Economy
-
ఎస్బీఐ యూపీఐ సేవల్లో అంతరాయం
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కస్టమర్లు యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్ సేవలను పొందడంలో మంగళవారం నాలుగు గంటలకు పైగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ సమస్య తలెత్తింది. సమస్యను పూర్తిగా పరిష్కరించామని బ్యాంక్ ప్రకటించింది. మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి ఈ సమస్య ఉత్పన్నమైంది. దీంతో వినియోగదార్లు చాలా మంది తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు. ‘ఎస్బీఐ యూపీఐ యాప్లో తలెత్తిన సాంకేతిక సమస్యలు పరిష్కరించాం. సాయంత్రం 5 గంటల నుండి ఆటంకం లేకుండా పనిచేస్తోంది’ అని బ్యాంక్ వివరించింది.రికార్డు స్థాయిలో యూపీఐ చెల్లింపులుయూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) ఆధారిత డిజిటల్ చెల్లింపులు ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి. లావాదేవీల విలువ, పరిమాణం విషయంలో 2025 ఫిబ్రవరి 1 సరికొత్త రికార్డు సృష్టించింది. ఏకంగా ఆ ఒక్కరోజే రూ.99,835 కోట్ల విలువైన లావాదేవీలు నమోదయ్యాయి. లావాదేవీల సంఖ్య 60 కోట్లు దాటింది. యూపీఐ వ్యవస్థలో ఇదే రికార్డు. గత రికార్డులు చూస్తే లావాదేవీల విలువ 2025 జనవరి 2న అత్యధికంగా రూ.94,429 కోట్లు, లావాదేవీల సంఖ్య జనవరి 10న 57.8 కోట్లు నమోదైంది. ఫిబ్రవరి 1–25 మధ్య రూ.19,60,263 కోట్ల విలువైన 1439.8 కోట్ల లావాదేవీలు జరిగాయి.ఇదీ చదవండి: టాటా గ్రూప్ నుంచి మరో ఐపీవోఅగ్రస్థానంలో ఫోన్పేయూపీఐ విభాగంలో ఫోన్పే తొలి స్థానంలో దూసుకుపోతోంది. 2025 జనవరిలో రూ.11,91,304 కోట్ల విలువైన 810 కోట్ల లావాదేవీలను సాధించింది. గూగుల్పే రూ.8,26,845 కోట్ల విలువైన 618 కోట్ల లావాదేవీలతో రెండవ స్థానంలో కొనసాగుతోంది. రూ.1,26,313 కోట్ల విలువైన 115 కోట్ల లావాదేవీలతో పేటీఎం మూడవ స్థానంలో నిలిచింది. లావాదేవీల విలువ పరంగా క్రెడ్, ఐసీఐసీఐ బ్యాంక్ యాప్స్, నవీ, గ్రో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ యాప్స్, అమెజాన్ పే, భీమ్ యాప్స్ తర్వాతి స్థానాల్లో పోటీపడుతున్నాయి. -
గుట్టు విప్పిన ఐటీ శాఖ: అలాంటి వారికి ట్యాక్స్ నోటీసులు?
నిర్దిష్ట ఆదాయం కంటే ఎక్కువ సంపాదన ఉన్నప్పుడు.. మన దేశంలో ట్యాక్స్ చెల్లించాలి. పాత ఆదాయపు పన్ను విధానం ప్రకారం.. ట్యాక్స్ రిబేట్ రూ. 5 లక్షలుగా ఉండేది. కొత్త పన్ను విధానం ప్రకారం ఇది రూ. 12 లక్షలకు చేరింది. ఆదాయపన్ను చట్టం 1961 కింద.. కొత్త, పాత పన్ను విధానాల కింద ఏది ఎంచుకుంటే.. ఆ శ్లాబుల ప్రకారం ట్యాక్స్ చెల్లించాలి.పన్ను మినహాయింపు పరిమితి దాటితే.. ఐటీఆర్ ఫైల్ చేయాలి. కొందరు దీనిని పెడచెవిన పెడుతున్నారు. అంటే ట్యాక్స్ చెల్లించకుండా తప్పించుకుంటున్నారు. అలాంటి వారిని ఇప్పుడు ఐటీ శాఖ గుర్తించింది. ఇప్పటికే ట్యాక్స్ కట్టకుండా ఉన్నవారి లిస్ట్ కూడా తయారు చేసుకుంది. సదరు వ్యక్తులకు నోటీసులు కూడా అందుతాయి.ఎవరైతే ట్యాక్స్ కట్టకుండా తప్పించుకుంటున్నారో.. వారిపైన సెక్షన్ 148ఏ కింద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు లిస్ట్ చేసిన వారు 2018-19, 2019-20, 2020-21, 2021-22 ఆర్ధిక సంవత్సరానికి గానూ చెల్లించకుండా ఉన్నవారు అని తెలుస్తోంది. ఇప్పటికే కొందరికి నోటీసులు పంపినట్లు చెబుతున్నారు.పన్ను కట్టకుండా తప్పించుకునే వారిని గుర్తించడానికి ఏఐఎస్, టీడీఎస్/టీసీఎస్ స్టేట్మెంట్స్, ఫైనాన్సియల్ ట్రాన్సక్షన్ స్టేట్మెంట్ వంటి వాటిని ఆదాయపన్ను శాఖ తనిఖీ చేస్తుంది. వీటి ద్వారానే ఎవరు పన్ను కడుతున్నారు, ఎవరు కట్టడం లేదనే విషయాలను తెలుసుకుంటుంది. పన్ను ఎగ్గొట్టే వారిని గుర్తించి.. వారికి నోటీసులు జారీ చేస్తుంది.ఇదీ చదవండి: రన్యా రావు కేసు.. దుబాయ్ నుంచి ఎంత బంగారం తీసుకురావచ్చంటే?ఎవరైతే పన్ను చెల్లించకుండా.. తప్పించుకుంటున్నారో వారికి నోటీసులు జారీ చేసి, చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే కండొనేషన్ ఆఫ్ డిలేకు అప్లై చేసుకుని లేదా వడ్డీతో కలిపి ట్యాక్స్ పూర్తిగా చెల్లించినట్లయితే.. బయటపడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. -
బ్యాంకులకు వరుస సెలవులు: ఎందుకో తెలుసా?
ఈ నెలలో (మార్చి 2025) దాదాపు పది రోజుల కంటే ఎక్కువ బ్యాంకు సెలవులు ఉన్నాయి. కాగా ఈ ఒక్క వారంలోనే వరుస సెలవులు వస్తున్నాయి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సెలవులు ఉన్నాయి, ఆ సమయంలో ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉంటాయా? అనే వివరాలు తెలుసుకుందాం.మార్చి రెండో వారం కూడా మొదలైపోయింది. ఈ వారంలో 13 నుంచి 16వరకు వివిధ ప్రాంతాల్లోని బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. వరుస సెలవులు రావడం చేత.. తప్పకుండా బ్యాంకులకు వెళ్లి పూర్తి చేయాల్సిన పనులను ముందుగానే పూర్తి చేసుకోవచ్చు. ఆలస్యమైనా పరవాలేదు అనుకున్నప్పుడు.. ఎప్పుడు బ్యాంకులు మూసి ఉంటాయి అనే విషయం తెలుసుకోవాలి. అయితే ఆన్లైన్ సేవలు అన్నీ సెలవు దినాల్లో కూడా అందుబాటులో ఉంటాయి.➤మార్చి 13 (గురువారం): మార్చి 13న హోలిక దహన్, అట్టుకల్ పొంగళ పండుగ కారణంగా జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, కేరళ వంటి రాష్ట్రాల్లో సెలవు ఉంటుంది.➤మార్చి 14 (శుక్రవారం): హోలీ పండుగ సందర్భంగా.. త్రిపుర, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, మణిపూర్, కేరళ, నాగాలాండ్ మినహా ఇతర రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో సెలవు.➤మార్చి 15 (శనివారం): కొన్ని రాష్ట్రాలు మార్చి 14కి బదులుగా మార్చి 15న హోలీని జరుపుకుంటాయి. ఈ జాబితాలో త్రిపుర, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, మణిపూర్ ఉన్నాయి.➤ మార్చి 16 (ఆదివారం); ఆదివారం కావడం చేత దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు.(బ్యాంకింగ్ సెలవుల షెడ్యూల్ మారవచ్చు.. కాబట్టి హాలిడే క్యాలెండర్లో ఏవైనా అప్డేట్లు లేదా రివిజన్ల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. లేదా మీ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక ప్రకటనలను గమనించాల్సి ఉంటుంది). -
జీఎస్టీ తగ్గింపుపై నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు
పేదల కోసం సంక్షేమ పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వానికి నిధులు అవసరం. కాబట్టి, పరిశ్రమలు పన్నులను తగ్గించాలని నిరంతరం డిమాండ్ చేయకూడదని కేంద్ర మంత్రి 'నితిన్ గడ్కరీ' న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో వెల్లడించారు.జీఎస్టీ, ఇతర పన్నులను తగ్గించమని అడగకూడదు, ఒకవేళా పన్నులను తగ్గిస్తే.. ఇంకా తగ్గించాలని చెబుతారు. ఎందుకంటే అది మానవ నైజం. పన్నులు వసూలు చేయకుండా.. ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడం కష్టం. ధనవంతుల నుంచి పన్ను తీసుకొని.. పేదలకు ప్రయోజనాలు కల్పించడం ప్రభుత్వ దార్శనికత అని గడ్కరీ అన్నారు.రెండేళ్లలోపు భారతదేశంలోని లాజిస్టిక్స్ ఖర్చు 9 శాతానికి తగ్గుతుందని నితిన్ గడ్కరీ అన్నారు. ప్రస్తుతం భారతదేశ లాజిస్టిక్స్ ఖర్చు 14 నుంచి 16 శాతంగా ఉంది. చైనాలో లాజిస్టిక్స్ ఖర్చు 8 శాతంగా ఉంది. అమెరికా, యూరోపియన్ దేశాలలో ఇది 12 శాతం అని మంత్రి అన్నారు. కాబట్టి మరో రెండేళ్లలో మన దేశంలో కూడా లాజిస్టిక్ ఖర్చులను తగ్గించనున్నట్లు స్పష్టం చేశారు. అంత కాకుండా పెట్టుబడిని పెంచడం ద్వారా భారతదేశం మరిన్ని ఉద్యోగాలను సృష్టించబోతోందని మంత్రి పేర్కొన్నారు.ఇదీ చదవండి: నెలకు 10 రోజులు.. టెక్ కంపెనీ కొత్త రూల్!మీరు సంపద సృష్టికర్తలు మాత్రమే కాదు, ఉద్యోగాల సృష్టికర్తలు కూడా. ఈ స్వర్ణ యుగాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. అంతేకాకుండా, భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి దిగుమతులను తగ్గించి ఎగుమతులను పెంచాల్సిన అవసరాన్ని గడ్కరీ నొక్కి చెప్పారు. -
ఇంద్రుడిలా.. ఇన్కం ట్యాక్స్ వాళ్లు..
ఇంద్రుడికి వేయి కళ్లున్నాయి అనేది నాటి కథ. పురాణ కథ. ఇప్పుడు చెప్పుకోబోయేది నేటి కథ. జరగబోయే కథ. ఇన్కం ట్యాక్స్ వాళ్లు ఇప్పటికే తమకున్న విస్తృత అధికారాలను వాడుతూ, ఎన్నో రాళ్లు రువ్వుతున్నారు రతనాల కోసం. ప్రతి రాయీ రత్నం అవుతోంది. ఆదాయాన్ని తెస్తోంది. వారి దగ్గర ఉన్నది ‘‘డేటా’’ కాదు .. మీ బ్యాంకు బ్యాలెన్సు. ఆదాయాన్ని అసెస్ చేసి, వారి వాటా ఉంచుకుని మిగతాది మీకు ఇస్తారు. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ మైమరచిపోయే రోజులు పోయాయి. అరకొర సిబ్బంది ఏమీ చేయలేరని అనుకోకండి. అర కొర సిబ్బందికి కొత్త కోరలు వచ్చాయి. ఇక జాగ్రత్త.‘‘సంసారం గుట్టు .. రోగం రట్టు’’ అనేది ఒక సామెత. ‘‘సంపాదన గుట్టు, రోగం గుట్టు’’ అనే వాళ్లూ ఉన్నారు. మగవాడి జీతం అడగకూడదనే నానుడి ఉంది. డిజిటల్ ప్రపంచంలో అన్నీ అందరికీ తెలిసిపోతున్నాయి. సీక్రెసీ లేదు. ప్రైవసీ లేదు. ఇనుపపెట్టెలో రొక్కం, బీరువాలో నగలు, లాకర్లో బంగారం, స్విస్ బ్యాంకులో జమలు.. ఇవన్నీ తెలుసుకుంటున్నారు.మనం మన వంటికి ‘కవచకుండలం’లాగా భావించే సెల్ఫోన్ నిజానికి కవచ కుండలం కాదు. డేటాను వెదజల్లే కుండ. మన సంభాషణలు, వాట్సప్లో సందేశాలు, ఈమెయిళ్లు, గూగుల్ చెల్లింపులు, పేటీఎం చెల్లింపులు, అమెజాన్ ఆర్డర్లు, ఫ్లిప్కార్ట్ కొనుగోళ్లు, స్విగ్గీ ఆర్డర్లు, జొమాటో ఆర్డర్లు, విదేశీ ప్రయాణాలు, పండగ ఆఫర్లు, బంగారం కొనుగోళ్లు ప్రతీదీ తెలిసిపోతుంది. అలాగే బిల్డర్లతో, బ్రోకర్స్తో, బ్యాంకర్లతో, ఇన్వెస్ట్మెంట్ ప్లానర్స్తో, వ్యాపారవేత్తలతో స్నేహితులతో, పిల్లలతో, భాగస్వాములతో జరిపే ఈమెయిల్స్ సంభాషణలు, మన ఇన్స్ట్రాగామ్, వాట్సాప్, యూట్యూబ్, సోషల్ మీడియా, లింక్డిన్ ఖాతాలు మొదలైన వివరాలన్నీ తెలిసిపోతాయి.2026 ఏప్రిల్ 1 నుంచి అంటే 2026–27 ఆర్థిక సంవత్సరం నుంచి ఇన్కం ట్యాక్స్ అధికారులకు ఇంద్రుడిలాగా విస్తృత అధికారాలు ఇచ్చారు. మీ సోషల్ మీడియా అకౌంటు, బ్యాంకు అకౌంట్లు, ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ అకౌంటు, ట్రేడింగ్ అకౌంటు ... ఇలా అన్నీ చెక్ చేయొచ్చు. బ్యాంకు లాకర్లు పగలకొట్టడం విన్నాం. ఇప్పుడు మీ కంప్యూటర్ సిస్టంను బ్రేక్ చేస్తారు. వర్చువల్ డిజిటల్ స్పేస్లో ప్రవేశిస్తారు. ఇప్పటికే అనుభవజ్ఞులైన ఎథికల్ హ్యాకర్స్ని ఇన్వాల్వ్ చేసి మన సమాచారం తప్పని, తక్కువని, పూర్తిగా జరిపిన వ్యవహారాలన్నీ చూపించి మన జాతక విశ్వరూప ప్రదర్శనం చేసి వారి ‘‘విశ్వరూపాన్ని’’ చూపిస్తున్నారు. మేఘాల్లో (క్లౌడ్) నుంచి కూడా సమాచారాన్ని సంగ్రహించి, అసెస్మెంట్ చేస్తున్నారు. వెబ్సైట్లు, క్లౌడ్ సర్వర్లు, డిజిటల్ ప్లాట్ఫాంలు దేన్నీ వదలడం లేదు. ‘‘ఇందుగలడందు లేడ’’ని చెప్పినట్లు, ఎక్కడికైనా వెళ్తారు. ఆగమేఘాల మీద రావడం అంటే ఇదేనేమో.అధికార్లు ఎందుకు వస్తారు... నా ప్రైవసీలోకి రావచ్చా.. ఇది రాజ్యాంగబద్ధమా.. ఇది హక్కులు నేలరాయటం కాదా లాంటి ప్రశ్నలు వెయ్యకండి. కొత్త బిల్లులో నిర్వచనం చాలా పకడ్బందీగా రాశారు. ఉద్యోగి సిస్టం ద్వారా యజమాని వివరాలు తెలుసుకుంటారు. అంతే కాకుండా కొన్న సంవత్సరం నుంచి ఎనిమిదేళ్లు వెనక్కు వెళ్తారు. అందుకని జాగ్రత్త వహించండి. మనం ఎవరికీ తెలియకుండా వ్యాపారం/వ్యవహారం చేస్తున్నాం అనుకుంటాం. ఇరుగు పొరుగుకి, అన్నదమ్ములకు తప్ప అందరికీ తెలుస్తుంది. ‘కాగల కార్యం గంధర్వులే’ తీర్చినట్లుగా తెలియకూడని వాళ్లకే సర్వం తెలిసిపోతోంది. ‘సర్వం జగన్నాధం’.అయితే, ఈ అధికారాలు దుర్వినియోగం కాకూడదు. అందరికీ సమానంగా, అంటే పన్ను ఎగవేసే ప్రతి బడాబాబుకీ వర్తించేలా, బంధుప్రీతి లేకుండా, కక్ష సాధింపులా కాకుండా, రాజకీయాలకు అతీతంగా జరిగితే ఎంతో మంచిది. అదే విశ్వకల్యాణం.కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తికె.వి.ఎన్ లావణ్యట్యాక్సేషన్ నిపుణులు -
నేటి నుంచి యూఎస్పై చైనా సుంకాలు.. వ్యూహాత్మక ప్రతీకారం
ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు అమెరికా-చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం(Trade Tensions) ముదురుతోంది. ఇటీవల అమెరికా చైనా దిగుమతులపై సుంకాలు(tariffs) విధిస్తున్నట్లు ప్రకటించింది. చైనా దిగుమతులపై సుంకాలను 10 నుంచి 20 శాతానికి పెంచుతూ యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. దీనికి ప్రతీకారంగా సోమవారం నుంచి అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై బీజింగ్ సుంకాలు అమలు చేసింది.ట్రంప్ ఓటర్ బేస్ లక్ష్యంగా..కొత్త చైనా సుంకాలు చికెన్, గోధుమ, మొక్కజొన్న, పత్తితో సహా యూఎస్ వ్యవసాయ ఉత్పత్తుల శ్రేణిపై 10-15 శాతంగా అమలు చేస్తున్నారు. అలాగే సోయాబీన్స్, పంది మాంసం, పాడి ఉత్పత్తులపై కూడా ఈ సుంకాలు అమలు చేయాలని చైనా నిర్ణయించింది. అమెరికాలో ట్రంప్ ఓటర్ బేస్ను ఆధారంగా చేసుకొని, వ్యవసాయ రాష్ట్రాల్లోని వారే లక్ష్యంగా ఈ సుంకాలను చైనా జాగ్రత్తగా రూపొందించినట్లు ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.పరిస్థితులు మరింత క్లిష్టతరం?యూఎస్-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తీవ్రతరం కావడంతో చైనా నాయకత్వం సవాళ్లను ఎదుర్కొంటోంది. దేశ ఆర్థిక వ్యవస్థ మందకొడిగా సాగుతోంది. వినియోగదారుల వ్యయ సామర్థ్యం తగ్గుతోంది. దీర్ఘకాలిక స్థిరాస్తి రంగం సంక్షోభంలోకి వెళుతుంది. రికార్డు స్థాయిలో యువత నిరుద్యోగంతో అవస్తలు పడుతున్నారు. ఈ క్రమంలో వాణిజ్య యుద్ధం ఒత్తిళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు, చైనా తన ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడానికి చేస్తున్న ప్రయత్నాలు పరిస్థితులను మరింత క్లిష్టతరం చేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ అడ్డంకులు ఉన్నప్పటికీ పరిస్థితిని మెరుగ్గా నిర్వహిస్తామని చైనా అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. టారిఫ్ల ప్రభావాన్ని ఎదుర్కోవడానికి క్రియాశీల ఆర్థిక విధానాల అవసరాన్ని నొక్కిచెప్పిన చైనా అధ్యక్షుడు జీజిన్పింగ్కు సన్నిహితుడైన లీ కియాంగ్ ఇటీవల ఈ సంవత్సరానికి 5 శాతం ఆర్థిక వృద్ధి లక్ష్యాన్ని నిర్దేశించారు.ఇదీ చదవండి: మహిళలకూ కావాలి సమగ్ర బీమాచర్చలకు దారి తీస్తాయా..ఇరు దేశాల మధ్య వాణిజ్య వివాదం ముదురుతున్న కొద్దీ పరస్పరం ఆర్థిక వృద్ధిపై ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. బీజింగ్ సుంకాలు అమెరికాపై రాజకీయ ఒత్తిడి తీసుకురావడానికి రూపొందించినప్పటికీ అవి ఇరు వర్గాల మధ్య చర్చలకు దారితీసే అవకాశం కూడా కల్పిస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ వ్యూహాలు పరిష్కారానికి దారితీస్తాయా లేదా మరింత ఉధృతికి అవకాశం కల్పిస్తాయా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. -
జీఎస్టీ రేట్ల తగ్గింపుపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన
జీఎస్టీ రేట్లు మరింత తగ్గుతాయని, పన్ను రేట్లు & శ్లాబులను హేతుబద్ధీకరించే పని దాదాపు ముగింపు దశకు చేరుకుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) అన్నారు. 2017 జూలై 1న GST అమలులోకి వచ్చిన సమయంలో 15.8 శాతంగా ఉన్న రెవెన్యూ న్యూట్రల్ రేటు (RNR) 2023 నాటికి 11.4 శాతానికి తగ్గిందని అన్నారు. ఇది మరింత తగ్గుతుందని స్పష్టం చేశారు.సెప్టెంబర్ 2021లో సీతారామన్ నేతృత్వంలోని.. రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్, జీఎస్టీ రేట్లను హేతుబద్ధీకరించడానికి.. శ్లాబులలో మార్పులను సూచించడానికి మంత్రుల బృందాన్ని (GoM) ఏర్పాటు చేసింది. ఈ బృందంలో ఆరు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఉంటారు.శనివారం ఢిల్లీలో 'ది ఎకనామిక్ టైమ్స్ అవార్డ్స్' కార్యక్రమంలో జీఎస్టీ రేట్లు, శ్లాబులను హేతుబద్ధీకరించాల్సిన సమయం ఆసన్నమైందా అనే ప్రశ్నకు, నిర్మలా సీతారామన్ సమాధానమిస్తూ.. ఆ పని దాదాపు ముగింపు దశకు చేరుకుందని అన్నారు.స్టాక్ మార్కెట్ అస్థిరతకు కారణాలు, మార్కెట్లు మరింత ప్రశాంతంగా ఉండటానికి మార్గం ఎలా ఉందనే ప్రశ్నకు సీతారామన్ స్పందిస్తూ.. మీరు అడిగే ప్రశ్నలు.. ప్రపంచం ప్రశాంతంగా ఉంటుందా?, యుద్ధాలు ముగుస్తాయా?, ఎర్ర సముద్రం సురక్షితంగా ఉంటుందా?, సముద్ర దొంగలు ఉండరా అన్నట్లు ఉన్నాయి. ఇలాంటి ప్రశ్నలకు మీరు, నేను ఖచ్చితమైన సమాధానం చెప్పగలమా? అని అన్నారు.ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా తగ్గింపుపై సీతారామన్ మాట్లాడుతూ.. ప్రజల వాటాను పెంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎక్కువ మంది రిటైల్ పెట్టుబడిదారులు ఉండాలని తాము కోరుకుంటున్నట్లు సీతారామన్ స్పష్టం చేశారు.ఇదీ చదవండి: ప్రపంచ కుబేరుడితో నాల్గవ బిడ్డకు జన్మనిచ్చింది: ఎవరీ షివోన్ జిలిస్? -
మందగమనంలోకి అమెరికా!
వాషింగ్టన్: తీవ్ర అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి అడుగుపెట్టొచ్చని ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ అభిప్రాయపడ్డారు. వినియోగదారుల వ్యయంలో మందగమనం సంభవించే అవకాశముందని, ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులపై తీవ్ర అనిశ్చితి కొన సాగుతోందని వ్యాపార వర్గాల్లో అంచనాలు నెలకొన్నాయి. ఈ వార్తల నేపథ్యంలో ఫెడ్ చైర్మన్ వ్యా ఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో జరిగిన ఆర్థిక ఫోరంలో ఆయన చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు. → కొత్త ట్రంప్ ప్రభుత్వ విధానాలు ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అన్న అంశంపై స్పష్టత వచ్చే వరకు ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించడంలో ఏ మాత్రం తొందరపడబోదు. → కొత్త ప్రభుత్వం 4 ప్రధాన రంగాల్లో గణనీయమైన విధాన మార్పులను అమలు చేసే ప్రక్రియలో ఉంది. వాణిజ్యం, వలస, ద్రవ్య, నియంత్రణ విధానాల్లో మార్పులు చోటుచేసుకునే వీలుంది. ఈ మార్పులు, వాటి ప్రభావాలపై అనిశ్చితి తీవ్రంగా ఉంది. → పరిస్థితులు ఎలా మారుతున్నాయో అర్థం చేసుకోవడంపై మేము దృష్టి సారిస్తాము. మేము తొందరపడాల్సిన అవసరం లేదు. స్పష్టత కోసం ఎదురుచూడడానికే మేము మొగ్గు చూపిస్తాము. → ఆర్థిక వ్యవస్థ పటిష్ట స్థితిలో ఉంది. అయితే చోటుచేసుకుంటున్న పరిణామాలు భవిష్యత్తులో వ్యయాలు, అలాగే పెట్టుబడులపై ఎలా ప్రభావం చూపుతాయో వేచి చూడాలి. → కీలక సూచీలు స్థిరంగానే ఉన్నాయని. అయితే ద్రవ్యోల్బణం విషయంలో ఇంకా అస్పష్టత కొనసాగుతోంది. ఉపాధి కల్పనలో మాత్రం వృద్ధి ధోరణి కొనసాగుతోంది. → ద్రవ్యోల్బణం అంచనాలను మించిన వేగంతో తగ్గినా లేదా ఆర్థిక వ్యవస్థ బలహీనపడినా ద్రవ్య విధానంలో అవసరమైన మార్పులు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. → ఫిబ్రవరి నెలలో అమెరికా ప్రభుత్వం 1,51,000 ఉద్యోగాల వృద్ధిని నమోదుచేసింది. అయితే సెపె్టంబర్ నుంచి చూస్తే నెలకు సగ టున 1,91,000 ఉద్యోగ కల్పన జరుగుతోంది. మార్కెట్లపై ప్రతికూలతలు.. ట్రంప్ ప్రభుత్వం మెక్సికో, కెనడా వంటి ప్రధాన వ్యాపార భాగస్వాములపై భారీ దిగుమతి సుంకాలను ప్రకటించడం, అలాగే చైనా నుండి దిగుమతులపై సుంకాలను రెట్టింపు చేయడం వంటి పరిణామాలు మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో ఫెడరల్ రిజర్వ్ మార్చి 18–19 తేదీల్లో జరిపే తన పాలసీ సమావేశంలో 4.25%–4.50% శ్రేణిలో వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచే అవకాశం ఉంది. పాలసీ నిర్ణేతలు ఆవిష్కరించే కొత్త ఆర్థిక అంచనాలు.. ట్రంప్ ప్రభుత్వ తొలి రెండు నెలల విధానాలు, ఇవి ద్రవ్యోల్బణం, ఉపాధి, ఆర్థిక వృద్ధి, వడ్డీ రేట్ల మార్గాన్ని ఎలా ప్రభావితం చేశాయనే అంశంపై స్పష్టత నిచ్చే అవకాశం ఉంది. కాగా, మార్కెట్లో పెట్టుబడిదారులు ప్రస్తుతం అమెరికా ఆర్థిక వ్యవస్థలో మాంద్యం సంభవించే అవకాశం ఎక్కువగా ఉందని భావిస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఫెడ్ మూడు దఫాలుగా పావు శాతం (మొత్తం 0.75%) చొప్పున రేటు కోతలు ఉండే అవకాశం ఉందని భావిస్తుండడం గమనార్హం. -
2025 ఆర్థిక సంవత్సరంలో గోధుమల దిగుమతి ఎంతంటే..
ఆహార ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించేందుకు భారత ప్రభుత్వం 2025 ఆర్థిక సంవత్సరం(ఏప్రిల్1, 2024 నుంచి మార్కి 31, 2025)లో మూడు మిలియన్ టన్నుల (ఎంటీ) గోధుమలను బహిరంగ మార్కెట్ నుంచి దిగుమతి చేసుకుంది. ఆహార ధాన్యాల నిల్వల నిర్వహణ, మార్కెట్లో ఆహార ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ప్రభుత్వ వ్యూహంలో భాగంగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) ఈ చర్యలను అమలు చేసినట్లు మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇటీవల కాలం వరకు మిగులు గోధుమ నిల్వలను బహిరంగ మార్కెట్లో విక్రయించారు. ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ (ఓఎంఎస్ఎస్) కింద 2024 ఆర్థిక సంవత్సరంలో బల్క్ కొనుగోలుదారులకు రికార్డు స్థాయిలో 10 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని విక్రయించడం విశేషం.లభ్యత తగ్గుదల2023-24 పంట సంవత్సరానికి భారతదేశ గోధుమ ఉత్పత్తి 113.29 మెట్రిక్ టన్నులుగా అంచనా వేశారు. ఇది బలమైన సరఫరాను నిర్ధారిస్తుంది. అయితే మిగులు నిల్వలను మార్కెట్ డిమాండ్లతో సమతుల్యం చేసేందుకు ప్రభుత్వం గతంలో సవాళ్లు ఎదుర్కొంది. కానీ ఇటీవల దేశీయ గోధుమల లభ్యత తగ్గిపోవడంతో దిగుమతులపై ఆధారపడుతుంది. 2025 ఆర్థిక సంవత్సరంలో మూడు మూడు మెట్రిక్ టన్నుల గోధుమలను దిగుమతి చేసుకోవడం ద్వారా తక్కువ కాలంలో ధాన్యం లభ్యతను మెరుగుపరచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.వేలంలో తగ్గిన ధరలుబల్క్ కొనుగోలుదారులు, ప్రాసెసర్లకు ధాన్యాన్ని విక్రయించడానికి ఇటీవల నిర్వహించిన వీక్లీ ఆక్షన్లో ఎఫ్సీఐ 0.49 మెట్రిక్ టన్నుల గోధుమలను విక్రయించింది. అంతకుముందు వారంకంటే క్వింటాలుకు కనీసం రూ.200 తక్కువకు అమ్ముడయ్యాయని వాణిజ్య వర్గాలు తెలిపాయి. కొత్త మార్కెటింగ్ సీజన్ (2025-26) కోసం మధ్యప్రదేశ్లో మార్చి 15న సేకరణ కార్యకలాపాలు ప్రారంభంకానున్నందున వీక్లీ ఇ-ఆక్షన్ కొనసాగే అవకాశం లేదని వర్గాలు తెలిపాయి. అయినప్పటికీ అధికారికంగా ఎఫ్సీఐ, రాష్ట్ర ఏజెన్సీలు పంజాబ్, హరియాణా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్తో సహా ఇతర రాష్ట్రాల్లో ఏప్రిల్ 1 నుంచి రైతుల ద్వారా కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కు గోధుమలను కొనుగోలు చేయనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లోని మండీలకు తాజా పంట రావడం ప్రారంభమైందని, ఇది సరఫరాను పెంచుతుందని తెలిపాయి.బఫర్ కంటే అధికంగానే నిల్వలుగతేడాది ఏప్రిల్ 1న ఎఫ్సీఐ వద్ద 7.46 మెట్రిక్ టన్నుల గోధుమలు నిల్వ ఉండగా, ఈసారి 13.55 మెట్రిక్ టన్నుల వరకు నిల్వలు ఉన్నాయి. పరిశ్రమ అంచనాల ప్రకారం గోధుమ నిల్వలు ఈ ఏడాది ఏప్రిల్ 1న 10-11 మెట్రిక్ టన్నుల మధ్య ఉండే అవకాశం ఉంది. ఇది బఫర్ కంటే కొంచెం ఎక్కువగా ఉంది. 2024-25 సీజన్లో కేంద్రం ప్రకటించిన ఎంఎస్పీ క్వింటాలుకు రూ.2425 కంటే మధ్యప్రదేశ్, రాజస్థాన్లో క్వింటాలుకు రూ.125 బోనస్ ప్రకటించించారు. దాంతో రాబోయే రెండు వారాల్లో పంట రాబడి పుంజుకున్న తర్వాత మండీ ధరలు క్వింటాలుకు రూ.2600 వరకు ఉండే అవకాశం ఉందని వ్యాపారులు తెలిపారు.ఈసారి సేకరణ ఇలా..2025-26 రబీ మార్కెటింగ్ సీజన్ (ఏప్రిల్-జూన్)లో ఏజెన్సీల ద్వారా గోధుమల సేకరణ 31 మెట్రిక్ టన్నులుగా ఉంటుందని ఆహార మంత్రిత్వ శాఖ గత వారం అంచనా వేసింది. ఇది 2024-25 మార్కెటింగ్ సీజన్లో వాస్తవ కొనుగోలు 26.6 మెట్రిక్ టన్నులతో పోలిస్తే 26 శాతం అధికంగా ఉంది. 2021-22 సీజన్లో రికార్డు స్థాయిలో 43.3 మెట్రిక్ టన్నుల సేకరణను సాధించిన తరువాత ఎంఎస్పీ, తక్కువ ఉత్పత్తి కారణంగా 2022-23 సీజన్లో రికార్డు స్థాయిలో 18.8 మెట్రిక్ టన్నులకు పడిపోయాయి. అయితే 2023-24 సీజన్లో ఇది 40 శాతం పెరిగి 26.2 మెట్రిక్ టన్నులకు చేరుకుంది.ఇదీ చదవండి: 61 ఏళ్ల వయసులో నీతా అంబానీ ఫిటెనెస్ సీక్రెట్ ఇదే..2023-24 పంట సంవత్సరంలో గోధుమ ఉత్పత్తి 113.29 మెట్రిక్ టన్నులుగా అంచనా వేసినట్లు వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రాసెసింగ్ పరిశ్రమ అంచనాల ప్రకారం ప్రస్తుత పంట సంవత్సరంలో (2024-25) గోధుమ ఉత్పత్తి 110 మెట్రిక్ టన్నులుగా అంచనా వేశారు. ప్రస్తుత మార్కెటింగ్ సంవత్సరానికి (2024-25) ఎంఎస్పీ క్వింటాలుకు రూ.2,275 ఉంది. -
100 గిగావాట్ల అణువిద్యుత్కు రోడ్ మ్యాప్
భారత్ 100 గిగావాట్ల అణువిద్యుత్ సామర్థ్యం లక్ష్యాన్ని సాధించడానికి న్యూక్లియర్ ఎనర్జీ మిషన్(Nuclear Energy Mission) ద్వారా సమగ్ర రోడ్ మ్యాప్ను సిద్ధం చేస్తోంది. 2070 నాటికి నికర జీరో కర్బన ఉద్గారాలను సాధించాలనే దీర్ఘకాలిక లక్ష్యానికి అనుగుణంగా ఈ చర్యలకు పూనుకుంది. దేశీయంగా పెరుగుతున్న ఇంధన డిమాండ్లను పరిష్కరించడానికి మార్చి చివరి నాటికి న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ ద్వారా సమగ్ర రోడ్ మ్యాప్ను అధికారికంగా వెల్లడిస్తారని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ ఏర్పాటుఅణుశక్తి విభాగం, విద్యుత్ మంత్రిత్వ శాఖ అధికారులు, ఇతర కీలక భాగస్వాములతో కూడిన ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ ఈ రోడ్ మ్యాప్ను రూపొందిస్తోంది. భారత్ అణుశక్తి సామర్థ్యాన్ని పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించే బాధ్యతను ఈ కమిటీకి అప్పగించారు. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ల (SMR-చిన్న అణువిద్యుత్ కేంద్రాలు) అభివృద్ధి, దేశీయ, అంతర్జాతీయ భాగస్వాములతో జాయింట్ వెంచర్లను ప్రోత్సహించడం ఇందులో ప్రధానాంశాలుగా ఉండనున్నాయి. ఎస్ఎంఆర్లను అధిక విద్యుత్ డిమాండ్ ఉన్న మారుమూల ప్రాంతాలు, పారిశ్రామిక మండలాల్లో సులువుగా ఏర్పాటు చేయవచ్చు. ఇది భారతదేశ ఇంధన అవసరాలకు సరళమైన, సమర్థవంతమైన పరిష్కారాన్ని అందిస్తుంది. 2033 నాటికి కనీసం ఐదు స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఎస్ఎంఆర్లను అమలు చేసేందుకు పరిశోధన, అభివృద్ధి(ఆర్అండ్డీ)కి ప్రభుత్వం రూ.20,000 కోట్లు కేటాయించింది.ఇంధన డిమాండ్కు పరిష్కారం..పట్టణీకరణ వేగంగా విస్తరించడం, పారిశ్రామిక వృద్ధి, డిజిటల్ ఎకానమీ కారణంగా 2047 నాటికి భారత విద్యుత్ డిమాండ్ నాలుగైదు రెట్లు పెరుగుతుందని అంచనా. సౌర, పవన విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన వనరులు విస్తరిస్తున్నప్పటికీ అవి మాత్రమే మొత్తం విద్యుత్ అవసరాలను తీర్చలేవు. కర్బన ఉద్గారాలను తగ్గించాలనే లక్ష్యాలు ఉండడంతో థర్మల్ పవర్ను క్రమంగా తగ్గించాలనే ప్రతిపాదనలున్నాయి. అందుకు ప్రత్యామ్నాయంగా అణుశక్తి ఈ అంతరాన్ని పూడ్చడంలో కీలక పాత్ర పోషించనుంది.ఇదీ చదవండి: భారత్లో టెస్లా తొలి షోరూమ్.. ఎక్కడంటే..ఇంధన సామర్థ్యాన్ని పెంచేందుకు జాయింట్ వెంచర్లను కూడా ఏర్పాటు చేయాలని ఈ రోడ్ మ్యాప్ నొక్కి చెప్పే అవకాశం ఉంది. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్పీసీఐఎల్) వంటి ప్రభుత్వ రంగ సంస్థలు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడులను తీసుకురావడానికి ప్రైవేటు సంస్థలు, అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేయాలని భావిస్తున్నాయి. ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని పెంచేందుకు వీలుగా అణుశక్తి చట్టం, సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ చట్టానికి చట్టపరమైన సవరణలు చేయాలని అధికారులు భావిస్తున్నారు.సుస్థిరత దిశగా అడుగులుప్రభుత్వం చేపడుతున్న ఈ చర్యలు కేవలం ఇంధన డిమాండ్లను తీర్చడం మాత్రమే కాదు.. భారతదేశం సుస్థిరత లక్ష్యాలకు మూలస్తంభంగా నిలువనున్నాయి. అణు ఇంధన తయారీ ఏర్పాట్లను విస్తరించడం ద్వారా శిలాజ ఇంధనాలపై ఆధారపడడం తగ్గించవచ్చు. గ్రీన్ హౌస్ ఉద్గారాలను నియంత్రించవచ్చు. భవిష్యత్ తరాలకు ఇంధన భద్రతను కల్పించవచ్చు. పెరుగుతున్న డిమాండ్కు సరిపడా ఇంధన అవరాలను తీర్చుకోవచ్చు. -
ఇంజినీరింగ్ ఎగుమతుల జోరు
కోల్కతా: జనవరి నెలలో ఇంజినీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు 7 శాతం పెరిగి 9.42 బిలియన్ డాలర్లుగా (రూ.82వేల కోట్లు) ఉన్నట్టు ‘ఇంజినీరింగ్ ఎగుమతుల ప్రోత్సాహక మండలి’ (ఈఈపీసీ) ప్రకటించింది. ముఖ్యంగా అమెరికాకు 18 శాతం అధికంగా 1.62 బిలియన్ డాలర్ల (రూ.14వేల కోట్లు) విలువైన ఇంజినీరింగ్ ఎగుమతులు జరిగినట్టు తెలిపింది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024 ఏప్రిల్ నుంచి 2025 జనవరి మధ్య కాలంలో మొత్తం ఇంజినీరింగ్ ఎగుమతులు క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చి చూస్తే 10 శాతం ఎగసి 97 బిలియన్ డాలర్లకు (రూ.8.43 లక్షల కోట్లు) చేరినట్టు ఈఈపీసీ వెల్లడించింది. ఈ కాలంలో యూఎస్కు ఇంజినీరింగ్ ఎగుమతులు 9 శాతం పెరిగి 15.60 బిలియన్ డాలర్లుగా (రూ.1.37 లక్షల కోట్లు) ఉన్నట్టు తెలిపింది. ముఖ్యంగా యూఏఈకి ఎగుమతుల్లో పటిష్ట వృద్ధి నమోదైంది. జనవరిలో 56 శాతం పెరిగి 610 మిలియన్ డాలర్లుకు చేరగా.. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జనవరి మధ్యకాలంలో చూసినా 45 శాతం ఎగసి 6.87 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు ఈఈపీసీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. జర్మనీ, మెక్సికో, టర్కీ, దక్షిణాఫ్రికా, ఫ్రాన్స్, జపాన్, నేపాల్, బంగ్లాదేశ్లకు జనవరి నెలలో ఇంజనీరింగ్ ఎగుమతులు పెరిగాయి. అదే సమయంలో యూకే, సౌదీ అరేబియా, మలేషియా, చైనా, ఇటలీ, స్పెయిన్లకు తగ్గాయి. జనవరి నెలకు దేశ మొత్తం వస్తు ఎగుమతుల్లో ఇంజినీరింగ్ ఉత్పత్తుల వాటా 25.86 శాతంగా ఉంది. ఇదీ చదవండి: టాటా డిస్ప్లే చిప్స్ వస్తున్నాయ్..సవాళ్ల మధ్య రాణించిన ఎగుమతులు..భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకుతోడు వాణిజ్య రక్షణాత్మక ధోరణులు కొనసాగుతున్న తరుణంలోనూ దేశ ఇంజినీరింగ్ రంగం ఎగుమతుల పరంగా బలమైన వృద్ధిని చూపించినట్టు ఈఈపీసీ పేర్కొంది. అయితే, అంతర్జాతీయ వాణిజ్య విధానాల్లో వస్తున్న మార్పులు దేశ వ్యాపార సంస్థలపై అసాధారణ స్థాయిలో ఒత్తిళ్లను పెంచే ప్రమాదం లేకపోలేదని ఈఈపీసీ ఇండియా ఛైర్మన్ పంకజ్ చద్దా పేర్కొన్నారు. కార్మిక శాఖ పరిధిలో పనిచేసే ఈఈపీసీ ఇండియా.. ఎగుమతులను సులభతరం చేయడంతోపాటు, ఎంఎస్ఎంఈలు ప్రమాణాలను పెంచుకోవడానికి, అంతర్జాతీయ సరఫరా వ్యవస్థతో అనుసంధానం కావడానికి సేవలు అందిస్తుంటుంది. యూఎస్ తాజా టారిఫ్లు రానున్న రోజుల్లో ఎగుమతిదారులు ఎదుర్కోనున్న సవాళ్లను తెలియజేస్తున్నట్టు ఈఈపీసీ ఛైర్మన్ చద్దా పేర్కొన్నారు. ఎగుమతిదారులు పోటీతత్వాన్ని కొనసాగించేందుకు రుణ సాయం, టెక్నాలజీ పరంగా ప్రభుత్వం నుంచి మద్దతు కొనసాగాల్సి ఉందన్నారు. -
సంపన్న భారతం!
