపు ఆ పథకాలు ఈ ఏడాది లేనట్లే! మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి మహిళకు నెలనెలా రూ.1500 సాయం, నిరుద్యోగులకు ప్రతినెలా రూ.3 వేలు భృతి, 50 ఏళ్లకే బీసీలకు పింఛన్లు... పథకాలేవీ వచ్చే సంవత్సరం కూడా లేనట్లేనని రాష్ట్ర బడ్జెట్లో ప్రతిపాదనలు చూస్తే తెలుస్తోంది. తల్లికి వందనం పథకానికి కూడా కేవలం రూ.9407 కోట్లు మాత్రమే కేటాయించారంటే అదీ అనుమానమే. ఎంతమంది అర్హులుంటే అంతమందికీ ఇవ్వాలంటే దాదాపు రూ.20వేల కోట్లు అవసరమవుతాయి. గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమ్మ ఒడి పథకానికి 2019–20 బడ్జెట్లోనే రూ.19618 కోట్లు కేటాయించారు. దీన్నిబట్టి చూస్తే తల్లికి వందనం పథకం కూడా అమలయ్యేవరకూ చెప్పలేని పరిస్థితి. – డాక్టర్ శోభా స్వాతిరాణి, జీసీసీ మాజీ చైర్పర్సన్ సాక్షి ప్రతినిధి, విజయనగరం: టీడీపీ, జనసేన, బీజేపీ కలగలిపిన కూటమి ప్రభుత్వం మాది.. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారం తమదే.. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ టీడీపీ, జనసేన నాయకులు చెప్పుకొనే గొప్పలు చూస్తే అబ్బో అనిపిస్తాయి! తీరా రాష్ట్ర బడ్జెట్ చూస్తే మాత్రం అంతా అంకెల గారడీనే కనిపిస్తుందని విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. వైఎస్సార్సీపీ అమలుచేసిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని, అంతకుమించి సూపర్ సిక్స్ పథకాలను అమలుచేస్తామని గత సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో టీడీపీ, జనసేన నాయకులు అరచేతిలో వైకుంఠం చూపించారు. తీరా అధికారంలోకి వచ్చాక హామీలకు ఎగనామం పెట్టేశారు. రానున్న సంవత్సరం కూడా సూపర్ సిక్స్ పథకాలు అందవన్న విషయం శుక్రవారం నాటి రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలు చూసిన తర్వాత స్పష్టమైంది. సామాన్యుల ఆశలు కరిగిపోయాయి. గత ఏడాది నవంబర్లో ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్లోనే అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలను ప్రస్తావించినా తర్వాత వాటి ఊసే లేదు. వాటినే మళ్లీ తాజా పూర్తిస్థాయి బడ్జెట్ 2025–26లోనూ ప్రతిపాదించినా అరకొర నిధులే కేటాయించడంతో అవెంత వరకూ అమలుచేస్తారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సూపర్ సిక్స్లోని మిగతా సంక్షేమ పథకాలకు సంబంధించిన ప్రతిపాదనలేవీ లేవు. రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్పై ఉభయ విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల ప్రజలు పెదవి విరుస్తున్నారు. ● రైతులకు సాయం అందేనా? పెట్టుబడి సాయం కింది ప్రతి రైతు కుటుంబానికి ఏటా రూ.20 వేల చొప్పున అందిస్తామనేది టీడీపీ, జనసేన నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన హామీ. గత తాత్కాలిక బడ్జెట్లోనే ఇస్తామని ప్రతిపాదించినా ఒక్క పైసా కూడా రైతులకు ఇవ్వలేదు. ఈసారి బడ్జెట్లో రాష్ట్రంలో 53.5 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద దఫదఫాలుగా సాయం అందించేందుకు రూ.6,300 కోట్లు ప్రతిపాదించారు. అమలయ్యేవరకూ అనుమానమే. రైతుసేవా కేంద్రాలుగా పేరుమార్చిన రాష్ట్రంలోని 10778 ఆర్బీకేలకు నిర్వహణ ఖర్చుల కింద కేవలం రూ.19.42 కోట్లు మాత్రమే ప్రతిపాదించారంటే... వాటిని మరింత