న్యూఢిల్లీ: సంపద సృష్టి దన్నుతో దేశీయంగా కుబేరుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 2024లో 10 మిలియన్ డాలర్లకు పైగా సంపద ఉన్న వ్యక్తుల (హెచ్ఎన్డబ్ల్యూఐ) సంఖ్య 6 శాతం పెరిగి 85,698కి చేరింది. 2028 నాటికి ఇది 93,753కి చేరుతుందని అంచనా. ఇక అపర కుబేరుల్లాంటి బిలియనీర్ల సంఖ్య మరో 26 పెరిగి 191కి చేరింది. 2019లో బిలియనీర్ల సంఖ్య 7గా ఉండేది. నైట్ ఫ్రాంక్ విడుదల చేసిన ’ది వెల్త్ రిపోర్ట్ 2025’లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. హెచ్ఎన్డబ్ల్యూఐల జనాభా పెరుగుతుండటమనేది దీర్ఘకాలికంగా పటిష్టమైన ఆర్థిక వృద్ధి, పెట్టుబడులకు అవకాశాలు పెరుగుతుండటం, లగ్జరీ మార్కెట్ విస్తరిస్తుండటం తదితర అంశాలను సూచిస్తోందని నివేదిక పేర్కొంది. భారతీయ బిలియనీర్ల మొత్తం సంపద సుమారు 950 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. ఈ విషయంలో అమెరికా (5.7 ట్రిలియన్ డాలర్లు), చైనా (1.34 ట్రిలియన్ డాలర్లు) తర్వాత భారత్ మూడో స్థానంలో ఉంది. హెచ్ఎన్డబ్ల్యూఐల విషయంలో భారత్ నాలుగో స్థానంలో ఉంది. అమెరికా (9,05,413 మంది) అగ్రస్థానంలో, చైనా (4,71,634 మంది), జపాన్ (1,22,119 మంది) తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. అంతర్జాతీయంగా చూస్తే 3.7 శాతం మంది హెచ్ఎన్డబ్ల్యూఐలు భారత్లో ఉన్నారు. ‘ఎంట్రప్రెన్యూర్షిప్, కొత్త పరిశ్రమల దన్నుతో భారత్లో హెచ్ఎన్డబ్ల్యూఐల సంఖ్య అసాధారణంగా వృద్ధి చెందుతోంది. దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలను, ఆరి్థకంగా ఒడిదుడుకులను తట్టుకుని నిలబడగలిగే సామర్థ్యాలను దేశీయంగా పెరుగుతున్న సంపద సూచిస్తోంది’ అని నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజల్ తెలిపారు.హ్యాండ్బ్యాగ్లపై మక్కువ .. రియల్ ఎస్టేట్ నుంచి గ్లోబల్ ఈక్విటీల వరకు సంపన్నుల పెట్టుబడుల ధోరణులు కూడా మారుతున్నాయి. ఇందుకు సంబంధించిన నైట్ ఫ్రాంక్ లగ్జరీ ఇన్వెస్ట్మెంట్ ఇండెక్స్ (కేఎఫ్ఎల్ఐఐ) ప్రకారం గతేడాది అయిదు సాధనాలకు మాత్రమే డిమాండ్ నెలకొంది. అభిరుచులను బట్టి సంపన్నులు పెట్టుబడులు పెట్టే 10 సాధనాలను (లగ్జరీ కలెక్టబుల్స్) ఈ సూచీ మదింపు చేస్తుంది. దీని ప్రకారం లగ్జరీ హ్యాండ్ బ్యాగ్ల ధరలు 2.8 శాతం పెరగ్గా, ఆభరణాలు 2.3 శాతం, నాణేలు 2.1 శాతం, వాచీలు 1.7 శాతం, క్లాసిక్ కార్లు 1.2 శాతం పెరిగాయి. లగ్జరీ పెట్టుబడి సాధనంగా ఉండే ఆర్ట్ ధరలు అత్యధికంగా 18.3 శాతం పడిపోయాయి. 2023లో రెండంకెల స్థాయిలో వృద్ధి చెందిన ఈ విభాగంలో ధరలు, ప్రస్తుతం కోవిడ్–19 సంక్షోభ స్థాయి కన్నా దిగువకు తగ్గిపోయాయి. ఇక వైన్ రేట్లు 9.1 శాతం, ఫరి్నచర్ ధరలు 2.8 శాతం, రంగుల డైమండ్లు 2.2 శాతం తగ్గాయి. అరుదైన విస్కీ రేట్లు 9 శాతం క్షీణించాయి. 2022 వేసవి నాటి గరిష్ట స్థాయి నుంచి 19.3 శాతం పడిపోయాయి. లగ్జరీ కలెక్టబుల్స్ దీర్ఘకాలంలో ఇన్వెస్టర్లకు మెరుగైన రాబడులు అందించినట్లు నైట్ ఫ్రాంక్ గ్లోబల్ హెడ్ (రీసెర్చ్) లియామ్ బెయిలీ తెలిపారు. ‘వీటిలో 2005లో 1 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టి ఉంటే, కేఎఫ్ఎల్ఐఐ ప్రకారం వాటి విలువ ప్రస్తుతం 5.4 మిలియన్ డాలర్లుగా ఉండేది. అదే మొత్తాన్ని ఎస్అండ్పీ 500లో ఇన్వెస్ట్ చేసి ఉంటే 5 మిలియన్ డాలర్లే అయ్యేది‘ అని పేర్కొన్నారు. దేశీయంగా లగ్జరీ ఇళ్లలో ఢిల్లీ టాప్.. లగ్జరీ హౌసింగ్ సెగ్మెంట్లో ఢిల్లీ, బెంగళూరులో రేట్లు గణనీయంగా పెరిగాయి. ఇందుకు సంబంధించిన ప్రైమ్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ ఇండెక్స్ (పీఐఆర్ఐ) 2023తో పోలిస్తే 2024లో 3.6 శాతం పెరిగింది. దీని ప్రకారం విలాసవంతమైన నివాస గృహాల ధరలు 6.7 శాతం పెరగడంతో అంతర్జాతీయంగా టాప్ 100 నగరాల్లో ఢిల్లీ 37వ స్థానం నుంచి 18వ స్థానానికి ఎగబాకింది. బెంగళూరు 59వ ర్యాంకు నుంచి 40వ ర్యాంకుకు పెరగ్గా, ముంబై మాత్రం 13 ర్యాంకులు తగ్గి 21 స్థానానికి పడిపోయింది. అంతర్జాతీయ స్థాయిలో 18.4 శాతం రేట్ల వృద్ధితో సియోల్ అగ్రస్థానంలోనూ, మనీలా (17.9 శాతం), దుబాయ్ (16.9 శాతం) వరుసగా రెండు, మూడు స్థానాల్లోనూ ఉన్నాయి. మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆరి్థక వృద్ధి, లగ్జరీ ప్రాపర్టీలకు డిమాండ్ దన్నుతో హై–ఎండ్ రియల్ ఎస్టేట్ విభాగంలో ఈ నగరాలు ఆకర్షణీయంగా మారడాన్ని తాజా ర్యాంకులు సూచిస్తున్నట్లు బైజల్ తెలిపారు. -
బ్యాంకు ఉద్యోగుల సమ్మె.. వరుసగా నాలుగు రోజులు సెలవు
బ్యాంకు ఉద్యోగులు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సమ్మెకు దిగబోతున్నట్లు తెలిపారు. దాంతో మార్చిలో వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు మూతబడనున్నాయి. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్బీయూ) ఆధ్వర్యంలో మార్చి 24, 25 తేదీల్లో ఈ సమ్మె జరగనుండగా, మార్చి 22, 23 తేదీల్లో వారాంతపు సెలవులు ఉన్నాయి. దాంతో వరుసగా నాలుగు రోజులు సెలవులు వచ్చినట్లయింది. ఆయా తేదీల్లో బ్యాంకింగ్ సేవల కోసం వెళ్లే వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాల్సి ఉంది.సమ్మె ఎందుకంటే..తొమ్మిది బ్యాంకు యూనియన్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న యూఎఫ్బీయూ అనేక డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మెకు పిలుపునిచ్చింది.ఐదు రోజుల పని వారం: ప్రపంచ బ్యాంకింగ్ విధానాలకు అనుగుణంగా వారానికి ఐదు రోజుల పనిదినాలను ఉద్యోగులు సూచిస్తున్నారు. అయితే ప్రస్తుతం రెండు, నాలుగో శనివారం మాత్రమే సెలవు ఉంది.తగినన్ని నియామకాలు: తక్కువ సిబ్బందితో నిత్యం బ్యాంకింగ్ కార్యకలాపాలపై ఒత్తిడి పెరుగుతోంది. ఇది ఉద్యోగులపై పనిభారాన్ని పెంచుతుంది. వెంటనే తగినన్ని నియామకాలు చేపట్టాలి.భద్రతా చర్యలు: బ్యాంకు సిబ్బందిపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో మెరుగైన భద్రతా చర్యలు తీసుకోవాలి.విధాన సంస్కరణలు: పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలను, మైక్రో మేనేజ్మెంట్పై ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.ఇదీ చదవండి: నెలకు రూ.82,000 వేతనం.. ఇంటి ఖర్చులు భారం..బ్యాంకింగ్ సేవలపై ప్రభావంవరుసగా నాలుగు రోజులు బ్యాంకులు మూతపడటంతో ఖాతాదారులు తమ ఆర్థిక లావాదేవీలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని మార్కెట్ వర్గాలు సూచిస్తున్నాయి. ఏటీఎంలు, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా పని చేస్తాయని, చెక్ క్లియరెన్స్, లోన్ ప్రాసెసింగ్ వంటి కార్యకలాపాల్లో అంతరాయం ఏర్పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. -
బంగారానికి భవిష్యత్లో మరింత ఆదరణ
న్యూఢిల్లీ: పెట్టుబడులకు కీలకమైన వైవిధ్య సాధనంగా బంగారం రానున్న రోజుల్లో మరింత ప్రాధాన్యం సంతరించుకుంటుందని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు వి. అనంతనాగేశ్వరన్ అన్నారు. బంగారం విలువను కాపాడుకునే సాధనంగానే (స్టోర్ ఆఫ్ వ్యాల్యూ) కాకుండా, ఆభరణంగా, పోర్ట్ఫోలియోకి వైవిధ్యంగా నిలస్తుందన్నారు. అప్పటికి యావ్ ప్రపంచం అంతర్జాతీయంగా ఒకే మానిటరీ వ్యవస్థకు చేరుకుంటుందన్నారు. ఐజీపీసీ–ఐఐఎంఏ బంగారం మార్కెట్ల వార్షిక సదస్సులో భాగంగా నాగేశ్వరన్ మాట్లాడారు. బంగారం ధర గతేడాది 27 శాతం మేర పెరగ్గా, ఈ ఏడాది ఇప్పటికే 12 శాతం ర్యాలీ చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో నాగేశ్వరన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. విలువను కాపాడుకునే సాధనంగా బంగారం పాత్రను పలుచన చేయకుండానే, బంగారం నిల్వలను ఉత్పాదకత పెంపునకు వినియోగించడానికి మార్గాలను భారత్ కొనుగొనాల్సి ఉందన్నారు. ఇక్కడే విధానపరమైన సవాళ్లు నెలకొన్నట్టు చెప్పారు. గతంలో మాదిరి బంగారం మానిటైజేషన్ (నగదుగా మార్చుకోవడం) తరహా చర్యలను పరిశీలించాలన్నారు. 2015లో బంగారం మానిటైజేషన్ పథకాన్ని కేంద్రం ప్రకటించడం గమనార్హం. బంగారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేయడం ద్వారా దానిపై వడ్డీని పొందే పథకం అది. దిగుమతులను తగ్గించే లక్ష్యంతో కేంద్ర నాడు దీన్ని తీసుకొచి్చంది. ఆ తర్వాత కొన్నాళ్లకే మరుగునపడింది. రుణ భారం మరింత పెరిగితే కష్టమే.. నేడు ప్రపంచ రుణ భారం జీడీపీతో పోల్చితే ఎన్నో రెట్లకు పెరిగిందని అనంతనాగేశ్వరన్ తెలిపారు. ‘‘ఆ స్థాయి అధిక రుణ భారం తలనొప్పిగా మారుతుంది. భవిష్యత్ ఆదాయం వడ్డీ చెల్లింపులకే వెళుతుంది. అభివృద్ధికి పెద్దగా మిగిలేది ఉండదు. అధిక రుణ భారం నేపథ్యంలో దేశాలు ద్రవ్యోల్బణాన్ని ఉపయోగించుకుని రుణం విలువను తగ్గించుకునే ప్రయత్నం చేయొచ్చు’’అని నాగేశ్వరన్ పేర్కొన్నారు. -
ఫార్మా ఎగుమతుల్లో భారత్ జోరు
సాక్షి, బిజినెస్ బ్యూరో: జెనరిక్ ఔషధాల సరఫరాలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న భారత్.. ఎగుమతుల పరంగా కొత్త వృద్ధి శకానికి సిద్ధంగా ఉందని ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ (ఐపీఏ), మెకిన్సే అండ్ కంపెనీ నివేదిక తెలిపింది. ప్రపంచ సగటు 5 శాతం కంటే వేగంగా ఎగుమతుల్లో 9 శాతం వృద్ధి చెందుతూ కొత్తపుంతలు తొక్కుతోందని వివరించింది. ప్రపంచ ఫార్మా ఎగుమతులు 2011లో 424 బిలియన్ డాలర్ల నుంచి 2023 నాటికి 797 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. భారత్ విషయంలో ఇది 10 బిలియన్ డాలర్ల నుంచి 28 బిలియన్ డాలర్లుగా ఉందని నివేదిక వివరించింది. మౌలిక వసతులకు భారీ పెట్టుబడులు, వ్యయ నియంత్రణ చర్యలు, మెరుగైన నిర్వహణ, మొత్తం పరిశ్రమలో సామర్థ్యం పెరుగుదల ఇందుకు దోహదం చేసింది. విదేశాల్లోనూ పాగా.. భారత్ ఇప్పుడు ప్రపంచ జెనరిక్ ఔషధ డిమాండ్లో 20 శాతం సమరుస్తోంది. ఇందులో యూఎస్ జెనరిక్ ఔషధ అవసరాలలో 40 శాతం, యూకే మార్కెట్లో 25 శాతం వాటా భారత్ కైవసం చేసుకుంది. అంతర్జాతీయంగా ఎగుమతుల విషయంలో పరిమాణం పరంగా మూడవ స్థానం, విలువ పరంగా 11వ స్థానం మనదే. భారత్కు వ్రస్తాల తర్వాత సుమారు 20 బిలియన్ డాలర్లతో అత్యధిక విదేశీ మారకం సమకూరుస్తున్న విభాగం ఇదే. ప్రపంచ వ్యాక్సిన్ డిమాండ్లో 60 శాతం ఇక్కడి నుంచే సరఫరా అవుతున్నాయి. 70 శాతం యాంటీ రెట్రోవైరల్ మందులు భారత్ నుంచి వెళ్తున్నాయి. ప్రపంచ మార్కెట్తో పోలిస్తే మందుల ఉత్పత్తి సామర్థ్యం రెండింతలకుపైగా అధికమై ఏటా 8 శాతం వృద్ధి చెందుతోంది. యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్స్ (ఏపీఐ) తయారీలో భారత్ వాటా 8 శాతం ఉంది. బయోటెక్నాలజీ విభాగంలో 12వ ర్యాంకుతో పోటీపడుతోంది. ఆమోదం పొందిన బయోసిమిలర్ల సంఖ్య 2005లో 15 ఉంటే, 2023 నాటికి 138కి ఎగసింది. ఆమోదం పొందిన ఏఎన్డీఏల్లో టాపికల్స్, ఇంజెక్టేబుల్స్, నాసల్, ఆఫ్తాలి్మక్ వంటి సంక్లిష్ట డోసేజ్ల వాటా 2013లో 25 నుంచి 2023లో 30 శాతానికి చేరింది. యూఎస్ను మించిన కేంద్రాలు.. యూఎస్ఎఫ్డీఏ ఆమోదించిన తయారీ కేంద్రాల సంఖ్య భారత్లో 2024 నాటికి 752కి చేరుకుంది. సంఖ్య పరంగా యూఎస్ను మించిపోయాయి. డబ్లు్యహెచ్వో జీఎంపీ ధ్రువీకరణ అందుకున్న ప్లాంట్లు 2,050, అలాగే యూరోపియన్ డైరెక్టరేట్ ఫర్ ది క్వాలిటీ ఆఫ్ మెడిసిన్స్ (ఈడీక్యూఎం) ఆమోదం పొందిన ప్లాంట్లు 286 ఉన్నాయి. దశాబ్ద కాలంలో దేశంలో యూఎస్ఎఫ్డీఏ అధికారిక చర్య సూచించిన (ఓఏఐ) కేసులు 50 శాతం తగ్గాయి. నిబంధనల తాలూకా యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ (ఈఎంఏ) కేసులు 27 శాతం క్షీణించాయి. కారి్మక వ్యయాలు తక్కువగా ఉండడం, సామర్థ్య మెరుగుదల, డిజిటల్ స్వీకరణ కారణంగా భారత కంపెనీలు అమెరికా, యూరోపియన్ తయారీదారుల కంటే 30–35 శాతం తక్కువ ధరకే ఔషధాలను ఉత్పత్తి చేస్తున్నాయి. ప్రాధాన్య గమ్యస్థానంగా.. తక్కువ వ్యయానికే ఔషధాలు అందుబాటులో ఉండడంతో ప్రాధాన్య ఔట్సోర్సింగ్ గమ్యస్థానంగా భారత్ నిలిచింది. ఎంఆర్ఎన్ఏ, కణ, జన్యు చికిత్సలు, మోనోక్లోనల్ యాంటీబాడీస్తో సహా అభివృద్ధి చెందుతున్న చికిత్సలకు ఉపయోగించే ఔషధాలు ఏటా 13–14 శాతం పెరుగుతున్నాయి. సంప్రదాయ ఔషధ వృద్ధి రేటును ఇవి అధిగమించాయి. ఏఐ, జనరేటివ్ ఏఐ ఆధారిత పురోగతి కారణంగా అదనపు ఆదాయాన్ని 60 బిలియన్ డాలర్ల నుండి 110 బిలియన్ డాలర్లకు పెంచగలవని నివేదిక అంచనా వేసింది. మార్జిన్లను 4–7 శాతం మెరుగుపరుస్తాయని, ఉత్పాదకతను 50 శాతం పెంచగలవని వెల్లడించింది. ప్రపంచ ఫార్మా సరఫరా వ్యవస్థలో భారత పాత్రను బలోపేతం చేస్తూ తమ సామర్థ్యాలను విస్తరించుకోవడానికి అయిదు అగ్రశ్రేణి భారతీయ కాంట్రాక్ట్ అభివృద్ధి, తయారీ సంస్థలు (సీడీఎంఓలు) 650 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాయి. వెన్నంటే సవాళ్లు..ఔషధ రంగంలో భారత్ పురోగతి ఉన్నప్పటికీ.. పరిశ్రమ ఒక కీలక దశకు చేరుకున్నప్పుడు క్లిష్ట సవాళ్లను ఎదుర్కొంటుందని నివేదిక వివరించింది. డిజిటల్ పరివర్తన, స్మార్ట్ ఆటోమేషన్, కొత్త చికిత్సా విధానాల పెరుగుదల వంటి అంతరాయాలు ఔషధ కార్యకలాపాలను పునరి్నరి్మంచగలవని తెలిపింది. భౌగోళిక రాజకీయ మార్పులు, కొత్త పోకడలు, పెరుగుతున్న స్థిరత్వ డిమాండ్లు కూడా ముప్పును కలిగించే అవకాశం ఉందని వివరించింది. భారతీయ ఫార్మా కంపెనీలు పరిగణించవలసిన ఎనిమిది కీలక అంశాలలో లోపరహిత కార్యకలాపాలను సాధించడం, ఏఐ, డిజిటల్ సాధనాలను ఉపయోగించడం, ఉత్పత్తి ఖర్చులను తగ్గించడం, స్థిరత్వ ప్రయత్నాలను మెరుగుపరచడం వంటివి ఉన్నాయి. ‘దశాబ్ద కాలంలో నిర్మించిన పునాది కారణంగా భారత ఫార్మాస్యూటికల్ పరిశ్రమ నేడు బలంగా ఉంది. అంతరాయాలు ఎదురుకానున్నందున అధిక పనితీరును నడిపించడానికి, ప్రపంచ నాయకత్వాన్ని నిలబెట్టుకోవడానికి కంపెనీలు తమ నిర్వహణ విధానాలను పునరాలోచించాలి’ అని మెకిన్సే అండ్ కంపెనీ భాగస్వామి విష్ణుకాంత్ పిట్టి తెలిపారు. -
కంపెనీల బాండ్ బాజా!
ఎఫ్ఐఐల అమ్మకాలు ఆగటం లేదు. మార్కెట్లు పడిపోతున్నాయి. దీంతో చాలా కంపెనీల షేర్లు ఏడాది కనిష్టానికి వచ్చేశాయి. మిగిలిన పెట్టుబడి సాధనాల్లో... బంగారం పెరుగుతున్నా... ధరల్లో ఊగిసలాట తప్పదు. రియల్ ఎస్టేట్ అంతంత మాత్రంగానే ఉంది. బ్యాంకు డిపాజిట్లు సురక్షితమే కానీ... వడ్డీ రేట్లు తక్కువ. మరి వీటికన్నా ఎక్కువ వచ్చే ప్రభుత్వ బాండ్లు బెటరా? లేకపోతే అంతకన్నా కాస్త ఎక్కువ గిట్టుబాటయ్యే ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల బాండ్లు బెటరా? రాబోయే వారం పది రోజుల్లో పలు ప్రభుత్వ కంపెనీలు సైతం బాండ్లు జారీ చేయటానికి ముందుకొస్తున్న నేపథ్యంలో... వాటి లాభనష్టాలు, రిసు్కల గురించి తెలుసుకుందాం...వడ్డీ రేట్లు పెంచుతూ లిక్విడిటీని రిజర్వు బ్యాంకు కట్టడి చేస్తోంది. దీంతో అప్పుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సహా పలు కంపెనీలు బాండ్ల జారీకి వస్తున్నాయి. ఈ తాకిడి ఎంతలా అంటే... ఈ ఒక్కవారంలోనే కంపెనీలు రూ.30 వేల కోట్ల విలువైన బాండ్లు జారీ చేస్తున్నాయి. వీటిలో ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఇరెడా) 7.40 శాతం వడ్డీతో 11 ఏళ్ల కాలానికి రూ.820 కోట్లు సమీకరించగా... నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్హెచ్బీ) ఏడేళ్ల కాలానికి 7.35 శాతం వడ్డీ రేటుతో రూ.4,800 కోట్లు సమీకరించింది. ఇక ఆర్ఈసీ 7.99 శాతం వడ్డీతో నిరవధిక బాండ్లను జారీ చేసింది. రూ.2,000 కోట్లు సమీకరించాలనుకున్నా రూ.1,995 కోట్లే చేయగలిగింది. ఇక రాబోయే రోజుల్లో నాబార్డ్ పదేళ్ల కాలానికి రూ.7,000 కోట్లు, సిడ్బి నాలుగేళ్ల కాలానికి రూ.6,000 కోట్లు, పీఎఫ్సీ నాలుగేళ్లకు రూ.4 వేల కోట్లు సమీకరించనున్నాయి. జనవరిలో ట్రంప్ టారిఫ్ల ప్రకటన, భౌగోళిక అనిశి్చతుల నేపథ్యంలో బాండ్ మార్కెట్ భయపడింది. వడ్డీ రేట్లు పెరిగాయి. ఆర్బీఐ సైతం వడ్డీ రేట్లు పెంచి లిక్విడిటీని కట్టడి చేసింది. దీంతో ప్రభుత్వ బాండ్లపై ఈల్డ్లు (రాబడి) 0.5 శాతం వరకూ పెరిగాయి. దీంతో కార్పొరేట్లు మరింత ఎక్కువ వడ్డీని ఆఫర్ చేయాల్సి వచి్చంది. ప్రస్తుతం ప్రభుత్వ బాండ్ల ఈల్డ్ 7.1 శాతం నుంచి 7.3 శాతం మధ్య ఉండగా... ప్రైవేటు కంపెనీలు అంతకన్నా ఎక్కువ కూపన్ రేటును ఆఫర్ చేయాల్సి వస్తోంది. నిరవధిక బాండ్లు అంటే..సాధారణంగా పెర్పెట్యువల్ బాండ్లుగా పిలిచే ఈ బాండ్లకు నిర్ణీత కాలమంటూ ఏదీ ఉండదు. ఒక కంపెనీ ఈ రకమైన బాండ్లను జారీ చేస్తే... కాలపరిమితి ఉండదు కనుక ఏడాదికోసారి చొప్పున నిరవధికంగా వడ్డీని చెల్లిస్తూ పోతాయి. ఒకవేళ వాటిని బైబ్యాక్ చెయ్యాలని భావిస్తే అప్పుడు ప్రకటన ఇచి్చ... తమ బాండ్ల ప్రిన్సిపల్ మొత్తాన్ని చెల్లించి వెనక్కి తీసుకుంటాయి. అప్పటిదాకా వడ్డీ మాత్రం చెల్లిస్తుంటాయి. ప్రిన్సిపల్ మొత్తాన్ని తిరిగి పొందటానికి కాలపరిమితి ఉండదు కనుక వీటికి వడ్డీ రేటు కూడా ఎక్కువే ఉంటుంది. గమనించాల్సింది ఏంటంటే...బాండ్లలో ఇన్వెస్ట్ చేసేవారు గమనించాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే... ఆ బాండ్లకు బాగా రేటింగ్ ఉండి, చురుగ్గా ట్రేడయితేనే సెకండరీ బాండ్ మార్కెట్లో వెంటనే విక్రయించగలం. రేటింగ్ తక్కువగా ఉన్న బాండ్లయినా, నిరవధిక బాండ్లయినా విక్రయించటం అంత ఈజీ కాదు. పైపెచ్చు విక్రయించేటపుడు వాటి ధర అప్పటి వడ్డీ రేట్లపై ఆధారపడి ఉంటుంది. మీరు కొన్నపుడు వడ్డీరేట్లు తక్కువ ఉండి ఆ తరవాత పెరిగాయనుకోండి. మీ బాండ్ల ధర కూడా తగ్గుతుంది. అదే రివర్స్లో మీరు కొన్నాక వడ్డీ రేట్లు తగ్గితే.. మీ బాండ్లకు ఎక్కువ వడ్డీ వస్తుంది కనక వాటికి గిరాకీ ఉంటుంది. ఈ అంశాలు దృష్టిలో పెట్టుకుంటే బాండ్లలోనూ ఇన్వెస్ట్ చేయొచ్చు.ప్రభుత్వ సావరిన్ బాండ్లు→ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేస్తాయి కనుక చాలా తక్కువ రిస్కు ఉంటుంది. → సురక్షితం కనుక... తక్కుక వడ్డీని ఆఫర్ చేస్తాయి. కానీ బ్యాంకు డిపాజిట్లతో పోలిస్తే వడ్డీ కాస్తంత ఎక్కువ ఉంటుంది. → డిపాజిట్ల మాదిరి ఎప్పుడు కావాలంటే అప్పుడు క్యాన్సిల్ చేసుకోలేరు. కానీ బాండ్ మార్కెట్లో ట్రేడవుతాయి కనుక అప్పటి ధరకు విక్రయించుకోవచ్చు. → ఏడాదికోసారి వడ్డీ మన ఖాతాలో ఠంచనుగా పడుతుంది. ప్రైవేటు, ప్రభుత్వ కంపెనీల బాండ్లు→ కంపెనీలు తమ సొంత పూచీకత్తుపై జారీ చేస్తాయి. వాటి పనితీరుపై ఆధారపడి ఉంటాయి కనుక రిస్కు కాస్తంత ఎక్కువ. → రిస్కు ఎక్కువ కనుక ప్రభుత్వ బాండ్ల కన్నా వడ్డీ కాస్త ఎక్కువే. → వీటిని కూడా ప్రభుత్వ బాండ్ల మాదిరి ఎప్పుడు కావాలంటే అప్పుడు బాండ్ మార్కెట్లో విక్రయించుకునే అవకాశం ఉంటుంది. → వీటి రేటింగ్ను బట్టి వడ్డీ ఉంటుంది. ట్రిపుల్ ఏ బాండ్లకు కాస్త తక్కువగా... రేటింగ్ తగ్గుతున్న కొద్దీ వడ్డీ పెరిగేలా ఉంటాయి. → కాకపోతే తక్కు రేటింగ్ ఉన్న బాండ్లకు రిస్కు కూడా ఎక్కువని గమనించాలి. – సాక్షి, బిజినెస్ ప్రతినిధి -
ఉద్యోగాలు పెరుగుతున్నాయి, ప్చ్.. జీతాలే..
న్యూఢిల్లీ: దేశంలో ఉద్యోగాలు పెరుగుతున్నప్పటికీ, ద్రవ్యోల్బణానికి తగ్గట్లుగా జీతాలు మాత్రం పెరగడం లేదని నీతి ఆయోగ్ సభ్యుడు అరవింద్ విర్మానీ వ్యాఖ్యానించారు. గత ఏడేళ్లుగా ఇదే పరిస్థితి ఉందని చెప్పారు. ఇందుకు నైపుణ్యాల కొరతే ప్రధాన కారణమని తెలిపారు. అత్యధిక జనాభాను భారత్ ప్రయోజనకరమైన అంశంగా మల్చుకోవాలని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం బోధన, శిక్షణను మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉంటుందని పేర్కొన్నారు. ‘పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే డేటా ప్రకారం వర్కర్లు–జనాభా నిష్పత్తి గత ఏడేళ్లుగా పెరుగుతోంది. అంటే జనాభా వృద్ధికి మించి ఉద్యోగాల సంఖ్య పెరుగుతోంది. కాబట్టి ఉద్యోగాలు పెరగడం లేదనడం తప్పు. క్యాజువల్ వర్కర్ల వాస్తవ వేతనాలూ పెరిగాయని, వారి పరిస్థితులూ మెరుగుపడ్డాయని గణాంకాలు చెబుతున్నాయి. కానీ రెగ్యులర్ జీతాల ఉద్యోగాలే పెద్ద సమస్యగా ఉంటోంది. ఈ కేటగిరీలో ఏడేళ్లుగా ద్రవ్యోల్బణానికి తగ్గట్లుగా వాస్తవ వేతనాలు పెరగలేదు‘ అని విర్మానీ చెప్పారు. మిగతా దేశాల గణాంకాలతో పోల్చి చూసినప్పుడు, నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడంపై భారత్ మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనిపిస్తోందని తెలిపారు. జిల్లా స్థాయిలో ఫోకస్ చేయాలి.. కేంద్ర ప్రభుత్వం దీనిపై తగు చర్యలు తీసుకుంటోందని, రాష్ట్రాలు కూడా ఈ దిశగా కసరత్తు చేయాలని చెప్పారు. ఉద్యోగాల కల్పన జిల్లా స్థాయిలో జరుగుతుంది కాబట్టి అక్కడ దృష్టి పెట్టాలన్నారు. ఇప్పటికే పని చేస్తున్న వారికే కాకుండా కొత్తగా ఉద్యోగాల్లో చేరుతున్న వారికి కూడా నైపుణ్యాలు అవసరమేనని విర్మానీ చెప్పారు. ‘ఉద్యోగం, నైపుణ్యాలనేవి ఒకే నాణేనికి రెండు పార్శా్వలు. నైపుణ్యాలుంటే ఉద్యోగం దక్కించుకోవడం సులభమవుతుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే మనం అన్ని అంశాల్లోనూ మెరుగుపడాలి. అవకాశాలను అందిపుచ్చుకోవాలి‘ అని వివరించారు. -
ఫండ్స్లో ‘సిప్’ చేస్తున్నారా..?
‘‘స్మాల్, మిడ్క్యాప్లో సిప్లను ఇక నిలిపేయాల్సిన సమయం వచ్చిందని భావిస్తున్నా. ఎందుకంటే వాటి వేల్యుయేషన్లు చాలా అధిక స్థాయిలో ఉన్నాయి’’ మ్యూచువల్ ఫండ్స్లో దశాబ్దాల అనుభవం ఉన్న వెటరన్ ఫండ్ మేనేజర్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ సీఈవో ఎస్.నరేన్ తాజాగా చేసిన సంచలనాత్మక వ్యాఖ్యలు ఇవి. దీంతో స్మాల్, మిడ్క్యాప్ విభాగంలో మరింత అమ్మకాల ఒత్తిడి పెరిగిపోయింది. నరేన్ వ్యాఖ్యలు ఇన్వెస్టర్లలో ఆందోళనకు దారితీశాయి. సిప్పై సందేహాలు ఏర్పడ్డాయి. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఈక్విటీ ఫండ్స్లోకి నెలవారీ రూ.26 వేల కోట్లకు పైనే పెట్టుబడులు వస్తున్నాయి. దీర్ఘకాల ఆర్థిక లక్ష్యాలకు కావాల్సినంత సమకూర్చుకునేందుకు సిప్ మెరుగైన సాధనమన్న నిపుణుల సూచనలు, ఫండ్స్ పరిశ్రమ ప్రచారంతో ఇన్వెస్టర్లలో దీనిపై ఆకర్షణ పెరిగిపోయింది. వేతన జీవులతోపాటు హై నెట్వర్త్ ఇండివిడ్యువల్ (హెచ్ఎన్ఐలు/ధనవంతులు) సైతం సిప్కు జై కొడుతున్నారు. అన్ని కాలాలకూ అనువైన సాధనంగా సిప్ను భావిస్తుంటే, దీనిపై నరేన్ వ్యాఖ్యలు అయోమయానికి దారితీశాయి. ఈ తరుణంలో అసలు సిప్ దీర్ఘకాల లక్ష్యాల సాధనకు ఏ మేరకు ఉపకరిస్తుంది? ఇందులో ప్రతికూలతలు ఉన్నాయా? తదితర అంశాలపై నిపుణులు ఏమంటున్నారో తెలిపే కథనమిది... సిప్ అంటే..? నిర్ణిత మొత్తం, నిర్ణిత రోజులకు ఒకసారి చొప్పున ఎంపిక చేసుకున్న పథకంలో ఇన్వెస్ట్ చేయడానికి వీలు కల్పించేదే సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్). రోజు/వారం/పక్షం/నెల/మూడు నెలలకోసారి సిప్ చేసుకోవడానికి ఫండ్స్ అనుమతిస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల వద్ద 10.26 కోట్ల సిప్ ఖాతాలుంటే.. వీటి పరిధిలో జనవరి చివరికి మొత్తం రూ.13.12 లక్షల కోట్ల నిర్వహణ ఆస్తులు (ఏయూఎం) ఉన్నాయి. మొత్తం ఈక్విటీ ఫండ్స్ నిర్వహణ ఆస్తుల్లో సిప్కు సంబంధించే 40 శాతానికి పైగా ఉన్నాయి. పొదుపు–మదుపులో క్రమశిక్షణ సిప్తో నిర్బంధ పొదుపు, మదుపు సాధ్యపడుతుంది. ఇన్వెస్టర్ ప్రమేయం లేకుండా ప్రతి నెలా నిర్ణిత తేదీన నిర్ణీత మొత్తం పెట్టుబడిగా మారిపోతుంది. సిప్ కాకుండా.. ఇన్వెస్టర్ వీలు చూసుకుని ఏక మొత్తంలో పెట్టుబడి పెట్టాలంటే ఎక్కువ సందర్భాల్లో సాధ్యపడకపోవచ్చు. దీర్ఘకాల లక్ష్యాల సాధనకు కావాల్సింది క్రమశిక్షణ. అది సిప్ ద్వారా సాధ్యపడుతుంది.దీర్ఘకాలంలో సంపద సృష్టి 10 ఏళ్లలో కారు కొనుగోలు. 15–20 ఏళ్లలో పిల్లల ఉన్నత విద్య, 25 ఏళ్లకు పిల్లల వివాహాలు, అప్పటికి సొంతిల్లు.. ఇలా ముఖ్యమైన లక్ష్యాలను ప్రణాళికాబద్ధమైన పెట్టుబడులతో సాకారం చేసుకోవచ్చు. ఇలా ప్రతి లక్ష్యానికి నిర్ణీత కాలం అంటూ ఉంది. అన్నేళ్లలో అంత సమకూర్చుకునేందుకు ప్రతి నెలా, ప్రతి ఏటా ఎంత చొప్పున ఇన్వెస్ట్ చేయాలన్నది నిపుణుల సాయంతో తెలుసుకోవాలి. వారు చెప్పిన విధంగా.. మార్కెట్ అస్థిరతలను పట్టించుకోకుండా నియమబద్ధంగా సిప్ పెట్టుబడి చేసుకుంటూ వెళ్లిపోవడమే. దీనివల్ల కాంపౌండింగ్ ప్రయోజనం లభిస్తుంది. కాలాతీతం.. ఈక్విటీ మార్కెట్లు ఎప్పుడు ఎటు వైపు చలిస్తాయో ఇదమిత్థంగా ఎవరూ చెప్పలేరు. ఈ స్థాయి నుంచి ఇంకా పెరుగుతాయని, ఫలానా స్థాయి నుంచి కరెక్షన్కు వెళతాయని.. దిద్దుబాటులో ఫలానా స్థాయిల నుంచి మద్దతు తీసుకుని తిరిగి ర్యాలీ చేస్తాయని.. గమనాన్ని ఎవరూ కచి్చతంగా అంచనా వేయలేరు. మార్కెట్లు సహేతుక స్థాయిలో దిద్దుబాటుకు గురైనప్పుడు ఇన్వెస్ట్ చేస్తే అక్కడి నుంచి దీర్ఘకాలంలో పెట్టుబడిపై అద్భుత రాబడులు వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, దిద్దుబాటు సమయంలో ఎప్పుడు, ఏ స్థాయిల వద్ద ఇన్వెస్ట్ చేయాలనేది సాధారణ రిటైల్ ఇన్వెస్టర్లకు అర్థం కాని విషయం. లమ్సమ్ (ఏకమొత్తం) ఇన్వెస్ట్ చేస్తుంటే, ఒకవేళ మార్కెట్లు గరిష్టాల్లో ఆ మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టడం సరైన నిర్ణయం అనిపించుకోదు. ఎందుకంటే అక్కడి నుంచి మార్కెట్లు పతనాన్ని చూస్తే.. రాబడి చూడడానికి చాలా కాలం పట్టొచ్చు. విసిగిపోయిన ఇన్వెస్టర్ నష్టానికి తన పెట్టుబడిని వెనక్కి తీసుకునే ప్రమాదం లేకపోలేదు. ఇలాంటి సమస్యలన్నింటికీ పరిష్కారమే సిప్. మార్కెట్ ర్యాలీ చేస్తోందా? లేక పతనం అవుతోందా? అన్నదానితో సంబంధం లేదు. ఒక పథకంలో ప్రతి నెలా 1వ తేదీన రూ.5,000 ఇన్వెస్ట్ చేయాలని సిప్ దరఖాస్తు సమరి్పస్తే.. కచి్చతంగా ప్రతి నెలా అదే తేదీన బ్యాంక్ ఖాతా నుంచి ఆ మొత్తం డెబిట్ అయి పెట్టుబడి కింద మారుతుంది. దీనివల్ల కొనుగోలు వ్యయం సగటుగా మారుతుంది. ఉదాహరణకు ఎఫ్ అనే పథకంలో రూ.2,000 సిప్ చేస్తున్నారు. ఆ ఫండ్ యూనిట్ ఎన్ఏవీ 2025 జనవరి 1న రూ.40గా ఉంది. దీంతో 50 యూనిట్లు వస్తాయి. ఫిబ్రవరి 1కి కరెక్షన్ వల్ల అదే ఫండ్ ఎన్ఏవీ 34కు తగ్గింది. దీంతో 58.82 యూనిట్లు వస్తాయి. జనవరి నెల సిప్తో పోలి్చతే ఫిబ్రవరిలో దిద్దుబాటు వల్ల 8.82 యూనిట్లు అదనంగా వచ్చాయి. మార్చి1న ఫండ్ యూనిట్ ఎన్ఏవీ ఇంకా తగ్గి రూ.32కు దిగొస్తే.. అప్పుడు 62.5 యూనిట్లు వస్తాయి. ఈక్విటీ విలువల్లో మార్పులకు అనుగుణంగా ఫండ్ ఎన్ఏవీ మారుతుంటుంది. దీనికి అనుగుణంగా సిప్ కొనుగోలు సగటు ధర తగ్గుతుంది. దీనివల్ల 10–15–20 ఏళ్లు అంతకుమించిన కాలాల్లో మంచి రాబడులకు అవకాశం ఉంటుందని గత చరిత్ర చెబుతోంది.స్వల్ప మొత్తం... చాలా పథకాల్లో ఏకమొత్తంలో పెట్టుబడి పెట్టాలంటే కనీసం రూ.5,000 అవసరం, కొన్ని పథకాలకు ఇది రూ.1,000గా ఉంది. అదే సిప్ రూపంలో అయితే రూ.500 స్వల్ప మొత్తంతో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఇటీవలే రూ.250 సిప్ను (జన్నివే‹Ù) ప్రారంభించింది. రోజువారీ/వారం వారీ అయితే రూ.100 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.కేవలం ఈక్విటీలకేనా..? సిప్ ప్రయోజనం ఎక్కువగా ఈక్విటీ పెట్టుబడులపైనే లభిస్తుంది. డెట్ పెట్టుబడులపై రాబడి వడ్డీ రేట్లపై ఆధారపడి ఉంటుంది. ఈ వడ్డీ రేట్లు ఈక్విటీలంత చంచలంగా ఉండవు. నిర్ణిత సైకిల్ ప్రకారం రేట్లు చలిస్తుంటాయి. డెట్ ఫండ్స్లోనూ సిప్ చేసుకోవచ్చు. దీనివల్ల ఈక్విటీల మాదిరి అస్థిరతలను అధిగమించి, రాబడులు పెంచుకునే ప్రత్యేక ప్రయోజనం ఉండదు. డెట్, ఈక్విటీ కలయికతో కూడిన హైబ్రిడ్ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్, గోల్డ్ ఫండ్స్లో సిప్తో మెరుగైన ప్రతిఫలం పొందొచ్చు. సౌలభ్యం.. సిప్ కోసం సమ్మతి తెలిపామంటే.. కచి్చతంగా పెట్టుబడి పెట్టి తీరాలనేమీ లేదు. వీలు కానప్పుడు, లేదా పథకం పనితీరు ఆశించిన విధంగా లేనప్పుడు ఆ సిప్ను నిలిపివేసే స్వేచ్ఛ, వెసులుబాటు ఇన్వెస్టర్లకు ఎప్పుడూ ఉంటుంది. మార్కెట్తో ముడిపడి.. ప్రతి నెలా రూ.1,000 చొప్పున గత ఐదేళ్లలో రూ.60 వేలు ఈక్విటీ ఫండ్లో ఇన్వెస్ట్ చేశారని అనుకుందాం. ఏటా 15 శాతం కాంపౌండెడ్ రాబడి వస్తే ఐదేళ్లకు ఆ మొత్తం రూ.90 వేలకు చేరుతుంది. సరిగ్గా ఆ సమయంలో మార్కెట్ 25 శాతం పడిపోయిందనుకుంటే.. రూ.90 వేల పెట్టుబడి కాస్తా.. రూ.67,500కు తగ్గుతుంది. నికర రాబడి రూ.7,500కు తగ్గిపోతుంది. దీంతో వచ్చే వార్షిక కాంపౌండెడ్ రాబడి 4.5 శాతమే. డెట్ సెక్యూరిటీల కంటే తక్కువ. చారిత్రక డేటాను పరిశీలిస్తే లార్జ్క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లోనూ పలు సందర్భాల్లో ఐదేళ్ల సిప్ రాబడులు 5 శాతం కాంపౌండెడ్గానే (సీఏజీఆర్) ఉన్నట్టు తెలుస్తుంది. ప్రతికూల రాబడులు వచి్చన సందర్భాలూ ఉన్నాయి. అదే మిడ్, స్మాల్క్యాప్ పెట్టుబడులపై ఈ ప్రభావం ఇంకా అధికంగా ఉంటుంది.అనుకూలం/అననుకూలం→ 10 ఏళ్లు అంతకుమించిన కాలానికి, అవసరమైతే 20 ఏళ్లపాటు పెట్టుబడిని కొనసాగించే వెసులుబాటు ఉన్న వారికే సిప్ అనుకూలం. → అధిక రిస్క్ తీసుకునే వారే మిడ్, స్మాల్ క్యాప్లో సిప్ చేసుకోవాలి. → సిప్తో సగటు కొనుగోలు ధర తగ్గుతుందన్నది సాధారణంగా చెప్పే భాష్యం. కానీ, ఈక్విటీలు కొంత కాలం పాటు భారీ దిద్దుబాటు అన్నదే లేకుండా అదే పనిగా ర్యాలీ చేస్తూ వెళ్లి.. అక్కడి నుంచి భారీ పతనంతో కొన్నేళ్లపాటు బేర్ గుప్పిట కొనసాగితే రాబడులు కళ్లజూసేందుకు కొన్నేళ్లపాటు వేచి చూడాల్సి రావచ్చు. → సిప్ మొదలు పెట్టిన తర్వాత మార్కెట్లు కుదేలైతే.. పెట్టుబడి విలువ క్షీణతను ఎంత వరకు భరించగలరు? అని ప్రశి్నంచుకోవాలి. 50–60 శాతం పడిపోయినా ఓపిక వహించే వారికే అనుకూలం. → ‘ఈక్విటీ పెట్టుబడులు సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్’ అన్న హెచ్చరికను కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. మార్కెట్ల పనితీరు మెరుగ్గా ఉంటేనే సిప్పై మెరుగైన రాబడి వస్తుంది. అంతేకానీ సిప్పై లాభానికి గ్యారంటీ లేదు.అధిక రాబడులు ఎలా ఒడిసిపట్టాలి..? సిప్ చేస్తూనే.. మార్కెట్ పతనాల్లో పెట్టుబడిని రెట్టింపు చేయాలి. ఉదాహరణకు ప్రతి నెలా రూ.5,000 సిప్ చేస్తుంటే.. మార్కెట్ దిద్దుబాటు సమయంలో రూ.10,000 చొప్పున ఇన్వెస్ట్ చేయాలి. దిద్దుబాటు ముగిసి, బుల్ ర్యాలీ మొదలైన తర్వాత అదనపు సిప్ను నిలిపివేసుకోవచ్చు. 10 ఏళ్లకు మించిన సిప్ పెట్టుబడులపై రాబడిని స్వల్ప స్థాయి కరెక్షన్లు తుడిచి పెట్టేయలేవు. అదే 15–20 ఏళ్లు, అంతకుమించిన దీర్ఘకాలంలో రాబడులు మరింత దృఢంగా ఉంటాయి. ఒకవేళ పెట్టుబడిని ఉపసంహరించుకునే సమయంలో మార్కెట్ కరెక్షన్లోకి వెళితే, తిరిగి కోలుకునే వరకు లక్ష్యాన్ని వాయిదా వేసుకోవడమే మార్గం. ఇలాంటి పరిస్థితిని నివారించాలంటే.. ఆర్థిక లక్ష్యానికి రెండేళ్ల ముందు నుంచే క్రమంగా సిప్ పెట్టుబడులను విక్రయిస్తూ డెట్లోకి పెట్టుబడులు మళ్లించాలి. చివరి మూడేళ్ల పాటు ఈక్విటీ పథకంలో కాకుండా డెట్ ఫండ్లో సిప్ చేసుకోవాలి. ప్రత్యామ్నాయాలు.. పెట్టుబడులు అన్నింటినీ ఈక్విటీలకు కేటాయించుకోకూడదు. ఈక్విటీ, డెట్, బంగారం, రీట్, ఇని్వట్లతో కూడిన పోర్ట్ఫోలియో ఉండాలి. ఈక్విటీ ఫండ్స్, డెట్ ఫండ్స్, గోల్డ్ ఫండ్స్లో వేర్వేరుగా పెట్టుబడి పెట్టుకోవాలి. ఆర్థిక ప్రతికూల పరిస్థితుల్లో పెట్టుబడుల ఉపసంహరణ అవసరమైతే ఈక్విటీ పెట్టుబడులను కదపకుండా.. డెట్, గోల్డ్ తదితర ఫండ్స్ నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకోవచ్చు. సిప్ ఎప్పుడు స్టాప్ చేయాలి? → ఒక పథకం గతంలో మెరుగైన రాబడి ఇచి్చందని అందులో ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తుంటారు. భవిష్యత్తులోనూ అదే స్థాయి రాబడిని ఆ పథకం నుంచి ఆశిస్తుంటారు. ఒక పథకం 3, 5, 10 ఏళ్లలో సగటున మెరుగైన ప్రతిఫలం ఇచ్చి ఉండొచ్చు. కానీ ఆయా కాలాలను మరింత లోతుగా విశ్లేషిస్తే మధ్యలో ఒక్కో ఏడాది తక్కువ, ప్రతికూల రాబడులు ఇచి్చన సందర్భాలూ ఉంటాయి. సిప్ మొదలు పెట్టిన తొలి ఏడాదే రాబడిని ఆశించడం అన్ని వేళలా అనుకూలం కాదు. కనీసం రెండు మూడేళ్లకు గానీ పథకం అసలు పనితీరు విశ్లేషణకు అందదు. అందుకే ఒక పథకం ఎంపిక చేసుకునే ముందు.. ఆ విభాగంలోని ఇతర పథకాలతో పోల్చి చూసినప్పుడు రాబడి మెరుగ్గా ఉందా? కనీసం సమానంగా అయినా ఉందా అన్నది నిర్ధారించుకోవాలి. → ఒక ఫండ్ మేనేజర్ పనితీరు నచ్చి పథకంలో సిప్ చేయడం మొదలు పెట్టారు. తర్వాతి కాలంలో ఆ మేనేజర్ మరో సంస్థకు మారిపోయారు. అప్పుడు కొత్తగా వచ్చిన ఫండ్ మేనేజర్ చరిత్రను ట్రాక్ చేయాలి. → పై రెండు ఉదాహరణల్లోనూ పథకం పనితీరు ఆశించిన విధంగా లేకపోతే సిప్ నిలిపివేయొచ్చు. ప్రతికూల రాబడులు ఇటీవలి మార్కెట్ పతనంతో 26 స్మాల్క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో ఏడాది కాల సిప్ పెట్టుబడులపై రాబడి ప్రతికూలంగా మారింది. అంటే నికర నష్టంలోకి వెళ్లింది. క్వాంట్ స్మాల్క్యాప్ ఫండ్లో సిప్ పెట్టుబడిపై ఎక్స్ఐఆర్ఆర్ (రాబడి) మైనస్ 22.45 శాతంగా మారింది. మహీంద్రా మాన్యులైఫ్ స్మాల్క్యాప్ ఫండ్లో మైనస్ 21.84 శాతంగా మారింది. ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్ కంపెనీస్ ఫండ్ ఎక్స్ఐఆర్ఆర్ మైనస్ 18.25 శాతంగా ఉంది. ఇవే పథకాలు రెండేళ్లు, మూడేళ్లు, ఐదేళ్ల సిప్లపై డబుల్ డిజిట్ రాబడులు అందించడం గమనార్హం. దశాబ్దాల పాటు కుదేలైతే..? జపాన్ ‘నికాయ్ 225’ ఇండెక్స్ 1989 డిసెంబర్లో చూసిన 38,271 గరిష్ట స్థాయి నుంచి 2009 ఫిబ్రవరిలో 7,416 కనిష్ట స్థాయికి పతనమైంది. నెమ్మదిగా కోలుకుంటూ 35 ఏళ్ల తర్వాత.. 2024 మార్చిలో తిరిగి 1989 నాటి గరిష్ట స్థాయిని అధిగమించింది. రియల్ ఎస్టేట్ బబుల్ బద్దలు కావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. 1989 డిసెంబర్ నాటి ముందు వరకు సిప్ లేదా లమ్సమ్ రూపంలో జపాన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకుని, దీర్ఘకాలం పాటు వేచి చూసే అవకాశం లేని వారు.. ఆ తర్వాత నష్టానికి అమ్ముకోవాల్సిన పరిస్థితిలో ఉండిపోయారు. స్టాక్ మార్కెట్ ర్యాలీ ఆర్థిక వృద్ధిపైనే ఆధారపడి ఉంటుంది. జపాన్ ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలం పాటు స్తబ్దుగా కొనసాగడం వల్లే ఇన్నేళ్లపాటు అక్కడి మార్కెట్ ర్యాలీ చేయలేదు. ప్రస్తుతం చైనాలోనూ ఇలాంటి వాతావరణమే నడుస్తోంది. అలాంటి పరిస్థితులు భారత్ మాదిరి వర్ధమాన దేశాలకు అరుదు. నరేన్ ఏం చెబుతున్నారు? అర్థం, పర్థం లేని అధిక విలువలకు చేరిన అస్సెట్ క్లాస్లో (అది స్మాల్ లేదా మిడ్ లేదా మరొకటి అయినా) ఇన్వెస్ట్ చేస్తే ఆ తర్వాత కొన్నేళ్ల పాటు ఆ సిప్లపై రాబడి రాదన్నది నరేన్ విశ్లేషణగా ఉంది. ఇందుకు 2006 నుంచి 2013 మధ్య కాలాన్ని ప్రస్తావించారు. ఆ కాలంలో స్మాల్, మిడ్క్యాప్ ఫండ్స్లో సిప్ చేసిన వారికి ఎలాంటి రాబడులు రాలేదని చెప్పారు. కనీసం 20 ఏళ్లపాటు తమ పెట్టుబడులను కొనసాగించే వారికే స్మాల్, మిడ్క్యాప్ పెట్టుబడులకు మంచి వేదికలు అవుతాయన్నారు. అంతకాలం పాటు ఆగలేని వారికి మల్టిక్యాప్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్ లేదా మల్టీ అస్సెట్ ఫండ్స్ అనుకూలమని చెప్పారు. నరేన్ అభిప్రాయాలతో ఎడెల్వీజ్ మ్యూచువల్ ఫండ్ సీఈవో రాధికా గుప్తా విభేధించారు. ‘‘2006 గరిష్టాల నుంచి 2013 కనిష్టాల మధ్య రాబడులను చూస్తే అంత మంచిగా కనిపించవు. కానీ, మార్కెట్లో అలాంటివి సాధారణమే. మార్కెట్లో సంపద సృష్టి జరగాలంటే కనీసం 10 ఏళ్లు అంతకుమించిన కాలానికి సిప్ ద్వారా పెట్టుబడి పెట్టుకోవడం అవసరం’’ అని రాధికా గుప్తా సూచించారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
జనంలో రూ.2000 నోట్లు.. ఇంకా అన్ని ఉన్నాయా?