నిర్వీర్యం చేయడానికేనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయాధారిత విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో రైతులకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇవెంతగానే ఉపయోగపడిన విషయం తెలిసిందే. మార్కెట్లలో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పడిపోతే కొనుగోలు చేసి రైతులను ఆదుకొనేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సుమా రు రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసింది. కానీ కూటమి ప్రభుత్వం ఈ బడ్జెట్లో కేవలం రూ.300 కోట్లు మాత్రమే ప్రతిపాదించింది. సహకార రంగంపై చిన్నచూపు 2025–26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో సహకార సంఘాల బలోపేతం, సహకార చక్కెర ఫ్యాక్టరీల ఆధునికీకరణ, మార్కెట్ యార్డుల అభివృద్ధిని పట్టించుకోలేదు. కీలకమైన విద్యరంగానికి కేవలం 11శాతం, ఆరోగ్యం కోసం 6 శాతం, వ్యవసాయానికి 4 శాతం, గ్రామీణ పంచాయతీ రాజ్ అభివృద్ధికి 6 శాతం, ఇరిగేషన్కు కేవలం 5శాతం మాత్రమే కేటాయింపులు చేయడం అన్యాయం. – భీశెట్టి బాబ్జి, లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కంటితుడుపుగానే... సగానికి పైబడిన జనాభాకు ఆధారంగా ఉన్న వ్యవసాయ రంగానికి కూటమి ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు కంటి తుడుపుగానే ఉన్నాయి. జిల్లాలో పెండింగ్లో ఉన్న వంశధార, తోటపల్లి, నారాయణపురం ప్రాజెక్టుల ఆధునికీకరణకు కావాల్సిన నిధులు కేటాయించలేదు. పశువైద్య విద్యార్థులు గత 25 రోజులుగా సమ్మె చేస్తున్నా సమస్యకు పరిష్కారం చూపలేదు. ఉత్తరాంధ్రకు మొండిచేయి చూపింది. – బుడితి అప్పలనాయుడు, కార్యదర్శి, ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం హామీలకు... బడ్జెట్కు పొంతన ఉందా? ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఇచ్చిన హామీలకు.. రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపులకు పొంతన లేదు. తల్లికి వందనం కోసం రూ.12,450 కోట్లు అవసరమైతే కేవలం రూ.8,778 కోట్లు మాత్రమే కేటాయించడం దారుణం. ఆడబిడ్డ పథకానికి కేటాయింపులే లేవు. అన్నదాత సుఖీభవ పథకానికీ అరకొర నిధులే. లబ్ధిదారులు అప్రమత్తంగా ఉండాలి. బడ్జెట్ సాక్షిగా ప్రజలను మరోసారి మోసం చేశారు. – శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, మాజీ ఎమ్మెల్యే, బొబ్బిలి కార్మిక వ్యతిరేక బడ్జెట్ కూటమి ప్రభుత్వం కార్మిక, ఉద్యోగ వ్యతిరేక బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆప్కాస్ ఉద్యోగుల ఆశలపై నీళ్లుజల్లింది. మున్సిపల్ ఇంజినీరింగ్, వాటర్ సప్లై, స్ట్రీట్ లైట్లు, వాల్ ఆపరేటర్లు, పార్కుల్లో పనిచేసే కార్మికుల కోసం బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు చేయకుండా ద్రోహం చేసింది. ఆందోళనకు సిద్ధం కావాలి. – ఎ.జగన్మోహన్రావు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సీఐటీయూ) రాష్ట్ర కమిటీ సభ్యుడు ) నిరాశాజనకం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఉద్యోగవర్గాలకు నిరాశను మిగిల్చింది. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, ఐఆర్ ప్రస్థావన లేక పోవడం బాధాకరం. – కె.చంద్రరావు, ఎస్జీటీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, గజపతినగరం పీఆర్సీ అమలుకు కేటాయింపులేవీ? రాష్ట్ర బడ్జెట్లో ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గానికి అన్యాయం జరిగింది. ఇప్పటికే 20 నెలలు ఆలస్యమైన 12వ పీఆర్సీ ప్రస్థావనలేదు. ఐఆర్ అమలు కోసం నిధుల కేటాయింపుపై స్పష్టత ఇవ్వలేదు. సీసీఎస్/జీపీఎస్ కన్నా మెరుగైన పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని ఇచ్చిన హామీపై బడ్జెట్లో ఎటువంటి ప్రకటన లేదు. పాఠశాల విద్యకు గత ప్రభుత్వం చివరి బడ్జెట్లో 10.15 శాతం నిధులు కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్లో కేవలం 9.86 శాతం మాత్రమే కేటాయించారు. – డి.శ్యామ్, రాష్ట్రకార్యదర్శి, ఎస్టీయూ సాగునీటి పథకాలకు అరకొరగా నిధులు... దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఉమ్మడి విజయనగరం జిల్లాలో జలయజ్ఞంలో భాగంగా తలపెట్టిన సాగునీటి ప్రాజెక్టు పనులను పూర్తి చేయడమే లక్ష్యంగా ఆయన కుమారుడు, గత ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నిధులు కేటాయిస్తూ వచ్చారు. అదే పంథాను కొనసాగించడంలో కూటమి ప్రభుత్వం పెద్దగా ఆసక్తి చూపించలేదని ఈ బడ్జెట్ను చూస్తే తేటతెల్లమవుతోంది. కాలువల నిర్మాణానికి సంబంధించి జంఝావతి, తోటపల్లి కొత్త ఆయకట్టు తో కలిపి వెంగళరాయసాగర్ విస్తరణకు అవసరమైన 21 ఎకరాల భూసేకరణకు, తారకరామతీర్థ సాగరం ప్రాజెక్టు మిగులు పనులకు, తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టు గజపతినగరం బ్రాంచ్ కెనాల్కు అవసరమైన 240 ఎకరాల భూసేకరణకు, పాత తోటపల్లి బ్యారేజ్ ఆధునికీకరణ, పెద్దేరు రిజర్వాయరు, మడ్డువలస రిజర్వాయరు మిగులు పనులన్నింటికీ కలిపి కేవలం రూ.54.73 కోట్లు మాత్రమే ప్రతిపాదించడమే దీనికి నిదర్శనం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు రూ.605.75 కోట్లు, తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టుకు రూ.47.80 కోట్లు ప్రతిపాదించారు. మిగులు పనులు, నిర్వాసితులకు పరిహారం చెల్లింపునకు కలిపి తారకరామతీర్థ సాగరం ప్రాజెక్టుకు రూ.68 కోట్లు కేటాయించారు. అరకొరగా కేటాయింపులు... భోగాపురం ఎయిర్పోర్టు అనుసంధాన రహదారి నిర్మాణానికి ఇంకా 40 ఎకరాల భూసేకరణకు సంబంధించి రూ.195 కోట్లు ఈ బడ్జెట్లో ప్రతిపాదించారు. పార్వతీపురం మన్యం జిల్లా సహా రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో నెలకొన్న ఏనుగుల సమస్యను పరిష్కరించేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టు ఎలిఫెంట్కు కేవలం రూ.1.28 కోట్లే కేటాయించారు. విజయనగరంలోని జేఎన్టీయూ–గురజాడ ఇంజనీరింగ్ విశ్వవిద్యాలయంలో మౌలిక వసతుల కల్పనకు సాయంగా సుమారు రూ.5.60 కోట్లు ప్రతిపాదించారు. దీంతో పాటు కురు పాంలోని గిరిజన ఇంజినీరింగ్ కళాశాలకు కలిపి భవనాలు, ల్యాబ్ల నిర్మాణం కోసం మరో రూ.3.40 కోట్లు కేటాయించారు. విజయనగరం శివారులోని కోరుకొండ సైనిక్స్కూల్తో పాటు కలికిరి సైనిక్స్కూల్కు కలిపి అదనపు నిర్మాణాల కోసం రూ.2 కోట్లు ప్రతిపాదించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం గిరిజన ప్రాంతాలైన సీతంపేట, పార్వతీపురంతో పాటు మరో మూడు ప్రాంతాల్లో నిర్మించతలపెట్టిన మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులకు రూ.110 కోట్లు