ముంబై: ఉపసంహరించిన రూ.2000 నోట్లలో ఇప్పటి వరకు 98.18 శాతం తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థకు చేరాయి. ప్రజల వద్ద ఇంకా రూ.6,471 కోట్ల విలువైన నోట్లు ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శనివారం తెలిపింది.2023 మే 19న ఆర్బీఐ రూ.2000 నోట్లను చెలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించింది. ఆనాడు చలామణిలో ఉన్న రూ.2000 నోట్ల మొత్తం విలువ రూ.3.56 లక్షల కోట్లు. 2025 ఫిబ్రవరి 28 నాటికి ఈ విలువ రూ.6,471 కోట్లకు వచ్చి చేరిందని ఆర్బీఐ పేర్కొంది.ఆర్బీఐ కరెన్సీ కార్యకలాపాలను నిర్వహిస్తున్న 19 ఇష్యూ కార్యాలయాల్లో రూ.2000 నోట్లను డిపాజిట్ లేదా మార్చుకునే సదుపాయం ఉంది. మొత్తం మీద దేశంలో ఇప్పటికీ కొందమంది దగ్గర రూ. 2000 నోట్లు ఉన్నాయని స్పష్టమవుతోంది. ఇవన్నీ పూర్తిగా ఆర్బీఐకు ఎప్పుడు చేరుతాయనేది తెలియాల్సిన విషయం. -
2047 నాటికి అదే లక్ష్యం: ఆర్థిక సంఘం చైర్మన్
న్యూఢిల్లీ: అభివృద్ధి చెందిన దేశంగా 2047 నాటికి అవతరించాలనే భారత లక్ష్యం సాకారమయ్యే ఆశయమని 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగరియా శనివారం అన్నారు. ఇందుకోసం దేశ తలసరి ఆదాయం ఏటా 7.3 శాతం పెరిగి రాబోయే 24 ఏళ్లలో 14,000 డాలర్లకు చేరుకోవాలని అన్నారు.‘తలసరి ఆదాయంలో ఈ స్థాయి వృద్ధిని సాధించాలంటే భారత జీడీపీ రాబోయే 24 సంవత్సరాలలో 7.9 శాతం దూసుకెళ్లాలి. దేశ తలసరి ఆదాయం 2023–24లో దాదాపు 2,570 డాలర్లు. ఇది దక్షిణ కొరియా, తైవాన్, యూఎస్, ఇతర యూరోపియన్ దేశాలతో పోలిస్తే చాలా తక్కువ.ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానం, సహేతుక మూలధన సేకరణ, నైపుణ్య సముపార్జనతో తలసరి ఆదాయం విషయంలో అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరుకోవడానికి భారత్కు అపార అవకాశం ఉంది. 21 సంవత్సరాలుగా మన వృద్ధి రేటు (వాస్తవ డాలర్ పరంగా) 7.8 శాతంగా ఉంది. జీడీపీ వృద్ధి రేటుం 7.9 శాతానికి చేరుకోవడం పూర్తిగా సాధ్యమే. వికసిత భారత్ సాకారమయ్యే ఆశయం. ఈ వృద్ధి రేటును రాబోయే 10 సంవత్సరాలు కొనసాగిస్తే 9.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుంది’ అని వివరించారు.ఇరు దేశాలు తగ్గిస్తే..యూఎస్ ప్రతీకార పన్నులపై పనగరియా మాట్లాడుతూ.. ఇరు దేశాలు సుంకాలను తగ్గిస్తే పరిస్థితులు సానుకూలంగా మారతాయని అన్నారు. ఒకవేళ సుంకాల యుద్ధానికి దారితీస్తే.. అమెరికా భారతదేశంపై సుంకాలు విధించి, న్యూఢిల్లీ తన సొంత సుంకాలతో ప్రతీకారం తీర్చుకుంటే దురదృష్టకర ఫలితం ఉంటుందని ఆయన హెచ్చరించారు. -
వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్
న్యూయార్క్: బలమైన ప్రైవేట్ పెట్టుబడులు, స్థూల ఆర్థిక స్థిరత్వం నేపథ్యంలో 2025–26లో 6.5 శాతం జీడీపీ వృద్ధిని సాధించడం ద్వారా.. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ తన స్థానాన్ని నిలుపుకుంటుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ తెలిపింది. భారత బలమైన ఆర్థిక పనితీరు 2047 నాటికి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మారాలనే ఆశయాన్ని సాకారం చేసుకోవడానికి కీలక, సవాలుతో కూడిన నిర్మాణాత్మక సంస్కరణలను ముందుకు తీసుకెళ్లడానికి దేశానికి అవకాశాన్ని అందిస్తుందని వివరించింది.నిరంతర స్థూల ఆర్థిక, ఆర్థిక స్థిరత్వం నేపథ్యంలో ప్రైవేట్ వినియోగంలో బలమైన వృద్ధితో 2024–25, 2025–26లో వాస్తవ జీడీపీ 6.5% పెరుగుతుందని అంచనా. ఇటీవలి కాలంలో ఆర్థిక వ్యవస్థలో నియంత్రణ ఉన్న ప్పటికీ భారత ఆర్థిక వృద్ధి బలంగానే ఉంది. 2024–25 మొదటి అర్ధభాగంలో జీడీపీ వృద్ధి 6%గా ఉంది’ అని వివరించింది.నిరర్థక రుణాలు తగ్గాయి..అధిక నాణ్యత ఉద్యోగాలను సృష్టించడానికి, పెట్టుబడులను ఉత్తేజపరిచేందుకు, అధిక వృద్ధి అవకాశాలను అందుకోవడానికి సమగ్ర నిర్మాణాత్మక సంస్కరణలు చాలా ముఖ్యమైనవని ఐఎంఎఫ్ తెలిపింది. ‘కార్మిక మార్కెట్ సంస్కరణలను అమలు చేయడం, మానవ వనరుల బలోపేతం, శ్రామిక శక్తిలో మహిళల అధిక భాగస్వామ్యానికి మద్దతు ఇవ్వడంపై దృష్టి పెట్టాలి.ఆహార ధరల హెచ్చుతగ్గులు కొంత అస్థిరతను సృష్టించినప్పటికీ రిజర్వ్ బ్యాంక్ టాలరెన్స్ బ్యాండ్ (2 నుండి 6 శాతం) పరిధిలో ద్రవ్యోల్బణం విస్తృతంగా తగ్గింది. ఆర్థిక రంగం స్థితిస్థాపకంగానే ఉంది. నిరర్థక రుణాలు బహుళ సంవత్సరాల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఆర్థిక ఏకీకరణ కొనసాగింది. సర్వీ సెస్ ఎగుమతుల్లో బలమైన వృద్ధి మద్దతు తో కరెంట్ ఖాతా లోటు చాలా అదుపులో ఉంది’ అని వివరించింది. -
ప్రజలకు అందుబాటు ధరల్లో జనరిక్ మందులు
ప్రజలకు అందుబాటు ధరల్లో జనరిక్ మందులను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. మార్చి 1 నుంచి 7 వరకు వారం రోజుల పాటు నిర్వహించే ‘జన్ ఔషధి సప్తాహ్’ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈమేరకు ‘జన్ ఔషధి రథ్’లను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. 2025 చివరి నాటికి 20,000 జన్ ఔషధి కేంద్రాలను ప్రారంభించే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. 2027 నాటికి మరో 25,000 కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ..‘జన్ ఔషధి రథాలు ప్రజల్లో జన్ ఔషధి కేంద్రాల ప్రయోజనాల గురించి అవగాహన పెంచుతాయి. చౌకైన జనరిక్ మందుల ప్రాధాన్యతను తెలియజేస్తాయి. ఖరీదైన బ్రాండెడ్ మందులకు ప్రత్యామ్నాయాలు అందించాలని, ఆరోగ్య సంరక్షణ ఖర్చులను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రధాన మంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన (పీఎంబీజేపీ)లో భాగంగా ఈ చర్యలు చేపట్టాం. ప్రధాని నాయకత్వంలో 2027 నాటికి 25,000 జన ఔషధి కేంద్రాలకు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ముందుగా 80 కేంద్రాలతో వీటిని ప్రారంభించాం. ప్రస్తుతం 15 వేల కేంద్రాలు ఉన్నాయి. ఈ ఏడాది చివరి నాటికి వీటి సంఖ్యను 20 వేలకు పెంచుతాం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ సహాయమంత్రి అనుప్రియా పటేల్ పాల్గొని మాట్లాడారు. ‘మార్చి 1 నుంచి 7 వరకు 'జన్ ఔషధి - జన్ చేతన' వారోత్సవాలు నిర్వహిస్తున్నాం. జన్ ఔషధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. మందులపై ప్రజలు చేసే ఖర్చును తగ్గించేందుకు ఇవి ఎంతో ఉపయోగపడుతాయి’ అని చెప్పారు.రూ.1కే శానిటరీ న్యాప్కిన్స్మహిళల నెలసరి సమయంలో ఉపయోగించే శానిటరీ ప్యాడ్స్ను జన్ ఔషధి కేంద్రాల్లో కేవలం రూ.1కే అందించనున్నారు. సువిధ ఆక్సో బయోడిగ్రేడబుల్ శానిటరీ న్యాప్కిన్స్ ఎంతో పరిశుభ్రమైనవని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రజల్లో విభిన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి అవగాహన కల్పించడానికి వారమంతా వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.జన్ ఔషధిప్రధాన మంత్రి భారతీయ జన ఔషధి పరియోజన (పీఎంబీజేపీ) అనేది భారత ప్రభుత్వ ఫార్మాస్యూటికల్స్ విభాగం ప్రారంభించిన ఒక కార్యక్రమం. జన ఔషధి కేంద్రాలు అనే ప్రత్యేక అవుట్లెట్ల ద్వారా ప్రజలకు సరసమైన ధరలకు నాణ్యమైన జనరిక్ మందులను అందించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. బ్రాండెడ్ మందుల కంటే 50%-80% చౌకగా జనరిక్ మందులను అందించడం ద్వారా ఆరోగ్య సంరక్షణ ఖర్చులను తగ్గించాలని నిర్ణయించారు. డబ్ల్యూహెచ్వో-జీఎంపీ గుర్తింపు కలిగిన తయారీదారుల నుంచి ఔషధాలను సేకరించి నాణ్యత, భద్రతను ధృవీకరించడం కోసం ఎన్ఏబీఎల్(నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్) గుర్తింపు పొందిన ప్రయోగశాలల్లో పరీక్షిస్తారు.ఇదీ చదవండి: పని గంటలా..? పని నాణ్యతా..?ఈ జన్ ఔషధి అవుట్లెట్లలో 2,000 కంటే ఎక్కువ మందులు, 300 శస్త్రచికిత్సా వస్తువులు అందుబాటులో ఉంటాయి. 2024 సెప్టెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 13,822 జన ఔషధి కేంద్రాలు పనిచేస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఈ కేంద్రాలను ప్రారంభించడంలో స్థానిక యువతను ప్రోత్సహించడం ద్వారా ఉపాధిని సృష్టించే అవకాశం ఏర్పడింది. ‘సుగమ్ మొబైల్ యాప్’ ద్వారా వినియోగదారులు తమ సమీపంలోని జన ఔషధి కేంద్రాలను గుర్తించవచ్చని, జనరిక్ మందుల కోసం సెర్చ్ చేయవచ్చని, బ్రాండెడ్ మందులతో ధరలను పోల్చవచ్చని ప్రభుత్వం పేర్కొంది. -
వ్యవసాయ ఉత్పత్తులపై అధిక సుంకాల ప్రభావం
దేశీయ వ్యవసాయాన్ని రక్షించడానికి, ఆహార భద్రతను మెరుగుపరిచేందుకు వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలు అమలు చేస్తున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్ (ICRIER) ఇటీవల చేసిన అధ్యయనం ఇలాంటి సుంకాలు భారత వ్యవసాయ రంగంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో తెలిపింది. అందులోని కొన్ని కీలక అంశాలను కింద తెలుసుకుందాం.అంతర్జాతీయ పోటీ నుంచి వివిధ దేశాలు తమ వ్యవసాయ ఉత్పత్తులను కాపాడుకునేందుకు ఆయా అగ్రికల్చర్ దిగుమతులపై అధిక సుంకాలు విధిస్తున్నాయి. సాగుభూమిని నిర్ధారించేందుకు, గ్రామీణ ఉపాధిని నిర్వహించేందుకు, స్థిరమైన ఆహార సరఫరాను పొందేందుకు ఈ మేరకు చర్చలు తీసుకుంటున్నాయి. ఏదేమైనా ఈ రక్షణ చర్యలు దేశీయ వ్యవసాయ ఉత్పత్తుల పోటీతత్వాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఐసీఆర్ఐఈఆర్ అధ్యయనం వెల్లడించింది.అధ్యయనంలోని వివరాల ప్రకారం..అధిక సుంకాలు ప్రపంచ మార్కెట్లో భారతీయ వ్యవసాయ ఉత్పత్తులకు పోటీని తగ్గిస్తాయి. ఇవి మార్కెట్ సంకేతాలపై ప్రభావాన్ని చూపుతాయి. దాంతో వనరులు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది. లాభదాయకమైన లేదా స్థిరమైన ప్రత్యామ్నాయాల వైపు వనరులను మళ్లించకుండా రైతులు ఆర్థికంగా ఆచరణ సాధ్యం కాని పంటలను ఉత్పత్తి చేసే ప్రమాదం ఉంది. అధిక సుంకాలు దిగుమతి చేసుకునే ఉత్పత్తుల ఖర్చును పెంచుతాయి. ఇది వినియోగదారుల కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది. వైవిధ్యమైన ఆహార ఉత్పత్తుల వినియోగాన్ని పరిమితం చేస్తుంది.అధిక సుంకాలు వాణిజ్య భాగస్వాముల నుంచి ప్రతీకార చర్యలను ప్రేరేపిస్తాయి. ఇది వాణిజ్య యుద్ధాలకు దారితీస్తుంది. దాంతో వ్యవసాయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ సుంకాల పోటీ వాతావారణం దేశీయ రైతులకు ఎగుమతి అవకాశాలను తగ్గిస్తుంది. అధిక సుంకాలు ప్రపంచ సరఫరా గొలుసులో వస్తువుల ప్రవాహానికి అంతరాయం కలిగిస్తాయి. ఇది ఉత్పత్తుల పంపిణీ, లాజిస్టిక్స్పై తీవ్ర ప్రభావం చూపుతుంది.ఇదీ చదవండి: జెన్ఏఐ ద్వారా కొలువులు పెంపుసిఫార్సులుదేశంలో దిగుమతి అవుతున్న ఆహార పదార్థాలు, వాల్ నట్స్, కట్ చికెన్ లెగ్స్, పాల ఉత్పత్తులు వంటి ఎంపిక చేసిన వస్తువులపై దశలవారీగా సుంకాలను తగ్గించాలి. ఈ విధానం అమెరికాలో భారతీయ ఉత్పత్తులకు పరస్పర మార్కెట్ అవకాశాన్ని ప్రోత్సహిస్తుంది. వ్యవసాయ దిగుబడులు, పోటీతత్వాన్ని పెంపొందించడానికి వ్యవసాయ పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ)లో పెట్టుబడులను పెంచడం కీలకం. కోల్డ్ స్టోరేజీ సామర్థ్యాన్ని విస్తరించడం, లాజిస్టిక్స్ మౌలికసదుపాయాలను అప్గ్రేడ్ చేయడం ముఖ్యం. అగ్రికల్చర్ వ్యాల్యూ చెయిన్ను ఆధునీకరించడం భారత వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి సామర్థ్యాన్ని పెంచుతుంది. ఉత్పాదకతను మెరుగుపరిచి స్థిరమైన వ్యవసాయ పద్ధతులను అవలంబించాలి. -
పది నెలల్లో రూ.11,69,542 కోట్లు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు జనవరి చివరికి రూ.11,69,542 కోట్లకు చేరుకుంది. పూర్తి ఆర్థిక సంవత్సరం (2024–25) ద్రవ్యలోటు అంచనాల్లో (రూ.15.69 లక్షల కోట్లు) ఇది 74.5 శాతం కావడం గమనార్హం. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) ఈ మేరకు గణాంకాలు విడుదల చేసింది. ప్రభుత్వ వ్యయాలు–ఆదాయాల మధ్యలో అంతరమే ద్రవ్యలోటు. క్రితం ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల్లో ద్రవ్యలోటు 63.6 శాతంగానే ఉంది.మొత్తం ఆదాయం 2024 ఏప్రిల్ నుంచి 2025 జనవరి వరకు రూ.24 లక్షల కోట్లుగా (పన్నుల ఆదాయం రూ.19.03 లక్షల కోట్లు) ఉంది. 2024–25 సవరించిన అంచనాల ప్రకారం మొత్తం అంచనాల్లో ఇది 76.3 శాతానికి సమానం. మొత్తం వ్యయాలు రూ.35.7 లక్షల కోట్లుగా ఉన్నాయి. పూర్తి ఆర్థిక సంవత్సరం అంచనాల్లో ఇది 75.7 శాతానికి సమానం. ఇటీవలి బడ్జెట్లో 2024–25 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 4.8 శాతంగా, 2025–26 సంవత్సరంలో 4.4 శాతంగా ఉంటుందని ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రకటించడం తెలిసిందే. జనవరి చివరికి రూ.10,74,179 కోట్లను రాష్ట్రాలకు పన్నుల వాటా కింద కేంద్రం బదిలీ చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం తొలి 10 నెలల కాలంతో పోల్చి చూస్తే రూ.2,53,929 కోట్లు అధిక ఆదాయం రాష్ట్రాలకు సమకూరింది. మెరుగుపడిన మౌలికంజనవరిలో 4.6 శాతానికి పెరిగిన ఉత్పత్తిన్యూఢిల్లీ: మౌలిక రంగం ఈ ఏడాది జనవరి నెలలో బలమైన పనితీరు చూపించింది. ఎనిమిది మౌలిక రంగాల ఉత్పత్తి జనవరిలో 4.6 శాతంగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే నెలలో ఇది 4.2 శాతంగా ఉంది. కాకపోతే 2024 డిసెంబర్ నెలలో నమోదైన 4.8 శాతంతో పోలిస్తే పనితీరు కాస్త నిదానించినట్టు కనిపిస్తోంది. ఇదీ చదవండి: ఒక్కరోజే రూ.99,835 కోట్లుముడి చమురు, సహజ వాయువు ఉత్పత్తి క్రితం ఏడాది జనవరి నెల గణాంకాలతో పోల్చి చూస్తే తగ్గింది. బొగ్గు ఉత్తత్తి 4.6 శాతానికి పడిపోయింది. 2024 జనవరిలో ఇది 3.7 శాతంగా ఉంది. స్టీల్ ఉత్పత్తి వార్షికంగా చూస్తే 9.2 శాతం నుంచి 3.7 శాతానికి క్షీణించింది. విద్యుదుత్పత్తి 1.3 శాతంగా నమోదైంది. 2024 జనవరి నెలకు ఇది 5.7 శాతంగా ఉంది. రిఫైనరీ ఉత్పత్తి 8.3 శాతం, ఎరువుల ఉత్పత్తి 3 శాతం, సిమెంట్ ఉత్పత్తి 14.5 శాతానికి పుంజుకున్నది.ఈ ఏడాది 10 నెలల కాలంలో (2024 ఏప్రిల్–2025 జనవరి) 8మౌలిక రంగాల ఉత్పత్తి క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 7.8% నుంచి 4.4 శాతానికి క్షీణించింది. -
ఒక్కరోజే రూ.99,835 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) ఆధారిత డిజిటల్ చెల్లింపులు ఎప్పటికప్పుడు దూసుకెళ్తున్నాయి. లావాదేవీల విలువ, పరిమాణం విషయంలో 2025 ఫిబ్రవరి 1 సరికొత్త రికార్డు సృష్టించింది. ఏకంగా ఆ ఒక్కరోజే రూ.99,835 కోట్ల విలువైన లావాదేవీలు నమోదయ్యాయి. లావాదేవీల సంఖ్య 60 కోట్లు దాటింది. యూపీఐ వ్యవస్థలో ఇదే రికార్డు. గత రికార్డులు చూస్తే లావాదేవీల విలువ 2025 జనవరి 2న అత్యధికంగా రూ.94,429 కోట్లు, లావాదేవీల సంఖ్య జనవరి 10న 57.8 కోట్లు నమోదైంది. ఫిబ్రవరి 1–25 మధ్య రూ.19,60,263 కోట్ల విలువైన 1439.8 కోట్ల లావాదేవీలు జరిగాయి. లావాదేవీలు తక్కువేం కాదు..2023–24లో యూపీఐ లావాదేవీల విలువ రూ.200 లక్షల కోట్లు దాటింది. లావాదేవీల సంఖ్య 13,100 కోట్ల పైచిలుకు ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జనవరి మధ్య వ్యక్తుల నుంచి వర్తకులకు జరిగిన లావాదేవీల వాటా 62.35 శాతం. వ్యక్తుల మధ్య జరిగినవి 37.75 శాతం ఉన్నాయి. వ్యక్తుల నుంచి వర్తకుల మధ్య జరిగిన లావాదేవీల్లో రూ.500 లోపు విలువ చేసేవి ఏకంగా 86 శాతం నమోదయ్యాయి. ఇక మొత్తం రిటైల్ చెల్లింపుల్లో యూపీఐ వాటా 80 శాతానికి చేరిందని ఆర్థిక శాఖ ప్రకటించింది. 2025 జనవరి నాటికి 641 బ్యాంకులు, 80కిపైగా యాప్స్ యూపీఐ సేవలు అందించాయి.అగ్రస్థానంలో ఫోన్పేయూపీఐ విభాగంలో ఫోన్పే తొలి స్థానంలో దూసుకుపోతోంది. 2025 జనవరిలో రూ.11,91,304 కోట్ల విలువైన 810 కోట్ల లావాదేవీలను సాధించింది. గూగుల్పే రూ.8,26,845 కోట్ల విలువైన 618 కోట్ల లావాదేవీలతో రెండవ స్థానంలో కొనసాగుతోంది. రూ.1,26,313 కోట్ల విలువైన 115 కోట్ల లావాదేవీలతో పేటీఎం మూడవ స్థానంలో నిలిచింది. లావాదేవీల విలువ పరంగా క్రెడ్, ఐసీఐసీఐ బ్యాంక్ యాప్స్, నవీ, గ్రో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ యాప్స్, అమెజాన్ పే, భీమ్ యాప్స్ తర్వాతి స్థానాల్లో పోటీపడుతున్నాయి. ఇదీ చదవండి: రోహిత్ శర్మ అపార్ట్మెంట్ అద్దె ఎంతంటే..?జనవరిలో ఇలా..2025 జనవరిలో నమోదైన రూ.23,48,037 కోట్లలో వ్యక్తుల మధ్య జరిగిన లావాదేవీలు 73 శాతం. వ్యక్తుల నుంచి వర్తకులకు జరిగినవి 27 శాతం. విలువ పరంగా వ్యక్తుల నుంచి వ్యక్తులకు రూ.2,000లకుపైగా విలువ చేసే లావాదేవీల వాటా 87 శాతం ఉంది. రూ.501–2,000 మధ్య 10%, రూ.500 లోపు 3% నమోదయ్యాయి. వ్యక్తుల నుంచి వర్తకులకు రూ.2,000పైగా విలువ చేసే లావాదేవీలు 67 శాతం, రూ.501–2,000 మధ్య 17 శాతం, రూ.500 లోపు 16 శాతం ఉన్నాయి. ఇక లావాదేవీల సంఖ్య పరంగా వ్యక్తుల నుంచి వర్తకులకు 62 శాతం, వ్యక్తుల మధ్య 38 శాతం నమోదయ్యాయి. వ్యక్తుల నుంచి వర్తకుల మధ్య రూ.500 లోపు విలువ చేసే లావాదేవీల వాటా ఏకంగా 86 శాతం ఉంది. రూ.501–2,000 మధ్య 10 శాతం, రూ.2,000పైన 4 శాతం ఉన్నాయి. -
ఏటా 7.8 శాతం వృద్ధి అవసరం
న్యూఢిల్లీ: భారత్ అధిక ఆదాయ దేశంగా 2047 నాటికి (అభివృద్ధి చెందిన దేశం) అవతరించాలంటే ఏటా 7.8 శాతం సగటు వృద్ధిని, వచ్చే 22 ఏళ్లపాటు సాధించాల్సి ఉంటుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. ఇందుకు గాను ఆర్థిక రంగ, భూమి, కార్మిక మార్కెట్కు సంబంధించి సంస్కరణలు చేపట్టాల్సి ఉంటుందని విశ్లేషించింది. ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది. భారత్ 2000 నుంచి 2024 మధ్య కాలంలో వృద్ధిని సగటున 6.3 శాతానికి వేగవంతం చేసుకుందంటూ.. గత విజయాలు భవిష్యత్తు లక్ష్యాలకు మద్దతుగా నిలుస్తాయని పేర్కొంది. ‘‘2047 నాటికి అధిక ఆదాయ దేశంగా అవతరించాలన్న ప్రతిష్టాత్మక లక్ష్యం ఎప్పటి మాదిరే సాధారణ పనితీరుతో సాధ్యపడదు. తలసరి ఆదాయం ప్రస్తుత స్థాయి నుంచి ఎనిమిది రెట్లు వృద్ధి చెందాలి. అందుకోసం వృద్ధి మరింత వేగాన్ని అందుకుని, వచ్చే రెండు దశాబ్దాల పాటు స్థిరంగా కొనసాగాలి. అలాగే, ప్రస్తుతం అమలు చేస్తున్న చర్యలు సరిపోవు. సంస్కరణలను మరింత విస్తరించడంతోపాటు, వేగవంతం చేయాలి. అప్పుడే 2047 నాటికి అధిక ఆదాయ దేశంగా భారత్ మారుతుంది’’అని ప్రపంచబ్యాంక్ నివేదిక సూచించింది. విధానపరమైన చర్యలు, పెట్టుబడులు పెంచడం, నిర్మాణాత్మక పరివర్తనతోపాటు మరిన్ని ఉపాధి అవకాశాల కల్పనపై భారత్ దృష్టి సారించాలని పేర్కొంది.చిలీ, కొరియా, పోలండ్ నిదర్శనాలు.. ‘‘చిలీ, కొరియా, పోలండ్ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థతో మరింతగా అనుసంధానం కావడం ద్వారా మధ్యస్థ ఆదాయం నుంచి అధిక ఆదాయ దేశాలుగా విజయవంతంగా మారాయి. వాటి నుంచి ఈ విషయంలో పాఠాలు నేర్వాలి’’అని ప్రపంచబ్యాంక్ భారత్ డైరెక్టర్ ఆగస్టే టానో కౌమే పేర్కొన్నారు. 2000 నుంచి భారత ఆర్థిక వ్యవస్థ నాలుగు రెట్లు పెరిగిందని, జీడీపీలో తలసరి ఆదాయం సైతం మూడు రెట్లు అధికమైనట్టు ప్రపంచబ్యాంక్ నివేదిక గుర్తు చేసింది. ఇందుకు మిగిలిన ప్రపంచంతో పోల్చితే భారత్ వేగంగా వృద్ధి చెందినట్టు తెలిపింది. ఇది కఠిన పేదరికం గణనీయంగా తగ్గేందుకు, సేవలు, మౌలిక సదుపాయాల విస్తరణకు దోహదం చేసినట్టు వివరించింది. గత విజయాల మాదిరే భారత్ తన సంస్కరణలను వేగవంతం చేసి, భవిష్యత్తులో మరింత అధిక వృద్ధిని సాధించాల్సి ఉంటుందని కౌమే పేర్కొన్నారు.అధిక యువ జనాభా సౌలభ్యం నేపథ్యంలో మెరుగైన ఉపాధి అవకాశాలకు అనువైన పరిస్థితులు కల్పించడం, కార్మిక శక్తిలో మహిళల ప్రతినిధ్యాన్ని 35.6 శాతం నుంచి 2047 నాటికి 50 శాతానికి పెంచడం అవసరమని ఈ నివేదికకు సహ రచయితగా వ్యవహరించిన ఎమిలీయా స్కాక్, రంగీత్ ఘోష్ అభిప్రాయపడ్డారు. ‘‘మౌలిక వసతులు మెరుగుపడాలి. ఆధునిక టెక్నాలజీలను అందిపుచ్చుకోవాలి. కార్మిక మార్కెట్ నిబంధనలను క్రమబదీ్ధకరించాలి. నిబంధనల భారాన్ని తగ్గించాలి. ఇలా చేయడం వల్ల ఉత్పాదకతతోపాటు పోటీతత్వం పెరిగేందుకు దోహదం చేస్తుంది. ఈ చర్యలతో భారత్ థాయిలాండ్, వియత్నాం, చైనాతో సమానంగా అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో భారత్ తన భాగస్వామ్యాన్ని పెంచుకుంటుంది’’అని ప్రంపచబ్యాంక్ నివేదిక సూచించింది. -
జీడీపీ.. ప్చ్!
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) క్యూ3లోనూ (2024 అక్టోబర్–డిసెంబర్) బలహీన ధోరణి ప్రదర్శించింది. జీడీపీ వృద్ధి రేటు 6.2 శాతంగా నమోదైంది. జూలై–సెపె్టంబర్ త్రైమాసికంలో నమోదైన ఏడు త్రైమాసికాల కనిష్ట స్థాయి 5.6 శాతం (తాజా సవరణకు ముందు 5.4 శాతం) నుంచి, డిసెంబర్ క్వార్టర్లో 6.2 శాతానికి పుంజుకున్నప్పటికీ.. క్రితం ఆర్థిక సంవత్సరం(2023–24)క్యూ3లో నమోదైన 9.5 శాతం రేటుతో పోల్చితే గణనీయంగా తగ్గినట్టు స్పష్టమవుతోంది. అంతేకాదు, ఆర్బీఐ అంచనా 6.8 శాతం కంటే కూడా తక్కువగానే నమోదైంది. తయారీ, మైనింగ్ రంగాల పనితీరు బలహీనపడడం వృద్ధి రేటును తక్కువ స్థాయికి పరిమితం చేసింది. పట్టణ వినియోగం కూడా బలహీనంగానే కొనసాగింది. అదే సమయంలో వ్యవసాయ రంగం పటిష్ట పనితీరుకుతోడు ప్రభుత్వం మూలధన వ్యయాలను పెంచడం.. మెరుగైన వర్షాలకుతోడు పండుగల సీజన్లో గ్రామీణ వినియోగం పుంజుకోవడం ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా నిలి చాయి. డిసెంబర్ త్రైమాసికం జీడీపీ గణాంకాలను జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) శుక్రవారం విడుదల చేసింది. నాలుగేళ్ల కనిష్టం.. 2024–25 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ 6.5% వృద్ధిని (స్థిర కరెన్సీలో రూ.188 లక్షల కోట్లు) సాధిస్తుందని ఎన్ఎస్వో తన ద్వితీయ ముందస్తు అంచనాల్లో పేర్కొంది. ఈ ఏడాది జనవరిలో వేసిన తొలి ముందస్తు అంచనాల్లో ఇది 6.4 శాతంగా ఉండడం గమనార్హం. అయినప్పటికీ ఇది నాలుగేళ్ల కనిష్ట వృద్ధి కానుంది. క్రితం ఆర్థిక సంవత్సరం 9.2 శాతం కంటే కూడా తక్కువ. ఎన్ఎస్వో తాజా అంచనాల మేరకు జీడీపీ 6.5 శాతానికి పుంజుకోవాలంటే చివరి త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ మరింత మెరుగైన పనితీరు చూపించాల్సి ఉంటుంది. రంగాల వారీ పనితీరు.. → స్థూల విలువ జోడింపు (జీవీఏ/ఆర్థిక కార్యకలాపాల తీరు) డిసెంబర్ త్రైమాసికంలో 6.2 శాతంగా నమోదైంది. అంతకుముందు త్రైమాసికంలో ఇది 5.6 శాతంగా ఉంది. → వ్యవసాయ రంగం ఆరు త్రైమాసికాల గరిష్ట స్థాయికి పుంజుకున్నది. డిసెంబర్ త్రైమాసికంలో ఐదు రెట్లు బలపడి 5.6 శాతం వృద్ధిని చూపించింది. అంతకుముందు త్రైమాసికంలో (జూలై–సెపె్టంబర్) ఇది 4.1 శాతంగా ఉంటే, క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్కు 1.5 శాతమే కావడం గమనించొచ్చు. → తయారీ రంగంలో వృద్ధి సెపె్టంబర్ క్వార్టర్లో ఉన్న 2.1 శాతం నుంచి డిసెంబర్ త్రైమాసికంలో 3.5 శాతానికి చేరింది. అయినప్పటికీ క్రితం ఆర్థిక సంవత్సరం క్యూ3లో 14 శాతం వృద్ధి రేటుతో పోల్చి చూస్తే చాలా తక్కువే. → మైనింగ్లో వృద్ధి 1.4%కి పడిపోయింది. క్రితం ఆర్థిక సంవత్సరం క్యూ3లో ఇది 4.7%. → సేవల రంగం వృద్ధి రేటు క్యూ3లో 7.4 శాతానికి మెరుగుపడింది. క్రితం ఆర్థిక సంవత్సరం క్యూ3లో ఇది 8.3 శాతం కావడం గమనార్హం. క్యూ4లో బలమైన పనితీరు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలోనూ ఆర్థిక వ్యవస్థ స్థిరమైన పనితీరు చూపించవచ్చు. ప్రభుత్వ, ప్రైవేటు మూలధన వ్యయాలు పుంజుకోవడంతోపాటు, ఎగుమతులు వృద్ధికి మద్దతుగా నిలుస్తాయి. – అనంత నాగేశ్వరన్, కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు -
రికార్డు స్థాయికి చేరిన యూపీఐ లావాదేవీలు
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీలు జనవరి 2025లో రికార్డు స్థాయిలో 16.99 బిలియన్(1,699 కోట్లు)లకు చేరుకున్నాయి. వీటి మొత్తం విలువ రూ.23.48 లక్షల కోట్లు దాటింది. దేశవ్యాప్తంగా జరిగే మొత్తం రిటైల్ చెల్లింపుల్లో యూపీఐ ద్వారా జరిగే లావాదేవీలే 80 శాతానికిపైగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 641 బ్యాంకులు, 80 యూపీఐ యాప్లు ఈ వ్యవస్థలో భాగస్వామ్యం అయ్యాయి.లావాదేవీలు పెరగడానికి కారణాలునగదు రహిత ఆర్థిక వ్యవస్థ, డిజిటల్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ కోసం భారత ప్రభుత్వం యూపీఐను అందుబాటులోకి తీసుకొచ్చింది. సాంకేతికతలో నిరంతర మెరుగుదల, యూపీఐను వివిధ ప్లాట్ఫామ్లతో అనుసంధానించడం వినియోగదారుల లావాదేవీలకు భద్రత కల్పించడంతో దీని వాడకం పెరుగుతోంది. తక్షణ చెల్లింపు సౌలభ్యం, యూపీఐ ఆధారిత యాప్లు విస్తృతంగా అందుబాటులో ఉండడంతో ఇటు వినియోగదారులు, అటు వ్యాపారులు దీన్ని అవకాశంగా మలుచుకున్నారు.ఆర్థిక వ్యవస్థపై ప్రభావంయూపీఐ లావాదేవీలు పెరగడం భారత ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావాన్ని చూపుతోంది. ఇది అంతరాయం లేని ఆర్థిక లావాదేవీలను సులభతరం చేసింది. నగదుపై ఆధారపడటాన్ని తగ్గించింది. ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకతను ప్రోత్సహించింది. అదనంగా డిజిటల్ చెల్లింపుల వినియోగం ఆర్థిక వ్యవస్థ క్రమబద్ధీకరణకు దోహదం చేసింది. ఇది ఆర్థిక కార్యకలాపాలను ట్రాక్ చేయడానికి, వాటిని నియంత్రించేందుకు మెరుగైన సాధనంగా ఉంది.ఇదీ చదవండి: రోహిత్ శర్మ అపార్ట్మెంట్ అద్దె ఎంతంటే..?భవిష్యత్తు అవకాశాలుయూపీఐ అభివృద్ధి చెందుతున్నందున దాని భవిష్యత్తు అవకాశాలు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. దీని పరిధిని విస్తరించడానికి బ్లాక్ చెయిన్, కృత్రిమ మేధ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలతో అనుసంధానించడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. ప్రభుత్వం, ఆర్థిక సంస్థలు, టెక్నాలజీ ప్రొవైడర్ల నిరంతర మద్దతుతో భారత డిజిటల్ చెల్లింపు వ్యవస్థకు యూపీఐ దన్నుగా నిలుస్తోంది. -
కీలక ఖనిజాలపై భారత్ దృష్టి
న్యూఢిల్లీ: కీలక ఖనిజాల(మినరల్స్)తోకూడిన ఆస్తుల మైనింగ్కు ఆసక్తిగా ఉన్నట్లు గనుల శాఖ కార్యదర్శి వీఎల్ కాంతా రావు పేర్కొన్నారు. కాంగో, జాంబియా, టాంజానియా, ఆస్ట్రేలియా తదితర దేశాలలో అవకాశాలను అన్వేషిస్తున్నట్లు ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలియజేశారు. కాబిల్తో ఆస్ట్రేలియా ప్రభుత్వం కలసి పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ఈ బాటలో దేశీ కంపెనీల కోసం కాంగో, టాంజానియా తదితర కొన్ని దేశాలలో కీలక ఖనిజ ఆస్తులను వెలికి తీసేందుకు పనిచేస్తున్నట్లు తెలియజేశారు. కాపర్, లిథియం, నికెల్, కోబాల్ట్ తదితరాలను అత్యంత ప్రాధాన్యతగల ముడిసరుకులుగా పేర్కొన్నారు. వేగవంత వృద్ధిలో ఉన్న శుద్ధ ఇంధన టెక్నాలజీలకు ఇవి బూస్ట్నివ్వగలని పేర్కొన్నారు. గాలి మరలు(విండ్ టర్బయిన్లు), ఎలక్ట్రిక్ వాహనాలు, వాటి బ్యాటరీల తయారీ ఎలక్ట్రిసిటీ నెట్వర్క్స్ తదితరాలలో వీటి వినియోగం విస్తరిస్తున్నట్లు వివరించారు. ఈ బాటలో కోల్ ఇండియా, ఎన్ఎండీసీ, ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్ తదితర పీఎస్యూ దిగ్గజాలు కాబిల్తో పనిచేస్తున్నట్లు వెల్లడించారు. తద్వారా ఆస్ట్రేలియాలో కీలక మినరల్ బ్లాకులను అన్వేషిస్తున్నట్లు తెలియజేశారు. జాంబియా గ్రీన్ సిగ్నల్ కోబాల్ట్, కాపర్ అన్వేషణకు జాంబియా ప్రభుత్వం 9,000 చదరపు కిలోమీటర్ల క్షేత్రాల(గ్రీన్ఫీల్డ్)ను భారత్కు ఇచ్చేందుకు ఇటీవల అంగీకరించినట్లు రావు తెలియజేశారు. రెండు, మూడేళ్లలో ఖనిజాన్వేషణ చేపట్టనున్నట్లు, తద్వారా మైనింగ్ హక్కులను సైతం పొందనున్నట్లు పేర్కొన్నారు. దేశీ జియలాజికల్ సర్వే(జీఎస్ఐ).. భారీ డిమాండుగల లిథియం బ్లాకులను జమ్ము, కాశీ్మర్(జేఅండ్కే), చత్తీస్గఢ్లలో గుర్తించినట్లు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు. వెరసి జేఅండ్కేలో లిథియం బ్లాకుల అన్వేషణకు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసేందుకు జీఎస్ఐ నిర్ణయించినట్లు తెలియజేశారు. ఏప్రిల్, మే నెలకల్లా వీటిపై స్పష్టత రానున్నట్లు వెల్లడించారు. -
యువత ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యం
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు యుక్తవయస్కుల ఆరోగ్య సంరక్షణ కోసం మరిన్ని నిధులు వెచ్చించాలని, ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక సూచించింది. తద్వారా ప్రతీ డాలర్ వ్యయంపై 4.6 నుంచి 71.4 డాలర్ల స్థాయిలో ప్రతిఫలం లభిస్తుందని అంచనా వేసింది. ఇందుకోసం ప్రభుత్వం, ప్రవేటు రంగం నుంచి సహకారం అవసరమని సూచించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, మేటర్నల్, న్యూబోర్న్ అండ్ చైల్డ్ హెల్త్ (పీఎంఎన్సీహెచ్) సహకారంతో ఈ నివేదిక రూపొందించింది. యుక్త వయస్కుల (కౌమరదశ/10–19 ఏళ్లు) ఆరోగ్యంపై చేసే పెట్టుబడులతో జీడీపీ ఏటా 10 శాతం మేర పుంజుకుంటుందని అంచనా వేసింది. హెచ్పీవీ టీకా, టీబీ చికిత్స, మయోపియా గుర్తింపు–చికిత్సకు 2024–2035 మధ్య ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది. 2024–2050 మధ్య కాలంలో విద్య, ఉపాధి, బాల్య వివాహాల తగ్గింపు, రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి పెట్టాలని సూచించింది. ఇలా యుక్త వయసు్కల ఆరోగ్యంపై చేసే పెట్టుబడులతో పెద్ద ఎత్తన ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయని అభిప్రాయపడింది. దేశ భవిష్యత్తులో కీలక పాత్ర.. ‘‘ఈ తరహా భవిష్యత్ పెట్టుబడులు దేశ జీడీపీని సగటున ఏటా 10 శాతం మేర పెరిగేలా చేస్తాయి.ప్రభుత్వం, ప్రైవేటు రంగం, పౌర సమాజం, కమ్యూనిటీలు, కుటుంబాలు కలసి ఏటా ఇందుకోసం చేసే 33 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో ఏటా 476 బిలియన్ డాలర్ల ప్రయోజనాలు ఒనగూడతాయి’’అని ఈ నివేదిక తెలిపింది. ఆరోగ్యం, విద్య, బాల్య వివాహాలను అరికట్టడంపై చేసే ప్రతీ డాలర్ పెట్టుబడికి 4.6 డాలర్ల నుంచి 71.4 డాలర్ల వరకు ప్రతిఫలం వస్తుందని పేర్కొంది. -
ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలతో ముందడుగు
న్యూఢిల్లీ: భారత్ వాణిజ్యం, పెట్టుబడుల కోసం ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తృతం చేసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో ద్వైపాక్షికవాదం కొత్త ఉ్రత్పేరకంగా కనిపిస్తుందన్నారు. బీఎస్ మంథన్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె మాట్లాడారు. సవాళ్లతో కూడిన కాలంలో భారత్ను ప్రపంచ ఆర్థిక శక్తిగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటున్నట్ట చెప్పారు. ‘‘ద్వైపాక్షికవాదం ఇప్పుడు ప్రముఖ అజెండాగా మారుతోంది. చాలా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను ఇతోధికం చేసుకోవాల్సి ఉంది. కేవలం వాణిజ్యం లేదా పెట్టుబడుల కోసమే కాదు, వ్యూహాత్మక సంబంధాల దృష్ట్యా కూడా అవసరమే. కొత్త ప్రపంచ క్రమంలో భారత్ తనకున్న టెక్నాలజీ, నిపుణుల బలంతో అంతర్జాతీయ ఆర్థిక వృద్ధికి చోదకంగా మారగలదు’’అని వివరించారు. మల్టీలేటరల్ ఇనిస్టిట్యూషన్స్ క్రమంగా కనుమరుగవుతున్నాయంటూ.. వాటి పునరుద్ధరణకు చేసే ప్రతి ప్రయత్నం ఆశించిన ఫలితాన్నివ్వడం లేదన్నారు. ప్రపంచ వాణిజ్య విధానాల్లో మార్పులు.. ప్రపంచ వాణిజ్యం పూర్తిగా మార్పునకు గురవుతోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ‘‘మల్టీలేటరల్ ఇనిస్టిట్యూషన్లు, వాటి సేవలు ఉనికిని కోల్పోతున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) సమర్థంగా పని చేయడం లేదు. ప్రాధాన్య దేశం హోదా (ఎంఎఫ్ఎన్) అన్నదానికి అర్థం లేకుండా పోయింది. ప్రతి దేశం తమను ప్రత్యేకంగా చూడాలని కోరుకుంటోంది. ఒకవేళ డబ్ల్యూటీవో బలహీనపడితే లేదా మల్టీ లేటరల్ ఇనిస్టిట్యూషన్లు సమర్థవంతంగా పనిచేయకపోతే.. అప్పుడు వాణిజ్యం విషయంలో ద్వైపాక్షిక ఒప్పందాలే కీలకంగా మారతాయి’’అని మంత్రి చెప్పారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపై దృష్టి బ్రిటన్ (యూకే) సహా పలు దేశాలతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల దిశగా భారత్ చర్చలు ప్రారంభించినట్టు మంత్రి సీతారామన్ తెలిపారు. అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోనున్నట్టు తెలిపారు. 27 దేశాల సమూహం అయిన ఐరోపా యూనియన్ (ఈయూ)తోనూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం సంప్రదింపులు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. రుణ నిర్వహణ, ద్రవ్య క్రమశిక్షణ పరంగా ప్రభుత్వం మరింత కృషి చేయాల్సి ఉందన్నారు. ‘‘సంస్కరణలన్నవి కేవలం కేంద్ర ప్రభుత్వ అజెండాగానే ఉండిపోకూడదు. ప్రతి రాష్ట్రం దీన్ని సీరియస్గా తీసుకోవాలి. ఈ విషయంలో రాష్ట్రాలు పోటీ పడాలని కోరుకుంటున్నాను’’అని మంత్రి సీతారామన్ చెప్పారు. పోటీతత్వాన్ని పెంచుకోవాలి స్వీయ శక్తి సామర్థ్యాలపై దృష్టి పెట్టాలి పరిశ్రమలకు వాణిజ్య మంత్రి గోయల్ పిలుపు ముంబై: పారిశ్రామికవేత్తలు ప్రభుత్వ సహకారంపై ఆధారపడకుండా.. తమ శక్తి సామర్థ్యాలపై దృష్టి పెట్టి, మరింత పోటీతత్వంతో ముందుకు రావాలని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. ఐఎంసీ చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా గోయల్ మాట్లాడారు. ‘‘ప్రభుత్వ సహకారం కోసం ఎంత కాలం పాటు చూస్తారు? లేదా సబ్సిడీలు, సహకారం, ప్రోత్సాహకాలు, అధిక దిగుమతి సుంకాలు ఎంతకాలం పాటు కోరుకుంటారు? ప్రపంచంతో రక్షణాత్మక వైఖరి ఎంత కాలం? ఈ తరహా రక్షణాత్మక మనస్తత్వం, బలహీన ఆలోచనా ధోరణి నుంచి బయటకు రావడంపై నిర్ణయం తీసుకోవాలి’’అంటూ దేశీ పరిశ్రమ స్వీయ సామర్థ్యాలతో ఎదగాలన్న సంకేతం ఇచ్చారు. ఆవిష్కరణలు, తయారీ విధానాల నవీకరణ, నైపుణ్యాలు, సామర్థ్యాల నుంచే పోటీతత్వం వస్తుందన్నారు. పోటీతత్వంతో ఎదగనంత వరకు 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు నెరవేరవని, ప్రపంచంతో వాణిజ్య సంబంధాలను పటిష్టం చేసుకోకపోతే అభివృద్ధి చెందిన దేశంగా అవతరించలేమన్న అభిప్రాయాన్ని మంత్రి వ్యక్తం చేశారు. చమురు, రక్షణ, ఆహారం వంటి కొన్ని రంగాల్లోనే కొన్ని మినహాయింపులు ఉన్నట్టు చెప్పారు. సమావేశానికి ఆలస్యంగా వచ్చిన మంత్రి పీయూష్ గోయల్.. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అల్లకల్లోల పరిస్థితుల్లో ఎన్నో ముఖ్యమైన కార్యకలాపాల నడుమ తీరిక లేకుండా ఉన్నట్టు చెప్పారు. ట్రంప్ విధానాలతో దేశాల మధ్య పెద్ద ఎత్తున చర్చలు మొదలైనట్టు తెలిపారు. భారత్–యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలను ప్రారంభించినట్టు చెప్పారు. నాణ్యత భారత్కు దీర్ఘకాలిక సవాలుగా ఉన్నట్టు గోయల్ గుర్తు చేశారు. ఫార్మాలో తగిన అనుమతులు ఉన్న బడా సంస్థలు చిన్న కంపెనీలకు మద్దతుగా నిలవాలని సూచించారు. -
యూరప్పై యూఎస్ సుంకాల మోత.. ఎంతంటే..