ప్రతిపాదించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్మించిన విజయనగరం సహా రాష్ట్రంలోని మరో ఆరు బోధనాసుపత్రులకు కలిపి రూ.375 కోట్లు మాత్రమే ప్రతిపాదించారు. అరకొర నిధులతో విజయనగరం మెడికల్ కాలేజీలో రెండో దశ నిర్మాణాలు వేగవంతమయ్యే అవకాశం కనిపించట్లేదు. మాయల బడ్జెట్ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను కొనసాగించేందుకే తిప్పలు పడుతు న్న చంద్రబాబు ప్రభుత్వం మాయల బడ్జెట్ను ప్రవేశపెట్టింది. మరి అలవికాని హామీలను ఇచ్చి, అందులోనూ సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని చెప్పిన చంద్రబాబు వాటిని అటకెక్కించినట్టేనా? నిరుద్యోగ భృతి ఏమైంది? మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏమైంది.? వీటికి సమాధానం చెప్పాలి. – బొద్దల సత్యనారాయణ, వైఎస్సార్సీపీ జిల్లా ప్రచార కార్యదర్శి, బొబ్బిలిగారడీ బడ్జెట్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ అంతా గారడీగానే కనిపిస్తోంది. అమరాతి చుట్టు పక్కల అభివృద్ధికే పరిమితమైంది. రాష్ట్రాభివృద్ధిని పక్కనపెట్టింది. పేదల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. నిరుద్యోగులకు మొండిచేయి చూపింది. విద్య, వైద్య రంగాలకు కొత్త కేటాయింపులు లేకపోవడం దారుణం. – డాక్టర తలే రాజేష్, వైఎస్సార్సీపీ రాజాం నియోజకవర్గ ఇన్చార్జి మంత్రులు సిగ్గుపడాలి బడ్జెట్ బాగుందంటూ ప్రశంసలు గుప్పించిన మంత్రులు సిగ్గుపడాలి. బడ్జెట్ అంతా అంకెల గారడీలా ఉంది. ద్రవ్యలోటు రూ.68,742,65 కోట్లుగా, రెవెన్యూ లోటు రూ.34,712,84 కోట్లుగా చూపారు. ఈ లోటును ఏ రకంగా భర్తీచేస్తారో చెప్పలేదు. నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రణ ఊసేలేదు. విద్యారంగానికి బడ్జెట్లో 30 శాతం నిధులు కేటాయించాలన్న కొఠారి కమిషన్ నివేదికను కనీసం పట్టించుకోలేదు. కౌలురైతులు, నిరుద్యోగుల కోసం కనీసం ప్రస్థావన లేదు. – బుగత అశోక్, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి -
రామతీర్థం హుండీల ఆదాయం రూ.49.96 లక్షలు
నెల్లిమర్ల రూరల్: మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామి వారి హుండీలలో భక్తులు వేసిన కానుకలను దేవస్థానం అధికారులు గురువారం లెక్కించారు. కల్యాణ మండపంలో చేపట్టిన హుండీల లెక్కింపులో రూ.49,96,162 నగదు లభించినట్టు ఈఓ వై.శ్రీనివాసరావు తెలిపారు. 11.800 మిల్లీ గ్రాముల బంగారం, 5 కేజీల 960 గ్రాముల వెండి లభ్యమైందన్నారు. హుండీల లెక్కింపున దేవదాయశాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ కె.శిరీష పర్యవేక్షించారు. ఆదాయం లెక్కింపులో పలువురు శ్రీవారి భక్తులు, తనిఖీదారు శ్యామ్ప్రసాద్, దేవస్థాన సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు. నిఘా నీడలో ఇంటర్మీడియట్ పరీక్షలు ●● నేటి నుంచి 20వ తేదీ వరకు నిర్వహణ ● జిల్లాలో 66 కేంద్రాల ఏర్పాటు ● పరీక్షలు రాయనున్న విద్యార్థులు 41,270 మంది ● వాట్సాప్లో హాల్టికెట్ల డౌన్లోడ్ విజయనగరం అర్బన్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు వేళయింది. గతనెల 11న ప్రారంభమైన ప్రాక్టికల్ పరీక్షలు 20వ తేదీతో ముగిశాయి. శనివారం నుంచి 20వ తేదీ వరకు నిఘానీడలో థియరీ పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో సాధారణ, వృత్తి విద్యాకోర్సులు