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వచ్చీరాగానే కార్యనిర్వాహక ఉత్తర్వులను(ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు) జారీ చేసి ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థల్లో ఆందోళనలను రేకిత్తించారు. అనుకున్న విధంగానే ప్రమాణ స్వీకారం తర్వాత వరుసగా వివిధ దేశాలపై సుంకాల మోత మోగిస్తున్నారు. తాజాగా యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి చేసే దిగుమతులపై 25 శాతం సుంకం విధించనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అమెరికా, ఈయూ మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న వాణిజ్య అసమతుల్యతను పరిష్కరించేందుకు తన ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పారు. కార్ల దిగుమతులపై ప్రత్యేక దృష్టి సారించి సుంకాలు విస్తృతంగా వర్తిస్తాయని ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ట్రంప్ పేర్కొన్నారు. వాణిజ్య లోటును ప్రధాన సమస్యగా పేర్కొంటూ ఈయూ అమెరికాను వినియోగించుకుంటుందని తెలిపారు.సుంకాలు తొలిసారి కాదు..ట్రంప్ సుంకాలతో ఈయూను టార్గెట్ చేయడం ఇదేం తొలిసారి కాదు. తన మొదటి పదవీకాలంలో యూరప్ చేసుకున్న ఉక్కు, అల్యూమినియం ఎగుమతులపై సుంకాలు విధించారు. ప్రస్తుతం ‘అమెరికా ఫస్ట్’ అనే విధానాన్ని అనుసరిస్తున్న నేపథ్యంలో యూరప్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై టారిఫ్లు విధించాలని నిర్ణయించుకున్నారు. ఇది ఈయూతో అమెరికాకు ఉన్న అంతర్జాతీయ భాగస్వామ్యాల కంటే ఆర్థిక ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చేలా ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: ఎఫ్సీఐ చూపు.. రుణాల వైపుఆర్థిక ప్రభావాలుప్రతిపాదిత సుంకాలు గణనీయమైన ఆర్థిక ప్రభావాలను కలిగి ఉంటాయని భావిస్తున్నారు. దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై అధిక టారిఫ్ల వల్ల స్థానికంగా యూఎస్లో తయారీ పరిశ్రమను పరుగులు పెట్టించే అవకాశం ఉంటుంది. లేదంటే తప్పకుండా వినియోగదారులు అవే వస్తువులు వాడాలనుకుంటే మాత్రం ధరలు పెరిగే ప్రమాదం ఉంది. ఇలా ఉత్పత్తులపై పెరిగే ఖర్చులు ద్రవ్యోల్బణాన్ని పెంచుతాయని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. కొత్త టారిఫ్లపై ‘గట్టిగా, వెంటనే’ ప్రతిస్పందిస్తామని యూరోపియన్ కమిషన్ హెచ్చరించింది. స్వీడన్ మాజీ ప్రధాని కార్ల్ బిల్డ్ ట్రంప్ అభిప్రాయాన్ని తప్పుబట్టారు. -
భారత్కు గడ్డుకాలం ముగిసినట్టే: డాయిష్ బ్యాంక్
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థకు గడ్డుకాలం ముగిసినట్టేనని జర్మనీకి చెందిన డాయిష్ బ్యాంక్ అభిప్రాయపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో జీడీపీ 5.4 శాతానికి (ఏడు త్రైమాసికాల కనిష్టం) పడిపోవడం తెలిసిందే. దీంతో దేశ ఆర్థిక వృద్ధిపై ఆందోళనలు నెలకొన్నాయి. ఈ తరుణంలో డిసెంబర్ త్రైమాసికంలో జీడీపీ 6.2 శాతానికి మెరుగుపడుతుందని బ్యాంక్ అంచనా వేసింది. అయినప్పటికీ 2025–26లో జీడీపీ వృద్ధి 7 శాతం లోపే ఉంటుందని పేర్కొంది.క్యూ3 (2024 అక్టోబర్-డిసెంబర్) జీడీపీ గణాంకాలు విడుదల కావడానికి ముందు బ్యాంక్ ఈ నివేదిక విడుదల చేయడం గమనార్హం. కీలక సూచికలు సైతం వృద్ధి రేటు 6.2 శాతానికి పెరుగుతుందని సూచిస్తున్నట్టు తెలిపింది. వృద్ధికి మద్దతుగా ఏప్రిల్ మానిటరీ పాలసీ సమీక్షలోనూ ఆర్బీఐ మరో 25 బేసిస్ పాయింట్ల మేర రేట్లను తగ్గించొచ్చని అంచనా వేసింది. అనంతరం 0.50 శాతం రేటు బదిలీ దిశగా లిక్విడిటీ చర్యలపై ఆర్బీఐ దృష్టి సారించొచ్చని తెలిపింది.ప్రస్తుత సైకిల్లో మరిన్ని రేట్ల కోతలు ఉండకపోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది. లిక్విడిటీ అవసరాల పట్ల ఆర్బీఐ ఇప్పటికే దృష్టి పెట్టిందంటూ.. ఇటీవల 10 బిలియన్ డాలర్ల స్వాప్ ప్రకటన ప్రోత్సాహనీయంగా పేర్కొంది.జీడీపీలో పన్నుల నిష్పత్తిని పెంచుకోవాలి: ఈవైభారత్ 6.5 - 7 శాతం మేర జీడీపీ వృద్ధిని నమోదు చేయాలంటే, పన్నుల పరిధిని 1.2 - 1.5 శాతం స్థాయిలో కొనసాగించాలని ఈవై సూచించింది. ఆదాయ వసూళ్లను బలోపేతం చేసుకోవాలంటూ.. జీడీపీలో పన్నుల నిష్పత్తిని 2025 - 26లో 12 శాతం అంచనా స్థాయి నుంచి 2030 - 31 నాటికి 14 శాతానికి పెంచుకోవాలని పేర్కొంది. ద్రవ్య నిర్వహణ, నిర్మాణాత్మక సంస్కరణలు, పన్ను చెల్లింపుదారుల పరిధిని పెంచుకోవడంపై భారత్ దృష్టి సారించాలని సూచించింది. 2025–26లో భారత జీడీపీ 6.3 - 6.8 శాతం మధ్య వృద్ధిని నమోదు చేయవచ్చని అంచనా వేసింది. -
ఎఫ్సీఐ చూపు.. రుణాల వైపు
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) తన కార్యకలాపాల కోసం రూ.40,000 కోట్ల స్వల్పకాలిక రుణాలు పొందడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని యోచిస్తోంది. ఇప్పటికే ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి గణనీయంగా రూ.1.26 లక్షల కోట్లు అందుకున్నప్పటికీ ఈ రుణాలు తీసుకునేందుకు సిద్ధపడడం గమనార్హం. ఇప్పటివరకు అందుకున్న కేటాయింపులు 2025 ఆర్థిక సంవత్సరానికి మొత్తం అంచనా వేసిన రూ.1.34 లక్షల కోట్ల ఆహార సబ్సిడీలో 95 శాతంగా ఉన్నాయి.ఆర్థిక సవాళ్లు, కార్యాచరణ అవసరాలుదేశ ఆహార భద్రత, పంపిణీ నిర్వహణకు బాధ్యత వహించే ఎఫ్సీఐ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రస్తుత సబ్సిడీ కేటాయింపులకు, కార్పొరేషన్ నిర్వహణ ఖర్చులకు మధ్య అంతరాన్ని పూడ్చడానికి స్వల్పకాలిక రుణాలు దోహదపడతాయి. దేశవ్యాప్తంగా ఆహార ధాన్యాల సేకరణ, నిల్వ, పంపిణీ సజావుగా సాగేందుకు ఈ రుణాలు కీలకం కానున్నాయి.వడ్డీ రేట్లు, రుణ నిబంధనలునిర్దేశిత బ్యాంకులు అందించే ఈ స్వల్పకాలిక రుణాల వార్షిక వడ్డీ రేట్లు 6.79% నుంచి 7.39% మధ్య ఉంటాయి. ఈ రుణాలు సాధారణంగా 90 రోజుల కాలపరిమితికి లభిస్తాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రావాల్సిన మిగిలిపోయిన సబ్సిడీలు, వచ్చే ఆర్థిక సంవత్సరానికి కేటాయింపుల్లో కొంత భాగం విడుదలయ్యే వరకు ఎఫ్సీఐ తన రోజువారీ కార్యకలాపాలను నిర్వహించడానికి అవసరమైన లిక్విడిటీని ఈ రుణాల వల్ల సమకూర్చుకుంటుంది.ఇదీ చదవండి: పెట్రోల్లో కలిపే ఇథనాల్ 20 శాతానికి పెంపుసబ్సిడీ కేటాయింపు, ఆర్థిక నిర్వహణఆహార సబ్సిడీ ఖర్చుల్లో అధిక భాగాన్ని ఎఫ్సీఐకి విడుదల చేయడంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ క్రియాశీలకంగా వ్యవహరించింది. అయితే, ఇప్పటికే 95 శాతం నిధుల కేటాయింపు పూర్తయింది. మిగిలిన 5 శాతం సబ్సిడీ సాధారణంగా అవసరమైన ఖాతాల ఆడిట్ తరువాత పంపిణీ చేస్తారు. దీనికితోడు 2024 ఆర్థిక సంవత్సరం నుంచి ఖర్చుకాని రూ.5,900 కోట్ల సబ్సిడీని ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఫార్వర్డ్ చేశారు. అయినప్పటికీ ఎఫ్సీఐ 2025 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.10,000 కోట్ల లోటును అంచనా వేసింది. ఇందులో ఖాతాల సిటిల్మెంట్ తర్వాత లభించే రూ.6,000 కోట్లు ఉన్నాయి. కార్పొరేషన్ వద్ద ప్రస్తుతం 3.6 కోట్ల టన్నుల బియ్యం, 1.48 కోట్ల టన్నుల గోధుమలతో సహా 5.08 కోట్ల టన్నుల ఆహార ధాన్యాల నిల్వలు ఉన్నాయి. దేశ ఆహార భద్రత అవసరాలను తీర్చడానికి, బఫర్ స్టాక్స్ నిర్వహించడానికి ఈ నిల్వలు చాలా అవసరం. -
పెట్రోల్లో కలిపే ఇథనాల్ 20 శాతానికి పెంపు
గౌహతి: పెట్రోల్(Petrol)లో జీవ ఇంధనం ఇథనాల్(Ethanol)ను 20 శాతానికి పైగా కలపడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలనుకుంటున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ఇందులో సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు నీతి ఆయోగ్య సారథ్యంలో ఓ కమిటీ ఏర్పాటైందని వెల్లడించారు. పెట్రోల్లో 19.6 శాతం ఇథనాల్ కలపాలన్న లక్ష్యాన్ని ఇప్పటికే సాధించామన్నారు. 20 శాతం ఇథనాల్ను కలపాలన్న లక్ష్యాన్ని 2026 నాటికి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అయితే అంతకుమునుపే అంటే వచ్చే నెలలోనే ఈ లక్ష్యాన్ని సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.అడ్వాంటేజ్ అసోం 2.0 బిజినెస్ సమిట్లో బుధవారం మంత్రి పురి ప్రసంగించారు. మనకు 1,700 కోట్ల లీటర్ల ఇథనాల్ను కలిపే సామర్థ్యముండగా ఇప్పటికే 1,500 కోట్ల లీటర్లను వాడుతున్నామని చెప్పారు. వివిధ రకాలైన ఇంధన దిగుమతుల కోసం దేశం ఏటా 15,000 కోట్ల డాలర్లను విచ్చిస్తోందని మంత్రి వివరించారు. అయితే, సంప్రదాయ ఇంధనాలకు బదులుగా గ్రీన్ హైడ్రోజన్పై దృష్టి సారించాల్సి ఉందన్నారు. ప్రస్తుతం గ్రీన్ హైడ్రోజన్ ధర 4.5 డాలర్లుగా ఉంది. దీనిని 2.5 డాలర్లకు తగ్గించ గలిగితే ఈ రంగంలో పెను విప్లవమే వస్తుందన్నారు.ఇదీ చదవండి: అగ్రి, గృహ రుణాల్లో ఎగవేతలు పెరగొచ్చుప్రస్తుతం మన దేశంలో రోజుకు 55 లక్షల బారెళ్ల ముడి చమురును వాడుతున్నామని మంత్రి తెలిపారు. సమీప భవిష్యత్తులో ఇది 65 లక్షల బ్యారెళ్ల నుంచి 70 లక్షల బ్యారెళ్లకు పెరగనుందని, అదేవిధంగా దేశీయ పెట్రోలియం, సహజ వాయువుల ఉత్పత్తి 2030కల్లా 50 లక్షల టన్నులకు చేరనుందని మంత్రి పురి అంచనా వేశారు. -
అగ్రి, గృహ రుణాల్లో ఎగవేతలు పెరగొచ్చు
న్యూఢిల్లీ: పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులతో వ్యవసాయ, గృహ రుణాల్లో వచ్చే ఐదేళ్ల కాలంలో రుణ ఎగవేతలు 30 శాతానికి చేరుకోవచ్చని బీసీజీ సంస్థ అంచనా వేస్తోంది. పారిశ్రామిక విప్లవానికి ముందు నాటి రోజులతో పోల్చి చూస్తే ఉష్ణోగ్రతలు సగటున 1.2 డిగ్రీల మేర పెరిగాయని, ఇది తీర ప్రాంతాల్లో వరదలు, వ్యవసాయ ఉత్పత్తి క్షీణతకు దారితీస్తున్నట్టు తెలిపింది. ఈ తరహా తీవ్ర ప్రతికూల వాతావరణ పరిస్థితులతో తలసరి ఆదాయం తగ్గినట్టు తెలిపింది.షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల రుణాల్లో సగం మేర ప్రకృతిపై ఆధారపడి ఉంటాయని, ప్రకృతి విపత్తులు వాటి లాభాలపై ప్రభావం చూపిస్తాయని బీసీజీ వివరించింది. 2030 నాటికి దేశంలోని 42 జిల్లాలు సగటున రెండు డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతల పెరుగుదలను ఎదుర్కొంటాయని, ఈ ప్రకారం వచ్చే ఐదేళ్లలో 321 జిల్లాలపై ఉష్ణోగ్రతల ప్రభావం ఉంటుందని తెలిపింది. వాతావరణ మార్పులతో బ్యాంక్లకు 150 బిలియన్ డాలర్ల (రూ.12.9 లక్షల కోట్లు) మేర వార్షికంగా వ్యాపార అవకాశాలు రానున్నట్టు బీసీజీ సంస్థ అంచనా వేసింది. పర్యావరణ అనుకూల ఇంధనాలకు సంబంధించి ఈ మేరకు రుణ వితరణ అవకాశాలు లభిస్తాయని పేర్కొంది. 2070 నాటికి సున్నా కర్బన ఉద్గారాల విడుదల (తటస్థ స్థాయి) లక్ష్యాన్ని చేరుకోవడం కేవలం ప్రభుత్వ నిధులు ఒక్కటితోనే సాధ్యపడదని గుర్తు చేసింది.ఇదీ చదవండి: ఈపీఎఫ్వోలో కొత్తగా 16 లక్షల మందికి చోటుభారీ పెట్టుబడులు అవసరం‘భారత్ బొగ్గు, చమురు వినియోగాన్ని తగ్గించి పునరుత్పాదక ఇంధన వనరుల పెంపు పట్ల అంకిత భావాన్ని ప్రదర్శించింది. ఈ విధమైన ఇంధన పరివర్తనానికి ఏటా 150–200 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు అవసరం. కానీ దేశంలో ప్రస్తుతం వాతావరణ సంబంధిత రుణ వితరణలు 40–60 బిలియన్ డాలర్లుగానే ఉంటున్నాయి. మరో 100–150 బిలియన్ డాలర్లు అవసరం’ అని బీసీజీ ఎండీ, పార్ట్నర్ అభినవ్ భన్సాల్ తెలిపారు. ఇది బ్యాంక్లకు గణనీయమైన అవకాశాలను తీసుకొస్తుందంటూ.. ఇందులో ఎక్కువ భాగం 2030–40 మధ్య కాలంలో ఆచరణ రూపం దాల్చొచ్చని అభిప్రాయపడ్డారు. -
ఎన్బీఎఫ్సీ, సూక్ష్మ రుణాలకు మరింత మద్దతు!
బ్యాంక్లు మంజూరు చేసే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు), సూక్ష్మ రుణాలపై రిస్క్ వెయిటేజీని ఆర్బీఐ తగ్గించింది. కన్జ్యూమర్ మైక్రోఫైనాన్స్ రుణా లు, ఎన్బీఎఫ్సీలకు ఇచ్చే రుణాలపై 25 శాతం తగ్గించడంతో రిస్క్ వెయిట్ 100కు దిగొచ్చింది. దీంతో ఆయా రుణాల కోసం బ్యాంక్లు పక్కన పెట్టాల్సిన నిధుల పరిమాణం తగ్గుతుంది. తద్వారా బ్యాంక్ల లిక్విడిటీ మెరుగవుతుంది. ఆయా విభాగాలకు రుణ వితరణ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.2023 నవంబర్లో ఎన్బీఎఫ్సీలు, సూక్ష్మ రుణ సంస్థలకు రిస్క్ వెయిటేజీని ఆర్బీఐ పెంచడం గమనార్హం. అప్పటి నుంచి వాటి రుణ వితరణ కుంటుపడింది. ఎన్బీఎఫ్సీలకు వాణిజ్య బ్యాంక్ల రుణాలపై రిస్క్ వెయిట్ను 25 శాతం పాయింట్లను పెంచింది. అదే ఏడాది వ్యక్తిగత రుణాలకు సైతం 25 శాతం మేర వెయిట్ను పెంచి 125 చేసింది. గృహ రుణాలు, విద్యా రుణాలు, వాహన రుణాలు, బంగారం రుణాలకు మాత్రం మినహాయింపునిచ్చింది. కఠిన నిబంధనలతో ఎన్బీఎఫ్సీలకు బ్యాంక్ల నుంచి రుణాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా తగ్గిపోయాయి. ఈ పరిస్థితుల్లో ఎన్బీఎఫ్సీలు, సూక్ష్మ రుణాలకు గతంలో పెంచిన మేర వెయిటేజీని తాజా తగ్గించగా, దీన్ని నిపుణులు స్వాగతిస్తున్నారు.భారత్పై టారిఫ్ల ప్రభావం తక్కువేఆసియా పసిఫిక్ ప్రాంతంలోని (ఏపీఏసీ) ఇతర దేశాలతో పోలిస్తే ఎగుమతుల కోసం అమెరికాపై భారత్ ఆధారపడటం తక్కువగానే ఉంటోంది కాబట్టి, కొన్ని రంగాలు మినహా చాలా రంగాలపై ప్రతిపాదిత టారిఫ్ల ప్రభావం మరీ అంతగా ఉండకపోవచ్చని మూడీస్ రేటింగ్స్ ఒక నివేదికలో పేర్కొంది. ఆహారోత్పత్తులు, జౌళి, ఫార్మా మొదలైన ఉత్పత్తులకు టారిఫ్ రిసు్కలు ఉండొచ్చని వివరించింది.ఇదీ చదవండి: రూ.8.6 లక్షల కోట్ల ఎగుమతులుతాము రేటింగ్ ఇచ్చే భారతీయ కంపెనీలు చాలా మటుకు దేశీ మార్కెట్పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయని, అవి అమెరికా మార్కెట్పై ఆధారపడటం తక్కువేనని పేర్కొంది. టారిఫ్ల విషయంలో అమెరికాతో అత్యధిక వ్యత్యాసాలున్న ఏపీఏసీ దేశాల్లో భారత్, వియత్నాం, థాయ్లాండ్ మొదలైనవి ఉన్నట్లు వివరించింది. ఎల్రక్టానిక్స్, మోటర్ సైకిల్స్, ఫుడ్, టెక్స్టైల్స్ విభాగాలు ఎక్కువగా అమెరికాపై ఆధారపడి ఉన్నాయని పేర్కొంది. అమెరికాతో వివాదానికి తావివ్వకుండా, ద్వైపాక్షిక చర్చల ద్వారా బేరసారాలాడుకోవడం ద్వారా ప్రభుత్వాలు టారిఫ్ల విషయంలో వివేకవంతంగా వ్యవహరించే అవకాశం ఉందని మూడీస్ రేటింగ్స్ తెలిపింది. -
రూ.8.6 లక్షల కోట్ల ఎగుమతులు
న్యూఢిల్లీ: భారత ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ పరిశ్రమ వచ్చే 5–7 ఏళ్లలో ఎగుమతులను 100 బిలియన్ డాలర్లకు (రూ.8.6 లక్షల కోట్లు) పెంచుకునే లక్ష్యంతో పనిచేయాలని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. 2015లో ఎల్రక్టానిక్స్ గూడ్స్ ఎగుమతులు 167వ ర్యాంక్లో ఉంటే, అక్కడి నుంచి రెండో ర్యాంక్కు చేరుకున్నట్టు చెప్పారు. జనవరి నెలలో 3 బిలియన్ డాలర్ల ఎలక్ట్రానిక్ వస్తు ఎగుమతులు నమోదు కావడం గమనార్హం.ఇదీ చదవండి: యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ గురించి తెలుసా..?ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ తయారీదారుల సంఘం (ఏఈఈఎంఏ) సమావేశంలో భాగంగా మంత్రి గోయల్ మాట్లాడారు. ఎలక్ట్రానిక్స్ గూడ్స్ పరిశ్రమ అధిక నాణ్యత ఉత్పత్తులను, సేవలను ప్రపంచానికి అందించే విధంగా ప్రమాణాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. వినియోగదారులకు మెరుగైన ఉత్పత్తి విషయంలో భరోసానిచ్చే విధంగా పరిశ్రమ పనిచేయాలన్నారు. సమష్టిగా పనిచేస్తే పోటీతత్వాన్ని పెంచుకోవచ్చన్నారు. ఎంఎస్ఎంఈ రంగం, కస్టమర్ల ప్రయోజనాల మధ్య సమతూకాన్ని పాటించాలని పరిశ్రమకు సూచించారు. -
రష్యా నుంచి రూ.4.45 లక్షల కోట్ల చమురు
న్యూఢిల్లీ: ఉక్రెయిన్పై రష్యా యుద్ధం మొదలు పెట్టిన తర్వాత రష్యా నుంచి భారత్ వరుసగా మూడో ఏడాదీ 49 బిలియన్ యూరోల విలువైన (రూ.4.45 లక్షల కోట్లు సుమారు) చమురు కొనుగోలు చేసింది. ఈ వివరాలను ప్రైవేటు పరిశోధనా సంస్థ అయిన సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (సీఆర్ఈఏ) నివేదిక రూపంలో వెల్లడించింది.భారత్ సాధారణంగా మిడిల్ఈస్ట్ దేశాల నుంచి చమురు సమకూర్చుకుంటుంది. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై రష్యా దాడి మొదలు పెట్టిన తర్వాత మారిన సమీకరణాలతో.. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ గణనీయంగా పెంచడం గమనార్హం. పాశ్చాత్య దేశాలు ఆర్థిక ఆంక్షలు విధించడం, యూరోపియన్ దేశాలు కొనుగోళ్లను తగ్గించడంతో.. అంతర్జాతీయ బెంచ్మార్క్ కంటే రష్యా చాలా తక్కువ ధరకే చమురును ఆఫర్ చేయడం ఇందుకు కారణం. అంతకుముందు వరకు దేశ చమురు దిగుమతుల్లో రష్యా వాటా ఒక శాతంలోపే ఉండగా.. అక్కడి నుంచి 40 శాతానికి పెరిగాయి.‘‘రష్యా నుంచి మూడో ఏడాది అత్యధికంగా చైనా 78 బిలియన్ యూరోల చమురు కొనుగోలు చేయగా, భారత్ 49 బిలియన్ యూరోలు, టర్కీ 34 బిలియన్ యూరోల చొప్పున కొనుగోలు చేశాయి. దీంతో రష్యా చమురు ఆదాయాల్లో ఈ మూడు దేశాలు 74 శాతం సమకూర్చాయి’’అని సీఆర్ఈఏ తెలిపింది. ఉక్రెయిన్పై దాడి ప్రారంభించిన మూడో ఏడాది రష్యాకి శిలాజ ఇంధనాల ద్వారా 242 బిలియన్ యూరోలు, ఉక్రెయిన్పై దాడి మొదలు పెట్టిన తర్వాత మొత్తం 847 బిలియన్ యూరోల ఆదాయం లభించినట్టు వెల్లడించింది. ఒకానొక దశలో మార్కెట్ రేటు కంటే బ్యారెల్కు 18–20 డాలర్లు తక్కువే చమురును రష్యా ఆఫర్ చేసినట్టు తెలిపింది. దీంతో భార్ తక్కువ రేటుపై చమురును సొంతం చేసుకోగలిగినట్టు పేర్కొంది. అయితే ఇటీవలి కాలంలో రష్యా ఆఫర్ చేసే డిస్కౌంట్ బ్యారెల్పై 3 డాలర్లకు తగ్గినట్టు వెల్లడించింది. యూరప్, జీ7 దేశాలకు ఎగుమతులు భారత్లోని రిఫైనరీలు చౌకగా లభించిన రష్యా ముడి చమురును పెట్రోల్, డీజిల్ ఇంధనాలుగా మార్చి యూరప్, జీ7 దేశాలకు ఎగుమతి చేసినట్టు ఈ నివేదిక తెలిపింది. ఉక్రెయిన్పై రష్యా దాడి ప్రారంభించిన మూడో ఏడాది జీ7 దేశాలు 18 బిలియన్ యూరోల ఆయిల్ను భారత్, టరీ్కలోని రిఫైనరీల నుంచి కొనుగోలు చేసినట్టు పేర్కొంది. భారత్, టర్కీ రిఫైనరీల నుంచి ఈయూ అతిపెద్ద చమురు దిగుమతిదారుగా నిలిచింది. రిఫైనరీల మొత్తం ఉత్పత్తిలో 13 శాతం ఇలా ఎగుమతి అయినట్టు ఈ నివేదిక తెలిపింది. ఐరోపా యూనియన్లో నెదర్లాండ్స్ 3.3 బిలియన్ యూరోలు, ఫ్రాన్స్ 1.4 బిలియన్ యూరోలు, రొమానియా 1.2 బిలియన్ యూరోలు, స్పెయిన్ 1.1 బిలియన్ యూరోల చొప్పున భారత్, టర్కీ రిఫైనరీల నుంచి కొనుగోలు చేసినట్టు పేర్కొంది. -
పీఎస్యూ బ్యాంకుల్లో వాటా విక్రయంపై దృష్టి
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు, లిస్టెడ్ ఫైనాన్షియల్ సంస్థలలో వాటా విక్రయంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకు అనుగుణంగా పెట్టుబడులు, పబ్లిక్ ఆస్తుల నిర్వహణ సంస్థ(దీపమ్) మర్చంట్ బ్యాంకర్లు, న్యాయసలహా సంస్థలకు ఆహ్వానం పలికింది. రెండు రకాల ప్రతిపాదనల(రిక్వస్ట్ ఫర్ ప్రపోజల్–ఆర్ఎఫ్పీ)కు తెరతీసింది. దీనిలో భాగంగా మర్చంట్ బ్యాంకర్లు, న్యాయసలహా సంస్థలను మూడేళ్ల కాలానికి దీపమ్ ఎంపిక చేయనుంది. గడువును మరో ఏడాది పొడిగించేందుకు వీలుంటుంది. ఎంపికైన సంస్థలు వాటాల విక్రయం విషయంలో ప్రభుత్వానికి సలహాలు, సూచనలు అందించవలసి ఉంటుంది. ఎంపిక చేసిన బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలలో వాటాల విక్రయంలో ప్రభుత్వానికి తగిన విధంగా సహకారం అందించవలసి ఉంటుంది. ఇందుకుగాను మర్చంట్ బ్యాంకర్లు బిడ్స్ దాఖలు చేసేందుకు మార్చి 27వరకూ దీపమ్ గడువు ప్రకటించింది. అయితే రెండు కేటగిరీలలో మర్చంట్ బ్యాంకర్లు దరఖాస్తు చేయవలసి ఉంటుంది. ఏప్లస్ విభాగంకింద రూ. 2,500 కోట్లు లేదా అంతకుమించిన పరిమాణంగల లావాదేవీల నిర్వహణ ఉంటుంది. ఏ కేటగిరీలో రూ. 2,500 కోట్ల విలువలోపు వాటాల విక్రయంలో ప్రభుత్వానికి మద్దతివ్వవలసి ఉంటుందని దీపమ్ తెలియజేసింది. ఆర్థిక శాఖ నిర్వహణలోని దీపమ్ ప్రభుత్వ రంగ సంస్థలలో వాటా విక్రయ వ్యవహారాలను పర్యవేక్షించే సంగతి తెలిసిందే. ప్రస్తుతం పబ్లిక్కు కనీసం 25 శాతం వాటా నిబంధనను పలు ప్రభుత్వ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అమలు చేయవలసి ఉంది. ఇందుకు ప్రభుత్వం 2026 ఆగస్ట్ 1వరకూ గడువునిచ్చింది. తద్వారా ప్రభుత్వ వాటాను తగ్గించడంతోపాటు.. పబ్లిక్ వాటా పెంచవలసి ఉంది. ఐదు బ్యాంకులు ప్రధానంగా ఐదు ప్రభుత్వ రంగ బ్యాంకులు పబ్లిక్కు కనీసం 25 శాతం వాటాను అమలు చేయవలసి ఉంది. ప్రస్తుతం పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్లో ప్రభుత్వ వాటా 98.3 శాతంకాగా.. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో 96.4 శాతం, యుకో బ్యాంక్లో 95.4 శాతం, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 93.1 శాతం, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 86.5 శాతం చొప్పున వాటా కలిగి ఉంది. ఇదే విధంగా ఐఆర్ఎఫ్సీలో 86.36 శాతం, న్యూ ఇండియా ఎస్యూరెన్స్లో 85.44 శాతం, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో 82.4 శాతం చొప్పున ప్రభుత్వానికి వాటా ఉంది. వెరసి ఈ సంస్థలలో పబ్లిక్కు కనీస వాటా నిబంధనను అమలు చేయవలసి ఉంది. ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంక్ ప్రయివేటైజేషన్ ప్రక్రియ కొనసాగుతున్న విషయం విదితమే. -
ఆసియాపసిఫిక్ దేశాలకు టారిఫ్ ముప్పు
న్యూఢిల్లీ: ట్రంప్ హయాంలో పలు ఆసియా పసిఫిక్ దేశాలకు అధిక టారిఫ్ల రిస్క్ లు నెలకొన్నాయని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ వెల్లడించింది. భారత్, దక్షిణ కొరియా, థాయ్ల్యాండ్ తదితర దేశాలకు ముప్పు ఉందని ఒక నివేదికలో పేర్కొంది. మిగతా దేశాలతో పోలిస్తే తైవాన్, వియత్నాం, థాయ్ల్యాండ్, దక్షిణ కొరియాలాంటివి అమెరికాపై ఎక్కువగా ఆధారపడినందువల్ల టారిఫ్లు విధిస్తే ఆర్థికంగా వాటిపై ప్రభావం పడుతుందని వివరించింది. భారత్, జపాన్లో దేశీ మార్కెట్ కాస్త భారీగా ఉండటం వల్ల టారిఫ్ల ప్రభావం నుంచి కొంత ఉపశమనం ఉండొచ్చని వివరించింది. భారత్ సహా వాణిజ్య భాగస్వాములపై ప్రతీకార టారిఫ్లు విధిస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేసిన నేపథ్యంలో నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. ఆసియా పసిఫిక్లోని కొన్ని దేశాలు తమ ఎగుమతులపై అమెరికా విధించే సుంకాలకన్నా అత్యధికంగా అమెరికన్ ఉత్పత్తుల దిగుమతులపై విధిస్తున్నాయని నివేదిక వివరించింది. ప్రతీకార టారిఫ్ చర్యల కోసం సదరు దేశాలను పరిశీలించే అవకాశం ఉందని పేర్కొంది. -
జపాన్ ఎగుమతులకు బూస్ట్
న్యూఢిల్లీ: ఎగుమతులు పెంచుకోవడం ద్వారా ఇండియా జపాన్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యంలో సమతూకాన్ని తీసుకురానున్నట్లు వాణిజ్యం, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఇందుకు తగిన చర్యలు చేపడుతున్నట్లు తెలియజేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) ఏప్రిల్–జనవరిలో జపాన్కు దేశీ ఎగుమతులు 21 శాతంపైగా ఎగసి 5.1 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇదే సమయంలో దిగుమతుల విలువ 9.1 శాతం పెరిగి 15.92 బిలియన్ డాలర్లను తాకింది. వెరసి 10.82 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు నమోదైంది. గతేడాది(2023–24)లో జపాన్కు భారత్ ఎగుమతులు 5.15 బిలియన్ డాలర్లుకాగా.. దిగుమతులు 17.7 బిలియన్ డాలర్లు. వాణిజ్య లోటు 12.55 బిలియన్ డాలర్లుగా నమోదైంది. దీంతో రెండు దేశాల మధ్య వాణిజ్య సమతూకానికి చర్యలు చేపట్టినట్లు గోయల్ తెలియజేశారు. ఇందుకు అనుగుణంగా ఎగుమతుల పెంపుపై దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. తద్వారా పరస్పర లబ్దికి వీలుంటుందని ఇండియా–జపాన్ ఆర్థిక వ్యవస్థ, పెట్టుబడుల(ఎకానమీ అండ్ ఇన్వెస్ట్మెంట్) సదస్సులో గోయల్ తెలియజేశారు. ఈ సందర్భంగా గ్రీన్ ఎనర్జీ, పునరుత్పాదక ఇంధనం, హైటెక్ సెమీకండక్టర్ల తయారీ, ఎల్రక్టానిక్స్ గూడ్స్, ఏఐ తదితర విభాగాలలో మరింత సహకారానికి జపనీస్ సంస్థలను ఆహ్వానించారు. సమీకృత స్వేచ్చా వాణిజ్య ఒప్పందం(సీఈపీఏ)పై రెండు దేశాలు 2011లో సంతకాలు చేశాయి. 1,400కుపైగా జపనీస్ కంపెనీలు భారత్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. పలు జపనీస్ కంపెనీలతో 8 రాష్ట్రాలలో 11 పారిశ్రామిక టౌన్షిప్లు విస్తరించాయి. ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో ముంబై, అహ్మదాబాద్ హైస్పీ డ్ రైల్ సహా ఢిల్లీ, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై మెట్రో వ్యవస్థలు దేశీ అభివృద్ధిలో జపనీస్ కంపెనీల భాగస్వామ్యాన్ని ప్రతిఫలిస్తున్నట్లు గోయల్ ప్రస్తావించారు. సమీప భవిష్యత్లో ముంబై, అహ్మదాబాద్ల మధ్య బుల్లెట్ ట్రయిన్ సరీ్వసులు ప్రారంభంకాగలవన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. -
ఆర్బీఐ మరోసారి వడ్డీరేట్ల కోత..?
ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే లక్ష్యంతో వ్యూహాత్మక మార్పులో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రాబోయే రోజుల్లో మరింత వడ్డీరేట్ల కోతలను అమలు చేయాలని భావిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) ద్రవ్యోల్బణాన్ని నియంత్రించి వృద్ధిని ప్రోత్సహించడంపై దృష్టి సారించింది. దాంతో రాబోయే రోజుల్లో మరిన్ని వడ్డీరేట్ల కోతలుండే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.2025 ఫిబ్రవరి 7న ఆర్బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు కట్ చేస్తూ 6.25 శాతానికి తగ్గించింది. దాదాపు ఐదేళ్లలో ఎంపీసీ తొలిసారి ఈ నిర్ణయం తీసుకుంది. సమీప భవిష్యత్తులో ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంటుందని ఆర్బీఐ భావిస్తోంది. వినియోగం, పెట్టుబడుల మందగమనంతో భారత ఆర్థిక వ్యవస్థ సవాళ్లను ఎదుర్కొంటోంది. రుణ వ్యయాన్ని తగ్గించడం ద్వారా, ఖర్చులు, పెట్టుబడులను ఉత్తేజపరిచేందుకు ఆర్బీఐ చర్యలు తీసుకుంటోంది. ద్రవ్యోల్బణం ఆందోళనకరంగా ఉన్నప్పటికీ క్రమంగా తగ్గుతుందని, ఆర్బీఐ లక్ష్యానికి అనుగుణంగా ఉందని ఎంపీసీ భావిస్తోంది.ఇదీ చదవండి: ఫిబ్రవరిలో సవరించిన ఎఫ్డీ వడ్డీ రేట్లు..అంతర్జాతీయ ఆర్థిక వాతావరణం కూడా ఆర్బీఐ నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రపంచ అనిశ్చితుల నేపథ్యంలో వృద్ధికి ఊతమిచ్చేందుకు పలు కేంద్ర బ్యాంకులు అనుకూలమైన ద్రవ్య విధానాలను అవలంబిస్తున్నాయి. ఆర్బీఐ కూడా అదేబాటలో నడవాలని భావిస్తోంది. రెపో రేటు తగ్గింపు వల్ల రుణాలపై వడ్డీ రేట్లు తగ్గుతాయని, గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు వినియోగదారులకు చౌకగా లభిస్తాయని ఆర్బీఐ పేర్కొంది. ఇది వినియోగదారుల వ్యయాన్ని పెంచుతుందని, ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుందని నిపుణులు భావిస్తున్నారు. -
టారిఫ్లు తగ్గిస్తే దేశానికే మంచిది: నీతి ఆయోగ్ సీఈవో
న్యూఢిల్లీ: టారిఫ్లు (దిగుమతి సుంకాలు) ఏ దేశాన్ని కాపాడలేవని, ఎవరో చెప్పారని కాకుండా భారత్ తన ప్రయోజనాల కోసం సుంకాలు తగ్గించాలని నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రమణ్యం అభిప్రాయపడ్డారు. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (AIMA) 69వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు.అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే ప్రపంచంతో స్వేచ్ఛాయుత వాణిజ్యం నెరపడం ఐదు కీలక ప్రాధాన్యతల్లో ఒకటిగా ఉండాలన్నారు. టారిఫ్లు తగ్గించేందుకు వీలుగా భారత్ యూరోపియన్ యూనియన్, బ్రిటన్, ఇతర ప్రముఖ ఆర్థిక వ్యవస్థలతో ముందుగా వాణిజ్య ఒప్పందాలను పూర్తి చేసుకోవాలని సూచించారు.కేంద్రం, రాష్ట్రాల స్థాయిలో నియంత్రణలను తొలగించడం ప్రపంచ సరఫరా వ్యవస్థతో భారత్ అనుసంధానానికి కీలకమన్నారు. భారత్లో పెట్టుబడులకు ఆసక్తి ఉన్నప్పటికీ, ఇన్వెస్టర్లు ఇక్కడి వచ్చి చూసి వేరే దేశాలకు వెళ్లిపోతున్నట్టు చెప్పారు. అంతర్జాతీయ కంపెనీలు అనుసరిస్తున్న ‘చైనా ప్లస్ వన్’ విధానంతో ఇండోనేషియా, వియత్నాం, టర్కీ ఎక్కువగా లాభపడుతున్నట్టు తెలిపారు. ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాలకు మించి నియంత్రణల తొలగింపు, నైపుణ్యాభివృద్ది అన్నవి అంతర్జాతీయ సరఫరా వ్యవస్థకు అవసరమన్నారు.వివిధ రంగాల్లో అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో భారత్ను భాగం చేసేందుకు నీతి ఆయోగ్ కృషి చేస్తున్నట్టు సుబ్రమణ్యం తెలిపారు. ఎల్రక్టానిక్స్ విడిభాగాలకు సంబంధించి తాము చేసిన సిఫారసులు కేబినెట్ ఆమోదానికి వేచి ఉన్నట్టు్ట చెప్పారు. ఆటో విడిభాగాలు, కెమికల్స్, టెక్స్టైల్స్, పాదరక్షలను సైతం అంతర్జాతీయ సరఫరా వ్యవస్థతో అనుసంధానించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించినట్టు ప్రకటించారు. తాము రూపొందించిన జాతీయ తయారీ మిషన్ను మూడు నెలల్లో ప్రారంభించనున్నట్టు తెలిపారు. అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు విద్య, వ్యవసాయానికి సైతం ఎంతో ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. -
ఫిబ్రవరిలో సవరించిన ఎఫ్డీ వడ్డీ రేట్లు.. ఏ బ్యాంకులో ఎంతంటే..
ఫిబ్రవరి 2025లో కొన్ని బ్యాంకులు తమ ఫిక్స్డ్ డిపాజిట్ (Fixed Deposit) వడ్డీ రేట్లను సవరించాయి. పెట్టుబడిదారులకు, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు ఆకర్షణీయమైన రాబడిని అందించాలని నిర్ణయించాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల రెపో రేటును తగ్గించినప్పటికీ, కొన్ని బ్యాంకులు ఎఫ్డీలపై వడ్డీ రేట్లను పెంచలేదు. కొన్ని ఆర్థిక సంస్థలు సీనియర్ సిటిజన్లకు ఏటా 9.10% వరకు వడ్డీ రేట్లు అందిస్తున్నాయి. ఇటీవల ఎఫ్డీ వడ్డీరేట్లను అప్డేట్ చేసిన బ్యాంకుల వివరాలు కింద తెలుసుకుందాం.సిటీ యూనియన్ బ్యాంక్జనరల్ పబ్లిక్: 7 రోజుల నుంచి 10 సంవత్సరాల కాలపరిమితికి సంవత్సరానికి 5% నుంచి 7.50% వరకు వడ్డీ.సీనియర్ సిటిజన్లు: అదే కాలపరిమితికి సంవత్సరానికి 5% నుంచి 8% వరకు.అత్యధిక వడ్డీ రేటు: సాధారణ ప్రజలకు 333 రోజుల కాలపరిమితికి సంవత్సరానికి 7.50%, సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి 8%.అమలు తేదీ: ఫిబ్రవరి 10, 2025.డీసీబీ బ్యాంక్జనరల్ పబ్లిక్: 7 రోజుల నుంచి 10 సంవత్సరాల కాలపరిమితికి సంవత్సరానికి 3.75% నుంచి 8.05% వరకు వడ్డీ లభిస్తుంది.సీనియర్ సిటిజన్లు: అదే కాలపరిమితికి సంవత్సరానికి 4.25% నుంచి 8.55% వరకు వడ్డీ.అత్యధిక వడ్డీ రేటు: 19 నుంచి 20 నెలల కాలపరిమితికి వార్షికంగా 8.05%, సీనియర్ సిటిజన్లకు 8.55%.అమలు తేదీ: ఫిబ్రవరి 14, 2025.కర్ణాటక బ్యాంక్జనరల్ పబ్లిక్: 7 రోజులు-10 సంవత్సరాల కాలపరిమితికి సంవత్సరానికి 3.50% నుంచి 7.50% వరకు వడ్డీ లభిస్తుంది.సీనియర్ సిటిజన్లు: ఇదే కాలపరిమితికి సంవత్సరానికి 3.75% నుంచి 8% వరకు వడ్డీ.గరిష్ట వడ్డీ రేటు: సాధారణ ప్రజలకు 401 రోజుల కాలపరిమితికి సంవత్సరానికి 7.50%, సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి 8%.అమలు తేదీ: ఫిబ్రవరి 18, 2025.శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్జనరల్ పబ్లిక్: 7 రోజులు-10 సంవత్సరాల కాలపరిమితికి సంవత్సరానికి 3.50% నుంచి 8.55% వరకు.సీనియర్ సిటిజన్లు: ఇదే కాలపరిమితికి సంవత్సరానికి 4% నుండి 9.05% వరకు వడ్డీ లభిస్తుంది.అత్యధిక వడ్డీ రేటు: సాధారణ ప్రజలకు 1 రోజు నుంచి 18 నెలల కంటే తక్కువ కాలపరిమితికి, 12 నెలల కాలపరిమితికి ఏటా 8.55%, సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి 9.05% వడ్డీ.అమలు తేదీ: ఫిబ్రవరి 18, 2025.ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్జనరల్ పబ్లిక్: 7 రోజుల నుంచి 10 సంవత్సరాల కాలపరిమితికి సంవత్సరానికి 3.75% నుంచి 8.25% వరకు వడ్డీ లభిస్తుంది.సీనియర్ సిటిజన్లు: ఇదే కాలపరిమితికి సంవత్సరానికి 4.25% నుంచి 8.75% వరకు వడ్డీ లభిస్తుంది.అత్యధిక వడ్డీ రేటు: 12 నెలల నుంచి 24 నెలల కాలపరిమితికి సాధారణ పౌరులకు సంవత్సరానికి 8.25%, సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి 8.75% వడ్డీ.అమలు తేదీ: ఫిబ్రవరి 20, 2025.ఇదీ చదవండి: ఈవీ బ్యాటరీ తయారీలోకి కైనెటిక్ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్జనరల్ పబ్లిక్: 7 రోజులు-10 సంవత్సరాల కాలపరిమితికి సంవత్సరానికి 4% నుంచి 8.50% వరకు.సీనియర్ సిటిజన్లు: అదే కాలపరిమితికి సంవత్సరానికి 4.50% నుండి 9.10% వరకు వడ్డీ లభిస్తుంది.అత్యధిక వడ్డీ రేటు: 12 నెలల నుంచి 24 నెలల కాలపరిమితికి సాధారణ పౌరులకు సంవత్సరానికి 8.50%, సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి 9.10% వడ్డీ.అమలు తేదీ: ఫిబ్రవరి 22, 2025. -
యూఎస్ రక్షణశాఖలో 5,400 మందికి లేఆఫ్స్
అమెరికా తన రక్షణశాఖలో పనిచేస్తున్న 5,400 మంది సిబ్బందిని ఉద్యోగంలో నుంచి తొలగించబోతున్నట్లు తెలిపింది. అమెరికా పెంటగాన్(యూఎస్ డిఫెన్స్ ప్రధాన కార్యాలయం)లో డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE) సిబ్బంది సందర్శించి వచ్చే వారం నుంచి ప్రొబేషనరీ ఉద్యోగులకు లేఆఫ్స్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఏడాది కంటే తక్కువ కాలం సర్వీసులో ఉన్నవారిపై ఈ ప్రభావం పడనుందని పేర్కొంది. దాంతోపాటు తదుపరి నియామకాలను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు డీఓజీఈ స్పష్టం చేసింది. యూఎస్ రక్షణశాఖ సామర్థ్యాన్ని పెంచడం, ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిబ్బంది తెలిపారు.కొవ్వును తగ్గించి కండరాలు పెంచాలి..అమెరికాలో మొత్తంగా ప్రభుత్వ అదీనంలోని శ్రామిక శక్తిని 5-8% తగ్గించే విస్తృత వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ పేర్కొన్నారు. సామర్థ్యాలను పెంచడానికి, అధ్యక్షుడి ప్రాధాన్యతలపై డిపార్ట్మెంట్ దృష్టి సారించిందన్నారు. ఈ లేఆఫ్స్కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ.. కొవ్వు(హెడ్ క్వార్టర్స్లోని సిబ్బంది)ను తగ్గించి కండరాలను (వార్ఫైటర్లు) పెంచాల్సిన అవసరం ఉందన్నారు. రక్షణ విభాగంలో ఉన్న వనరులను మరింత సమర్థంగా వినియోగించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ చర్య వల్ల కార్యకలాపాలను క్రమబద్ధీకరించనున్నట్లు పేర్కొన్నారు. అయితే ఇలాంటి చర్యలపై కొందరు విభిన్నంగా స్పందిస్తున్నారు. ఇది అంతిమంగా అధ్యక్షుడు ట్రంప్ ప్రాధాన్యతలకు నిధులు సమకూర్చేందుకేనని అభిప్రాయపడుతున్నారు.అతిపెద్ద అమెరికా ప్రభుత్వ సంస్థ అయిన డిఫెన్స్ విభాగంలో 7,00,000 మందికి పైగా పూర్తికాల కార్మికులు పనిచేస్తున్నారు. ఫెడరల్ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ దృష్టి సారించింది. అందులో భాగంగానే ఇలా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు కొందరు భావిస్తున్నారు.ఇదీ చదవండి: రుణాల ముందస్తు ముగింపుపై ఛార్జీలొద్దుపెంటగాన్పెంటగాన్ యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రధాన కార్యాలయం. వర్జీనియాలోని ఆర్లింగ్టన్లో ఉన్న ఈ ఆఫీస్ 6.5 మిలియన్ చదరపు అడుగుల స్థలంలో విస్తరించి ప్రపంచంలోని అతిపెద్ద కార్యాలయ భవనాల్లో ఒకటిగా ఉంది. వీటిలో కేవలం 3.7 మిలియన్ చదరపు అడుగులను మాత్రమే కార్యాకలాపాలకు ఉపయోగిస్తున్నారు. ఈ భవనాన్ని యూఎస్ మిలిటరీకి చిహ్నంగా భావిస్తారు. ఇందులో సుమారు 23,000 మంది సైనిక, ఇతర ఉద్యోగులు, 3,000 మంది రక్షణేతర సహాయక సిబ్బంది పని చేస్తున్నారు. -
రుణాల ప్రీక్లోజర్ ఛార్జీలపై ఆర్బీఐ స్పందన
బ్యాంక్లు రుణాల ముందస్తు చెల్లింపులపై రుణగ్రహీతల నుంచి ప్రీ పేమెంట్ పెనాల్టీ/ ఫోర్క్లోజర్ పేరుతో వసూలు చేసే ఛార్జీల విధానాన్ని తొలగించే దిశగా ఆర్బీఐ(RBI) ముఖ్యమైన ప్రతిపాదన చేసింది. వ్యక్తులు, ఎంఎస్ఈలు తీసుకునే అన్ని ఫ్లోటింగ్ రేటు రుణాలు, వ్యాపార అవసరాలకు తీర్చుకునే వాటిపైనా ముందస్తు చెల్లింపుల చార్జీలు ఉండకూడదన్నది ఈ ప్రతిపాదన ఉద్దేశం.‘టైర్ 1, టైర్ 2 ప్రాథమిక అర్బన్ కోపరేటివ్ బ్యాంక్లు, బేస్ లేయర్ ఎన్బీఎఫ్సీలు మినహా అన్ని రెగ్యులేటెడ్ ఎంటిటీలు (ఆర్బీఐ నియంత్రణ పరిధిలోని అన్ని రకాల బ్యాంక్లు, ఇతర ఎన్బీఎఫ్సీలు) ఫ్లోటింగ్ రేటు రుణాలను ముందుగా తీర్చివేస్తే ఎలాంటి చార్జీలు/పెనాల్టీలు విధించరాదు’ అని ఆర్బీఐ ముసాయిదా సర్క్యులర్ పేర్కొంది. ఎంఎస్ఈ రుణ గ్రహీతలు అయితే రూ.7.50 కోట్ల వరకు పూర్తి రుణ మొత్తాలకు ఇది వర్తిస్తుంది. ఎలాంటి లాకిన్ పీరియడ్ లేకుండా దీన్ని అమలు చేయాలని పేర్కొంది. ఈ ముసాయిదాపై మార్చి 21 వరకు సూచనలు, సలహాలను ఆహ్వానిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది.రిస్క్ ఇన్వెస్టింగ్పై అవగాహన కల్పించాలిఅన్సెక్యూర్డ్ రుణాలు, వేలం వెర్రిగా డెరివేటివ్స్ ట్రేడింగ్ పెరిగిపోతుండటంపై రిజర్వ్ బ్యాంక్ డిప్యుటీ గవర్నర్ ఎం రాజేశ్వర్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. తాత్కాలిక లాభాల్లో ఉండే ఆకర్షణ వల్ల దీర్ఘకాలిక ఆర్థిక భద్రత గురించి పట్టించుకోని పరిస్థితి ఉంటోందని పేర్కొన్నారు. అనాలోచితమైన విధంగా ఆర్థిక సేవలను విస్తరిస్తే (ఆర్థికీకరణ) రిస్కులు తప్పవని, ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆర్థిక సంస్థలను హెచ్చరించారు.ఇదీ చదవండి: ‘చిన్న షేర్ల విషయంలో అప్పుడే హెచ్చరించాం’ఈ నేపథ్యంలో ప్రజల్లో అన్సెక్యూర్డ్ రుణాలు, స్పెక్యులేటివ్ ఇన్వెస్టింగ్ వల్ల తలెత్తే రిస్క్ల గురించి అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. ఈ విషయంపై ఆర్థిక రంగానికి చెందిన ఇతర నియంత్రణ సంస్థలతో కూడా ఆర్బీఐ కలిసి పని చేస్తోందని రావు చెప్పారు. ఆర్థిక అక్షరాస్యత లేకపోవడం వల్లే అమాయకులు మోసగాళ్ల బారిన పడుతున్న ఉదంతాలు పెరుగుతున్నాయని వివరించారు. ఏదైనా ఎదురుదెబ్బ తగిలినప్పుడు మొత్తం ఆర్థిక వ్యవస్థపైనే నమ్మకం పోయే ప్రమాదం ఉంది కాబట్టి, ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వ్యవస్థే పూనుకోవాలని సూచించారు. శరవేగంగా మారిపోతున్న ప్రపంచంలో నియంత్రణనేది చాలా సున్నితమైన అంశంగా మారిందని రావు చెప్పారు. నియంత్రణను మరీ తగ్గిస్తే వ్యవస్థాగతంగా రిస్క్లు పెరుగుతాయని, అలాగని మరీ ఎక్కువగా నియంత్రిస్తే కొత్త ఆవిష్కరణలకు, రుణ లభ్యతకు అవరోధాలు ఏర్పడతాయని ఆయన పేర్కొన్నారు. -
బీవోఐలో రూ. 227 కోట్ల ఫ్రాడ్
న్యూఢిల్లీ: గుప్తా పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే సంస్థ రూ. 227 కోట్ల మేర రుణం తీసుకుని, మోసం చేసినట్లు ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) వెల్లడించింది. ఈ ఖాతాను మొండిపద్దుగా (ఎన్పీఏ) వర్గీకరించి, రిజర్వ్ బ్యాంక్ దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించింది. రూ. 227 కోట్లకు గాను రూ. 213 కోట్లు ప్రొవిజనింగ్ చేసినట్లు బ్యాంకు తెలిపింది. ఒరిస్సాకు చెందిన గుప్తా పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అటు పంజాబ్ నేషనల్ బ్యాంకులో (పీఎన్బీ) కూడా రూ. 271 కోట్ల ఫ్రాడ్కి పాల్పడింది. పీఎన్బీ కూడా దీన్ని ఎన్పీఏగా వర్గీకరించి, ప్రొవిజనింగ్ చేసి, రిజర్వ్ బ్యాంక్ దృష్టికి తీసుకెళ్లింది. డిసెంబర్తో ముగిసిన మూడో త్రైమాసికంలో బీవోఐ నికర లాభం 35% పెరిగి రూ. 1,870 కోట్ల నుంచి రూ. 2,517 కోట్లకు చేరగా, ఆదాయం రూ.16,411 కోట్ల నుంచి రూ.19,957 కోట్లకు ఎగసింది. -
రూ.26,000 కోట్ల విలువైన బిడ్లను తిరస్కరించిన ఆర్బీఐ
బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీని సులభతరం చేయడంలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 91 రోజులు, 182 రోజులకు సంబంధించిన ట్రెజరీ బిల్లుల వేలానికి వేసిన బిడ్లను తిరస్కరించింది. ఈ బిడ్ల విలువ రూ.26,000 కోట్లుగా ఉంది. ఫారెక్స్ మార్కెట్లో ఆర్బీఐ జోక్యం చేసుకోవడం, డాలర్లను విక్రయించడం, రూపాయి లిక్విడిటీని తగ్గించడం వంటి నగదు సంక్షోభం పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకుంది.ట్రెజరీ బిల్లులుట్రెజరీ బిల్లులను సాధారణంగా టీ-బిల్లులు అని పిలుస్తారు. ఇవి నిధుల సమీకరణ కోసం ప్రభుత్వం జారీ చేసే స్వల్పకాలిక రుణ సాధనాలుగా తోడ్పడుతాయి. అవి ప్రామిసరీ నోట్ల రూపంలో ఉంటాయి. ఒక సంవత్సరంలోపు లేదా నిర్ణీత గడువులోపు తిరిగి చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇస్తుంది. టీ-బిల్లుల కాలపరిమితి 91 రోజులు, 182 రోజులు లేదా 364 రోజులు. ఇతర రకాల ప్రభుత్వ బాండ్ల మాదిరిగా కాకుండా టీ-బిల్లులకు కాలానుగుణ వడ్డీ సమకూరదు. దానికి బదులుగా, అవి వాటి ముఖ విలువ(ఫేస్ వాల్యూ)కు డిస్కౌంట్ను అందిస్తాయి. కొనుగోలు ధర, ముఖ విలువ మధ్య వ్యత్యాసం పెట్టుబడిదారులకు సంపాదించిన వడ్డీని సూచిస్తుంది. టీ-బిల్లులను సురక్షితమైన, అత్యంత లిక్విటిడీ పెట్టుబడుల్లో ఒకటిగా పరిగణిస్తారు. ఎందుకంటే వీటికి ప్రభుత్వం హామీ ఇస్తుంది. తక్కువ మెచ్యూరిటీ వ్యవధిని కలిగి ఉంటాయి.ఇదీ చదవండి: 2047 నాటికి రూ.3,000 లక్షల కోట్ల ఆదాయం!బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ పరిస్థితుల కారణంగా తాజాగా 91 రోజులు, 182 రోజుల టీ-బిల్లుల కోసం వేసిన బిడ్లను ఆర్బీఐ తిరస్కరించింది. కానీ, 364 రోజుల టీ-బిల్లుల కోసం రూ.7,000 కోట్ల విలువైన బిడ్లను మాత్రం ఆమోదించింది. సాధారణంగా ట్రెజరీ బిల్లులను ద్రవ్య మార్కెట్(మనీ మార్కెట్) సాధనాలుగా జారీ చేస్తారు. ఈ టీ-బిల్లులకు ఇన్వెస్టర్లు ఆఫర్ చేసే రేట్లు ఆర్బీఐ అంగీకరించడానికి సిద్ధంగా ఉన్న దానికంటే ఎక్కువగా ఉన్నాయని మార్కెట్ పార్టిసిపెంట్స్ పేర్కొన్నారు. ఈ వ్యవహారం వ్యవస్థలో లిక్విడిటీ పెంచేందుకు పరోక్షంగా దోహదం చేసే ప్రయత్నంగా భావిస్తున్నారు. -
2047 నాటికి రూ.3,000 లక్షల కోట్ల ఆదాయం!