కలిపి మొత్తం 41,270 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో ప్రథమ సంవత్సరం 20,902 మంది, ద్వితీయ సంవత్సరం 20,368 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికోసం జిల్లాలో మొత్తం 66 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షలు రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. పరీక్షల ఏర్పాట్లను జిల్లా కన్వీనర్ మజ్జి ఆదినారాయణ, జిల్లా పరీక్షల కమిటీ (డీఈసీ) సభ్యులు పరిశీలించారు. పరీక్షలకు 900 మందిని ఇన్విజిలేటర్లుగా నియమించారు. ముగ్గురు ఫ్లైయింగ్ స్క్వాడ్స్, ఆరుగురు సిట్టింగ్ స్క్వాడ్స్, డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీ సభ్యులు ప్రతిరోజూ పరీక్ష కేంద్రాలను పర్యవేక్షిస్తారు. పరీక్ష కేంద్రానికి 8.30 గంటలకే చేరుకోవాల్సి ఉంటుంది. విద్యార్థుల హాల్టికెట్లను 95523 00009 అనే వాట్స్ప్ నంబర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రిన్సిపాల్ సంతకం లేకుండానే హాల్టికెట్ తీసుకుని నేరుగా పరీక్ష కేంద్రాలకు వెళ్లొచ్చు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లుకు తావివ్వొద్దని పరీక్షల జిల్లా కన్వీనర్ మజ్జి ఆదినారాయణ చీఫ్ సూరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో సూచించారు. పరీక్షల పరిశీలన సిబ్బంది సెల్ఫోన్లు వినియోగించరాదన్నారు. ఎలాంటి సమస్యలు తలెత్తినా జిల్లా కేంద్రంలోని ఆర్ఐఓ కార్యాలయంలో కంట్రోల్ రూం ఫోన్: 08922–237988కు తెలియజేయాలన్నారు. నేటి నుంచి కొత్త మెనూ విజయనగరం అర్బన్: మధ్యాహ్న భోజన పథకానికి ఇంతవరకు వండుతున్న వంటకాలను మార్చుతూ కొత్త మెనూను విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. కొత్తగా ప్రకటించిన మెనూ శనివారం నుంచి అమల్లోకి వస్తున్నట్లు డీఈఓ యు.మాణిక్యంనాయుడు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
అమ్మ జాతరకు సర్వంసిద్ధం
చీపురుపల్లి: విజయనగరం జిల్లాతో పాటు శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఉండే భక్తులు మాత్రమే కాకుండా ఒడిశా వంటి సుదూర ప్రాంతాలకు చెందిన భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి జాతరరానే వచ్చింది. భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లి, ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి 27వ జాతర మహోత్సవాలకు సర్వం సిద్ధమైంది. మార్చి 2, 3, 4 తేదీల్లో అమ్మవారి జాతర నిర్వహించేందుకు దేవాదాయశాఖ నిర్ణయించింది. రేపటినుంచి శ్రీ కనకమహాలక్ష్మి జాతర మూడు రోజుల జాతరకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు -
బొబ్బిలిలో హమాలీల ఆందోళన
బొబ్బిలి: ‘గత 40 సంవత్సరాలుగా బొబ్బిలి రైల్వే స్టేషన్లోని వ్యాగన్పాయింట్ వద్ద హమాలీలుగా పనిచేస్తున్నాం. ఏటా హమాలీల అగ్రిమెంట్ ఒప్పందాలు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది కూడా అగ్రిమెంట్ డిసెంబర్ వరకూ ఉంది. అగ్రిమెంట్ను కాదని ఇక్కడ హమాలీలకు చెల్లిస్తున్న కూలిరేట్ల కంటే తక్కువ కూలికి వచ్చేవారిని నియమించుకునేందుకు ప్రయత్నించడం దుర్మార్గం’ అంటూ హమాలీలు ఆందోళన చేశారు. పట్టణ కళాశీ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు బోగాది అప్పలస్వామి, దంతులూరి వర్మ సమక్షంలో కాంట్రాక్టర్లను