సేవల రంగం తోడ్పాటుతో భారత్ 2047 నాటికి అధిక ఆదాయ దేశంగా అవతరిస్తుందని ఒక నివేదిక అంచనా వేసింది. అప్పటికి జీడీపీ 23–35 ట్రిలియన్ డాలర్లకు (రూ.1,978–3,010 లక్షల కోట్లు) చేరుకుంటుందని తెలిపింది. దేశ జీడీపీలో సేవల రంగం వాటా 60 శాతంగా, తయారీ రంగం వాటా 32 శాతం మేర ఉంటుందని పేర్కొంది. ఈ నివేదికను బెయిన్ అండ్ కంపెనీ, నాస్కామ్ సంయుక్తంగా రూపొందించాయి.‘రానున్న దశాబ్దాల్లో 20 కోట్ల మంది శ్రామికశక్తి అందుబాటులోకి వస్తారు. అధిక విలువ ఉద్యోగాలను కల్పించే వినూత్నమైన అవకాశం భారత్ ముందుంది. తద్వారా గణనీయమైన ఆర్థిక సామర్థ్యాలను వెలికితీయగలదు. ఇందుకు రంగాలవారీ టెక్నాలజీపరమైన కార్యాచరణ అవసరం. ఏఐ ఆధారిత చిప్ డిజైన్, విడిభాగాల తయారీకి కావాల్సిన ముడి సరుకుల సరఫరా వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడం వంటి చర్యలు పోటీతత్వాన్ని, ఆవిష్కరణలను పెంచుతాయి. దీనివల్ల ఎగుమతుల్లో తయారీ వాటా 24 శాతం నుంచి 2047 నాటికి 45–50 శాతానికి చేరుకుంటుంది’ అని ఈ నివేదిక వివరించింది. అలాగే ఆటో విడిభాగాల ఎగుమతులు 200–250 బిలియన్ డాలర్లు చేరుకోవచ్చని అంచనా వేసింది. ఇదీ చదవండి: ఈ–కామర్స్ దూకుడుఐదు కీలక రంగాలు..అంతర్జాతీయంగా నెలకొన్న ధోరణులు, విస్తృతమైన అవకాశాల దృష్ట్యా.. ఎలక్ట్రానిక్స్, ఇంధనం, కెమికల్స్, ఆటోమోటివ్, సేవలు భారత్కు వృద్ధి చోదకాలుగా పనిచేస్తాయని ఈ నివేదిక తెలిపింది. పెరిగే ఆదాయం, నైపుణ్య కార్మికులు, మౌలిక వసతుల కల్పన ఈ వృద్ధికి నడిపిస్తాయని పేర్కొంది. -
ద్వితీయార్ధంలో ఎకానమీ జోరు
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వీతీయార్ధంలో ఆర్థిక వ్యవస్థ పుంజుకున్నట్టు ఆర్బీఐ బులెటిన్ (ఫిబ్రవరి నెల) వెల్లడించింది. వాహన విక్రయాలు, విమాన ప్రయాణికుల రద్దీ, స్టీల్ వినియోగం, జీఎస్టీ ఈ–వే బిల్లులు తదితర కీలక గణాంకాలు ఇదే విషయాన్ని తెలియజేస్తున్నట్టు పేర్కొంది. డాలర్ బలోపేతం కావడంతో వర్దమాన ఆర్థిక వ్యవస్థల నుంచి పెట్టుబడులు వెనక్కి పోవడం కరెన్సీ రిస్క్ లను పెంచుతున్నట్టు తెలిపింది. ‘‘ఆర్థిక కార్యకలాపాలు స్థిరంగా కొనసాగనున్నాయి. బలమైన గ్రామీణ వినియోగానికి, వ్యవసాయ రంగం పటిష్ట పనితీరు మద్దతునివ్వనుంది. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం, బడ్జెట్లో పన్ను రాయితీలు పెంపుతో పట్టణ వినియోగం సైతం కోలుకోనుంది’’అని బులెటిన్ వివరించింది. 27 రకాల కీలక సూచికల ఆధారంగా ఆర్థిక కార్యకలాపాల తీరును అంచనా వేస్తుండడం గమనార్హం. ద్రవ్యోల్బణం తగ్గుదల నిదానంగా ఉండడం, టారిఫ్ల రిస్క్ పట్ల ఫైనాన్షియల్ మార్కెట్లలో ఆందోళన నెలకొందని చెబుతూ.. వర్ధమాన మార్కెట్లలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్పీఐలు) అమ్మకాలకు తోడు డాలర్తో కరెన్సీలు బలహీనపడడాన్ని ఈ బులెటిన్ ప్రస్తావించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధిలోనే ఉన్నప్పటికీ, అది మోస్తరుగా ఉన్నట్టు తెలిపింది. ‘‘వృద్ధిని, ద్రవ్య స్థీకరణను యూనియన్ బడ్జెట్ చక్కగా సమతుల్యం చేసింది. మూలధన వ్యయాలలు, వినియోగానికి మద్దతుతోపాటు డెట్ స్థిరీకరణకు స్పష్టమైన కార్యాచరణను ప్రకటించింది. దీనికి అదనంగా రెపో రేటు తగ్గింపుతో దేశీ డిమాండ్ పుంజుకోనుంది’’అని ఆర్బీఐ బులెటిన్ వెల్లడించింది. 2025లో జీడీపీ 6.4 % మూడిస్ ఎనలిటిక్స్ అంచనా న్యూఢిల్లీ: భారత జీడీపీ 2025లో 6.4 శాతం మేర వృద్ధిని సాధించొచ్చని అంతర్జాతీయ సంస్థ మూడిస్ ఎనలిటిక్స్ తెలిపింది. యూఎస్ టారిఫ్లు, అంతర్జాతీయంగా డిమాండ్ బలహీనపడడం ఎగుమతులపై ప్రభావం చూపిస్తాయని పేర్కొంది. 2024లో జీడీపీ 6.6%గా ఉందని గుర్తు చేసింది. 2025లో ఆసియా పసిఫిక్ వ్యాప్తంగా వృద్ధి నిదానిస్తుందని మూడిస్ ఎనలిటిక్స్ తెలిపింది. వాణిజ్య ఉద్రిక్తతలు, విధానపరమైన మార్పులు ఈ ప్రాంతం వృద్ధిపై ప్రభావం చూపిస్తాయని పేర్కొంది. చైనా జీడీపీ 2024లో 5%గా ఉంటే.. 2025లో 4.2%కి, 2026లో 3.9 శాతానికి తగ్గుముఖం పడుతుందని వివరించింది. భారత వృద్ధి 2024లో ఉన్న 6.6% నుంచి వచ్చే రెండేళ్లు 6.4 శాతానికి తగ్గొచ్చని అంచనా . -
సీఈఏ పదవీ కాలం పొడిగింపు
న్యూఢిల్లీ: ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు(సీఈఏ) వి అనంత నాగేశ్వరన్ పదవీకాలాన్ని కేంద్రం మరో రెండేళ్ల పొడిగించింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. దీంతో నాగేశ్వరన్ మార్చి 31, 2027 వరకు పదవిలో కొనసాగనున్నారు. కేవీ సుబ్రమణియన్ స్థానంలో 2022, జనవరి 28న సీఈఏగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. వివిధ ఆర్థిక విధానాలపై ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడంతో పాటు కేంద్ర బడ్జెట్కు ముందు పార్లమెంట్లో ప్రవేశపెట్టే ఆర్థిక సర్వేను రూపొందించడం సీఈఏ కార్యాలయం ప్రధాన బాధ్యత. నాగేశ్వర్ సీఈఏగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు 2019 నుంచి 2021 వరకు ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలిలో పార్ట్టైం సభ్యుడిగా పనిచేశారు. భారత్, సింగ్పూర్లో అనేక బిజినెస్ స్కూల్స్లో బోధించారు. నాగేశ్వరన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, అహ్మదాబాద్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ డిగ్రీని పొందారు. 1994లో మసాచుసెట్స్ విశ్వవిద్యాలయం నుంచి ఫైనాన్స్లో డాక్టరేట్ పట్టా అందుకున్నారు. -
పీఎన్బీ రుణ రేట్లు కట్..
న్యూఢిల్లీ: రిటైల్ రుణాలపై (గృహ, వాహన సహా) 25 బేసిస్ పాయింట్ల (0.25శాతం) మేర వడ్డీ రేటును తగ్గిస్తున్నట్టు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) ప్రకటించింది. గృహ, కార్ల రుణాలు, విద్య, వ్యక్తిగత రుణాలకు ఈ తగ్గింపు అమలు కానుంది. ఐదేళ్ల విరామం తర్వాత ఆర్బీఐ ఈ నెల మొదట్లో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించడం తెలిసిందే. ఈ తగ్గింపు ప్రయోజనాన్ని రుణగ్రహీతలకు బదిలీ చేస్తూ పీఎన్బీ కొత్త రేట్లను ప్రకటించింది. సవరణ తర్వాత గృహ రుణాలపై రేటు 8.15 శాతం నుంచి మొదలవుతుంది. అంటే ప్రతి లక్షకు చెల్లించాల్సిన ఈఎంఐ రూ.744గా ఉంటుందని పీఎన్బీ ప్రకటించింది. ఆటో రుణాలపై 8.50 శాతం నుంచి రేట్లు మొదలవుతాయి. ప్రతి లక్షకు రూ.1,240 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. పర్యావరణ అనుకూల ఇంధన వాహనాలకు 0.05 శాతం మేర వడ్డీలో రాయితీ ఇవ్వనుంది. అలాగే ఎక్స్ షోరూమ్ ధరపై 100 శాతం రుణంగా లభిస్తుంది. 120 నెలల కాలానికి ఎంపిక చేసుకోవచ్చు. విద్యా రుణాలపై రేట్లు 7.85 శాతానికి తగ్గాయి. వ్యక్తిగత రుణాలపై రేట్లు 11.25 శాతం నుంచి మొదలవుతాయి. కొత్త రేట్లు ఫిబ్రవరి 10 నుంచే అమల్లోకి వస్తాయని పీఎన్బీ ప్రకటించింది. -
దేశంలో నిరుద్యోగం.. తగ్గుముఖం
దేశవ్యాప్తంగా నిరుద్యోగిత రేటు తగ్గింది. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (ఎన్ఎస్ఎస్ఓ) ప్రకారం.. 2024–25 అక్టోబర్–డిసెంబర్ కాలంలో పట్టణ ప్రాంతాల్లో 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో నిరుద్యోగిత రేటు 6.4 శాతానికి వచ్చి చేరింది. జూలై–సెప్టెంబర్లోనూ ఇదే స్థాయిలో నమోదైంది.2023–24 డిసెంబర్ త్రైమాసికంలో నిరుద్యోగిత రేటు 6.5 శాతంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లోని 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న స్త్రీలలో నిరుద్యోగిత రేటు 2024 అక్టోబర్–డిసెంబర్లో 8.1 శాతానికి తగ్గింది. అంత క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో 8.6 శాతంగా ఉంది.2024 జూలై–సెప్టెంబర్లో ఈ రేటు 8.4 శాతం. ఇక పురుషుల్లో నిరుద్యోగిత రేటు అంత క్రితం ఏడాది మాదిరిగానే 2024 అక్టోబర్–డిసెంబర్లో 5.8 శాతం వద్ద స్థిరంగా ఉంది. 2024 జూలై–సెప్టెంబర్లో ఇది 5.7 శాతం నమోదైంది. -
మాకూ ట్యాక్స్ ఆడిట్ అవకాశం కల్పించాలి: కాస్ట్ అకౌంటెంట్స్
న్యూఢిల్లీ: ప్రస్తుతం సీఏలకు మాత్రమే ఉన్న ట్యాక్స్ ఆడిటింగ్ అవకాశాన్ని తమకు కూడా కల్పించాలని కాస్ట్ అకౌంటెంట్లు కోరుతున్నారు. జీఎస్టీ చట్టంలో, ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్గాను, సోషల్ ఆడిటర్లుగాను ఇద్దరికీ సమాన హోదాలనిచ్చినప్పటికీ ట్యాక్స్ ఆడిటింగ్ మాత్రం సీఏలకే పరిమితం చేయడం సమంజసం కాదని వారు పేర్కొన్నారు.కొత్త ఆదాయ పన్ను చట్టం బిల్లులో అకౌంటెంట్ నిర్వచనంలో కాస్ట్ అకౌంటెంట్ను చేర్చకపోవడమనేది గతంలో అకౌంటింగ్ వృత్తి నిపుణులందరికీ సమాన హోదా కల్పిస్తామన్న హామీకి విరుద్ధమని ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఎంఏఐ) సెంట్రల్ కౌన్సిల్ సభ్యుడు కేసీహెచ్ఏవీఎస్ఎన్ మూర్తి తెలిపారు.ఈ అంశంపై విధాన నిర్ణేతలతో సంప్రదింపులు జరుగుతున్నాయని మూర్తి వివరించారు. అటు అకౌంటెంట్ల నిర్వచనం పరిధిలో తమను చేర్చకపోవడంపై కంపెనీ సెక్రటరీలు ఆందోళన వ్యక్తం చేశారు.పరోక్ష, ప్రత్యక్ష పన్ను చట్టాలపై కంపెనీ సెక్రటరీలకు కూడా పట్టు ఉంటుందని, ట్యాక్సేషన్ వ్యవస్థలో వారు కీలకంగా వ్యవహరిస్తారని ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ) ప్రెసిడెంట్ ధనంజయ్ శుక్లా పేర్కొన్నారు. మరోవైపు, ఆడిట్ అనేది సీఏల పరిధిలోకి మాత్రమే వస్తుందని ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ చరణ్జోత్ సింగ్ నందా స్పష్టం చేశారు. ఈ అంశాన్ని కోఆర్డినేషన్ కమిటీ దృష్టికి తీసుకెళ్తామని ఆయన చెప్పారు. -
బంగారం.. అందుకే ఆల్టైమ్ హై!
ప్రపంచవ్యాప్తంగా ఆగకుండా పెరుగుతున్న బంగారం ధరలు (Gold prices) రోజుకో కొత్త గరిష్టాన్ని చేరుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచవ్యాప్త సుంకాల భయం నేపథ్యంలో పసిడిని సురక్షితమైన స్వర్గధామ ఆస్తిగా భావిస్తున్న ఇన్వెస్టర్లు తమ డబ్బును అందులో పెట్టుబడి పెట్టడానికి తొందరపడటంతో బంగారం ధరలు కొత్త రికార్డు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.బ్లూమ్బెర్గ్ డేటా ప్రకారం.. ప్రపంచ మార్కెట్లలో బులియన్ ఔన్సు ధర 2,935 డాలర్ల దగ్గర ట్రేడవుతోంది. అంతకుముందు ఇది 2,947.01 డాలర్ల తాజా రికార్డు స్థాయిని తాకింది. ఇక భారతదేశంలో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో 2025 ఏప్రిల్ ఫ్యూచర్స్కు బంగారం 10 గ్రాములకు రూ.85,879 వద్ద ట్రేడైంది. గరిష్ట ధర రూ. 86,592.అమెరికాలోకి వచ్చే ఆటోమొబైల్, సెమీకండక్టర్, ఔషధ దిగుమతులపై 25% సుంకాలను విధిస్తామని గత మంగళవారం ట్రంప్ ప్రతిజ్ఞ చేశారు. ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా, రష్యా సీనియర్ అధికారులు మొదటి రౌండ్ చర్చల కోసం సమావేశమైన తర్వాత పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు బంగారం ధరల పెరుగుదలకు దోహదపడే మరో అంశం.ఇది చదివారా? బంగారం, వెండి దిగుమతి ధరలు పెంపు2024లోనే బంగారం పావు వంతుకు పైగా పెరిగింది. 2025లో, ట్రంప్ వాణిజ్య విధానాల వల్ల బంగారం అనేక రికార్డు గరిష్టాలను తాకింది. ఈ వారం ప్రారంభంలో గోల్డ్మన్ సాచ్స్ కూడా బంగారం కోసం సంవత్సరాంతపు లక్ష్యాన్ని ఔన్సుకు 3,100 డాలర్లకు పెంచింది. సెంట్రల్-బ్యాంక్ కొనుగోలు ఊహించిన దానికంటే బలంగా ఉండటం కీలకమైన చోదక శక్తిగా ఉంటుందని నివేదిక పేర్కొంది. ఆర్థిక విధానంపై విస్తృత అనిశ్చితి కొనసాగితే (ముఖ్యంగా సుంకాలపై) బులియన్ ధర 3,300 డాలర్లకు చేరుకోవచ్చని అభిప్రాయపడింది. -
ఈ ఏడాది సగటున వేతన పెంపు ఎంతంటే..
దేశంలో 2025 ఏడాదిలో ఉద్యోగుల జీతాలు సగటున 9.2 శాతం పెరగనున్నాయని ఏఓఎన్ తాజా నివేదికలో వెల్లడించింది. 2024లో కనిపించిన 9.3 శాతం పెరుగుదలతో పోలిస్తే 2025లో వేతనాల పెంపు స్వల్పంగా క్షీణిస్తుందని నివేదిక తెలిపింది. ఇందుకు ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు, మందగమనం ప్రధాన కారణాలని విశ్లేషించింది.రంగాల వారీగా ఇంక్రిమెంట్లురంగాల వారీగా వేతనాల పెంపులో మార్పులు వస్తున్నాయి. నివేదిక ప్రకారం కొన్ని విభాగాల్లో ఉద్యోగులకు అధిక వేతన పెంపు ఉంటుంది. ఇంజినీరింగ్ డిజైన్ సర్వీసెస్, ఆటోమోటివ్, వెహికల్ మాన్యుఫ్యాక్చరింగ్ సెక్టార్లలో అత్యధికంగా 10.2 శాతం వేతన పెంపు ఉంటుంది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీ), రిటైల్ వంటి ఇతర రంగాల్లోనూ గణనీయమైన వేతన పెరుగుదలను చూడవచ్చని భావిస్తున్నారు.ఆర్థిక స్థిరత్వంఅంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత్ ఆర్థిక అవకాశాలు నిలకడగానే ఉన్నాయి. గ్రామీణ గిరాకీ మెరుగవుతోంది. ప్రైవేటు వినియోగం ఊపందుకుంటోంది. ఈ స్థిరత్వం ఉద్యోగులకు సానుకూల సంకేతంగా భావించవచ్చు. ఇది ఆర్థిక వ్యవస్థకు స్థిరమైన వృద్ధి పథాన్ని సూచిస్తుంది. 2022లో గరిష్టంగా 21.4 శాతంగా ఉన్న అట్రిషన్ రేటు(ఒక ఉద్యోగం నుంచి మరో ఉద్యోగంలోకి మారడం) 2024 నాటికి 17.7 శాతానికి పడిపోయింది. టాలెంట్ పూల్ స్థిరపడడాన్ని ఇది సూచిస్తుంది.ఇదీ చదవండి: భారత్లోకి టెస్లా.. మస్క్ వైఖరి ‘చాలా అన్యాయం’రంగాల వారీగా గతేడాదితో పోలిస్తే వేతనాల్లో వ్యత్యాసం ఇలా..(శాతాల్లో)రంగాలు 2024 2025ఇంజినీరింగ్ డిజైన్ సర్వీసెస్ 10.1 10.2ఆటోమోటివ్ 10.7 10.2ఎన్బీఎఫ్సీ 10.1 10రిటైల్ 9.6 9.8గ్లోబల్ కేపబులిటీ సెంటర్ 9.4 9.7ఇంజినీరింగ్/మ్యానుఫ్యాక్చరింగ్ 9.7 9.7ఫండ్స్/ అసెట్ మేనేజ్మెంట్ 10 9.7ఫ్రొఫెషనల్ సర్వీసెస్ 8.9 9.5లైప్ సైన్సెస్ 9.5 9.5టెక్నాలజీ ప్లాట్ఫామ్ 9.5 9.4 -
‘త్రివిధ దళాల ఎక్స్ పో’ కోసం ప్రభుత్వ ప్రణాళికలు
దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శించడానికి, ఎగుమతులు, వ్యాపార భాగస్వామ్యాలను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం కొత్తగా త్రివిధ దళాల వార్షిక ప్రదర్శనను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈ ఏకీకృత కార్యక్రమం ఇటీవల జరిగిన ప్రత్యేక ఏరోఇండియా(AeroIndia) ప్రదర్శనను భర్తీ చేయనుంది. లాజిస్టిక్ సవాళ్లు, పరిమిత ప్రదేశంలో నిర్వహణ సమస్యలను కొత్తగా ఏర్పాటు చేయాలనుకుంటున్న ప్రదర్శన పరిష్కరిస్తుందని ప్రభుత్వం భావిస్తుంది. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రాలేదు.ఏకీకృత కార్యక్రమం: ఏరోఇండియా పేరుతో ప్రస్తుతం నిర్వహిస్తున్న ప్రత్యేక ఏరోస్పేస్ షో పద్ధతిని తొలగించి త్రివిధ దళాల ఎక్స్పోను నిర్వహించాలని యోచిస్తున్నారు. డిఫెన్స్, ఎయిర్, నేవీ వ్యవస్థలపై ఈ ఎక్స్పోలో దృష్టి సారిస్తారు.లాజిస్టిక్ సవాళ్లు: ఏటా ఏరోఇండియా ప్రదర్శన బెంగళూరులోని యలహంక వైమానిక స్థావరంలో నిర్వహిస్తున్నారు. అయితే పరిమిత స్థలంలో ఏర్పాటు చేస్తున్న ఈ ప్రదర్శనకు లాజిస్టిక్ సవాళ్లు సమస్యగా మారుతున్నాయి. దీనికోసం మరింత అనువైన వేదికను సిద్ధం చేసి దీనికి పరిష్కారం అందించాలని కొత్త ఎక్స్ పో లక్ష్యంగా పెట్టుకుంది.వ్యాపార ధోరణి: త్రివిధ దళాల ఎక్స్ పో ద్వారా వాటాదారులందరూ హాజరై వ్యాపార కార్యక్రమాలపై దృష్టి సారించడం సులభతరం అవుతుంది. ఇది ఎగుమతులను ప్రోత్సహించడానికి, వ్యాపార భాగస్వామ్యాలను కుదుర్చుకునేందుకు సహాయపడుతుంది.ఫ్లాగ్ షిప్ ఈవెంట్: స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శించి విదేశీ పెట్టుబడిదారులు, వ్యాపారులను ఆకర్షించే అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీ పెంపు?రక్షణ రంగంపై ప్రభావంత్రివిధ దళాల ఎక్స్ పో నిర్వహించడం ద్వారా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శించడానికి, వ్యాపార భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి ఒక వేదికను సిద్ధం చేసినట్లవుతుంది. ఇది రక్షణ పరిశ్రమపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు. రక్షణ రంగంలోని ఉత్పత్తుల తయారీలో దేశ స్వావలంబనకు దోహదం చేస్తుందని అంచనా వేస్తున్నారు. -
సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీ పెంపు?
సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ని గణనీయంగా పెంచాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. 2026 మార్చి 31 నాటికి ఈ ఉత్పత్తులపై పరిహార సెస్(కంపెన్సేషన్ సెస్-రాష్ట్రాలకు చెల్లించె పన్ను విధానం)ను దశలవారీగా ఎత్తివేయాలని ప్రభుత్వం యోచిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తెరపైకి వచ్చింది. ప్రతిపాదిత విధానం ద్వారా ప్రజారోగ్య సమస్యలను పరిష్కరిస్తూ పన్ను ఆదాయాన్ని కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.ప్రస్తుత పన్నులు ఇలా..ప్రస్తుతం సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులపై 28 శాతం జీఎస్టీతో పాటు అదనపు సుంకాలు విధిస్తున్నారు. దాంతో మొత్తం పన్ను భారం 53 శాతంగా ఉంది. అయితే ఇది ఇప్పటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన 75% పన్ను విధానం కంటే తక్కువగానే ఉంది. ఈ ఉత్పత్తులపై 5 శాతం జోడించే పరిహార సెస్ను నిలిపివేయాలని యోచిస్తున్నారు. అదే సమయంలో మరింత భారీగా పన్నులు విధించాలని చూస్తున్నారు.ప్రతిపాదిత మార్పులుపొగాకు ఉత్పత్తులపై జీఎస్టీని గరిష్టంగా 40 శాతానికి పెంచడంతో పాటు అదనపు ఎక్సైజ్ సుంకాన్ని విధించాలని కూడా జీఎస్టీ కౌన్సిల్ పరిశీలిస్తోంది. పరిహార సెస్ నిలిపేసిన తర్వాత ఈ ఉత్పత్తుల నుంచి పన్ను ఆదాయం తగ్గకుండా ఇది తోడ్పడుతుంది. 2026 అనంతరం పరిహార సెస్ పరిస్థితులను సమీక్షించడానికి, ప్రత్యామ్నాయ పన్ను పద్ధతులను అన్వేషించడానికి కౌన్సిల్ ఇప్పటికే మంత్రుల బృందాన్ని నియమించింది. ఈ బృందం దీనిపై నిర్ణయం తీసుకోనుంది.ప్రజారోగ్యం, ఆర్థిక ప్రభావంపొగాకు ఉత్పత్తులను ‘హానికారక వస్తువులు’గా పరిగణిస్తున్నారు. వీటిపై అధిక పన్నులు విధిస్తే వినియోగం తగ్గుతుందనేది ప్రభుత్వం భావన. కాగా, పొగాకు, పొగాకు ఉత్పత్తుల ద్వారా 2022-23లో ప్రభుత్వానికి రూ.72,788 కోట్ల ఆదాయం సమకూరింది. పన్నులు మరింత పెంచితే ఆదాయం కూడా అధికమవుతుంది. ప్రతిపాదిత పన్ను పెంపు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనలకు లోబడి ఉంటుందని కొందరు అధికారులు పేర్కొన్నారు. ఈ కొత్త విధానం ద్వారా పొగాకు వినియోగాన్ని తగ్గించడం, తద్వారా ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నారు.ఇదీ చదవండి: భారత్లోకి టెస్లా.. మస్క్ వైఖరి ‘చాలా అన్యాయం’సవాళ్లు ఇవే..ప్రభుత్వం పన్నులను పెంచడానికి ఆసక్తిగా ఉన్నప్పటికీ పొగాకు పరిశ్రమ, దానిపై ఆధారపడిన కార్మికుల స్థితిగతులు, వారి ఉపాధి ప్రభావితం చెందుతుందనే ఆందోళనలు ఉన్నాయి. దీనికి తోడు కొన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం కొత్త సెస్ విధానాన్ని ప్రవేశపెట్టడానికి సంకోచిస్తున్నాయి. జీఎస్టీను పరిగణించి పోగాకు ధరలు పెంచాలంటే సెస్ల విధింపే కీలకం కానుంది. దాంతో ఈ వ్యవహారంపై తుది నిర్ణయం తీసుకునేటప్పుడు జీఎస్టీ కౌన్సిల్ ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. -
పదేళ్లలో రూ.60 లక్షల కోట్ల పెట్టుబడులు
భారత్ తన ప్రతిష్టాత్మకమైన సున్నా కర్బన ఉద్గారాల స్థితి (తటస్థం)ని 2070 నాటికి చేరుకోవాలంటే.. వచ్చే పదేళ్లలో 700 బిలియన్ డాలర్ల పెట్టుబడులు (రూ.60 లక్షల కోట్లు) విద్యుత్ రంగం(Power Sector)లో చేయాల్సి వస్తుందని మూడిస్ రేటింగ్స్ తెలిపింది. పునరుత్పాదక ఇంధనాలు, అణు ఇంధనం, విద్యుత్ ప్రసారం, పంపిణీ, ఇంధన స్టోరేజీ వసతుల కోసం ఈ మొత్తం వెచ్చించాల్సి వస్తుందని వివరించింది.దేశంలో కర్బన ఉద్గారాల విడుదలలో 37 శాతం విద్యుత్ రంగం నుంచే ఉంటోందని మూడిస్ పేర్కొంది. 2026 నుంచి 2051 ఆర్థిక సంవత్సరాల మధ్య ఏటా జీడీపీలో 1.5–2 శాతం మేర పెట్టుబడులను (వచ్చే పదేళ్లు ఏటా 2 శాతం) ఈ రంగంలో చేయాల్సి వస్తుందని అంచనా వేసింది. 2034–35 వరకు ఏటా రూ.4.5–6.4 లక్షల కోట్ల చొప్పున, ఆ తర్వాత 2026–51 మధ్యకాలంలో ఏటా రూ.6–9 లక్షల కోట్ల పెట్టుబడి అవసరం అవుతుందని వెల్లడించింది. ఈ స్థాయిలో పెట్టుబడులను ప్రభుత్వం, ప్రైవేటు రంగం, దేశ, విదేశీ మూలధనం రూపంలో సమకూర్చుకోవచ్చని సూచించింది. దేశంలో ఇప్పటికీ అధిక శాతం విద్యుత్ బొగ్గు ఆధారితమే ఉన్నందున, ఈ కాలుష్యాన్ని తగ్గించేందుకు పెద్ద మొత్తంలో పెట్టుబడులు అవసరమవుతాయని అభిప్రాయపడింది. వచ్చే పదేళ్ల పాటు బలమైన ఆర్థిక వృద్ధి అన్నది బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి విస్తరణను సూచిస్తోందని, ఇది కర్బన ఉద్గారాల తగ్గింపు లక్ష్యానికి ప్రతికూలంగా మారొచ్చని పేర్కొంది. ఇదీ చదవండి: ఇన్ఫోసిస్లో 20,000 నియామకాలు!తలసరి వినియోగం మూడో వంతేభారత ఆర్థిక వ్యవస్థ ఏటా 6.5 శాతం చొప్పున వచ్చే పదేళ్ల పాటు వృద్ధిని నమోదు చేస్తుందని, దీంతో ఏటా విద్యుత్ డిమండ్ 6 శాతం చొప్పున కాంపౌండెడ్ వార్షిక పెరుగుదలను చూస్తుందని మూడిస్ రేటింగ్స్ అంచనా వేసింది. ‘భారత్లో తలసరి విద్యుత్ వినియోగం (2021–22లో 1,255 కిలోవాట్ హవర్) ప్రపంచ వినియోగంలో మూడింత ఒక వంతుగానే ఉంది. ఆర్థిక వృద్ధితోపాటు, జీవన ప్రమాణాల మెరుగుదల నేపథ్యంలో రానున్న కాలంలో వినియోగం మరింత పెరగనుంది. వచ్చే పదేళ్లలో 450 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం డిమాండ్ను తీర్చలేదు. ఈ కాలంలో బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తిని మరో 35 శాతం పెంచుకోవాల్సి రావచ్చు. 1.7–1.8 రెట్లు పెరిగే విద్యుత్ డిమాండ్ను తీర్చడానికి స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం 2034–35 నాటికి 2–2.2 రెట్లు పెరగాలి. 2023–24 నాటికి శిలాజేతర ఇంధన వనరుల ఆధారిత విద్యుత్ తయారీ 23.5 శాతంగా ఉంటే, 2034–35 నాటికి 45–50 శాతానికి చేర్చాలి’అని మూడిస్ వివరించింది. పునరుత్పాదక ఇంధన వనరుల వైపు మళ్లే విషయంలో ప్రైవేటు రంగం ఎంతో కీలకమంటూ, విదేశీ నిధులు అంతరాన్ని భర్తీ చేయగలవని పేర్కొంది. -
భారత్పై అమెరికా సుంకాల ప్రభావం ఎంతంటే..
అమెరికా ప్రతీకార సుంకాల ప్రభావం భారత్పై పెద్దగా ఉండబోదని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ స్పష్టం చేసింది. భారత ఆర్థిక వ్యవస్థ అధిక శాతం దేశీ డిమాండ్ (వినియోగం)పై ఆధారపడి ఉన్న విషయాన్ని తన తాజా నివేదికలో గుర్తు చేసింది. దీనికితోడు అమెరికాకు భారత్ చేసే ఎగుమతుల్లో ఎక్కువ భాగం సేవల రూపంలో ఉన్నందున, ట్రంప్ పాలనా యంత్రాంగం వీటిని లక్ష్యంగా చేసుకోకపోవచ్చని తెలిపింది. భారత్ సహా తమ ఉత్పత్తులపై అధిక సుంకాలు వేస్తున్న దేశాలన్నింటి నుంచి వచ్చే దిగుమతులపై అదే మోతాదులో తాము కూడా సుంకాల మోత మోగిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ప్రధాని మోదీ సమక్షంలోనే స్పష్టం చేయడం గమనార్హం. అమెరికా ప్రతీకార సుంకాలు ఎక్కువగా వియత్నాం, దక్షిణ కొరియా, తైవాన్పై ప్రభావం చూపిస్తాయని, ఆ దేశాలు అమెరికాతో అధిక వాణిజ్య మిగులు కలిగి ఉన్నట్టు ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ ఆసియా–పసిఫిక్ ఆర్థికవేత్త విశృత్ రాణా తెలిపారు. అమెరికాతో ఎక్కువగా సేవల వాణిజ్యం నడుపుతున్న జపాన్పైనా సంకాలు ఏమంత ప్రభావం చూపించబోవన్నారు. ధరల ఆజ్యంతో అధిక వడ్డీ రేట్లుఅమెరికా విధించే ప్రతీకార సుంకాలు ధరలకు ఆజ్యం పోస్తాయని, దీంతో ప్రపంచవ్యాప్తంగా అధిక వడ్డీ రేట్లకు దారితీయొచ్చని రాణా అభిప్రాయపడ్డారు. ‘భారత్ వృద్ధి కోసం ఎగుమతులపై అంతగా ఆధారపడి లేదు. కాబట్టి అమెరికా టారిఫ్ల ప్రభావం చాలా పరిమితంగానే ఉంటుంది’ అని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ డైరెక్టర్ ఈఫార్న్ ఫువా తెలిపారు. జ్యుయలరీ, ఫార్మాస్యూటికల్, టెక్స్టైల్స్, కెమికల్స్పై టారిఫ్ల ప్రభావం ఎక్కువగా ఉండొచ్చన్నారు. అయితే, భారత్ నుంచి వచ్చే ఫార్మాస్యూటికల్స్పై అమెరికా అధిక సుంకాలు విధించకపోవచ్చని, అలా చేయడం అమెరికాలో ఆరోగ్య వ్యయాలను పెంచుతుందన్నారు. అదే సమయంలో టెక్స్టైల్స్, కెమికల్స్ అధిక టారిఫ్ల రిస్క్ ఎదుర్కోవాల్సిరావచ్చన్నారు. ట్రంప్ మొదటి విడత పాలనను గుర్తు చేసుకుని చూస్తే మొత్తం మీద భారత్పై పడే ప్రభావం పరిమితంగానే ఉండొచ్చని ఫువా విశ్లేషించారు.ప్రభావం ఏ మేరకు..?ట్రంప్ టారిఫ్లతో భారత జీడీపీపై 0.1–0.6 శాతం మేర ప్రభావం పడొచ్చని గోల్డ్మన్ శాక్స్ అంచనా వేసింది. అమెరికా దిగుమతి చేసుకునే అన్నింటిపైనా సగటు వ్యత్యాసం మేర టారిఫ్లు మోపితే, అలాంటి పరిస్థితుల్లో భారత్ చేసే ఎగుమతులపై అమెరికా నికర టారిఫ్ రేట్లు 6.5 శాతం మేర పెరగొచ్చని పేర్కొంది. అలా కాకుండా, విడిగా ప్రతీ ఉత్పత్తిపై రెండు దేశాల మధ్య ఉన్న వ్యత్యాసం మేర అదనంగా టారిఫ్ పెంచేస్తే అప్పుడు భారత ఎగుమతులపై పెరిగే సుంకాల భారం 6.5–11.5 శాతం మధ్య ఉంటుందని వివరించింది.2024–25లో వృద్ధి 6.3 శాతమే: ఎస్బీఐ రీసెర్చ్దేశ జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024–25) 6.2–6.3 శాతమే వృద్ధి చెందొచ్చని ఎస్బీఐ రీసెర్చ్ విభాగం అంచనా వేసింది. జాతీయ శాంపిల్ కార్యాలయం (ఎన్ఎస్వో) జూన్, సెపె్టంబర్ త్రైమాసికాల అంచనాలను పెద్దగా సవరించకపోవచ్చని పేర్కొంది. 6.4 శాతం వృద్ధి నమోదు కావొచ్చని ఎన్ఎస్వో లోగడ అంచనా వేయడం గమనార్హం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉండడం స్థిరత్వాన్ని తీసుకొస్తుందని, ఇతర రంగాల్లో వృద్ధికి ఊతంగా నిలుస్తుందని ఎస్బీఐ రీసెర్చ్ పేర్కొంది. ద్రవ్యోల్బణం తగ్గడం విచక్షణారహిత వినియోగాన్ని పెంచుతుందని, అది వినియోగ ఆధారిత వృద్ధికి దారితీస్తుందని అంచనా వేసింది. భారత్ 2024–25, 2025–2026 ఆర్థిక సంవత్సరాల్లో 6.5 శాతం వృద్ధి నమోదు చేస్తుందన్నది ఐఎంఎఫ్ అంచనాగా ఉంది. మరోవైప ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ సైతం వచ్చే రెండేళ్ల పాటు భారత్ జీడీపీ 6.7–6.8 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని తాజాగా వెల్లడించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరాలతో పోల్చి చూసినప్పుడు తక్కువే అయినప్పటికీ, అదే ఆదాయ స్థాయి కలిగిన దేశాల కంటే ఎగువనే ఉంటుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ డైరెక్టర్ ఈఫార్న్ ఫువా తెలిపారు. పన్ను రేట్లను తగ్గించినప్పటికీ ఆదాయ వృద్ధికి మద్దతుగా నిలుస్తుందన్నారు. ఇదీ చదవండి: ‘గ్రోక్ 3’ను ఆవిష్కరించిన మస్క్ఫార్మాపై టారిఫ్లతో అమెరికన్లపైనే ప్రభావం..-ఫార్మెక్సిల్ డైరెక్టర్ జనరల్ రాజా భాను భారత ఫార్మా ఎగుమతులపై ప్రతీకార టారిఫ్లు విధించేలా అమెరికా నిర్ణయం తీసుకుంటే, అమెరికన్ వినియోగదారులపైనే ప్రధానంగా ప్రభావం పడుతుందని ఫార్మా ఎగుమతుల ప్రోత్సాహక మండలి ఫార్మెక్సిల్ డైరెక్టర్ జనరల్ రాజా భాను వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి దేశీయ పరిశ్రమ వేచి, చూసే ధోరణితో వ్యవహరిస్తోందని తెలిపారు. అమెరికాకు భారత్ ఏటా 8 బిలియన్ డాలర్ల విలువ చేసే ఉత్పత్తులు ఎగుమతులు చేస్తోందని చెప్పారు. అమెరికన్ అధ్యయన నివేదికలను ఉటంకిస్తూ.. భారత ఔషధ ఎగుమతులతో అమెరికాలోని హెల్త్కేర్ వ్యవస్థకు 2013–2022 మధ్య 1.3 లక్షల కోట్ల డాలర్లు ఆదా అయినట్లు భాను తెలిపారు. వచ్చే అయిదేళ్లలో మరో 1.3 బిలియన్ డాలర్లు ఆదా అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ‘ఇలాంటి పరిస్థితుల్లో (మన ఔషధాలతో వాళ్లకు ఇంత ఆదా అవుతున్నప్పుడు) మనపై టారిఫ్లు విధిస్తామంటే ఏమనగలం‘ అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం భారత్ నుంచి ఫార్మా దిగుమతులపై అమెరికాలో ఎటువంటి సుంకాలు లేవు. ఈ ఆరి్థక సంవత్సరం మొత్తం ఫార్మా ఎగుమతులు 29 బిలియన్ డాలర్లుగా ఉంటాయని అంచనా వేస్తున్నట్లు భాను తెలిపారు. -
పీఎన్బీలో రూ.271 కోట్ల ఫ్రాడ్
ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంకులో (PNB) మరో మోసం వెలుగు చూసింది. ఒరిస్సాకు చెందిన గుప్తా పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ రూ.271 కోట్ల మేర రుణం తీసుకుని తిరిగి చెల్లించకుండా మోసానికి పాల్పడింది. ఈ ఖాతాను మొండిపద్దుగా (ఎన్పీఏ) వర్గీకరించి రిజర్వ్ బ్యాంక్ దృష్టికి తీసుకెళ్లినట్లు బ్యాంకు వివరించింది. ఇప్పటికే ఈ మొత్తానికి ప్రొవిజనింగ్ చేసినట్లు పేర్కొంది.భువనేశ్వర్లోని పీఎన్బీ స్టేషన్ స్క్వేర్ బ్రాంచ్ ఈ రుణాన్ని జారీ చేసింది. పీఎన్బీ ఫ్రాడ్ జరిగినా డిసెంబర్ త్రైమాసికంలో నికర లాభం రెండు రెట్లు పెరిగి రూ.4,508 కోట్లకు చేరుకుంది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో రూ.2,223 కోట్లతో పోలిస్తే అధికంగా నమోదైంది. బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.29,962 కోట్ల నుంచి రూ.34,752 కోట్లకు, వడ్డీ ఆదాయం రూ.27,288 కోట్ల నుంచి రూ.31,340 కోట్లకు పెరిగింది. అంతేకాకుండా పీఎన్బీ స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి 6.24 శాతం నుంచి 4.09 శాతానికి తగ్గింది.పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కొన్నేళ్లుగా హైప్రొఫైల్ కేసులతో ఇబ్బంది పడుతోంది. అందులో కొన్ని కింద తెలియజేశాం.నీరవ్ మోదీ స్కామ్ (2018): భారతదేశ చరిత్రలో అతిపెద్ద బ్యాంకింగ్ మోసాల్లో ఒకటిగా నిలిచింది. దీని విలువ సుమారు రూ.12,700 కోట్లు. నగల వ్యాపారి నీరవ్ మోదీ తన బంధువు మెహుల్ చోక్సీతో కలిసి పీఎన్బీ ఉద్యోగులతో కుమ్మక్కై అనధికార లెటర్స్ ఆఫ్ అండర్ టేకింగ్ (ఎల్ఓయూ)లను ఉపయోగించి మోసపూరిత రుణాలు పొందారు. బ్యాంకింగ్ వ్యవస్థలో లొసుగుల కారణంగా ఈ కుంభకోణం ఏళ్ల తరబడి బయటపడలేదు.నీరవ్ మోదీ కుంభకోణంలో గీతాంజలి జెమ్స్ యజమాని మెహుల్ చోక్సీ కూడా ఇరుక్కున్నాడు. 2018 ప్రారంభంలో దేశం విడిచి పారిపోయిన అతను అప్పటి నుంచి అధికారులు, విచారణ వ్యవస్థల నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు.ఇదీ చదవండి: రేట్ల కోత కాదు.. ఏం చేయాలో సూచించిన మిశ్రాపీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ మోసం (2020): సరైన నిబంధనలు పాటించకుండా షెల్ కంపెనీలకు రుణాలు ఇచ్చిన కేసులో పీఎన్బీఐ హౌసింగ్ ఫైనాన్స్ ప్రమేయం ఉందని తేలింది. ఈ కేసు ఇంకా విచారణలో ఉంది. -
రేట్ల కోత కాదు.. ఏం చేయాలో సూచించిన మిశ్రా
వృద్ధికి ఊతమివ్వాలని భావిస్తే ఆర్బీఐ(RBI) రేట్ల కోతకు బదులు ద్రవ్య లభ్యత పరిస్థితులను సులభతరం (లిక్విడిటీ) చేయడంపై దృష్టి పెట్టాలని యాక్సిస్ బ్యాంక్ ముఖ్య ఆర్థికవేత్త నీల్కాంత్ మిశ్రా సూచించారు. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలిలో మిశ్రా పార్ట్ టైమ్ సభ్యుడిగా ఉన్నారు. ఈ నెల మొదట్లో పావు శాతం మేర రెపో రేటును ఆర్బీఐ తగ్గించడం తెలిసిందే. అలాగే, తదుపరి పాలసీ సమీక్షల్లోనూ మరింత రేట్ల కోతతో రుణ వితరణ పెరగదని, ద్రవ్య కొరత రేట్ల కోత బదిలీకి అడ్డుపడుతుందని చెప్పారు.‘రేట్ల కోత ఉద్దేశ్యం మరిన్ని రుణాల జారీ అయితే.. కొత్త రుణాలు తక్కువ రేట్లపై జారీ చేయడం అసాధ్యం. ఎందుకంటే ద్రవ్య నియంత్రణ కట్టడి చర్యల ఫలితంగా మార్జినల్ కాస్ట్ ఆఫ్ మనీ 18 నెలలుగా అధిక స్థాయిలో కొనసాగుతోంది. రేపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన తర్వాత కూడా ఏడాది కాల సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్ల రేటు 7.8 శాతం వద్దే కొనసాగుతోంది’ అని మిశ్రా వివరించారు. ఆర్బీఐ రెగ్యులర్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ను చేపట్టడం ద్వారా తగినంత లిక్విడిటీ ఉండేలా చూడొచ్చన్నారు. లేదంటే నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ను తగ్గించడం మరింత ఫలితాన్నిస్తుందన్నారు. లిక్విడిటీ సాధారణ స్థాయికి చేరి, ప్రభుత్వం ద్రవ్య స్థిరీకరణకు కట్టుబడితే 2025–26 ద్వితీయ త్రైమాసికం నుంచి జీడీపీ వృద్ధి 7 శాతం రేటును చేరుకోవచ్చని అంచనా వేశారు. క్యూ3లో 6.4 శాతం వృద్ధి: ఇక్రాప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో జీడీపీ 6.4 శాతం వృద్ధిని నమోదు చేయొచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. ప్రభుత్వ వ్యయాలు పెరగడం ఇందుకు సాయపడుతుందని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో జీడీపీ 6.7 శాతం వృద్ధిని నమోదు చేయగా, జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో 5.4 శాతానికి పడిపోవడం గమనార్హం. గతేడాది సాధారణ ఎన్నికల ముందు ప్రభుత్వం అంచనాల మేరకు మూలధన వ్యయాలు చేయలేకపోవడం, డిమాండ్ బలహీనత ఇందుకు దారితీశాయి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు మూలధన, రెవెన్యూ వ్యయాలు పెంచడం, సేవల ఎగుమతుల్లో అధిక వృద్ధి, వస్తు ఎగుమతులు పుంజుకోవడం, ప్రధాన ఖరీఫ్ పంటల దిగుబడి మెరుగ్గా ఉండడం డిసెంబర్ త్రైమాసికంలో భారత ఆర్థిక పనితీరు బలపడేందుకు దోహదం చేస్తాయని ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితి నాయర్ వివరించారు.ఇదీ చదవండి: ట్రేడింగ్–డీమ్యాట్ ఖాతా లాగిన్ మరింత భద్రం!మొత్తం మీద క్యూ3లో జీడీపీ, జీవీఏ విస్తరణ కొనసాగుతుందన్నారు. పెట్టుబడులకు సంబంధించి సంకేతాల్లో వృద్ధి కనిపిస్తున్నట్టు ఇక్రా తన నివేదికలో పేర్కొంది. ప్రభుత్వాల మూలధన వ్యయాలు ఆరు త్రైమాసికాల గరిష్ట స్థాయి 47.7 శాతానికి క్యూ3లో పెరిగినట్టు, అంతకుముందు త్రైమాసికంలో ఇది 10.3 శాతంగా ఉన్నట్టు వెల్లడించింది. క్యూ3 జీడీపీ వృద్ధి అంచనాలు ఈ నెల 28న విడుదల కానున్నాయి. అలాగే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో ముందస్తు జీడీపీ అంచనాలను సైతం ఎన్ఎస్వో ప్రకటించనుంది. జనవరిలో విడుదల చేసిన తొలి అంచనాల ప్రకారం 2024–25లో వృద్ధి నాలుగేళ్ల కనిష్టం 6.4 శాతానికి తగ్గనుంది. కానీ, ఆర్బీఐ మాత్రం 6.6 శాతం వృద్ధిని అంచనా వేస్తోంది. -
యూఎస్తో డీల్పై ఆందోళన అక్కర్లేదు
న్యూఢిల్లీ: అమెరికాతో భారత్ నిర్వహించే వాణిజ్య సంప్రదింపుల పట్ల దేశీ పరిశ్రమ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ భరోసా ఇచ్చారు. ఈ విషయంలో భారత్ బలమైన స్థానంలో ఉందన్నారు. వివిధ భాగస్వాములతో సంప్రదింపుల ద్వారా చర్చలకు సన్నద్ధం అవుతున్నామని, త్వరలోనే ఇవి మొదలవుతాయని చెప్పారు. ఇరు దేశాలూ పరస్పర రాయితీలతోపాటు, సుంకాల తగ్గింపును ఆఫర్ చేయనున్నట్టు స్పష్టం చేశారు.దీంతో రెండు దేశాల మధ్య ఎగుమతులు, దిగుమతులు సులభతరంగా మారతాయన్నారు. ప్రధాని మోదీ ఇటీవలి అమెరికా పర్యటన సందర్భంగా.. రెండు దేశాలు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి రెట్టింపు చేసుకోవాలని (500 బిలియన్ డాలర్లు), పరస్పర ప్రయోజనాలతో మొదటి దశ వాణిజ్య ఒప్పందాన్ని వీలైనంత ముందుగా ఈ ఏడాది కుదుర్చుకోవాలని నిర్ణయించడం తెలిసిందే. ప్రస్తుతం రెండు దేశాల మధ్య వాణిజ్యం 200 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ ఒప్పందం దేశీ పరిశ్రమలకు వ్యాపార అవకాశాలను విస్తృతం చేస్తుందని మంత్రి గోయల్ ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చెప్పారు. ‘‘భారత్ను మరింత పోటీతత్వంతో తీర్చిదిద్దడానికి దీన్నొక గొప్ప అవకాశంగా చూస్తున్నాం. నాణ్యమైన ఉత్పత్తులతో ముందుకు రండి. భారత్, అమెరికాకు పరస్పర ప్రయోజనం కల్పించే, ఆకర్షణీయమైన వాణిజ్య షరతులను గమనించండి’’అని గోయల్ పేర్కొన్నారు. టారిఫ్లు మనం కూడా వేస్తాం.. ప్రతీకార సుంకాలపై మంత్రి గోయల్ మాట్లాడుతూ.. దిగుమతుల నుంచి దేశీ పరిశ్రమను కాపాడుకునేందుకు మన దగ్గరా సుంకాలు ఉన్నట్టు గుర్తు చేశారు. ‘‘ఈ అంశాలను పరిష్కరించుకునేందుకు, పరస్పన ప్రయోజనాలపై చర్చల్లో భాగంగా దృష్టి పెడతాం. ఈ విషయంలో దేశీ సంస్థలకు ఆందోళన అక్కర్లేదు. ఇదొక సువర్ణావకాశం. కొత్త వ్యాపార అవకాశాలకు తలుపులు తెరుచుకుంటాయి. ఈ రోజు ఆందోళన చెందుతున్న వారు రేపు పశ్చాత్తాపం చెందాల్సి వస్తుంది’’అని మంత్రి వ్యాఖ్యానించారు. -
పెట్రోలియం ధరల్లో హెచ్చుతగ్గులు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా అనిశ్చితి, పెట్రోలియం ధరల్లో తీవ్ర ఒడిదుడుకులతో వరుసగా మూడో నెలా భారత ఎగుమతులు క్షీణించాయి. జనవరిలో 2.38 శాతం తగ్గి 36.43 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. మరోవైపు, దిగుమతులు 10 శాతం పెరిగి 59.42 బిలియన్ డాలర్లకు చేరడంతో వాణిజ్య లోటు సుమారు 23 బిలియన్ డాలర్లుగా నమోదైంది. కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జనవరి మధ్య కాలంలో ఎగుమతులు 1.39 శాతం పెరిగి 358.91 బిలియన్ డాలర్లకు, దిగుమతులు 7.43 శాతం పెరిగి 601.9 బిలియన్ డాలర్లకు చేరాయి. వాణిజ్య లోటు 242.99 కోట్లుగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పటికీ ఇటు ఉత్పత్తులు, అటు సర్వీసుల ఎగుమతుల్లో భారత్ మెరుగ్గానే ఉంటోందని వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ బరత్వాల్ తెలిపారు. ఎలక్ట్రానిక్స్, ఫార్మా, బియ్యం, రత్నాభరణాల్లాంటి రంగాలు జనవరిలో మెరుగైన వృద్ధి రేటు సాధించినట్లు వివరించారు. 2024–25లో భారత్ ఎగుమతులు 800 బిలియన్ డాలర్ల స్థాయిని దాటగలవని ధీమా వ్యక్తం చేశారు. 2023–24లో ఇవి 778 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. పసిడి దిగుమతులు 41 శాతం అప్..దేశీయంగా డిమాండ్ నెలకొనడంతో జనవరిలో బంగారం దిగుమతులు 41% పెరిగి 2.68 బిలియన్ డాలర్లకు చేరాయి. గత జనవరిలో వీటి విలువ 1.9 బిలియన్ డాలర్లు. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జనవరి మధ్య కాలంలో పసిడి దిగుమతులు 32 శాతం పెరిగి 37.85 బిలియన్ డాలర్ల నుంచి ఏకంగా 50 బిలియన్ డాలర్లకు చేరాయి. సురక్షిత సాధనంగా బంగారంపై నమ్మకం, అంతర్జాతీయంగా అనిశ్చితుల వల్ల ఇన్వెస్టర్లు డైవర్సిఫికేషన్కి ప్రాధాన్యం ఇస్తుండటం, బ్యాంకుల నుంచి డిమాండ్ పెరగడం, కస్టమ్స్ సుంకాల తగ్గింపు మొదలైన అంశాలు పసిడి దిగుమతులు పెరగడానికి కారణమయ్యాయి. జనవరిలో క్రూడాయిల్ దిగుమతులు 16.56 బిలియన్ డాలర్ల నుంచి 13.43 బిలియన్ డాలర్లకు తగ్గాయి. రత్నాభరణాల ఎగుమతులు 16 శాతం పెరిగి 3 బిలియన్ డాలర్లకు చేరగా, వెండి దిగుమతులు 83% పెరిగి 883 మిలియన్ డాలర్లకు చేరాయి. జనవరిలో సర్వీసుల ఎగుమతుల విలువ 31.01 బిలియన్ డాలర్ల నుంచి 38.55 బిలియన్ డాలర్లకు పెరిగాయి. సర్వీసుల దిగుమతులు 14.84 బిలియన్ డాలర్ల నుంచి 18.22 బిలియన్ డాలర్లకు పెరిగాయి.పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు 59 శాతం క్షీణించి 3.56 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. కమోడిటీలు, మెటల్ ధరల్లో హెచ్చుతగ్గులతో పాటు టారిఫ్ యుద్ధాలు తదితర అంశాల కారణంగా ఎగుమతులపై ప్రభావం పడినట్లు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్ఐఈవో) ప్రెసిడెంట్ అశ్వని కుమార్ తెలిపారు. అయితే, వాణిజ్య లోటు, దిగుమతులు పెరగడమనేది దేశీ పరిశ్రమపై ప్రతికూల ప్రభావం చూపవచ్చనే ఆందోళన నెలకొందని వివరించారు. ఇదీ చదవండి: డిపాజిట్పై బీమా పెంపు! వాణిజ్య శాఖ గణాంకాల ప్రకారం జనవరిలో కీలక వాణిజ్య భాగస్వామి అమెరికాకు ఎగుమతులు 39 శాతం పెరిగి 8.44 బిలియన్ డాలర్లకు చేరగా, దిగుమతులు 33 శాతం పెరిగి 3.57 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఏప్రిల్–జనవరి మధ్య కాలంలో ఎగుమతులు సుమారు 9 శాతం వృద్ధి చెంది 68.46 బిలియన్ డాలర్లకు ఎగిశాయి. 2023–24లో భారత్కి అమెరికా అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలి్చంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 119.71 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇందులో 77.51 బిలియన్ డాలర్ల విలువ చేసే ఎగుమతులు ఉండగా, 42.19 బిలియన్ డాలర్ల దిగుమతులు నమోదయ్యాయి. అమెరికాతో భారత్కి 35.31 బిలియన్ డాలర్ల వాణిజ్య మిగులు నమోదైంది. ఇరు దేశాలు 2030 నాటికి 500 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. -
డిపాజిట్పై బీమా పెంపు!
ముంబై: బ్యాంకు డిపాజిట్లను మరింత ఆకర్షణీయంగా మార్చే దిశగా త్వరలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఒక బ్యాంక్ పరిధిలో ఒక కస్టమర్కు గరిష్టంగా రూ.5 లక్షల డిపాజిట్పై బీమా సదుపాయం అమలవుతోంది. దీన్ని మరింత పెంచాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఎం.నాగరాజ్ వెల్లడించారు. ఇటీవలే ముంబైలో న్యూ ఇండియా కో ఆపరేటివ్ బ్యాంక్లో స్కామ్ వెలుగు చూడడం తెలిసిందే. ఈ తరహా స్కామ్లు, ఆర్థిక సంక్షోభాలతో బ్యాంక్ కుప్పకూలితే డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) డిపాజిట్దారులకు చెల్లింపులు చేస్తుంటుంది. ఇందుకుగాను బ్యాంక్లు డీఐసీజీసీకి ఏటా ప్రీమియం చెల్లిస్తుంటాయి. ‘‘డిపాజిట్ ఇన్సూరెన్స్ పెంపును ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రభుత్వం ఆమోదం తెలిపినప్పుడు దీన్ని నోటిఫై చేస్తాం’’అని నాగరాజు వెల్లడించారు. 2020లో పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో ఆపరేటివ్ (పీఎంసీ) బ్యాంక్లో సంక్షోభం తలెత్తిన తర్వాత.. డిపాజిట్పై ఇన్సూరెన్స్ను రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచడం గమనార్హం. దీని ఫలితంగా న్యూ ఇండియా కో ఆపరేటివ్ బ్యాంక్ డిపాజిట్ దారుల్లో 90 శాతం మందికి తమ డిపాజిట్ మొత్తం వెనక్కి రానుంది. -
ఈఎంఐలు.. ఇప్పట్లో తగ్గేనా?
ఆర్బీఐ చాలా కాలం తర్వాత కీలకమైన రెపో రేటు ను 25 బేసిస్ పాయింట్లు (0.25 శాతం) తగ్గిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో హమ్మయ్య రుణ రేట్లు తగ్గుతాయని, నెలవారీ ఈఎంఐ చెల్లింపుల భారం దిగొస్తుందని ఆశపడే వారు.. కొంత కాలం పాటు వేచి చూడక తప్పేలా లేదు. రెపో రేటు కోత ప్రభావం రుణాలు, డిపాజిట్లపై పూర్తిగా ప్రతిఫలించేందుకు కొన్ని నెలల సమయం తీసుకోవచ్చని విశ్లేషకులు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనికి ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో ద్రవ్య లభ్యత కొరత (లిక్విడిటీ) ఉండడాన్ని, డిపాజిట్ల సమీకరణ కోసం బ్యాంక్ల మధ్య నెలకొన్న తీవ్ర పోటీని ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్) ఆధారంగా మంజూరయ్యే రుణాలతోపాటు, డిపాజిట్లపై రేటు తగ్గింపు వెంటనే అమల్లోకి రాకపోవచ్చని.. అదే సమయంలో రెపో ఆధారిత రుణాలపై రేట్ల తగ్గింపు వేగంగా బదిలీ అవుతుందని చెబుతున్నారు. కొంత సమయం తర్వాతే.. ‘‘తాజా రేటు తగ్గింపు ప్రయోజనం కొత్త రుణాలపై అమలయ్యేందుకు కొంత సమయం తీసుకోవచ్చు. ఎందుకంటే డిపాజిట్ల కోసం పోటీ కారణంగా నిధులపై బ్యాంకులు అధికంగా వ్యయం చేయాల్సి వస్తోంది’’అని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ అజిత్ వెలోనీ తెలిపారు. ఫ్లోటింగ్ రేటు రుణాలపై ఆర్బీఐ రేటు తగ్గింపు వేగంగా అమల్లోకి వస్తుందన్నారు. బ్యాంకు రుణాల్లో 40 శాతం మేర రెపో ఆధారిత రుణాలు ఉన్నట్టు చెప్పారు. ఆర్బీఐ నిర్ణయంతో రెపో రేటు 6.5 శాతం నుంచి 6.25 శాతానికి దిగిరావడం తెలిసిందే. మరోవైపు సమీప భవిష్యత్లో లిక్విడిటీ పట్ల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లిక్విడిటీ పెంచే అదనపు చర్యలను ఆర్బీఐ తీసుకోకపోతే మార్చి నాటికి వ్యవస్థ వ్యాప్తంగా రూ.2.5 లక్షల కోట్ల లోటు ఏర్పడొచ్చని అంటున్నారు. అప్పుడు ఆర్బీఐ రేట్ల తగ్గింపు బదిలీకి మరింత సమయం పట్టొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎంసీఎల్ఆర్ ఆధారిత రుణాలపై రేట్ల తగ్గింపునకు రెండు త్రైమాసికాల సమయం తీసుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా ఈ రుణాల రేట్లను బ్యాంక్లు ఆర్నెళ్లకోసారి సమీక్షించడాన్ని ఇందుకు నిదర్శనంగా పేర్కొంటున్నారు. దీంతో బ్యాంక్లు జూలై లేదా వచ్చే డిసెంబర్లో ఈ రుణాల రేట్లను సవరించే అవకాశం ఉంటుంది.డిపాజిట్లపై.. ఇప్పటికే ఫిక్స్డ్ డిపాజిట్లు చేసిన వారికి తాజా రేటు తగ్గింపుతో ఎలాంటి ప్రభా వం పడదు. కొత్తగా డిపాజిట్ చేసే వారికి రేటు తగ్గే అవకాశాలున్నాయి. కాకపోతే వెంటనే కాకుండా క్రమంగా డిపాజిట్లపై ఈ మార్పు కనిపిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. డిపాజిట్ల కోసం బ్యాంక్ల మధ్య పోటీ ఉన్నందున రేట్లను వెంటనే తగ్గించకుండా, ఆర్బీఐ చర్యలతో లిక్విడిటీ మెరుగయ్యాకే డిపాజిట్లపై రేట్లు తగ్గించొచ్చని భావిస్తున్నారు. ‘‘ఎక్స్టర్నల్ బెంచ్మార్క్స్ అనుసంధానిత రుణాలపై రేట్ల మార్పు ప్రభావం వెంటనే అమల్లోకి రావచ్చు. ఎంసీఎల్ఆర్ ఆధారిత రుణాలపై అమలు కావడానికి కొంత సమయం తీసుకోవచ్చు. మానిటరీ పాలసీ రేట్ల ప్రభావం డిపాజిట్లపై ప్రతిఫలించేందుకు కూడా రెండు త్రైమాసికాలు పట్టొచ్చు’’అని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ స్వామినాథన్ పేర్కొనడం గమనార్హం. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
బంగారం, వెండి దిగుమతి ధరలు పెంపు
ప్రపంచ మార్కెట్లో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా భారత ప్రభుత్వం బంగారం (gold), వెండి (silver) దిగుమతి మూల ధరలను పెంచింది. ఫిబ్రవరి 14న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC) జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. బంగారం మూల ధర 10 గ్రాములకు 41 డాలర్లు పెరిగి 938 డాలర్లకు చేరుకుంది. వెండి బేస్ రేటు కూడా కేజీకి 42 డాలర్లు పెరిగింది.ట్రెండ్స్కు అనుగుణంగా సర్దుబాటుఅమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు సహా ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక రాజకీయ అంశాల కారణంగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. బేస్ దిగుమతి ధర పెరిగితే వాటి మీద విధించే దిగుమతి సుంకాలు కూడా పెరుగుతాయి. వీటిని బేస్ ధరలో ఒక శాతంగా లెక్కించి వసూలు చేస్తారు. దీని దిగుమతి ధరలో సర్దుబాటు కారణంగా వెండి ధరలు కూడా పెరిగాయి.భారత్లో బంగారం ధరలుప్రపంచ ట్రెండ్ను అనుసరించి సోమవారం (ఫిబ్రవరి 17 ) భారత్లో కూడా బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.8,662, 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.7,940 చొప్పున ఉన్నాయి. బేస్ ధరల సవరణతో, వ్యాపారులు దేశీయ బంగారం ధరలను తదనుగుణంగా సర్దుబాటు చేసే అవకాశం ఉంది. ఇది రిటైల్ మార్కెట్లో మొత్తం ధరలను ప్రభావితం చేస్తుంది.వెండి ధర సర్దుబాటుబంగారం లాగే వెండి కూడా అంతర్జాతీయంగా ధరల పెరుగుదలను చూసింది. వెండి బేస్ దిగుమతి ధరను పెంచాలనే ప్రభుత్వం నిర్ణయం ఈ ప్రపంచ మార్పులను చూపిస్తుంది. దిగుమతి ధరలలో మార్పు మార్కెట్కు అనుగుణంగా బేస్ ధరపై సుంకాలు విధించడం ద్వారా పన్నుల వ్యవస్థలో స్థిరత్వాన్ని కొనసాగించడానికి సహాయపడుతుంది. ప్రపంచ మార్కెట్ పరిస్థితుల్లో తదుపరి మార్పులను బట్టి తదుపరి సవరణ వరకు కొత్త బేస్ దిగుమతి ధరలు వర్తిస్తాయి. -
లిక్విడిటీ అవసరాలకు ఆర్బీఐ రూ.43 లక్షల కోట్లు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ సవాళ్లను పరిష్కరించడానికి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. 2024 డిసెంబర్లో బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి బ్యాంకింగ్ వ్యవస్థకు ఊతమిచ్చే చర్యలపై దృష్టి సారించారు. గత నాలుగు నెలల్లో సవాళ్లతో కూడిన లిక్విడిటీ పరిస్థితులను సమర్థంగా నిర్వహించేందుకు ఆర్బీఐ రూ.43.21 లక్షల కోట్లను చొప్పించింది.2024 డిసెంబర్ 16 నుంచి 2025 ఫిబ్రవరి 14 మధ్య బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ లోటు రూ.30,000 కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్లకు పెరిగింది. పన్ను ప్రవాహాలు, పరిమిత ప్రభుత్వ వ్యయం, రూపాయికి మద్దతుగా ఫారెక్స్ మార్కెట్లో ఆర్బీఐ భారీగా జోక్యం చేసుకోవడం ఈ మార్పునకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు.ఆర్బీఐ తీసుకున్న చర్యలుపెరుగుతున్న లిక్విడిటీ లోటును పరిష్కరించేందుకు, బ్యాంకింగ్ వ్యవస్థలోని సవాళ్లను ఎదుర్కోవడానికి ఆర్బీఐ కీలక చర్యలు తీసుకుంది. వేరియబుల్ రేట్ రెపో (వీఆర్ఆర్) వేలం ద్వారా రూ.16.38 లక్షల కోట్లను అందుబాటులో తీసుకొచ్చింది. రోజువారీ వీఆర్ఆర్ వేలం ద్వారా రూ.25.79 లక్షల కోట్లను అందించింది. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ (ఓఎంఓ) ద్వారా రూ.60,020 కోట్ల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేసింది. విదేశీ కరెన్సీ కొనుగోలు-అమ్మకం ద్వారా సుమారు రూ.45,000 కోట్లను వ్యవస్థలోకి చొప్పించింది.ఇదీ చదవండి: ఒకప్పుడు సుజుకీ సంస్థ నమ్మని మొదటి బిలియనీర్!మనీ మార్కెట్ రేట్లపై ప్రభావంలిక్విడిటీ లోటు సమస్యలున్నప్పటికీ ఓవర్నైట్ మనీ మార్కెట్ రేట్లు ఆర్బీఐ రెపోరేటు కంటే కొంచెం అధికంగానే ఉన్నాయి. 6.6 శాతం నుంచి 6.74 శాతం మధ్య ట్రేడ్ అవుతున్నాయి. కార్పొరేట్లు, బ్యాంకుల రుణ వ్యయాలపై ఇది నిరంతర ఒత్తిడిని పెంచుతోంది. దీన్ని పరిష్కరించాలని బ్యాంకర్లు ఆర్బీఐను కోరుతున్నారు. ఆర్థిక సవాళ్లను నిర్వహించడానికి, ఆర్థిక స్థిరత్వానికి మద్దతు ఇవ్వడానికి ఆర్బీఐ విస్తృత వ్యూహంలో భాగంగా ఇటీవలి పాలసీ రేటు కోతకు మద్దతు ఇచ్చింది. దాంతోపాటు బ్యాంకింగ్ వ్యవస్థలోకి లిక్విడిటీని చొప్పిస్తోంది. -
ప్రపంచంలోనే అధిక బంగారు నిల్వలున్న దేశాలు
ప్రపంచ వ్యాప్తంగా బంగారానికి(Gold) ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. మన దేశంలో అయితే దీన్ని మరింత విలువైన లోహంగా భావిస్తారు. కొందరు బంగారాన్ని తమ గౌరవానికి సూచికగా భావిస్తే..ఇంకొందరు దీన్నో పెట్టుబడి సాధనంగా చూస్తున్నారు. దాంతో దేశంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా పసిడికి డిమాండ్ పెరుగుతూనే ఉంది. ఇటీవల దీని తులంధర ఏకంగా రూ.88 వేలు దాటిపోయింది. త్వరలో బంగారం రేటు రూ.ఒక లక్ష కూడా చేరే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదిలాఉండగా, ప్రపంచవ్యాప్తంగా ఏయే దేశాల్లో అధికంగా బంగారం నిల్వలున్నాయో కింద తెలుసుకుందాం.యునైటెడ్ స్టేట్స్ 8,133.46 టన్నులుజర్మనీ 3,351.53 టన్నులుఇటలీ 2,451.84 టన్నులుఫ్రాన్స్ 2,436.94 టన్నులుచైనా 2,264.32 టన్నులుస్విట్జర్లాండ్ 1,039.94 టన్నులుభారతదేశం 853.63 టన్నులుజపాన్ 845.97 టన్నులుతైవాన్, చైనా 422.69 టన్నులుపోలాండ్ 419.70 టన్నులుఇదీ చదవండి: అంకెలు మారాయి కానీ.. ప్రశ్న మారలేదు..చైనాలో భారీ బంగారు గనిచైనాలోని హునాన్ ప్రావిన్స్లోని పింగ్ జియాంగ్ కౌంటీలో ఇటీవల సుమారు రూ.7,09,577,16,96,000 విలువైన ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు నిల్వల గనిని కనుగొన్నారు. ఈ నిక్షేపం వాంగు గోల్డ్ఫీల్డ్స్లో బయటపడినట్లు తెలియజేస్తున్నారు. ఇక్కడ భూగర్భ శాస్త్రవేత్తలు 2,000 మీటర్ల లోతు వరకు విస్తరించిన 40 బంగారు నిక్షేపాలను గుర్తించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం వీటిలో కనీసం 300 మెట్రిక్ టన్నుల బంగారం ఉందని తేలినట్లు సమాచారం. 3,000 మీటర్ల వరకు విస్తరించిన లోతైన ఈ గనిలో మరింత నిల్వలు ఉండవచ్చని అంచనా. దాంతో ఇందులో మొత్తంగా సుమారు 1,000 మెట్రిక్ టన్నుల వరకు బంగారం ఉంటుందని కొన్ని మీడియా సంస్థలు తెలిపాయి. -
కమర్షియల్ ఫ్లైట్లలో తరలుతున్న బంగారం!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US president Donald Trump) విధించిన సుంకాలు (US tariffs) భిన్నమైన గోల్డ్ రష్కు దారితీశాయి. న్యూయార్క్, లండన్ నగరాల మధ్య వాణిజ్య విమానాల్లో బిలియన్ల డాలర్ల విలువైన బంగారం తరలుతోందని ఒక నివేదిక తెలిపింది. పెరుగుతున్న ధరలు, మారుతున్న మార్కెట్ల కారణంగా జేపీ మోర్గాన్ సహా బ్యాంకులు బంగారాన్ని తరలించడానికి ఇబ్బంది పడుతున్నందున వింత పరిస్థితి ఏర్పడుతోందని క్వార్ట్జ్ నివేదించింది.పెరుగుతున్న బంగారం ధరలు బంగారం ధర నిరంతరం పెరుగుతోంది. ఈ సంవత్సరం ఫ్యూచర్స్ కాంట్రాక్టులు 11% పెరిగాయని నివేదిక పేర్కొంది. గత బుధవారం న్యూయార్క్లోని కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ ట్రాయ్ ఔన్సుకు 2,909 డాలర్ల వద్ద ముగిశాయి. ఇది త్వరలో 3,000 డాలర్లకు చేరుకోవచ్చని విశ్లేషకులు సూచిస్తున్నారని ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. ట్రంప్ ఎన్నిక, యూరప్పై సుంకాలు విధిస్తానని ఆయన బెదిరింపు తర్వాత, డిసెంబర్ ప్రారంభం నుండి లండన్లో భౌతిక బంగారం ధర దాదాపు 20 డాలర్లు తక్కువగా ట్రేడవుతోందని నివేదిక పేర్కొంది.న్యూయార్క్కు బంగారం తరలింపుసాధారణంగా లండన్, న్యూయార్క్ నగరాల్లో బంగారం ధరలు ఒకే రకంగా కదులుతాయి. ధరల అంతరం ఉన్నప్పుడల్లా వ్యాపారులు ఈ రెండు నగరాల మధ్య బంగారాన్ని తరలిస్తూ ఉంటారు. లండన్లో గోల్డ్ బార్లను కలిగి ఉన్న బ్యాంకులు వాటిని రుణంగా ఇవ్వడం ద్వారా ఈ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి. ఇక ధరల తగ్గుదల నుండి రక్షించుకోవడం కోసం న్యూయార్క్లో ఫ్యూచర్స్ కాంట్రాక్టులను విక్రయిస్తుంటాయి. జేపీ మోర్గాన్, హెచ్ఎస్బీసీ వంటి పెద్ద బ్యాంకులు ఈ బంగారు లావాదేవీలను నిర్వహిస్తుంటాయి.కానీ ఇటీవల పరిస్థితులు మారిపోయాయి. అమెరికాలో బంగారం ధరలు లండన్ కంటే ఎక్కువగా పెరగడంతో గోల్డ్ ఫ్యూచర్లను విక్రయించిన బ్యాంకులు ఇప్పుడు నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఈ ఫ్యూచర్స్ కాంట్రాక్టులను నష్టానికి తిరిగి కొనుగోలు చేయడానికి బదులుగా, బ్యాంకులు తమ లండన్ వాల్ట్ల నుండి భౌతిక బంగారాన్ని న్యూయార్క్కు తరలించే తెలివైన పరిష్కారాన్ని కనుగొన్నాయి. ఇలా చేయడం ద్వారా బ్యాంకులు నష్టపోకుండా తమ ఒప్పందాలను నెరవేర్చుకోవచ్చు. అలాగే బంగారాన్ని అధిక యూఎస్ ధరకు అమ్మడం ద్వారా లాభం కూడా పొందవచ్చు. వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకారం.. ఒక్క జేపీ మోర్గాన్ సంస్థే ఈ నెలలో న్యూయార్క్కు 4 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని తరలించాలని ప్రణాళిక వేసింది.బంగారం తరలింపునకు వాణిజ్య విమానాలుబంగారం తరలింపు బ్యాంకులకు నష్టాలను తగ్గించి, లాభాలను కూడా పొందేందుకు వీలు కల్పించినప్పటికీ, తరలింపులో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొంతమంది క్లయింట్లు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఖజానాల నుండి తమ బంగారాన్ని తిరిగి పొందడానికి ఒక వారం వరకు వేచి ఉన్నారని నివేదిక పేర్కొంది. ధర వ్యత్యాసాలు ఓవైపు ఉంటే మరోవైపు కామెక్స్ కాంట్రాక్టులు గోల్డ్ బార్ల పరిమాణానికి సంబంధించి కూడా కఠినమైన నిబంధనలు ఉన్నాయి. అంటే వ్యాపారులు బంగారాన్ని యథాతథంగా రవాణా చేయలేరు. యూఎస్కు రవాణా చేయడానికి ముందు సరైన పరిమాణంలోకి మార్చడానికి వాటిని ముందుగా శుద్ధి కర్మాగారాలకు పంపాల్సి ఉంటుందని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది.ఇలా బంగారం సిద్ధమైన తర్వాత కూడా దానిని రవాణా చేయడం అత్యంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందుకే వాణిజ్య విమానాల ద్వారా తరలింపు సురక్షితమైన మార్గమని బ్యాంకులు భావిస్తున్నాయని నివేదిక పేర్కొంది. బ్యాంకులు భద్రతా సంస్థలతో కలిసి సాయుధ వ్యాన్లలో బంగారాన్ని లండన్లోని విమానాశ్రయాలకు తరలిస్తున్నాయని, తరువాత వాటిని న్యూయార్క్కు తరలిస్తారని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. -
రుణగ్రహీతలకు శుభవార్త
ముంబై: బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) గృహ రుణ గ్రహీతలకు తీపి కబురు చెప్పింది. రుణ రేట్లను తగ్గించినట్లు బ్యాంక్ ప్రకటన పేర్కొంది. దీనితో గృహ రుణ గ్రహీతలకు ఈజీ మంత్లీ ఇన్స్టాల్మెంట్ల (ఈఎంఐ) భారం తగ్గనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను ఇటీవలే పావుశాతం తగ్గించిన నేపథ్యంలో (6.5 శాతం నుంచి 6.25 శాతానికి) ఎస్బీఐ తాజా నిర్ణయం తీసుకుంది. తగ్గించిన రేట్లు ఇలా...→ వివిధ రుణాలకు వర్తించే ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ ఆధారిత లెండింగ్ రేట్ (ఈబీఎల్ఆర్), అలాగే రెపో ఆధారిత రుణ రేటు (ఆర్ఎల్ఎల్ఆర్) 25 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతానికి సమానం) తగ్గించింది. ఈ తగ్గింపు ఫిబ్రవరి 15వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది. → అయితే బ్యాంక్ మార్జినల్ కాస్ట్–బేస్డ్ లెండింగ్ రేట్లు (ఎంసీఎల్ఆర్), బేస్ రేట్, బెంచ్మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్ను (బీపీఎల్ఆర్) యథాతథంగా కొనసాగించింది. రెపో ఆధారిత రుణల విషయానికి వస్తే...రెపో ఆధారిత రుణ రేటు (ఆర్ఎల్ఎల్ఆర్) ప్రత్యక్షంగా రెపో రేటుకు అనుసంధానమై ఉంటుంది. ఎస్బీఐ తాజా నిర్ణయంతో ఈ రేటు 8.75 శాతం నుంచి 8.50 శాతానికి తగ్గుతుంది. దీనితో ఆర్ఎల్ఎల్ఆర్కు అనుసంధానమైన గృహ, వాణిజ్య రుణాలు తగ్గుతాయి. ఆకర్షణీయం..ఈబీఎల్ఆర్ లేదా ఆర్ఎల్ఎల్ఆర్కు అనుసంధానమైన రుణ గ్రహీతల రుణ నిబంధనలను బట్టి వారి ఈఎంఐలు లేదా రుణ వ్యవధి తగ్గుతుంది. ఆర్బీఐ రెపో రేటు తగ్గింపుతో గృహ రుణాలను మరింత ఆకర్షణీయంగా చేస్తూ, ఈబీఎల్ఆర్, ఆర్ఎల్ఎల్ఆర్ను ఎస్బీఐ తగ్గించడం కస్టమర్లకు ప్రయోజనం కలిగించే అంశమని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఈ తగ్గిన రుణ రేటు ప్రయోజనాలు పొందడానికి మార్జినల్ కాస్ట్ రుణ రేటు (ఎంసీఎల్ఆర్) కస్టమర్లు తక్కువ వడ్డీరేటు రుణ విధానానికి మారవలసి ఉంటుంది. ‘రుణ’ పునఃపరిశీలనకు సూచన...తాజా రుణ రేట్లు, సంబంధిత పరిణామాల నేపథ్యంలో కొత్త రుణగ్రహీతలు రుణదాతను (బ్యాంక్) ఎంచుకునే ముందు వివిధ బ్యాంకుల రుణ రేట్లను సరిపోల్చుకోవాలని, వారి సామర్థ్యానికి అనువైన రుణ రేట్లను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే రుణగ్రహీతలు తప్పనిసరిగా తమ రుణ ఒప్పందాలను సమీక్షించుకోవాలని వారు సూచిస్తున్నారు. అవసరమైతే రీఫైనాన్సింగ్ ఎంపికలను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంటున్నారు. సెంట్రల్ బ్యాంక్ రెపో తగ్గింపు నేపథ్యంలో కెనరా బ్యాంక్, పీఎన్బీ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి అనేక బ్యాంకులు కూడా తమ రెపో ఆధారిత రుణ రేటును పావు శాతం తగ్గించాయి. ఈ బ్యాంకుల నుండి గృహ రుణ గ్రహీతలు తమ ఈఎంఐలను అలాగే రుణ చెల్లింపు వ్యవధి కాల పరిమితులను సమీక్షించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.ఈబీఎల్ఆర్ అంటే?ఈబీఎల్ఆర్ అంటే ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ లెండింగ్ రేట్. ఎస్బీఐ 2019 అక్టోబర్ నుంచి తన ఫ్లోటింగ్ రేటు గృహ రుణాలను అనుసంధానించడానికి ఈబీఎల్ఆర్ను ప్రామాణికంగా తీసుకుంది. దీనితో అన్ని ఫ్లోటింగ్ రేట్ హోమ్ లోన్లకు వడ్డీ రేట్లు ఎక్స్టర్నల్ బెంచ్మార్క్తో అనుసంధానమవుతాయి. తాజా నిర్ణయంతో గృహ రుణ ఫ్లోటింగ్ రేట్లు తగ్గుతాయన్న మాట. దీనితోపాటు ఈబీఎల్ఆర్కు అనుసంధానమైన అన్ని వ్యక్తిగత ఇతర రిటైల్ రుణాలు సైతం దిగివస్తాయి. తాజా నిర్ణయం ప్రకారం ఈబీఎల్ ఆర్ 9.15% నుంచి 8.90 శాతానికి తగ్గింది. -
ఎస్బీఐ గుడ్న్యూస్.. తగ్గనున్న ఈఎంఐ
భారతదేశంలో అతిపెద్ద రుణదాత అయిన 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (SBI) లోన్ తీసుకున్నవారికి శుభవార్త చెప్పింది. గృహ రుణాలతో సహా వివిధ రుణాలకు ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ ఆధారిత లోన్ రేటు (EBLR), రెపో లింక్డ్ లెండింగ్ రేటు (RLLR)ను తగ్గిస్తున్న ఇటీవల ప్రకటించింది. సవరించిన రుణ రేట్లు ఫిబ్రవరి 15, 2025 నుంచి అమల్లోకి వస్తాయి. ఎంపీసీ సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు (bps) తగ్గించిన తర్వాత ఎస్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.మార్జినల్ కాస్ట్-బేస్డ్ లెండింగ్ రేట్లు (MCLR), బేస్ రేటు & బెంచ్మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్ (BPLR)లలో ఎటువంటి మార్పులు లేకుండా కొనసాగించనున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. బ్యాంకులు వినియోగదారులకు అందించే వడ్డీ రేట్లను.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటు, రెపో లింక్డ్ లెండింగ్ రేట్ (RLLR) ఆధారంగా నిర్ణయిస్తాయి.గృహ రుణాలకు రేపో రేటును అనుసంధానం చేసేందుకు.. ఈబీఎల్ఆర్ విధానాన్ని ఎస్బీఐ 2019 అక్టోబర్ 1 నుంచి అనుసరిస్తోంది. ఈ కారణంగానే ఆర్బీఐ రేపు రేటును మార్చిన ప్రతిసారీ.. ఎస్బీఐ రేటు కూడా మారుతూ ఉంటుంది. ఈబీఎల్ఆర్ను 9.15 శాతం నుంచి 25 బేసిస్ పాయింట్లు తగ్గించి.. 8.90 శాతానికి చేర్చింది. దీంతో ఈబీఎల్ఆర్తో అనుసంధానం అయిన పర్సనల్ లోన్స్, హోమ్లోన్స్ వంటి వాటితో పాటు రిటైల్ లోన్స్పై వడ్డీ రేట్లు తగ్గనున్నాయి.రుణ రేట్లను సవరిస్తున్న బ్యాంకులుఎస్బీఐ మాత్రమే కాకుండా కెనరా బ్యాంక్ (9.25% నుంచి 9% శాతానికి), బ్యాంక్ ఆఫ్ ఇండియా (9.35% నుంచి 9.10%కి తగ్గించింది), బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( 9.25 శాతం నుంచి 9 శాతానికి తగ్గించింది), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (9.25 శాతం నుంచి 9 శాతానికి తగ్గించింది)లు కూడా వడ్డీ రేట్లను తగ్గించాయి.ఇదీ చదవండి: నేనో ఇడియట్లా ఫీలయ్యా.. నిఖిల్ కామత్ ఇన్స్టా పోస్ట్ వైరల్ -
ముంచుకొస్తున్న జనాభా సంక్షోభం
ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో నిరుద్యోగం పెచ్చురిల్లుతోంది. సరైన సంపాదన అవకాశాలులేక ప్రజలు పేదరికంలోకి నెట్టివేయబడుతున్నారు. దానికితోడు కొన్నిదేశాల్లో పెరుగుతున్న జనాభా ఆయా ప్రాంతాల అభివృద్ధికి సవాలుగా మారుతుంటే.. యూరప్లాంటి ఇంకొన్ని ప్రాంతాల్లో తగ్గుతున్న జనాభా భవిష్యత్తులో శ్రామికశక్తి లోటును సూచిస్తోంది. జనన రేటు, వృద్ధాప్యం, వలసలు, ఆర్థిక మార్పులు వంటి వివిధ అంశాలతో 2100 నాటికి యూరప్ జనాభా భారీగా తగ్గిపోతుందని కొన్ని సర్వేలు అంచనా వేస్తున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి జనాభాను ఆకర్షించేందుకు, స్థానికులకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేసేందుకు యూరప్ దేశాలు కొన్ని ప్రత్యేక వెసులుబాట్లు కల్పిస్తున్నాయి. అసలు యూరప్లో ఈ పరిస్థితులు నెలకొనేందుకుగల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.వృద్ధులు అధికమవుతుండడంయూరప్ 2100 నాటికి ప్రపంచంలోనే అత్యధిక వృద్ధాప్య జనాభా ఉన్న ప్రాంతాల్లో ఒకటిగా ఉంటుందని అంచనా. ఆరోగ్య సంరక్షణలో పురోగతి వల్ల వృద్ధుల నిష్పత్తి గణనీయంగా పెరుగుతుంది. ఇప్పటికే జర్మనీ, ఇటలీ, స్పెయిన్ వంటి దేశాల్లో భారీగా వృద్ధులు పెరుగుతున్నారు. దేశ ఉత్పాదకతలో పెద్దగా పాలుపంచుకోని ఈ జనాభా వల్ల సామాజిక సంక్షేమ వ్యవస్థలు, ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు, పెన్షన్ పథకాలపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు, వృద్ధాప్య సమాజానికి మద్దతు ఇవ్వడానికి సమగ్ర విధాన సంస్కరణలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.తగ్గుతున్న జననాల రేటుఅనేక యూరప్ దేశాల్లో జననాల రేటు క్షీణిస్తోంది. ఈ ధోరణి రాబోయే దశాబ్దాల్లో అధికంగా ఉంటుందని భావిస్తున్నారు. మారుతున్న సామాజిక నిబంధనలు, ఆర్థిక ఒత్తిళ్లు, జీవనశైలి వంటి అంశాలు ఈ తగ్గుదలకు దోహదం చేస్తాయి. దాంతో భవిష్యత్తులో గ్రీస్, పోర్చుగల్, హంగేరి వంటి దేశాలు స్థిరమైన శ్రామిక శక్తిని నిర్వహించడంలో సవాళ్లను ఎదుర్కోవచ్చు. ఇది కార్మికుల కొరతకు, ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుంది. దీన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు అధిక జనన రేటుకు అవసరమయ్యే విధానాలను అమలు చేయాలి. యువతకు, పనిచేసే తల్లిదండ్రులకు మద్దతుగా నిలిచేందుకు వినూత్న పరిష్కారాలను అన్వేషించాలి.వలసలే శరణ్యం?2100 నాటికి యూరప్ జనాభాపై వలసలు కీలక పాత్ర పోషిస్తాయని అంచనా వేస్తున్నారు. శ్రామిక కొరత, జనాభా అసమతుల్యతలను పరిష్కరించడానికి వలస విధానాలు మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. ఫ్రాన్స్, యునైటెడ్ కింగడమ్, స్వీడన్ వంటి దేశాలు గణనీయమైన సంఖ్యలో వలసదారులను ఆకర్షించే ప్రయత్నాలు చేయాల్సి ఉంది. ఇది జనాభా పెరుగుదలకు, వైవిధ్యానికి దోహదం చేస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాలు ఈ దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నాయి.స్పెయిన్: గ్రామీణ ప్రాంతాల్లో జనాభా తగ్గుదలను పరిష్కరించేందుకు ఆయా ప్రాంతాల్లో నివసించాలనుకునేవారికి ప్రత్యేకంగా 3,000 యూరోలు(రూ.2.7 లక్షలు) అందిస్తుంది. పిల్లలతో ఉన్న కుటుంబాలు అదనపు బోనన్ను పొందవచ్చు.ఇటలీ: ఇటలీ తన ప్రాంతాల్లో తిరిగి జనావాసాన్ని పెంచే కార్యక్రమాలను ప్రారంభించింది. మోలిస్, కాలాబ్రియా, సిసిలీ వంటి ప్రాంతాల్లో నివసించాలనుకునే కొత్తవారికి మూడు సంవత్సరాలకుగాను 28,000 యూరోలు(రూ.25.44 లక్షలు) అందిస్తుంది. దాంతోపాటు స్థానిక వ్యాపారాన్ని ప్రారంభించడానికి గ్రాంట్లు కూడా పొందవచ్చు. ఒక యూరో(సుమారు రూ.91) కంటే తక్కువకు గృహాలను కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తుంది.గ్రీస్: మారుమూల ద్వీపం అంటికైథెరాలో నివసించడానికి గ్రీస్ కొత్త నివాసితులను ఆకర్షించే ప్రయత్నాలు ప్రారంభించింది. అక్కడ నివసించాలనుకునే వారికి గృహ సహాయంతో పాటు ఏటా 3,000 యూరోలు(రూ.2.7 లక్షలు) వరకు గ్రాంట్లను అందిస్తుంది. ఈ చొరవ వల్ల ఆ ద్వీపం సంస్కృతిని పరిరక్షించడం లక్ష్యంగా పెట్టుకుంది.ఐర్లాండ్: ఐర్లాండ్ ద్వీపాల్లో నివసించడానికి ఇష్టపడేవారికి గృహ పునరుద్ధరణ, పునరావాస గ్రాంట్ల కోసం ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు.పట్టణీకరణ, ప్రాంతీయ అసమానతలుపట్టణీకరణ పెరుతున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఉపాధికోసం, ఇతర కారణాల వల్ల లండన్, పారిస్, బెర్లిన్ వంటి ప్రధాన నగరాల్లో నివసిస్తున్నారు. ఇవి ఆర్థిక కార్యకలాపాలు, సాంస్కృతిక వైవిధ్యానికి కేంద్రాలుగా ఉన్నప్పటికీ ప్రాంతీయ అసమానతలకు దారితీస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలు జనాభా, ఆర్థిక క్షీణతను ఎదుర్కొంటున్నాయి. ప్రాంతీయ అభివృద్ధిని ప్రోత్సహించడం, మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెట్టడం, తక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో అవకాశాలను పెంపొందించడం ద్వారా ఈ అసమతుల్యతలను పరిష్కరించాలి.సాంకేతిక పురోగతి, భవిష్యత్తు అవకాశాలుయూరప్ భవిష్యత్తు జనాభాను పెంపొందించడంలో సాంకేతిక పురోగతి కీలక పాత్ర పోషిస్తుంది. ఆటోమేషన్, కృత్రిమ మేధస్సు, ఆరోగ్య సంరక్షణలో పురోగతి శ్రామిక శక్తిని ప్రభావితం చేస్తాయి. ప్రభుత్వాలు, వ్యాపారాలు నూతన మార్పులకు అనుగుణంగా మారాలి. సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో అవసరమైన నైపుణ్యాలు, వనరులను పౌరులు కలిగి ఉన్నారో లేదో నిర్ధారించుకుని అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి.ఇదీ చదవండి: కుమారుడి పెళ్లి ఖర్చుపై విమర్శలు.. నీతా అంబానీ రిప్లై2100 నాటికి యూరప్ దేశాల్లో జనాభా క్షీణత ఇలా..దేశం జనాభా క్షీణత తగ్గుదలపోలాండ్ 1.88 కోట్లు 49%జర్మనీ 1.31 కోట్లు 16%ఇటలీ 2.38 కోట్లు 40%ఉక్రెయిన్ 2.38 కోట్లు 61%బల్గేరియా 32 లక్షలు 47%లిథువేనియా 16 లక్షలు 57%లాట్వియా 9.28 లక్షలు 50%సెర్బియా 30 లక్షలు 45%హంగేరీ 22 లక్షలు 23% -
శాంతించిన కూరగాయలు, ఆహార ధరలు
న్యూఢిల్లీ: టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం జనవరి నెలలో స్వల్పంగా క్షీణించింది. 2024 డిసెంబర్ నెలలో 3.7 శాతంగా ఉండగా, అక్కడి నుంచి 2.31 శాతానికి దిగొచ్చింది. ఆహారోత్పత్తులు, ముఖ్యంగా కూరగాయల ధరలు శాంతించడం సానుకూలించింది. 2024 జనవరి నెలకు ఇది 0.33 శాతంగా ఉండడం గమనార్హం.విభాగాల వారీగా.. గత డిసెంబర్లో ఆహార వస్తువల ద్రవ్యోల్బణం 8.47 శాతం స్థాయిలో ఉంటే, జనవరిలో 5.88 శాతానికి శాతించింది. కూరగాయల ద్రవ్యోల్బణం 28.65 శాతం నుంచి 8.35 శాతానికి తగ్గింది. ఈ విభాగంలో టమాటాల ధరలు 18.9 శాతం తగ్గాయి.ఆలుగడ్డల ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయిలో 74.28 శాతంగా ఉంది. ఉల్లిగడ్డల ఆధారిత ద్రవ్యోల్బణం 28.33 శాతానికి పెరిగింది.గుడ్లు, మాంసం, చేపల విభాగంలోనూ 5.43 శాతం నుంచి 3.56 శాతానికి దిగొచ్చింది.ఇంధనం, విద్యుత్ విభాగంలో ద్రవ్యోల్బణం 3.79 శాతం నుంచి 2.78 శాతానికి చల్లబడింది.తయారీ వస్తువుల టోకు ద్రవ్యోల్బణం మాత్రం 2.14 శాతం నుంచి 2.51 శాతానికి పెరిగింది. పెరిగే రిస్క్.. ‘‘టోకు ద్రవ్యోల్బణం 2024–25 ఆర్థిక సంవత్సరానికి సగటున 2.4 శాతంగా ఉండొచ్చు. కానీ, వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2025–26) ఇది 3 శాతానికి పెరగొచ్చు’’అని ఇక్రా సీనియర్ ఆర్థికవేత్త రాహుల్ అగర్వాల్ తెలిపారు. -
మనపై అమెరికా సుంకాల ప్రభావం అంతంతే..