నిలదీశారు. ఇదీ సమస్య... ఇతర రాష్ట్రాలకు బియ్యం తరలించేందుకు బొబ్బిలి రైల్వే స్టేషన్లో వ్యాగన్ పాయింట్ నాలుగు దశాబ్దాలుగా నడుస్తోంది. ఇక్కడ పలు గ్రామాలకు చెందిన హమాలీలు పనిచేస్తున్నారు. ఇటీవల విశాఖ–రాయపూర్ల మధ్య నిర్మిస్తున్న మూడో రైల్వే లైన్ నిర్మాణంతో పాటు రైల్వేస్టేషన్లోని పలు భవనాల పనుల కారణంగా రైల్వే వ్యాగన్ పాయింట్ను కోమటిపల్లి స్టేషన్కు తరలించారు. అక్కడకు వెళ్లిన హమాలీలను కొత్తగా అక్కడ నియమితులైన కార్మికులు అడ్డుకున్నారు. ఏళ్లతరబడి ఇదే పనిగా బతుకుతున్నామని, పనికి రావద్దంటే ఎలా అన్ని ప్రశ్నించినా ఫలితం లేకపోయింది. స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లభించకపోవడంతో శుక్ర వారం ధర్నాకు దిగారు. బొబ్బిలి పట్టణంలోని రైల్వే స్టేషన్లో ఉన్న వ్యాగన్పాయింట్ నుంచి కోమటిపల్లిలో లోడింగ్కోసం వెళ్తున్న సివిల్ సప్లయి లారీలను గ్రోత్ సెంటర్ వద్ద అడ్డుకున్నారు. లారీలన్నింటినీ గ్రోత్సెంటర్లోని అంతర్గత రోడ్లలోకి మళ్లించి అడ్డంగా నిలబడ్డారు. న్యాయం జరిగే వరకూ పోరాడుతామంటూ నినదించారు. విషయం తెలుసుకున్న బొబ్బిలి సీఐ కె.సతీష్కుమార్, ఎస్ఐలు ఆర్.రమేష్, పి.జ్ఞానప్రసాద్, పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన పౌరసరఫరాల శాఖ సాంకేతిక అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని హమాలీలకు నచ్చజెప్పే ప్రయత్నంచేసినా వినలేదు. సంఘ నాయకులను పోలీస్స్టేషన్కు తీసుకువెళ్లి కాంట్రాక్టర్తో చర్చలు జరిపారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే బేబినాయన దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. వచ్చే రైల్వే వ్యాగన్ లోడింగ్ పనిలో గతంలో పనిచేసిన హమాలీలే పనిచేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇవ్వడం, కాంట్రాక్టర్తో ఒప్పందపత్రం రాయించడంతో ఆందోళన విరమించి లారీలను విడిచిపెట్టారు. ఆందోళనలో పీడీఎస్ఓ నాయకులు సోమేశ్వరరావు, పిరిడి అప్పారావు, యరబాల అప్పారావు, పైల రామకృష్ణ, పౌరసరఫరాల సంస్థ టెక్నీషియన్ హరిశంకర్, కాంట్రాక్టర్లు అప్పారావు, బుల్లిరాజు, లారీ ఓనర్ల సంఘం బొబ్బి లి అధ్యక్షుడు నంబియార్వేణుగోపాలరావు, కాకల వెంకటరావు, పిరిడి ఈశ్వరరావు పాల్గొన్నారు. ఏళ్లతరబడి పనిచేస్తున్నవారిని పక్కన పెట్టడంపై మండిపాటు సివిల్ సప్లయి బియ్యం లోడ్లను అడ్డుకున్న కూలీలు బొబ్బిలి రైల్వే స్టేషన్వేగన్ పాయింట్ వద్ద ధర్నా -
ఇఫ్టూ విలీన సభను విజయవంతం చేయండి
బొబ్బిలి: రాజమండ్రి పుష్కరాల రేవు వద్ద మార్చి 2వ తేదీన నిర్వహించే ఇఫ్టూ విలీన సభను విజయవంతం చేయాలని జిల్లా కార్యదర్శి ఎం.గోపాలం పిలుపునిచ్చారు. దీనికి సంబంధించిన వాల్ పోస్టర్లను బొబ్బిలిలో గురువారం ఆవిష్కరించారు. కార్మికులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు వి.