అమెరికా ప్రతిపాదిత ప్రతీకార టారిఫ్ల ప్రభావం భారత్పై పెద్దగా ఉండకపోవచ్చని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. ఇరు దేశాలు ఎగుమతుల తీరుతెన్నులు భిన్నంగా ఉండటమే కారణమని ఆయన చెప్పారు. ఉదాహరణకు అమెరికా నుంచి దిగుమతయ్యే పిస్తాలపై భారత్ 50 శాతం సుంకాలు విధిస్తోందనుకుంటే, మన దగ్గర్నుంచి దిగుమతయ్యే వాటి మీద కూడా అమెరికా అదే స్థాయిలో టారిఫ్లు వడ్డిస్తానంటే ఉపయోగం ఉండకపోవచ్చన్నారు. ఎందుకంటే భారత్ అసలు పిస్తాలే ఎగుమతి చేయదు కాబట్టి నష్టపోయేదేమీ ఉండదని శ్రీవాస్తవ చెప్పారు.అమెరికా నుంచి దిగుమతుల విలువకు సంబంధించి 75 శాతం భాగానికి టారిఫ్లు సగటున 5 శాతం లోపే ఉంటున్నాయని ఆయన తెలిపారు. ఇక జౌళి, దుస్తులు, పాదరక్షలులాంటి కార్మిక శక్తి ఎక్కువగా ఉండే ఉత్పత్తుల ఎగుమతుల విషయంలో అమెరికా అత్యధికంగా 15–35 శాతం సుంకాలు విధిస్తోందని వివరించారు. ‘రెండు దేశాల ఎగుమతుల ప్రొఫైల్స్ భిన్నంగా ఉంటాయి కాబట్టి ప్రతీకార టారిఫ్ల ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు.ప్రతీకార టారిఫ్లపై అమెరికా తుది నిర్ణయం కోసం ఏప్రిల్ వరకు ఎదురు చూసి, అప్పుడు అవసరమైతే 2019 జూన్లోలాగే మనం కూడా తగిన చర్యలు తీసుకోవచ్చు‘ అని శ్రీవాస్తవ పేర్కొన్నారు. వ్యాపార భాగస్వామ్య దేశాలతో వాణిజ్య లోటును భర్తీ చేసుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయా దేశాలపై ప్రతీకార టారిఫ్లను ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. స్పష్టత రావాలిపరిశ్రమపై విధిస్తుందా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంటుందని శ్రీవాస్తవ చెప్పారు. ఉదాహరణకు అత్యంత ప్రాధాన్య దేశాలకు (ఎంఎఫ్ఎన్) వ్యవసాయోత్పత్తుల మీద తాము 5 శాతం సుంకాలు విధిస్తుంటే.. భారత్ సగటు ఎంఎఫ్ఎన్ టారిఫ్ 39 శాతంగా ఉంటోందని అమెరికా వైట్హౌస్ ఫ్యాక్ట్ షీట్ వెల్లడించింది. అలాగే తమ మోటర్సైకిళ్లపై భారత్ 100 శాతం టారిఫ్లు విధిస్తుంటే, భారత మోటర్సైకిళ్లపై తాము 2.4 శాతం మాత్రమే విధిస్తున్నట్లు అమెరికా పేర్కొంది. దీనిపై స్పందిస్తూ పారదర్శకంగా నిర్ణయాలు తీసుకునేందుకు అమెరికా ఏదో ఒక అంశాన్ని, అంటే, ఉత్పత్తి లేదా రంగాన్ని ప్రామాణికంగా పరిగణించాలని శ్రీవాస్తవ చెప్పారు. లేకపోతే అత్యధికంగా పారిశ్రామికోత్పత్తులను సరఫరా చేసే చైనాకు ప్రయోజనం చేకూర్చినట్లవుతుందని పేర్కొన్నారు.వాణిజ్యంలో కీలక భాగస్వామి...అమెరికాకు భారత్ గణనీయంగా ఎగుమతి చేస్తుండగా, అక్కడి నుంచి దిగుమతులు తక్కువగానే ఉంటూ.. వాణిజ్య మిగులు భారత్ పక్షాన సానుకూలంగా ఉంటోంది. 2023–24లో 119.71 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యంతో భారత్కు అమెరికా అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా నిల్చింది. అప్పట్లో భారత్ 77.51 బిలియన్ డాలర్ల ఎగుమతులు చేయగా, 42.19 బిలియన్ డాలర్ల ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది. 35.31 బిలియన్ డాలర్ల వాణిజ్య మిగులు సాధించింది. మరోవైపు, 2024–25 ఏప్రిల్–నవంబర్ మధ్య కాలంలో 82.52 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యంతో భారత్కు అమెరికా రెండో అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా నిల్చింది. భారత్ 52.89 బిలియన్ డాలర్ల ఉత్పత్తులను ఎగుమతి చేయగా, 29.63 బిలియన్ డాలర్ల విలువ చేసే ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది. భారత్ పక్షాన 23.26 బిలియన్ డాలర్ల మిగులు నమోదైంది. -
పండగైనా బ్యాంకులు పనిచేయాల్సిందే: ఆర్బీఐ
మార్చి 31, 2025 (సోమవారం) ప్రభుత్వ సెలవు దినం అయినప్పటికీ.. అన్ని బ్యాంకులు పనిచేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆదేశించింది. 2024-25 ఆర్ధిక సంవత్సరం ముగింపు రోజు కాబట్టి.. అన్ని లావాదేవాలను అదే రోజు నమోదయ్యేలా చూసేందుకు సెలవు రద్దు చేయడం జరిగింది.2025 ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. కాబట్టి అప్పటికే పన్ను చెల్లింపులు (ఆదాయపు పన్ను, జీఎస్టీ, కస్టమ్స్, ఎక్సైజ్ సుంకాలు), పెన్షన్ చెల్లింపులు, ప్రభుత్వ సబ్సిడీలు, ప్రభుత్వ జీతభత్యాల చెల్లింపు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రజా లావాదేవీలను ముగించాల్సి ఉంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.నిజానికి మార్చి 31 రంజాన్ పండుగ, ఈ కారణంగానే.. దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు. ఆర్ధిక సంవత్సరం చివరి రోజు కావడంతో ఆ రోజు బ్యాంకులన్నీ పనిచేయాలని.. ఆర్ధిక కార్యకలాపాలకు సంబంధించిన అన్ని పనులను పూర్తి చేయాలనీ ఆర్బీఐ ఆదేశించింది. అంతే కాకుండా ఏప్రిల్ 1న సెలవు దినంగా ప్రకటించింది. ఆన్లైన్ సేవలు అన్ని సెలవు దినాల్లో కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఆన్లైన్ లావాదేవీలకు ఎలాంటి ఆటంకం ఉండదు. -
ఈపీఎఫ్ఓ వడ్డీరేటుపై త్వరలో నిర్ణయం
ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 8 శాతానికి పైగా కొనసాగించే ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. ఇది గత సంవత్సరానికి ప్రకటించిన 8.25% రేటుకు దగ్గరగా ఉండనుంది. ఫిబ్రవరి 28న ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ఓ ఆదాయ, వ్యయాలను పరిగణనలోకి తీసుకుని రిటైర్మెంట్ ఫండ్ బాడీ గణాంకాలను లెక్కలోకి తీసుకోనున్నారు. వీటన్నింటినీ లెక్కించి వడ్డీ రేటును నిర్ణయించడానికి ఇన్వెస్ట్మెంట్ కమిటీ, ఈపీఎఫ్ఓ అకౌంట్స్ కమిటీ త్వరలో సమావేశం కానున్నాయని ఓ అధికారి తెలిపారు. సంబంధిత కమిటీలు వివరాలను రూపొందిస్తున్నాయని, గత సంవత్సరాలతో సమానంగా ఉండే వడ్డీ రేటును ప్రతిపాదించే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ఓ పెట్టుబడులపై అధిక రాబడులు, సబ్స్క్రైబర్ల సంఖ్య పెరిగినట్లు చెప్పారు. అదే సమయంలో క్లెయిమ్ సెటిల్మెంట్లు అధికమయ్యాయని పేర్కొన్నారు.ఇదీ చదవండి: నేడు పార్లమెంట్లో కొత్త ఆదాయపన్ను బిల్లు2023-24లో రూ.1.82 లక్షల కోట్ల విలువైన 4.45 కోట్ల క్లెయిమ్లను పరిష్కరించగా, 2024-25లో రూ.2.05 లక్షల కోట్ల విలువైన 5.8 కోట్ల క్లెయిమ్లను ఈపీఎఫ్ఓ ప్రాసెస్ చేసిందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఈపీఎఫ్ఓకు 6.5 కోట్లకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. 2023-24 సంవత్సరానికి రూ.1,07,000 కోట్ల ఆదాయంపై 8.25 శాతం వడ్డీని ఇచ్చింది. 2022-23లో రూ.11.02 లక్షల కోట్ల అసలు ఆదాయంపై 8.15 శాతం వడ్డీ రేటుపై రూ.91,151.66 కోట్ల ఆదాయం అందించింది. వడ్డీ రేటుకు సంబంధించిన తుది ప్రతిపాదనను ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) ఆమోదం కోసం సమర్పిస్తారు. ఒకసారి ఆమోదం పొందితే అధికారికంగా నోటిఫై చేసి చందాదారుల ఖాతాల్లో జమ చేయడానికి ముందు ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతి అవసరం అవుతుంది. -
నేడు పార్లమెంట్లో కొత్త ఆదాయపన్ను బిల్లు
కేంద్ర ప్రభుత్వం గురువారం కొత్త ఆదాయపన్ను బిల్లును (ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు, 2025) లోక్సభలో ప్రవేశపెట్టనుంది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బిల్లును సమర్పించనున్నారు. ఇందులో ఎలాంటి కొత్త పన్నుల్లేవని ఇదివరకే స్పష్టం చేశారు. ఇది వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్యూఎఫ్), ఇతరులకు సంబంధించిన ఆదాయపన్ను ముసాయిదా చట్టం అని తెలిపారు. ఈ బిల్లు అర్థం చేసుకునేందుకు, ఆచరణకు సులభతరంగా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.కొత్త బిల్లు పన్ను చట్టాలను ఎలా సులభతరం చేస్తుంది?కొత్త బిల్లులో ట్యాక్స్ ఇయర్ అనే పదాన్ని తీసుకొచ్చారు. టాక్స్ ఇయర్ అనేది నిర్దిష్ట ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను ప్రయోజనాల కోసం పరిగణించే 12 నెలల వ్యవధి. కొత్త ఆదాయపు పన్ను బిల్లు ప్రకారం ట్యాక్స్ ఇయర్ గతంలోలాగే ఏప్రిల్ 1న ప్రారంభమై మరుసటి ఏడాది మార్చి 31న ముగుస్తుంది. 1961 ఆదాయపు పన్ను చట్టంలో ఉపయోగించిన ‘ప్రివియస్ ఇయర్’, ‘అసెస్మెంట్ ఇయర్(మదింపు సంవత్సరం)’ స్థానంలో ఈ ట్యాక్స్ ఇయర్ను వాడనున్నారు.స్థిరమైన ట్యాక్స్ ఇయర్ను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా పన్ను చెల్లింపుదారులు ఆదాయాన్ని నివేదించడానికి, పన్నులు చెల్లించడానికి నిర్దిష్ట వ్యవధిని కలిగి ఉంటారు. ఇది విభిన్న ఆర్థిక సంవత్సరాలకు వేర్వేరు అసెస్మెంట్ ఇయర్(మదింపు సంవత్సరం-వచ్చే ఆర్థిక సంవత్సరం)లను కలిగి ఉండటం వల్ల తలెత్తే గందరగోళాన్ని తొలగిస్తుంది.పన్ను చెల్లింపుదారులు తమ బాధ్యతలను అర్థం చేసుకోవడానికి సులభమైన, స్పష్టమైన భాషను ఉపయోగించాలని కొత్త బిల్లు లక్ష్యంగా పెట్టుకుంది. ఏళ్ల తరబడి పేరుకుపోయిన కాలం చెల్లిన నిబంధనలు, వివరణలను తొలగించాలని నిర్ణయించారు.పన్ను విధానాలకు సంబంధించి స్పష్టమైన నిర్వచనాలు, క్రమబద్ధమైన విధానాలతో కొత్త పన్ను చట్టాలు వివాదాలు, లిటిగేషన్లను తగ్గిస్తాయని భావిస్తున్నారు. దీనివల్ల మరింత పన్ను వసూలుకు వీలవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పన్నుకు సంబంధించి వివాదాలు తగ్గడం వల్ల న్యాయవ్యవస్థపై భారం తగ్గుతుందని చెబుతున్నారు.తరచూ శాసన పరమైన సవరణలు అవసరం లేకుండా పన్ను పథకాలను ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ)కి ఎక్కువ అధికారాన్ని ఈ బిల్లు కల్పిస్తుంది.ఇదీ చదవండి: హార్వర్డ్ యూనివర్సిటీలో నీతా అంబానీ ప్రసంగం1961 నాటి చట్టం 880 పేజీలు, 298 సెక్షన్లు, 23 చాప్టర్లు, 14 షెడ్యూళ్లతో ఉంది. కొత్త బిల్లును 622 పేజీలకు కుదించారు. అదే సమయంలో సెక్షన్లను 526కు, షెడ్యూళ్లను 16కు పెంచారు. చాప్టర్లు 23గానే ఉన్నాయి. -
నెమ్మదించిన పారిశ్రామికోత్పత్తి
న్యూఢిల్లీ: మైనింగ్, తయారీ రంగాల పేలవ పనితీరుతో డిసెంబర్లో పారిశ్రామికోత్పత్తి వృద్ధి మందగించింది. ఐఐపీ (పారిశ్రామికోత్పత్తి సూచీ) 3 నెలల కనిష్ట స్థాయిలో 3.2 శాతానికి పరిమితమైంది. 2023 డిసెంబర్లో ఇది 4.4 శాతంగా నమోదైంది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్వో) ఈ మేరకు గణాంకాలు విడుదల చేసింది. ఈ సందర్భంగా గతేడాది నవంబర్ గణాంకాలను 5.2 శాతం నుంచి 5 శాతానికి సవరించింది. అటు ఐఐపీ వృద్ధి సెప్టెంబర్లో 3.2 శాతంగా, అక్టోబర్లో 3.7 శాతంగా నమోదైంది.డిసెంబర్లో తయారీ రంగ ఉత్పత్తి 4.6 శాతం నుంచి 3 శాతానికి నెమ్మదించింది. అలాగే మైనింగ్ ఉత్పత్తి సైతం 5.2 శాతం నుంచి 2.6 శాతానికి పడిపోయింది.విద్యుదుత్పత్తి 1.2 శాతం నుంచి 6.2 శాతానికి, కన్జూమర్ డ్యూరబుల్స్ 5.2 శాతం నుంచి 8.3 శాతానికి పెరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్/నిర్మాణ రంగ ఉత్పత్తుల తయారీ 5.5 శాతం నుంచి 6.3 శాతానికి వృద్ధి చెందింది. ఇదీ చదవండి: ఓఎన్జీపీఎల్ చేతికి అయానా రెన్యూవబుల్ఐఐటీ–మద్రాస్తో ఎస్ఈఐఎల్ ఒప్పందంహైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో అతిపెద్ద స్వతంత్ర విద్యుత్ ఉత్పత్తిదారులలో ఒకటైన ఎస్ఈఐఎల్ ఎనర్జీ తాజాగా ఐఐటీ మద్రాస్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా కార్బన్ క్యాప్చర్ (బొగ్గు పులుసు వాయువును సంగ్రహించే) సాంకేతికతను అభివృద్ధి చేస్తారు. కార్బన్ క్యాప్చర్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచే పేటెంట్ కలిగిన కీమోజెల్ అనే నానోపారి్టకల్ ఆధారిత ద్రావకాన్ని ఐఐటీ మద్రాస్ ఇప్పటికే సృష్టించింది. ఇప్పుడు క్షేత్ర స్ధాయిలో ఈ ద్రావకం పనితీరును పరీక్షించేందుకు ఒక పైలట్ ప్రాజెక్ట్కు శ్రీకారం చుట్టారు. ఈ విప్లవాత్మక పరిశోధనకు మద్దతుగా కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా రూ.71 లక్షల నిధులు సమకూరుస్తున్నట్టు ఎస్ఈఐఎల్ సీఈవో రాఘవ్ త్రివేది తెలిపారు. -
కొత్త పన్ను చట్టం.. ఎంతో సులభతరం!
న్యూఢిల్లీ: అర్థం చేసుకునేందుకు, ఆచరణకు సులభతరంగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం చెబుతున్న కొత్త ఆదాయపన్ను బిల్లును (ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు, 2025) ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్సభకు సమర్పించనున్నట్టు సమాచారం. ఇందులో ఎలాంటి కొత్త పన్నుల్లేవు. వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్యూఎఫ్), ఇతరులకు సంబంధించిన ఆదాయపన్ను ముసాయిదా చట్టం ఇది. చిన్న వ్యాక్యాలతో, చదివేందుకు వీలుగా, టేబుళ్లు, ఫార్ములాలతో ఉంటుంది. ఆదాయపన్ను చట్టం, 1961 స్థానంలో తీసుకువస్తున్న ఈ నూతన బిల్లు స్టాండింగ్ కమిటీ పరిశీలన, పార్లమెంట్ ఆమోదం అనంతరం 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. ‘‘1961 నాటి ఆదాయపన్ను చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత నుంచి ఎన్నో సవరణలు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రాథమిక నిర్మాణమే మారిపోయింది. భాష సంక్లిష్టంగా ఉండడంతో, నిబంధనల అమలు విషయంలో పన్ను చెల్లింపుదారులపై వ్యయ భారం పెరిగింది. ఇది పన్ను యంత్రాంగం సమర్థతపైనా ప్రభావం చూపిస్తోంది’’అని కొత్త బిల్లు తీసుకురావడానికి గల కారణాలను ప్రభుత్వం వివరించింది. బిల్లులోని అంశాలు.. ట్యాక్స్ ఇయర్: గడిచిన ఆర్థిక సంవత్సరానికి (పీవై) రిటర్నులు దాఖలు చేసే సంవత్సరాన్ని అసెస్మెంట్ సంవత్సరంగా (ఏవై) ప్రస్తుతం పిలుస్తున్నారు. ఇకపై పీవై, ఏవై పదాలు ఉండవు. వీటి స్థానంలో ఏప్రిల్ 1 నుంచి 12 నెలల కాలాన్ని (ఆర్థిక సంవత్సరాన్ని) ‘ట్యాక్స్ ఇయర్’గా సంభాషిస్తారు. ప్రస్తుత చట్టం ప్రకారం 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి 2024–25 అసెస్మెంట్ సంవత్సరం అవుతుంది. సైజు కుదింపు: 1961 నాటి చట్టం 880 పేజీలు, 298 సెక్షన్లు, 23 చాప్టర్లు, 14 షెడ్యూళ్లతో ఉంది. కొత్త బిల్లును 622 పేజీలకు కుదించారు. అదే సమయంలో సెక్షన్లను 526కు, షెడ్యూళ్లను 16కు పెంచారు. చాప్టర్లు 23గానే ఉన్నాయి. టేబుళ్ల రూపంలో: టీడీఎస్, ప్రిజంప్టివ్ ట్యాక్స్, వేతనాలు, మినహాయింపులకు సులభంగా అర్థం చేసుకునేందుకు టేబుళ్లను ఇచ్చారు. టీడీఎస్ సెక్షన్లు అన్నింటికీ ఒకే క్లాజు కిందకు తీసుకొస్తూ అర్థం చేసుకునేందుకు సులభమైన టేబుళ్ల రూపంలో ఇచ్చినట్టు నాంజియా ఆండర్సన్ ఎల్ఎల్పీ ఎంఅండ్ఏ ట్యాక్స్ పార్ట్నర్ సందీప్ ఝున్ఝున్వాలా తెలిపారు. → వేతనాల నుంచి స్టాండర్డ్ డిడక్షన్, గ్రాట్యుటీ, ఎల్టీసీ తదితర తగ్గింపులన్నింటినీ వేర్వేరు సెక్షన్ల కింద కాకుండా ఒకే చోట ఇచ్చారు. → ‘నాత్ విత్ స్టాండింగ్’ (అయినప్పటికీ) అన్న పదం ప్రస్తుత చట్టంలో చాలా సందర్భాల్లో కనిపిస్తుంది. దీని స్థానంలో ఇర్రెస్పెక్టివ్ (సంబంధంలేకుండా)ప్రవేశపెట్టారు. ఇలా అనవసర పదాలు తొలగించారు. → ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్లకు (ఈసాప్) సంబంధించి పన్నులో స్పష్టత తీసుకొచ్చారు. → పన్ను చెల్లింపుదారుల చాప్టర్లో.. పన్ను చెల్లింపుదారుల హక్కులు, బాధ్యతలను వివరంగా పేర్కొన్నారు. -
దిగొస్తున్న ధరలు
న్యూఢిల్లీ: రిటైల్ ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కూరగాయలు, గుడ్లు, పప్పు ధాన్యాల ధరల క్షీణతతో జనవరిలో మరికాస్త తగ్గి 4.31 శాతానికి పరిమితమైంది. ఇది అయిదు నెలల కనిష్టం. చివరిసారిగా 2024 ఆగస్టులో ఇది 3.65 శాతంగా నమోదైంది. వినియోగదారుల ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం గతేడాది జనవరిలో 5.1 శాతంగాను, డిసెంబర్లో 5.22 శాతంగాను ఉంది. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) బుధవారం విడుదల చేసిన డేటా ప్రకారం జనవరిలో ఆహార పదార్థాల బాస్కెట్ ద్రవ్యోల్బణం 6.02 శాతంగా ఉంది. గత ఆగస్టులో నమోదైన 5.66 శాతం తర్వాత ఇది కనిష్టం. గ్రామీణ ప్రాంతాల్లో రిటైల్, ఆహార ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గినట్లు ఎన్ఎస్వో తెలిపింది. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుండటంతో ఆర్బీఐ త్వరలో మరోసారి కీలక వడ్డీ రేట్లను మరో పావు శాతం తగ్గించే అవకాశాలు ఉన్నాయి. -
రూ.50 నోట్లపై గవర్నర్ సంతకం మార్పు
ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ స్థానంలో 2024 డిసెంబర్లో బాధ్యతలు స్వీకరించిన ప్రస్తుత గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో కొత్త రూ.50 నోట్లను జారీ చేసే ప్రణాళికలను ప్రకటించారు. మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ సంతకం ఉన్న నోట్లు చట్టబద్ధంగా యథావిధిగా చెల్లుబాటు అవుతాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. కొత్త నోట్లు మహాత్మా గాంధీ ఇమేజ్తో కొత్త సిరీస్లోని రూ.50 నోట్లనే పోలి ఉంటాయని ఆర్బీఐ పేర్కొంది. కేవలం శక్తికాంత దాస్ సంతకం స్థానంలో కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం మాత్రమే మారుతుందని స్పష్టం చేసింది.శక్తికాంత దాస్ పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో ఆర్బీఐ గవర్నర్గా సంజయ్ మల్హోత్రా 2024 డిసెంబర్లో బాధ్యతలు చేపట్టారు. 56 సంవత్సరాల మల్హోత్రా కాన్పూర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) నుంచి కంప్యూటర్ సైన్స్లో ఇంజినీరింగ్ పట్టభద్రుడయ్యారు. అమెరికాలోని ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం నుంచి పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ పట్టా పొందారు. 1990 బ్యాచ్ రాజస్తాన్ కేడర్ ఐఏఎస్ అధికారిగా ఎంపికయ్యారు. 33 సంవత్సరాలకు పైగా తన కెరీర్లో విద్యుత్, ఫైనాన్స్, పన్నులు, సమాచార సాంకేతికత, గనులుసహా పలు రంగాలలో కీలక బాధ్యతలు నిర్వహించారు.ఇదీ చదవండి: ప్రముఖ బ్యాంక్పై ఆర్బీఐ ఆంక్షలు ఎత్తివేతగవర్నర్గా బాధ్యతలు స్వీకరించేకంటే ముందు వరకు ఆర్థిక మంత్రిత్వ శాఖలో కార్యదర్శి (రెవెన్యూ)గా కీలక బాధ్యతల్లో ఉన్నారు. అంతక్రితం ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సేవల విభాగంలో కార్యదర్శిగా పనిచేశారు. రాష్ట్రంతో పాటు కేంద్ర ప్రభుత్వ స్థాయిలలో ఆర్థిక, పన్నుల విషయంలో ఆయనకు విస్తృత అనుభవం ఉంది. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల విధాన రూపకల్పనలో అయన కీలక పాత్ర పోషించారు. -
కొత్త ఆదాయ పన్ను బిల్లులో ‘ట్యాక్స్ ఇయర్’?
పార్లమెంటులో త్వరలో ప్రవేశపెట్టనున్న కొత్త ఆదాయపు పన్ను బిల్లు(New Income Tax Bill) సామాన్యులకు ప్రత్యక్ష పన్ను చట్టాలను సులభతరం చేయడమే లక్ష్యంగా రూపొందించినట్లు అధికారులు తెలియజేస్తున్నారు. బిల్లులో ప్రతిపాదించిన కీలక మార్పుల్లో ‘ట్యాక్స్ ఇయర్’ ఒకటని సమాచారం. ఈ మార్పువల్ల వ్యాపారుల పన్ను చెల్లింపులను సులభతరం చేసేందుకు వీలవుతుందని భావిస్తున్నారు.టాక్స్ ఇయర్(Tax Year) అంటే ఏమిటి?టాక్స్ ఇయర్ అనేది నిర్దిష్ట ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను ప్రయోజనాల కోసం ఉపయోగించే 12 నెలల వ్యవధి. కొత్త ఆదాయపు పన్ను బిల్లు ప్రకారం ట్యాక్స్ ఇయర్ ఏప్రిల్ 1న ప్రారంభమై మరుసటి ఏడాది మార్చి 31న ముగుస్తుంది. 1961 ఆదాయపు పన్ను చట్టంలో ఉపయోగించిన ‘ప్రివియస్ ఇయర్’, ‘అసెస్మెంట్ ఇయర్(మదింపు సంవత్సరం)’ స్థానంలో ఈ ట్యాక్స్ ఇయర్ను వాడనున్నారు.ఇదీ చదవండి: ఎల్ అండ్ టీ చైర్మన్ మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలుపన్ను చట్టాలను ఎలా సులభతరం చేస్తుంది?స్థిరమైన ట్యాక్స్ ఇయర్ను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా పన్ను చెల్లింపుదారులు ఆదాయాన్ని నివేదించడానికి, పన్నులు చెల్లించడానికి నిర్దిష్ట వ్యవధిని కలిగి ఉంటారు. ఇది విభిన్న ఆర్థిక సంవత్సరాలకు వేర్వేరు అసెస్మెంట్ ఇయర్(మదింపు సంవత్సరం-వచ్చే ఆర్థిక సంవత్సరం)లను కలిగి ఉండటం వల్ల తలెత్తే గందరగోళాన్ని తొలగిస్తుంది.పన్ను చెల్లింపుదారులు తమ బాధ్యతలను అర్థం చేసుకోవడానికి సులభమైన, స్పష్టమైన భాషను ఉపయోగించాలని కొత్త బిల్లు లక్ష్యంగా పెట్టుకుంది. ఏళ్ల తరబడి పేరుకుపోయిన కాలం చెల్లిన నిబంధనలు, వివరణలను తొలగించాలని నిర్ణయించారు.పన్ను విధానాలకు సంబంధించి స్పష్టమైన నిర్వచనాలు, క్రమబద్ధమైన విధానాతతో కొత్త పన్ను చట్టాలు వివాదాలు, లిటిగేషన్లను తగ్గిస్తాయని భావిస్తున్నారు. దీనివల్ల మరింత పన్ను వసూలుకు వీలవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పన్నుకు సంబంధించి వివాదాలు తగ్గడం వల్ల న్యాయవ్యవస్థపై భారం తగ్గుతుందని చెబుతున్నారు.తరచూ శాసన పరమైన సవరణలు అవసరం లేకుండా పన్ను పథకాలను ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ)కి ఎక్కువ అధికారాన్ని ఈ బిల్లు కల్పిస్తుంది. -
పాత vs కొత్త పన్ను విధానం: ఎప్పుడు ఏది ఎంచుకోవాలంటే..
యూనియన్ బడ్జెట్ 2025లో కేంద్రమంత్రి 'నిర్మలా సీతారామన్' (Nirmala Sitharaman) మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కల్పించే విధంగా కొత్త ఆదాయపు పన్ను విధానంలో కొన్ని ప్రధాన మార్పులను ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగానే ప్రాథమిక మినహాయింపు పరిమితిని రూ.4 లక్షలకు పెంచాలని ప్రతిపాదించారు. సెక్షన్ 87A కింద రాయితీ కోసం ఆదాయ పరిమితిని రూ.12 లక్షలకు పెంచారు.నూతన విధానంలో కొత్త శ్లాబుల ప్రకారం మొదటి రూ.4 లక్షల్లోపు ఆదాయం ఉంటే పన్ను పరిధిలోకి రారు. స్టాండర్డ్ డిడక్షన్తో కలిపి చూసుకుంటే రూ.12.75 లక్షల ఆదాయం దాటని వేతన జీవులు, పెన్షనర్లు పన్ను చెల్లించక్కర్లేదు. రూ.4–12లక్షల ఆదాయంపై సెక్షన్ 87ఏ కింద రిబేట్ అమల్లో ఉంది. దీనికి రూ.75వేల స్టాండర్డ్ డిడక్షన్ అదనం. అంటే మొత్తంగా రూ.12,75,000 లక్షల ఆదాయం వరకు పన్ను చెల్లించక్కర్లేదు.వార్షిక ఆదాయం రూ. 12.75 లక్షల కంటే ఎక్కువ ఉంటే.. పాత పన్ను విధానం ఎందుకోవాలా? కొత్త పన్ను విధానం ఎంచుకోవాలా అని కొంత తికమకపడే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎప్పుడు ఏ పన్ను విధానం ఎందుకోవాలో పరిశీలిద్దాం..కొత్త పన్ను విధానం ఎప్పుడు ఎందుకోవాలంటే..➤సెక్షన్ 87A కింద పూర్తి రాయితీకి అర్హత ఉన్నందున, రూ. 12 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఆదాయం కలిగి ఉండాలి.➤సెక్షన్ 80C (ప్రావిడెంట్ ఫండ్, పీపీఎఫ్, జీవిత బీమా, లేదా హౌసింగ్ లోన్ ప్రిన్సిపల్ తిరిగి చెల్లింపు వంటివి) లేదా సెక్షన్ 80డీ (మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం) కింద మినహాయింపులు ఉండవు.➤మీరు భారీ తగ్గింపులను క్లెయిమ్ చేయకపోతే.. కొత్త పన్ను విధానం ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది వివరణాత్మక డాక్యుమెంటేషన్ అవసరం లేకుండా తక్కువ పన్ను రేట్లను అందిస్తుంది.మీరు పాత పన్ను విధానం ఎప్పుడు ఎంపిక చేసుకోవాలంటే..అధిక తగ్గింపులను క్లెయిమ్ చేయగల వ్యక్తులకు పాత పన్ను విధానం మరింత అనుకూలంగా ఉంటుంది. ఇందులో.. సెక్షన్ 80సీ కింద పీఎఫ్, పీపీఎఫ్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు, హోమ్ లోన్ చెల్లింపు మొదలైనవి మాత్రమే కాకుండా.. సెక్షన్ 80డీ కింద వ్యక్తిగత & కుటుంబ సభ్యులకు మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు, హోమ్ రెంట్ అలవెన్స్ (HRA), లీవ్ ట్రావెల్ అలవెన్స్ (LTA) వంటివి కూడా ఉన్నాయి. పన్ను చెల్లింపుదారులు ఈ తగ్గింపులను గరిష్టంగా పెంచుకుంటే, వారి పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు.కొత్త పన్ను విధానంలో శ్లాబులురూ.0-4 లక్షలు - సున్నారూ.4-8 లక్షలు - 5 శాతంరూ.8-12 లక్షలు - 10 శాతంరూ.12-16 లక్షలు - 15 శాతంరూ.16-20 లక్షలు - 20 శాతంరూ.20-24 లక్షలు - 25 శాతంరూ.24 లక్షల పైన 30 శాతంపాత పన్ను విధానంలో పన్ను శ్లాబులురూ.2,50,001 - రూ.5,00,000 - 5 శాతంరూ.5,00,000 నుంచి రూ. 10,00,000 - 20 శాతంరూ.10,00,000 ఆపైన - 30 శాతంఇదీ చదవండి: ఎప్పుడు, ఎలా చనిపోతారో చెప్పే డెత్ క్లాక్: దీని గురించి తెలుసా? -
గణనీయంగా పెరిగిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్నుల రూపంలో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు (2024 ఏప్రిల్ 1 నుంచి 2025 ఫిబ్రవరి 10 నాటికి) రూ.17.78 లక్షల కోట్ల నికర పత్య్రక్ష పన్ను వసూలైంది. అంతక్రితం ఆర్థిక సంత్సరం ఇదే కాలంలో ఆదాయంతో పోల్చి చూస్తే 14.69 శాతం వృద్ధి కనిపిస్తోంది.పత్య్రక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) విడుదల చేసిన తాజా గణాంకాలను పరిశీలించినప్పుడు.. నాన్ కార్పొరేట్ పన్నుల ఆదాయం (వ్యక్తిగత ఆదాయపన్ను రూపంలో) ఫిబ్రవరి 10 నాటికి 21 శాతం ఎగసి రూ.9.48 లక్షల కోట్లకు చేరింది. ఇక కార్పొరేట్ పన్నుల ఆదాయం సైతం 6 శాతం అధికమై రూ.7.78 లక్షల కోట్లుగా నమోదైంది.సెక్యూరిటీల లావాదేవీల పన్ను (ఎస్టీటీ) ఇదే కాలంలో 65 శాతం పెరిగి రూ.49,201 కోట్లుగా ఉంది. పన్ను చెల్లింపుదారులకు ఆదాయపన్ను శాఖ ఈ కాలంలో మొత్తం రూ.4.10 లక్షల కోట్లను రిఫండ్ (తిరిగి చెల్లింపు) చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చి చూస్తే రిఫండ్లు 42 శాతం పెరిగాయి.ఇక ఫిబ్రవరి 10 నాటికి స్థూల ప్రత్యక్ష పన్నుల ఆదాయం 19 శాతం పెరిగి రూ.21.88 లక్షల కోట్లకు చేరింది. 2024–25 సంవత్సరంలో ఆదాయపన్ను వసూళ్లు రూ.12.57 లక్షల కోట్లుగా ఉండొచ్చని ప్రభుత్వం ఇటీవలి బడ్జెట్లో సవరించిన అంచనాలు పేర్కొనడం గమనార్హం. -
యూరోపియన్ స్వేచ్ఛా వాణిజ్య కూటమితో డీల్
యూరోపియన్ స్వేచ్ఛా వాణిజ్య కూటమి (ఈఎఫ్టీఏ)తో చేసుకున్న వాణిజ్య, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (టెపా)తో భారత్ 400–500 బిలియన్ డాలర్ల (సుమారు రూ.43.5 లక్షల కోట్లు) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించగలదని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈఎఫ్టీఏ సభ్య దేశాల నుంచి 15 ఏళ్ల కాలంలో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు హామీ ఇచ్చినప్పటికీ, వాస్తవంగా నాలుగైదు రెట్లు అధికంగా ఎఫ్డీఐ దేశంలోకి వస్తుందని భావిస్తున్నట్టు చెప్పారు.ఈ ఒప్పందం ఈ ఏడాది చివరి నాటికి అమల్లోకి వస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఈఎఫ్టీఏలో ఐస్ల్యాండ్, లీచెన్స్టెయిన్, నార్వే, స్విట్జర్లాండ్ సభ్య దేశాలుగా ఉండడం గమనార్హం. ఈఎఫ్టీఏ కోసం ఉద్దేశించిన ప్రత్యేకమైన డెస్క్ను ప్రారంభించిన సందర్భంగా మంత్రి గోయల్ మాట్లాడారు. ఈ ఒప్పందం కింద స్విస్ వాచీలు, చాక్లెట్లు, కట్, పాలిష్డ్ వజ్రాల దిగుమతులను చాలా తక్కువ రేటుపై లేదా సున్నా రేటుపై భారత్ అనుమతించాల్సి ఉంటుంది. ఇందుకు ప్రతిఫలంగా సభ్య దేశాలు ఇచ్చిన హామీలో భాగంగా 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో 10 లక్షల మందికి ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయన్నది అంచనా. నాలుగు సభ్య దేశాలు ఈ ఒప్పందం ఆమోదం దిశగా కీలకమైన చర్యలు తీసుకున్నాయంటూ, ఈ ఏడాది చివరికి ఇవి అమల్లోకి రావచ్చని మంత్రి గోయల్ చెప్పారు.ఇదీ చదవండి: 462 కంపెనీలపై దర్యాప్తు!పారిశ్రామిక స్మార్ట్ సిటీల్లో కేటాయింపులుఎన్ఐసీడీసీ అభివృద్ధి చేస్తున్న 20 పారిశ్రామిక స్మార్ట్ పట్టణాల్లో ప్రత్యేకంగా కొంత భాగాన్ని ఈఎఫ్టీఏ సభ్య దేశాలకు ఆఫర్ చేయనున్నట్టు మంత్రి గోయల్ తెలిపారు. లేదా బడ్జెట్లో ప్రకటించినట్టు 100 హబ్ అండ్ స్పోక్ పారిశ్రామిక కేంద్రాలను కేటాయించనున్నట్టు తెలిపారు. ఈ దిశగా ఆయా దేశాలతో చర్చలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈఎఫ్టీఏ–భారత్ మధ్య 2023–24లో 24 బిలియన్ డాలర్ల (రూ.2.08 లక్షల కోట్లు) ద్వైపాక్షిక వాణిజ్యం నమోదైనట్టు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో ఉంటే, ఆ తర్వాతి స్థానంలో నార్వే ఉంది. 2000–2004 మధ్య స్విట్జర్లాండ్ నుంచి భారత్కు 10.72 బిలియన్ డాలర్ల ఎఫ్డీఐలు వచ్చాయి. -
ట్రంప్ ‘ఉక్కు’ పాదం..!
న్యూఢిల్లీ: అన్ని రకాల ఉక్కు, అల్యుమినియం దిగుమతులపై పాతిక శాతం టారిఫ్లు వడ్డించాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యోచన భారత పరిశ్రమలను కలవరపరుస్తోంది. దీనితో బిలియన్ డాలర్ల ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం భారత్ ఉక్కు ఎగుమతుల్లో అమెరికా వాటా సుమారు అయిదు శాతం లోపు ఉంటోంది. అయినప్పటికీ భారతీయ ఉక్కు ఎగుమతిదార్లు తమ ఉత్పత్తులను ఎగుమతి చేయడంలో కొంత సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉందని మూడీస్ రేటింగ్స్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ హుయ్ తింగ్ సిమ్ తెలిపారు. అమెరికా టారిఫ్ల దెబ్బతో మిగతా దేశాల్లో సరఫరా పెరిగిపోయి, భారత్ ఎగుమతులకు ప్రతికూలం కావచ్చని పేర్కొన్నారు. గత పన్నెండు నెలలుగా భారీ స్థాయిలో ఉక్కు దిగుమతులతో ధరలు, ఆదాయాలు పడిపోయి దేశీ ఉత్పత్తి సంస్థలు ఇప్పటికే సతమతమవుతున్నట్లు వివరించారు. ఇదే సమయంలో టారిఫ్ల వల్ల అమెరికాలోని ఉక్కు ఉత్పత్తి సంస్థలకు ప్రయోజనం చేకూరుతుందని సిమ్ చెప్పారు. అక్కడ దేశీయంగా ఉక్కుకు డిమాండ్ పెరిగి, ధరలూ పెంచుకునే అవకాశం లభిస్తుందన్నారు. సుంకాల విధింపుతో అమెరికాకు ఉక్కు ఎగుమతులు 85 శాతం మేర తగ్గిపోవచ్చని ఇండియన్ స్టీల్ అసోసియేషన్ (ఐఎస్ఏ) ప్రెసిడెంట్ నవీన్ జిందాల్ తెలిపారు. ఇలా మిగిలిపోయేదంతా, ప్రస్తుతం వాణిజ్యపరమైన ఆంక్షలు లేని అతి పెద్ద మార్కెట్లలో ఒకటైన భారత మార్కెట్లోకి వెల్లువెత్తుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు, అల్యూమినియం పరిశ్రమపై ప్రభావం గట్టిగా పడొచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే భారత అల్యుమినియం ఎగుమతుల్లో అమెరికా వాటా దాదాపు 12 శాతం ఉంటుంది. గతేడాది నవంబర్ నాటికి 777 మిలియన్ డాలర్ల అల్యూమినియం ఎగుమతులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఉక్కు పరిశ్రమతో పోలిస్తే అల్యుమినియం రంగంపై టారిఫ్ల ఎఫెక్ట్ ఎక్కువగా ఉండనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ట్రంప్తో నిర్వహించబోయే సమావేశంలో టారిఫ్ల అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2018 వ్యూహం.. ట్రంప్ 2018 వ్యూహాన్నే మళ్లీ అమలు చేస్తే వాణిజ్యానికి సంబంధించి బేరసారాలు ఆడేందుకు దీన్ని ఉపయోగించుకునే అవకాశం ఉందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ చెప్పారు. 2018లోనూ ట్రంప్ ఇలాంటి నిర్ణయమే తీసుకున్నా, అప్పట్లో మిగతా దేశాలతో పోలిస్తే భారత్పై పెద్దగా ప్రభావం పడలేదు. ప్రతిగా 2019లో 28 అమెరికన్ ఉత్పత్తుల దిగుమతులపై భారత్ కూడా అదనపు సుంకాలు విధించింది. 2023లో భారత్ నుంచి ఉక్కు, అల్యుమినియం దిగుమతులపై అమెరికా టారిఫ్లు తొలగించింది. తాజాగా టారిఫ్ల పెంపు అనేది అమెరికాకు అత్యధికంగా ఎగుమతి చేసే జపాన్, యూరప్ దేశాలు, కెనడా, మెక్సికోపై ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉన్నప్పటికీ సరఫరా పెరిగిపోయి, ధరలు పడిపోవడం వల్ల భారత్కి కూడా కాస్త ప్రతికూలంగానే ఉండొచ్చని విశ్లేషకులు తెలిపారు. ఆందోళన చెందనక్కర్లేదు: ఉక్కు శాఖఅమెరికాకు భారత్ ఉక్కు ఎగుమతులు అంతగా లేవు కాబట్టి టారిఫ్ల గురించి దేశీ పరిశ్రమ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఉక్కు శాఖ కార్యదర్శి సందీప్ పౌండ్రిక్ తెలిపారు. ‘గతేడాది మనం 14.5 కోట్ల టన్నుల ఉక్కును ఉత్పత్తి చేస్తే అందులో అమెరికాకు ఎగుమతి చేసింది చాలా తక్కువే. కాబట్టి, టారిఫ్ల పెంపు పెద్ద సమస్య కాబోదు‘ అని ఆయన చెప్పారు. దేశీయంగా ఉక్కు వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో, రాబోయే రోజుల్లో డిమాండ్కి తగ్గట్లుగా పరిశ్రమ సరఫరా చేయలేని పరిస్థితి ఏర్పడవచ్చని వివరించారు. -
కొత్త బడ్జెట్టు.. వినియోగపనిషత్తు..