రామమూర్తి, పిల్లా లక్ష్మణరావు, తదితరులు పాల్గొన్నారు. యువకుడు అనుమానాస్పద మృతి ● విజయనగరంలో ఘటన.. చినరావుపల్లిలో విషాదం ఎచ్చెర్ల క్యాంపస్ : ఆదుకుంటాడనుకున్న కొడుకు అనంత లోకాలకు వెళ్లిపోవడంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. విజయన గరం జిల్లాలో డిగ్రీ చదువుతున్న కుమారుడు మృతి చెందాడన్న వార్త విని శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎచ్చెర్ల మండలం చిన్నరావుపల్లి గ్రామానికి చెందిన అన్నెపు గణేష్, అమ్మాజమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సంతోష్కుమార్ డిగ్రీ పూర్తయి ఉద్యోగ వేటలో ఉండగా, చిన్న కుమారుడు లోకేష్ విజయనగరంలోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ఫస్టియర్ చదువుతున్నాడు. ఒక వైపు డిగ్రీ చదువుతూనే మరోవైపు రక్షణ రంగంలో ఉద్యోగాల కోసం స్నేహితులతో కలిసి రూమ్ అద్దెకు తీసుకొని కోచింగ్ తీసుకుంటున్నాడు. ఈ నెల 26న మధ్యాహ్నం 12 గంటల సమయంలో లోకేష్ స్నేహితులు సంతోష్కు ఫోన్ చేసి తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పడంతో విషాదంలో మునిగిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు విజయనగరం బయలుదేరారు. అక్కడి ప్రభుత్వ ఆస్పత్రిలో కుమారుడి మృతదేహాన్ని చూసి తండ్రి భోరున విలపించాడు. తమ కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదంటూ విజయనగరం వన్ టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు లోకేష్ స్నేహితులతో మాట్లాడి వివరాలు సేకరించారు. సెల్ఫోన్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. మంగళవారం అర్ధరాత్రి 1.30 నుంచి 3 గంటల మధ్య మృతి జరిగినట్టుగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. పంచనామా నిర్వహించిన వైద్యులు సైతం సస్పెక్టెడ్ డెత్ అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. ఇటీవల తన తరగతికే చెందిన ఓ విద్యార్థిని లోకేష్ ఇష్టపడినట్టుగా సెల్ఫోన్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. ఇదే సమయంలో మరో యువకుడు కూడా అదే అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు స్నేహితుల ద్వారా తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో లోకేష్ మృతి మిస్టరీగా మారింది. పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని యువకుడు పరారీ! విజయనగరం క్రైమ్: విజయనగరం పట్టణంలోని రెయ్యిల వీధికి చెందిన పాండ్రంకి సాయి (29) కనిపించడం లేదంటూ తల్లి చిట్టెమ్మ విజయనగరం వన్టౌన్ పోలీస్ స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశారు. సీఐ శ్రీనివాస్ కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. సాయికి వచ్చేనెల పెళ్లి చేయాలని పెద్దలు ముహూర్తం పెట్టారు. ఇష్టంలేని పెళ్లి చేయడం వల్లే ఇంటి నుంచి వెళ్లిపోయినట్టు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. 12 నెలల్లో 56 మిస్సింగ్ కేసులు జిల్లా కేంద్రంలో మిస్సింగ్ కేసుల నమోదు ఇటీవల పెరిగింది. గడిచిన 12 నెలల్లో వన్టౌన్ పోలీస్ స్టేషన్లో 56 మిస్సింగ్ కేసులు నమోదు కావడం గమనార్హం. 22 మంది మహిళలు మిస్సింగ్ కాగా, 21 మందిని పోలీసులు పట్టుకుని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మాటలురాని (మూగది) కే.ఎల్.పురానికి చెందిన బి.ముత్యాలమ్మ(59) ఆచూకీ పోలీసులకు ఇప్పటికీ లభించలేదు. పురుషుల్లో 20 మంది అదృశ్యంకాగా 17 మందిని సురక్షితంగా ఇంటికి చేర్చారు. కె.ఎల్.పురానికి చెందిన జి.కూర్మారావు(52), నాగోజీ పేటకు చెందిన గంటా నారాయణరావు(37), వీటీ ఆగ్రహారం రీమాపేటకు చెందిన గడి అప్పారావు(55) ఆచూకీ తెలియాల్సి ఉంది. వీరి ఆచూకీని తెలుసుకునేందుకు పోలీస్బృందాలు పనిచేస్తున్నట్టు సీఐ శ్రీనివాస్ తెలిపారు.