‘‘ఇది ప్రజల బడ్జెట్టు. ప్రజల సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్లు, వినియోగం పెరుగుతాయి’’ అని అన్నారు ప్రధాన మంత్రి. 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు నెరవేరతాయి అని ఆశిస్తున్నారు మోదీగారు. ‘‘ప్రజలకు ఒరిగిందేమీ లేదు. స్కీముల సంఖ్య పెరిగిందే కానీ సంతోషపడాల్సినదేమీ లేదు. ఆర్థిక మందగమనానికి నాంది’’ అని అంటున్నారు ఒకప్పటి ఆర్థికమంత్రి చిదంబరం.ఇక రాష్ట్రాల విషయానికొస్తే.. ప్రతి రాష్ట్రం ఎంతో కొంత అసంతృప్తిగానే ఉంది. ఆరోగ్యరంగానికి సరిపోయినంత మందు పడలేదంటున్నారు. రైల్వేను పట్టాల నుంచి తప్పించారంటున్నారు. రైతులకు అంతంతమాత్రమే అని ఒకరు .. పరిశ్రమలకు ఫర్వాలేదని మరొకరు.. ఆటలకి పెద్ద పీట.. చిన్న తరహా పరిశ్రమలకు ఊతం..కృత్రిమ మేధస్సుకు ఎక్సలెన్సు, మందుల ధరల తగ్గుముఖం .. ఆహార భద్రతకు అవకాశం .. ఆభరణాల మీద కస్టమ్స్ తగ్గుదల, పత్తికి కొత్త ఊపు, జౌళి పరిశ్రమకు దన్ను, ఎయిర్పోర్టుల విస్తరణ, రోడ్ల మీద చిన్న చూపు, అంతరిక్ష రంగాన్ని మరింత పైకి తీసుకెళ్లే ప్రయత్నం, చిన్న తరహా పరిశ్రమలకు భారీ ఊరట, యాత్రా స్థలాల సుందరీకరణ, ఎలక్ట్రిక్ వాహనాల ధరల తగ్గుదల.. ఇలా ఒక్కో రంగానిది ఒక్కో పరిస్థితి. ఏది ఎలా ఉన్నా స్టాక్ ఎక్స్చేంజీల్లో షేర్లు పతనం, విజయకేతనం. ఈ పరిణామం దిక్సూచి కాకపోయినా, ఇదో వెంటాడే బూచి. ‘‘నా తలరాత మారింది. నా ఇష్టమొచ్చినట్లు ఖర్చు పెట్టుకోవచ్చు’’ అని మురిసిపోతోంది మధ్యతరగతి మహిళ. భారీగా పెన్షన్ వచ్చే దంపతులు .. ఇక కంపల్సరీ సేవింగ్స్ మానేసి ‘‘పదవే గౌరీ, పరమాత్ముని చూడ’’ అని తీర్థయాత్రలకు విమానంలో ప్లాన్ చేస్తున్నారు. పింగళిగారు రాసిన పాటను పదే పదే పాడి ‘‘ప్రేమించిన పతికి ఎదురునుండగా తీర్థయాత్రకెందుకని’’ అంటూ పతిభక్తి చాటుకున్న భార్య సత్యవతి .. పదండి పదండి ఎప్పుడూ ఈ పాడు కొంపేనా అంటూ ట్రావెలింగ్ ఏజంటు దగ్గరకి పరుగెత్తింది, మొగుడి క్రెడిట్ కార్డు పట్టుకుని.‘వెకేషన్’కి పెద్ద ప్లాన్ చేస్తోంది లావణ్య. అక్కతో పాటు నేనూ, మా ఆయనా వస్తాం అంటోంది చెల్లెలు త్రిష. ‘మ్యుచువల్ ఫండ్స్’లో ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు రవి. ‘నాకు జీతం పెంచకపోయినా ఫర్వాలేదు’ అంటోంది ఉద్యోగిని ఊర్మిళ.. వాళ్లబాసుతో. ఇంట్లో పాత ఫర్నిచరు, టీవీలు తీసేసి కొత్తవి కొనుక్కుందాం అని అంటోంది మరో మహిళ లలిత. ఇల్లు కొత్తది కాకపోయినా మంచిగా ఇంటీరియర్స్ చేయిద్దాం అంటోంది హరిత. ‘‘సేవింగ్స్తో మంచిగా అప్స్కేలింగ్ వైపు వెళ్తాను’’ అని అంటున్నాడు అక్షిత్.లేటెస్టు మ్యూజిక్ పరికరాలు కొని సంగీతం సాధన చేస్తానంటోంది మరో వనిత అభిజ్ఞ. షేరు మార్కెట్లో ఎంటర్ అయ్యి వెల్త్ క్రియేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు వారెన్ బఫెట్ బుక్ చతివి రత్నాకర్. ‘‘పొరుగింటి మీనాక్షమ్మని చూశారా’’ అనే ప్రశ్న మానేసి తనకి కావాల్సిన బంగారం ఆభరణాలను ప్లాన్ చేస్తోంది నాగమణి. వీళ్ళందరి ఆలోచనలూ నిజమయ్యేనా? అంటే నిజమే అనిపిస్తోంది. తన ప్రతిపాదనలతో సంవత్సరానికి లక్ష కోట్ల రూపాయల నష్టమని చెప్తున్నారు సీతమ్మ తల్లి. రెండు కోట్ల మంది ట్యాక్స్ పేయర్లకు లబ్ధి చేకూరుతుందని ఫైనాన్స్ సెక్రటరీ పాండేగారి ఉవాచ. జనాల చేతిలో మిగులు. అలా మిగిలిన మొత్తం వెచ్చించడానికి ఇక హద్దులుండవు. ఇప్పటికి ప్రైవేటు వారి చేతిలో వినియోగం నిమిత్తం ఆర్థిక వ్యవస్థలోకి వచ్చేది రెండు వందల లక్షల కోట్లు. దానికి అదనంగా ఒక లక్ష కోట్లు అంటే సామాన్యం కాదు. పెద్ద సంఖ్యే.క్రమేపీ, పాత విధానం పన్నుల సేకరణ ఉండదు. కొత్త విధానానికి మొగ్గు చూపిస్తున్నారు. ద్రవ్యోల్బణం కొనసాగుతున్నా ఖర్చుల స్థాయి తగ్గలేదు. కోడి పందాల్లో వేల కోట్లు. కుంభమేళా సందర్భంగా కొన్ని వేల కోట్లు. ఆకలి చావులుండవచ్చు.. కానీ కోడి పులావ్ అమ్ముడుపోతుంది. అందరి ఖర్చులు పెరుగుతాయి. లిక్విడిటీ పెరుగుతుంది. ఈ యాగంలో ‘‘వినియోగమే’’ యోగప్రదమైనది.పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్ పంపించగలరు. -
రేట్ల కోతతో తక్షణ, దీర్ఘకాలిక ప్రభావాలు
ఆర్థిక పరిస్థితులను సులభతరం చేయడానికి, ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరిచే లక్ష్యంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల కీలక వడ్డీరేట్ల తగ్గింపు నిర్ణయం తీసుకుంది. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయం రెపో రేటుతో అనుసంధానమయ్యే రుణగ్రహీతలకు తక్షణ ఉపశమనం కలిగించినప్పటికీ బ్యాంకింగ్ వ్యవస్థపై, ముఖ్యంగా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR), డిపాజిట్లతో ముడిపడి ఉన్న రుణాలపై విస్తృత ప్రభావాలు చూపడానికి కొంత సమయం పడుతుందని నిపుణులు భావిస్తున్నారు.రెపో లింక్డ్ రుణగ్రహీతలకు తక్షణ ప్రయోజనాలుఆర్బీఐ రేట్ల తగ్గింపు వల్ల రెపో రేటుతో ముడిపడి ఉన్న రుణాలతో రుణగ్రహీతలకు తక్షణ ప్రయోజనం చేకూరుతుంది. వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ నుంచి తీసుకునే రుణాలపై విధించే వడ్డీని రెపో రేటు అంటారు. రెపో రేటును తగ్గించడం వల్ల ఈ రుణగ్రహీతలకు వడ్డీ రేట్లు తగ్గుతాయి. ఎందుకంటే బ్యాంకులు ఆ ప్రయోజనాన్ని వెంటనే లబ్ధిదారులకు బదిలీ చేస్తాయి. ఇది చాలా మంది రుణగ్రహీతలకు సమాన నెలవారీ వాయిదాలను (EMI) తగ్గించడానికి దారితీస్తుంది.ఎంసీఎల్ఆర్ రుణాలపై ప్రభావం ఆలస్యంఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో ఎంసీఎల్ఆర్తో ముడిపడి ఉన్న రుణాలపై ప్రభావం వెంటనే కనిపించదు. ఎంసీఎల్ఆర్ అనేది గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, ఇతర రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయించడానికి బ్యాంకులు ఉపయోగించే బెంచ్మార్క్ వడ్డీ రేటు. రెపో రేటు మాదిరిగా కాకుండా బ్యాంకులకు నిధుల వ్యయం, నిర్వహణ ఖర్చులు.. వంటి వాటిపై ఆధారపడి ఎంసీఎల్ఆర్లో మార్పులు ఉంటాయి. రేట్ల కోత ప్రభావం ఎంసీఎల్ఆర్లో పూర్తిగా ప్రతిబింబించడానికి కనీసం రెండు త్రైమాసికాలు పట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. బ్యాంకులు తమ వ్యయాలను సర్దుబాటు చేయడానికి, రేట్ల తగ్గింపు ప్రయోజనాలను రుణగ్రహీతలకు బదిలీ చేయడానికి కొంత సమయం వేచిచూడాల్సి ఉంటుంది. ఫలితంగా ఎంసీఎల్ఆర్ లింక్డ్ లోన్లు తీసుకున్నవారు తమ ఈఎంఐలు తగ్గాలంటే మరికొంత కాలం ఆగాలి.ఇదీ చదవండి: టార్గెట్ ఎఫ్డీఐ.. విధానాల సవరణకు యోచన!డిపాజిట్లకు సవాల్..వడ్డీరేట్ల తగ్గింపు డిపాజిట్ల పరంగా బ్యాంకులకు సవాలుగా మారుతుంది. రుణ రేట్లు తగ్గుతాయని భావిస్తున్నప్పటికీ డిపాజిట్లపై అందించే వడ్డీ రేట్లను కూడా బ్యాంకులు నిర్వహించాల్సి ఉంటుంది. డిపాజిట్ రేట్లను వెంటనే తగ్గించడం వల్ల బ్యాంకులు డిపాజిటర్లను ఆకర్షించడం, వారిని నిలుపుకోవడం కష్టతరం అవుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. వినియోగదారులు తమ పొదుపుపై మంచి రాబడిని కోరుకునే ఇతర మార్గాలను ఎంచుకుంటారని విశ్లేషిస్తున్నారు. -
టార్గెట్ ఎఫ్డీఐ.. విధానాల సవరణకు యోచన!
దేశంలోకి మరిన్ని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (FDI) ఆకట్టుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా కొన్ని రంగాలలో విధానాలను సవరించాలని యోచిస్తోంది. తద్వారా మరిన్ని ఎఫ్డీఐలకు దారి చూపాలని చూస్తున్నట్లు ప్రభుత్వ అధికారి ఒకరు తాజాగా పేర్కొన్నారు.ఈ బాటలో వివిధ ప్రభుత్వ శాఖలు, నియంత్రణ సంస్థలు, పారిశ్రామిక సహచర సంస్థలు, అడ్వయిజరీ, న్యాయ సంస్థలు, పెన్షన్ ఫండ్స్, ప్రయివేట్ ఈక్విటీ(పీఈ) సంస్థలు, వెంచర్స్ క్యాపిటల్(వీసీ) ఫండ్స్ తదితరాలతో అంతర్గత వాణిజ్యం, పారిశ్రామిక ప్రోత్సాహక శాఖ(డీపీఐఐటీ) సమావేశాన్ని ఏర్పాటు చేసింది. తద్వారా దేశీయంగా మరిన్ని విదేశీ పెట్టుబడులను ఆకర్షించుకునేందుకు అభిప్రాయాలు, సూచనలకు ఆహ్వానం పలికింది.వెరసి వివిధ శాఖలు, విభాగాలతో చర్చలు పూర్తిచేసినట్లు ప్రభుత్వ అధికారి వెల్లడించారు. దీంతో విభిన్న సమస్యలపై సలహాలు, సూచనలు అందుకున్నట్లు తెలియజేశారు. అయితే ఇంతవరకూ ఏ అంశాలపైనా తుది నిర్ణయాలకు రాలేదని తెలియజేశారు. నిబంధనలు, విధానాలను సరళతరం చేయడంపై ప్రస్తుతం దృష్టి సారించినట్లు వివరించారు. కాగా.. ఏఏ రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టిందీ వెల్లడించలేదు. -
'చరిత్ర సృష్టించబోతున్న భారత్': మొదటిసారి రికార్డ్!
భారతదేశంలో విదేశీ మారకద్రవ్య నిల్వలు క్రమంగా తగ్గుతున్నాయి. దీనిపై ఎటువంటి ఆందోళన అవసరం లేదని.. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి 'పియూష్ గోయల్' అన్నారు. ఎగుమతులు గణనీయంగా పెరుగుతున్నాయి, ఇందులో దేశం సరికొత్త చరిత్ర సృష్టించడానికి సిద్ధమవుతోందని అన్నారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు మంచి సంకేతమని వెల్లడించారు.2024-25 ఆర్ధిక సంవత్సరంలో.. భారతదేశ ఎగుమతులు మొదటిసారి రికార్డు స్థాయిలో 800 బిలియన్ డాలర్లకు చేరువలో ఉంది. గత నాలుగేళ్లుగా ఎగుమతులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది కూడా ఎగుమతులు గణనీయంగా ఉంటాయని గోయల్ అన్నారు. జూన్ 2025తో ముగిసే ఆర్ధిక సంవత్సరంలో ఉల్లి, టమోటా, బంగాళాదుంప ఉత్పత్తులు పెరిగే అవకాశం ఉందని కేంద్రం స్పష్టం చేసింది.మన ఎగుమతులు దేశ చరిత్రలోనే తొలిసారి 800 బిలియన్ డాలర్లను దాటుతుందని పియూష్ గోయల్ రాజ్యసభలో తెలిపారు. విదేశీ మారకద్రవ్య నిల్వలు చాలా నెలలుగా 600 బిలియన్ డాలర్ల వద్దనే స్థిరంగా ఉన్నాయి.ఎగుమతులు మాత్రమే కాకుండా.. దిగుమతుల అవసరం కూడా చాలా ఉంది. అయితే దిగుమతులు అనేవి కొరత, డిమాండ్ వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది. ఇందులో పెట్రోలియం ఉత్పత్తులు, బొగ్గు, పప్పుధాన్యాలు, నూనెలు వంటివి ఉన్నాయి. ఎగుమతులు, దిగుమతుల వల్ల విదేశీ మారకద్రవ్య నిల్వలు పెరుగుతాయని గోయల్ అన్నారు.ఇదీ చదవండి: టెక్ కంపెనీ భారీ లేఆఫ్స్: ఒకేసారి 3000 మంది బయటకు!భారతదేశంలో ఉత్పత్తి యూనిట్లను ఏర్పాటు చేసి, అందులో ఉత్పత్తులను ప్రారంభించడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అంతవరకు దిగుమతులు పెరుగుతాయి. ఒక ప్రాంతంలో దిగుమతులు పెరిగితే.. పరిశ్రమల చూపుకూడా అటువైపు పడుతుంది. దీంతో అక్కడ కంపెనీలు ఏర్పడతాయి. ఇది ఎంతోమంది ఉపాధి కల్పిస్తుందని పియూష్ గోయల్ అన్నారు. మొత్తం మీద దేశ ఆర్ధిక వ్యవస్థ మరింత పెరుగుతుందని స్పష్టం చేశారు. -
రూ. 20,000 కోట్ల నిధులు వాడుకోండి..
పరిశోధన, అభివృద్ధి(ఆర్అండ్డీ)పై దేశీ కార్పొరేట్లు మరింత దృష్టి సారించాలని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్ తాజాగా పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేటాయించిన రూ. 20,000 కోట్లు నాణ్యమైన ప్రతిపాదనకు వినియోగించుకోవాలని సూచించారు.ప్రయివేట్ రంగ ఆధారిత ఆర్అండ్డీకి బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం రూ. 20,000 కోట్లు కేటాయించిన విషయాన్ని బడ్జెట్ తదుపరి సీఐఐ సభ్యులతో ఏర్పాటు చేసిన ఇష్టాగోష్టి సందర్భంగా ప్రస్తావించారు. ఏడాది చివరికల్లా మొత్తం నిధులను వినియోగించుకునేలా అత్యుత్తమ ప్రతిపాదనలతో తరలిరావలసిందిగా ఆహ్వానించారు.పర్యావరణహిత ఇంధనాలవైపు ప్రయాణంలో ప్రయివేట్ రంగం చేయూత నివ్వాలని కోరారు. ఇదేవిధంగా అణు విద్యుత్ విషయంలో ప్రభుత్వం పరిశ్రమతో కలసి పనిచేయనున్నట్లు తెలియజేశారు.2025-26 బడ్జెట్ను ప్రకటిస్తూ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రైవేట్ రంగ ఆధారిత ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఒక కార్పస్గా సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖకు రూ.20,000 కోట్లు కేటాయించారు. గత జూలై బడ్జెట్లోనూ ఆమె రూ. లక్ష కోట్ల పరిశోధనాభివృద్ధి నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. -
కొత్త ఐటీ బిల్లు వచ్చే వారమే..
ఆరు దశాబ్దాల నాటి ఐటీ చట్టం స్థానంలో కొత్త ఆదాయపు పన్ను బిల్లును (New Income Tax Bill) లోక్సభలో వచ్చే వారం ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తెలిపారు. ఎగువసభలో ప్రవేశపెట్టిన తర్వాత బిల్లు పరిశీలన కోసం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపిస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆదాయపు పన్ను బిల్లుకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లతో బడ్జెట్ అనంతర సంప్రదాయ సమావేశంలో ప్రసంగించిన తర్వాత సీతారామన్ మీడియాతో మాట్లాడారు. పార్లమెంటరీ కమిటీ సిఫారసులు చేసిన తర్వాత బిల్లు మళ్లీ కేబినెట్కు వెళ్తుంది. కేబినెట్ ఆమోదం తర్వాత మళ్లీ పార్లమెంట్లో ప్రవేశపెడతారని మంత్రి చెప్పారు. బిల్లు విషయంలో తనకు ఇంకా మూడు క్లిష్ట దశలు ఉన్నాయని అన్నారు.‘రెండు సంవత్సరాల క్రితం కూడా కస్టమ్స్ డ్యూటీకి సంబంధించి కొన్ని హేతుబద్ధీకరించాం. భారత్ను మరింత పెట్టుబడిదారులు, వాణిజ్య స్నేహపూర్వకంగా మార్చాలనుకుంటున్నాం. అదే సమయంలో ఆత్మనిర్భర్ భారత్తో సమతుల్యం చేయాలనుకుంటున్నాం. పరిశ్రమకు అవసరమైన విధంగా సుంకాల రక్షణను అందిస్తాం’ అని ఆర్థిక మంత్రి తెలిపారు. -
సిబిల్ స్కోర్ చూసి పెళ్లి క్యాన్సిల్ చేశారు
సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే లోన్స్ క్యాన్సిల్ చేసే బ్యాంక్స్ గురించి విని ఉంటారు. కానీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందని పెళ్లి క్యాన్సిల్ చేసిన ఘటన గురించి ఎక్కడైనా విన్నారా? అయితే ఈ కథనం తప్పకుండా చదవాల్సిందే..ఒకప్పుడు పెళ్లి చేయాలంటే.. అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూసేవారు. ఇప్పుడు కాలం మారింది. అబ్బాయి ఉద్యోగం, బ్యాంక్ బ్యాలెన్స్ వంటివి చూస్తున్నారు. అయితే తాజాగా వరుడి సిబిల్ స్కోర్ తక్కువగా ఉందని మహారాష్ట్రలోని ముర్తిజాపూర్లో ఒక వధువు కుటుంబం ఏకంగా వివాహాన్నే రద్దు చేసింది.మహారాష్ట్రలోని ముర్తిజాపూర్కు చెందిన యువతికి, అదే ప్రాంతానికి చెందిన యువకుడితో పెద్దలు పెళ్లి నిర్చయించారు. ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయింది. కానీ పెళ్ళి జరగటానికి కొన్ని రోజుల ముందు, వధువు మేనమామ.. వరుడి సిబిల్ స్కోర్ చెక్ చేయాలని పట్టుబట్టాడు. ఇక చేసేదేమీ లేక సిబిల్ స్కోర్ చేసారు.సిబిల్ స్కోర్ చెక్ చేస్తే.. ఆ యువకుడు అనేక బ్యాంకుల నుంచో లోన్స్ తీసుకున్నట్లు తెలిసింది. అంతే కాకుండా అతని సిబిల్ స్కోర్ కూడా చాలా తక్కువ ఉందని గుర్తించారు. ఇప్పటికే ఆర్ధిక ఇబ్బందుల్లో యువకుడు.. అమ్మాయికి ఆర్ధిక భద్రతను ఎలా కల్పిస్తాడు? అనే ప్రశ్న లేవనెత్తారు. చివరకు పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది.ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరు నెటిజన్లు ఇలా అయితే ఇక అబ్బాయిలకు పెళ్లి అయినట్టే అని చెబుతుంటే.. ఇంకొందరు అమ్మాయి కుటుంబం తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు. అమ్మాయికి పెళ్లి చేయాలంటే.. ఆ మాత్రం జాగ్రత్త అవసరమని చెబుతున్నారు.సిబిల్ స్కోర్ అంటే ఏమిటి?సిబిల్ స్కోర్ అనే పదాన్ని ఎప్పుడూ వినేవారికి కూడా.. బహుశా సిబిల్ స్కోర్ అంటే ఏమిటో తెలిసుండకపోవచ్చు. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్(CIBIL) అనే క్రెడిట్ బ్యూరో.. మీ ఆర్థిక పరిస్థితి ఏంటని తెలుసుకుని మీకు ఇచ్చే రేటింగ్నే సిబిల్ స్కోర్ అంటారు.ఇదీ చదవండి: ఐఆర్సీటీసీ టికెట్ ధరలలో తేడా: రైల్వే మంత్రి సమాధానమిదే..సిబిల్ స్కోర్ అనేది 300 నుంచి 900 వరకు ఉంటుంది. ఈ స్కోర్ అనేది 900కి దగ్గరగా ఉంటె మంచి సిబిల్ స్కోర్ అంటారు. 750 కంటే తక్కువ ఉంటే మంచి సిబిల్ స్కోర్ కాదని చెబుతారు. సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉంటే.. కొంత తక్కువ వడ్డీకి బ్యాంకులు లోన్ ఇస్తాయి. తక్కువ స్కోర్ ఉంటే.. కొన్ని బ్యాంకులు లోన్ ఇవ్వవు. ఒకవేళా ఇచ్చినా.. వడ్డీ రేటు భారీగా ఉంటుంది. -
ఈఎంఐలు ఇక దిగొస్తాయ్!
ఎన్నాళ్లో వేచిన ఉదయం.. అన్నట్లుగా దాదాపు ఐదేళ్ల తర్వాత రుణ గ్రహీతలకు ఆర్బీఐ నుంచి చల్లని కబురు అందింది. కీలక రెపో రేటును పావు శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడంతో గృహ, వాహన, వ్యక్తిగత, కార్పొరేట్ రుణాలపై వడ్డీ రేట్లు ఇక దిగిరానున్నాయి. దీంతో ఈఎంఐల భారం తగ్గనుంది. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా పెరగడమే కానీ, తగ్గడమంటే ఏంటో తెలియని గృహ రుణ గ్రహీతలకు ఇది బంపర్ అవకాశమనే చెప్పొచ్చు. అటు మందగమనంతో ఆశగా ఎదుచుచూస్తున్న రియల్ ఎస్టేట్ రంగానికి కూడా తాజా తగ్గింపు తగిన బూస్ట్ ఇస్తుందని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.ముంబై: రుణ గ్రహీతలకు ఊరటనిచ్చేలా కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా సారథ్యంలో రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) అనూహ్య నిర్ణయం తీసుకుంది. మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటు అందించేలా దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత కీలక రెపో రేటును పావు శాతం తగ్గించింది. దీంతో ఈ ప్రామాణిక వడ్డీ రేటు 6.5 శాతం నుంచి 6.25 శాతానికి దిగి రానుంది. గవర్నర్ సారథ్యంలోని ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుంది. తాజా బడ్జెట్లో కేంద్రం మధ్య తరగతి వర్గాలకు ఆదాయపు పన్నులో భారీ ఉపశమనం కల్పించిన వెంటనే ఆర్బీఐ కూడా తీపి కబురు అందించడం విశేషం. కాగా, ప్రస్తుత పాలసీ విషయంలో ప్రస్తుత తటస్థ (న్యూట్రల్) విధానాన్నే కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. వృద్ధి రేటు ఇలా...: వచ్చే ఆర్థిక సంవత్సరం (2025–26)లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 6.7 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. మరోపక్క, ద్రవ్యోల్బణం కూడా 4.2 శాతానికి (ఈ ఆర్థిక సంవత్సరం అంచనా 4.8 శాతం) దిగొస్తుందని లెక్కగట్టింది. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.4 శాతానికి (నాలుగేళ్ల కనిష్టం) తగ్గిపోవచ్చని, ద్రవ్యోల్బణం 4.8 శాతంగా ఉండొచ్చని ప్రభుత్వం అంచనా వేయడం తెలిసిందే. గతేడాది అక్టోబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం 6.21 శాతం గరిష్టాన్ని తాకింది. ఆ తర్వాత నెమ్మదిగా శాంతిస్తూ.. నవంబర్లో 5.48 శాతానికి, డిసెంబర్లో 5.22 శాతానికి దిగొచ్చింది. కాగా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్య యుద్ధానికి తెరతీయడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి వెంటాడుతోంది. మరోపక్క, ద్రవ్యోల్బణం భయాలతో అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోతకు బ్రేక్ ఇచ్చింది. ఈ పరిణామాలతో రూపాయి ఘోరంగా పడిపోతోంది. తాజాగా డాలరు మారకంలో సరికొత్త ఆల్టైమ్ కనిష్ట స్థాయి 87.60కి క్రాష్ అవ్వడం తెలిసిందే. ఈ తరుణంలో ఆర్బీఐ రేట్ల కోత దేశీయంగానూ ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోస్తుందని, రూపాయి పతనంతో విదేశీ నిధులు మరింత తరలిపోయే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.రెపో రేటు అంటే.. బ్యాంకులు ఆర్బీఐ నుంచి తీసుకునే రుణాలపై విధించే వడ్డీ రేటునే రెపో (రీపర్చేజ్) రేటుగా వ్యవహరిస్తారు. రెపో అధికంగా ఉంటే బ్యాంకులకు నిధుల సమీకరణ వ్యయం పెరుగుతుంది, దీంతో రుణాలపై వడ్డీ రేట్లు పెంచుతాయి. రెపో రేటు తగ్గడం వల్ల బ్యాంకులు ఆ ప్రయోజనాన్ని రుణ గ్రహీతలకు బదలాయిస్తాయి. దీంతో గృహ, వాహన, వ్యక్తిగత కార్పొరేట్ లోన్లపైనా వడ్డీ భారం తగ్గుతుంది. అయితే, రెపో రేటు తగ్గడం వల్ల డిపాజిట్ రేట్లతో పాటు ఇతర పొదుపు సాధనాలపై కూడా తక్కువ వడ్డీ లభిస్తుంది.ఇతర ముఖ్యాంశాలు... → సైబర్ మోసాలకు అడ్డకట్ట వేసి, భద్రతను కట్టుదిట్టం చేయడం కోసం ప్రత్యేకంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇంటర్నెట్ డొమైన్ను డాట్ ఇన్ (.in)కు మార్చుకోవాలి. అంటే బ్యాంకులు ‘bank.in’, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు ‘fin.in’ ఉపయోగించాలి. బ్యాంకు డొమైన్ మార్పు 2025 ఏప్రిల్ నుంచి అమల్లోకి రానుండగా.. నాన్–బ్యాంకులకు రాబోయే రోజుల్లో అమలు చేయనున్నారు.→ స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీలో రిజిస్టర్ అయిన బ్యాంకింగేతర బ్రోకరేజ్ సంస్థలు తమ క్లయింట్ల తరఫున... ప్రభుత్వ సెక్యూరిటీల్లో సెకండరీ మార్కెట్ లావాదేవీల కోసం ఇక నేరుగా నెగోషియేటెడ్ డీలింగ్ సిస్టమ్–ఆర్డర్ మ్యాచింగ్ (ఎన్డీఎస్–ఓఎం) ను ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఎల్రక్టానిక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ నియంత్రిత సంస్థలకు, బ్యాంకులు, ప్రత్యేక ప్రైమరీ డీలర్ల తరఫున క్లయింట్లకే అందుబాటులో ఉంది. → తదుపరి పాలసీ సమీక్ష ఏప్రిల్ 7–9 తేదీల్లో జరుగుతుంది.గృహ రుణంపై ఊరట ఎంతంటే..? ఒక వ్యక్తి తాజా రెపో రేటు కోతకు ముందు 9 శాతం వడ్డీ రేటుతో 20 ఏళ్ల కాలానికి రూ. 25 లక్షల ఇంటి రుణం తీసుకున్నారనుకుందాం. అతనికి ప్రస్తుతం రూ.22,493 చొప్పున నెలవారీ వాయిదా (ఈఎంఐ) పడుతుంది. ఆర్బీఐ తాజా పావు శాతం రేటు కోత నేరుగా బ్యాంకులు వర్తింపజేస్తే.. గృహ రుణంపై వడ్డీ రేటు 8.75 శాతానికి తగ్గుతుంది. దీని ప్రకారం ఈఎంఐ రూ.22093కు దిగొస్తుంది. అంటే నెలకు రూ.400 తగ్గినట్లు లెక్క. మిగతా రుణ వ్యవధిలో ఇతరత్రా ఎలాంటి మార్పులు జరగకుండా ఉంటే, దీర్ఘకాలంలో రుణ గ్రహీతకు రూ. 96 వేలు మిగులుతాయి. ఒకవేళ అదే ఈఎంఐ మొత్తాన్ని కొనసాగిస్తే.. రుణ కాల వ్యవధి 10 నెలలు తగ్గుతుంది.5ఏళ్లలో తొలిసారి.. 2020 తర్వాత తొలి సారి రెపో రేటు ను తగ్గించగా.. రెండున్నరేళ్ల తర్వాత మళ్లీ కీలక రేట్లలో మార్పులు చేయడం విశేషం. 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి వరకు ఆర్బీఐ రెపో రేటును ఏకధాటిగా 4% నుంచి 6.5 శాతానికి, అంటే 2.5% పెంచేసింది. ఆ తర్వాత రేట్లలో మార్పు లేకుండా యథాతథ పాలసీని కొనసాగిస్తూ వస్తోంది. ఇక గృహ రుణాలపై వడ్డీ రేట్లు ఆల్టైమ్ కనిష్టాన్ని (దాదాపు 6%) తాకిన తర్వాత కొండెక్కి కూర్చున్నాయి. ప్రస్తుతం 9–9.5% రేంజ్లో తీవ్ర భారంగా మారాయి. అధిక వడ్డీ రేట్లకు తోడు పన్నుల భారం ధరల పెరుగుదల డెబ్బతో గత రెండేళ్లుగా ఇల్లు కొనాలంటే బెదిరిపోయే పరిస్థితి నెలకొంది. ఆర్బీఐ తాజా నిర్ణయంతో గృహ రుణ గ్రహీతలకు మళ్లీ మంచి రోజులు వచ్చినట్లేనని విశ్లేషకులు చెబుతున్నారు.సానుకూల పరిస్థితులతోనే... గడిచిన కొన్ని పాలసీ చర్యల కారణంగా ఆహార ద్రవ్యోల్బణం దిగొచ్చే అవకాశాలున్నాయి. 2025–26లో ద్రవ్యోల్బణం మరింత శాంతించి ఆర్బీఐ టార్గెట్ (4%) స్థాయికి చేరుతుందని భావిస్తున్నాం. ఈ సానుకూల పరిస్థితుల కారణంగానే మందగమనంలో ఉన్న వృద్ధికి తోడ్పాటు అందించేలా ఎంపీసీ ఏకగ్రీవంగా రెపో రేటు కోతకు మొగ్గు చూపింది. 2024–25 రెండో త్రైమాసికంలో వృద్ధి 5.4 శాతానికి (రెండేళ్ల కనిష్టం) తగ్గిన తర్వాత మళ్లీ క్రమంగా పుంజుకుంటోంది. ఈ వృద్ధి–ద్రవ్యోల్బణం లెక్కలను భేరీజు వేసుకునే నిర్ణయం ప్రకటించాం. స్థూల ఆర్థిక అంచనాల మేరకు భవిష్యత్తు సమావేశాల్లో తగిన నిర్ణయాలు తీసుకుంటాం. ఫైనాన్షియల్ వ్యవస్థలో తగినంత ద్రవ్య సరఫరా (లిక్విడిటీ) ఉండేలా అవసరమైన చర్యలన్నీ చేపడతాం. భారత్ మళ్లీ కచ్చితంగా 7 శాతానికి మించి వృద్ధి రేటు సాధిస్తుంది. బడ్జెట్లో ఆదాయపు పన్ను ఊరట వల్ల ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం లేదు, నిజానికి ఇది వృద్ధికి చేదోడుగా నిలుస్తుంది. ఇక రూపాయి పతనం విషయానికొస్తే, డాలరుతో దేశీ మారకం విలువ ’నిర్దిష్ట స్థాయి లేదా శ్రేణి’లో ఉండాలని ఆర్బీఐ లక్ష్యంగా పెట్టుకోలేదు. – సంజయ్ మల్హోత్రా, ఆర్బీఐ గవర్నర్సమయానుకూల నిర్ణయం.. ఆర్బీఐ రేట్ల తగ్గింపు నిర్ణయం సరైన సమయంలో వెలువడింది. నియంత్రణపరంగా చేపట్టిన చర్యలను కూడా స్వాగతిస్తున్నాం. – సి.ఎస్. శెట్టి, ఎస్బీఐ చైర్మన్ ఇది సరిపోదు... ఆర్బీఐ పావు శాతం రేట్ల తగ్గింపు వల రియల్ ఎస్టేట్ పరిశ్రమపై ప్రత్యక్ష ప్రభావం పరిమితంగానే ఉంటుంది. మొత్తం డిమాండ్ను పెంచి, ఇళ్ల విక్రయాలు జోరందుకోవాలంటే (ముఖ్యంగా అందుబాటు ధరల విభాగంలో) మరిన్ని రేట్ల కోతలు ఉంటాయని ఆశిస్తున్నాం. – బొమన్ ఇరానీ, క్రెడాయ్ జాతీయ అధ్యక్షుడుహౌసింగ్కు బూస్ట్... ఆర్బీఐ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. రేపో తగ్గింపు వల్ల గృహ రుణాలపై వడ్డీ రేట్లు దిగొస్తాయి. దీంతో మళ్లీ ఇళ్ల కొనుగోళ్లు పుంజుకునేందుకు దోహదం చేస్తుంది. – జి. హరిబాబు, నరెడ్కో జాతీయ అధ్యక్షుడు -
చివరకు ఆ రోజు వచ్చింది.. రేపో రేటు తగ్గింపుపై మీమ్స్
ఊహించినట్టుగానే 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (RBI) దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత మొదటిసారిగా రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో ఇది 6.25 శాతానికి వచ్చింది. ఖర్చులను పెంచడానికి, వృద్ధిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కేంద్ర బడ్జెట్లో వ్యక్తిగత పన్ను రేట్లను తగ్గించిన క్రమంలోనే ఈ రేటు తగ్గింపు నిర్ణయం కూడా రావడం గమనార్హం.ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా (Sanjay Malhotra) నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ (MPC) ఫిబ్రవరి 5న.. మూడు రోజుల సమావేశాన్ని ప్రారంభించింది. శుక్రవారం వడ్డీ రేట్లపై సంజయ్ మల్హోత్రా ప్రకటన చేశారు. పూర్వ గవర్నర్ శక్తికాంత దాస్ పదవీకాలం ముగిసిన తర్వాత, సంజయ్ మల్హోత్రా డిసెంబర్ 2024లో బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇది మొదటి ద్రవ్య విధాన కమిటీ సమావేశం. మార్కెట్లు రేటు తగ్గింపు కోసం ఆసక్తిగా ఎదురుచూశాయి. అందరూ అంచన వేసినట్లుగానే ఆర్బీఐ రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో బెంచ్మార్క్ రుణ రేటు ప్రస్తుత 6.5 శాతం నుండి 6.25 శాతానికి తగ్గింది.ఇదీ చదవండి: రీఛార్జ్ లేకుండానే.. ఫ్రీగా కాల్స్ మాట్లాడొచ్చు: సింపుల్ ట్రిక్ ఇదే..ఆర్బీఐ చివరిసారిగా 2020 మేలో రేపో రేట్లను తగ్గించింది. కోవిడ్-19 మహమ్మారి ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి అప్పట్లో రెపో రేటును 4 శాతానికి తగ్గించింది. 2022 మే నుంచి.. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, సరఫరా గొలుసు అంతరాయాలు, ప్రపంచ ధరల పెరుగుదలను ఎదుర్కోవడానికి సెంట్రల్ బ్యాంక్ రెపో రేటును ఏడు సార్లు 6.5 శాతానికి పెంచింది. కాగా ఇప్పుడు తగ్గిన రేపో రేటు హోమ్ లోన్ చెల్లించే కస్టమర్లకు ప్రయోజనాన్ని చేకూర్చుతుంది.#rbipolicy RBI cuts #RepoRate to 6.25 Basis point.Le #HomeLoan seeker be like:-#RBIMonetaryPolicy #PranaliRathod #ExitPolls #StocksToWatch #arrestwarrant #DelhiAssemblyElection2025 #Zomato#ExitPolls pic.twitter.com/IUS9VpCJh2— Sanjana Mohan (@SanjanaMohan10) February 7, 2025ఈ రోజు రేపో రేటును తగ్గించడంతో పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. దీనికి సంబందించిన మీమ్స్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఒకరు "ఆఖిర్ వో దిన్ ఆ హి గయా" (చివరకు, ఆ రోజు వచ్చింది) అనే పోస్ట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.after RBI Repo Rate cut by 25 bps to 6.25% 😎Meanwhile Indian, and Bank Sector be like 😂😂#RateCut #RepoRate #NagaChaitanya #Zomato #DelhiAssemblyElection2025 #ExitPolls #GIFTNIFTY #intraday pic.twitter.com/ehAyRn7bdN— Daphi (@Dafi_syiemz) February 7, 2025 -
RBI MPC: రెపో రేటు తగ్గించిన ఆర్బీఐ..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత మొదటిసారిగా రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో ఇది 6.25 శాతానికి వచ్చింది. ఖర్చులను పెంచడానికి, వృద్ధిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కేంద్ర బడ్జెట్లో వ్యక్తిగత పన్ను రేట్లను తగ్గించిన క్రమంలోనే ఈ రేటు తగ్గింపు నిర్ణయం కూడా రావడం గమనార్హం.ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ (MPC) ఫిబ్రవరి 5న మూడు రోజుల సమావేశాన్ని ప్రారంభించింది. శుక్రవారం వడ్డీ రేట్లపై ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటన చేశారు. పూర్వ గవర్నర్ శక్తికాంత దాస్ పదవీకాలం ముగిసిన తర్వాత, సంజయ్ మల్హోత్రా గత డిసెంబర్ లో పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇది మొదటి ద్రవ్య విధాన కమిటీ సమావేశం. మార్కెట్లు రేటు తగ్గింపు కోసం ఆసక్తిగా ఎదురుచూశాయి. అందరూ అంచన వేసినట్లుగానే ఆర్బీఐ రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో బెంచ్మార్క్ రుణ రేటు ప్రస్తుత 6.5 శాతం నుండి 6.25 శాతానికి తగ్గింది. జీడీపీ 6.7% రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేటు నిర్ణయ ప్యానెల్ 2026 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధిని దాదాపు 6.7%గా అంచనా వేసిందని గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. అలాగే 2026 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం 4.2% వద్ద కొనసాగుతుందని ఆర్బీఐ ప్యానెల్ అంచనా వేసింది. కొత్త పంటల రాక నేపథ్యంలో ఆహార ద్రవ్యోల్బణం తగ్గుతుందని భావిస్తున్నట్లు ఎంపీసీ నిర్ణయాలను ప్రకటిస్తూ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నారు.ఆర్బీఐ పూర్వ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో జరిగిన మునుపటి ఎంపీసీ సమావేశంలో రెపో రేటులో ఎటువంటి మార్పు చేయకుండా 6.5 శాతంగా యథతథంగా కొనసాగించారు. అయితే, నగదు నిల్వ నిష్పత్తి (CRR) 50 బేసిస్ పాయింట్లు తగ్గించారు. నగదు ప్రవాహాన్ని పెంచడానికి ఆర్బీఐ బ్యాంకింగ్ వ్యవస్థలోకి రూ. 1 ట్రిలియన్లను చొప్పించింది. డిసెంబర్ పాలసీలో కీలకమైన చర్య నగదు నిల్వ నిష్పత్తి (CRR) 50 బేసిస్ పాయింట్లు (bps) తగ్గించడం, బ్యాంకింగ్ వ్యవస్థలోకి రెండు విడతలుగా రూ. 1.16 లక్షల కోట్లు ఇంజెక్ట్ చేయడం.రెపో రేటు అంటే.. రెపో రేటు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలు వేసే వడ్డీ రేటు. రెపో రేటు పూర్తి రూపం రీపర్చేజ్ అగ్రిమెంట్ లేదా రీపర్చేజింగ్ ఆప్షన్. బ్యాంకులు అర్హత కలిగిన సెక్యూరిటీలను అమ్మడం ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుండి రుణాలు పొందుతాయి.బ్యాంకులకు నిధులు తక్కువగా ఉన్నప్పుడు లేదా అస్థిర మార్కెట్ పరిస్థితులలో ద్రవ్యతను కొనసాగించాల్సిన అవసరం వచ్చినప్పుడు ఇలా చేస్తాయి. మార్కెట్లో డబ్బు ప్రవాహాన్ని నియంత్రించడానికి, పెంచడానికి కేంద్ర బ్యాంకు రెపో రేటును ఉపయోగిస్తుంది. ద్రవ్యోల్బణం మార్కెట్పై ప్రభావం చూపినప్పుడు ఆర్బీఐ రెపో రేటును పెంచుతుంది.వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ నుంచి తీసుకున్న రుణాలపై వడ్డీ రేటు తగ్గించిన నేపథ్యంలో బ్యాంకులు కూడా కస్టమర్లకు ఇచ్చే రీటైల్ రుణాలపై వసూలు చేసే వడ్డీ రేట్లను ఆ మేరకు సవరించే అవకాశం ఉంటుంది. దీంతో బ్యాంకుల నుంచి లోన్లు తీసుకున్నవారికి ఊరట కలిగే అవకాశం ఉంటుంది. -
భానుడి ప్రతాపం.. జనవరిలో రికార్డు ఉష్ణోగ్రతలు
వాతావరణంలో రికార్డు స్థాయిలో జనవరి 2025లో ఉష్ణోగ్రతలు పెరిగినట్లు కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ (సీ3ఎస్) తెలిపింది. లా నినా, తూర్పు పసిఫిక్లో ఏర్పడే ఉష్ణోగ్రతల వల్ల వాతావరణ మార్పుల్లో తేడాలొస్తున్నట్లు పేర్కొంది. జనవరిలో సాధారణంగా ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయి. కానీ అందుకు భిన్నంగా జనవరి 2025లో సగటు ప్రపంచ ఉష్ణోగ్రత 13.23 డిగ్రీల సెల్సియస్గా నమోదైనట్లు సీ3ఎస్ తెలిపింది. ఇది 2024 జనవరిలో నమోదైన రికార్డు కంటే 0.09 డిగ్రీల సెల్సియస్ అధికంగా ఉంది.‘లా నినా’ అనేది మధ్య పసిఫిక్ మహాసముద్రంలో చల్లని ఉపరితల జలాలతో ఏర్పడే వాతావరణాన్ని సూచిస్తుంది. ఇది పసిఫిక్ చుట్టు పక్కల ప్రాంతాలను ప్రభావితం చేస్తుంది. ప్రపంచ ఉష్ణోగ్రతలపై లా నినా ప్రభావం ఉన్నప్పటికీ ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. తూర్పు పసిఫిక్లో మాత్రం సముద్ర ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యాయి. ఈ పరస్పర విరుద్ధం వాతావరణంలో మార్పు అధికంగా ఉండడంతోనే ఉష్ణోగ్రతలు పెరుగతున్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.గ్లోబల్ వార్మింగ్ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుదల గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాల ప్రభావాన్ని హైలైట్ చేస్తుంది. ఉష్ణమండల పసిఫిక్లో ఏర్పడే ఉష్ణోగ్రతలు లా నినాపై తీవ్ర ప్రభావాన్ని చూపినట్లు సీ3ఎస్ డిప్యూటీ డైరెక్టర్ సమంత బర్గెస్ పేర్కొన్నారు. ప్రపంచ ఉష్ణోగ్రతలపై లా నినా తాత్కాలిక శీతలీకరణ ప్రభావం ఉన్నప్పటికీ గత రెండు సంవత్సరాలుగా రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు తెలిపారు. అయితే ఈ ఉష్ణోగ్రతలు ప్రపంచవ్యాప్తంగా ఓకే ప్రభావాన్ని చూపలేదన్నారు. యునైటెడ్ స్టేట్స్లోని కొన్ని ప్రాంతాల్లో అసాధారణంగా చల్లని ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కెనడియన్ ఆర్కిటిక్ వంటి ప్రాంతాల్లో 30 డిగ్రీ సెంటిగ్రేడ్ల ఉష్ణోగ్రత రికార్ట్ అయింది. ఈ తేలికపాటి వాతావరణం ఆర్కిటిక్లో సముద్ర మంచు మట్టాన్ని ప్రభావితం చేసిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.ఇదీ చదవండి: ఉద్యోగాలపై ఏఐ ప్రభావం.. నారాయణమూర్తి ఏమన్నారంటే..2025 జనవరిలో నమోదైన రికార్డు ఉష్ణోగ్రతలు గ్లోబల్ వార్మింగ్పై ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. జనవరిలోనే ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదైతే రాబోయే వేసవికాలంలో ఏమేరకు ఉష్ణోగ్రతలు చూడాల్సి వస్తుందోనని నిపుణులు ఆందోళనలు చెందుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఉష్ణోగ్రతల్లో స్థిరమైన పెరుగుదల ఇబ్బందికరమైన అంశాన్ని సూచిస్తుంది. వాతావరణ మార్పుల ప్రభావాలతో ప్రపంచం సతమతమవుతున్న తరుణంలో గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల రాబోయే వేసవిలో వ్యవసాయ దిగుబడులు ప్రభావితం చెందే అవకాశం ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అది వ్యవసాయ ఉత్పత్తులపై ఆధారపడే కంపెనీల బ్యాలెన్స్షీట్లను ఎఫెక్ట్ చేస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు. -
గరిష్ట వడ్డీరేట్లను బహిర్గతం చేయాలని ఆదేశాలు
రుణాలపై విధించే వడ్డీరేట్లలో పారదర్శకతను పెంపొందించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) చర్యలు తీసుకుంటోంది. విభిన్న రుణాలపై వసూలు చేసే గరిష్ట వడ్డీ రేట్లను బహిర్గతం చేయాలని బ్యాంకింగేతర ఫైనాన్స్ కంపెనీలను (NBFC) ఆదేశించింది. ఇందులో భాగంగా వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు, బీమా, ఇతర ఛార్జీలను స్పష్టంగా తెలియజేయాల్సి ఉంటుంది.ఆర్బీఐ ఆదేశాల్లోని కీలక అంశాలుతనఖా, వాహనం, ఆస్తి, బంగారం, విద్యా రుణాలు వంటి వివిధ రుణ కేటగిరీలకు కాంపోజిట్ సీలింగ్ రేట్ల(గరిష్ట వడ్డీరేట్లు)ను ఎన్బీఎప్సీలు వెల్లడించాల్సి ఉంటుంది. ఈ గరిష్ట రేట్లను సంబంధిత డైరెక్టర్ల బోర్డులు ఆమోదించాలి. ఆర్థిక సంస్థల కార్యకలాపాలు ఆర్బీఐ ఫెయిర్ ప్రాక్టీసెస్ కోడ్కు అనుగుణంగా ఉండాలి. ఇది వివిధ కేటగిరీల రుణగ్రహీతలకు వేర్వేరు రేట్లను వసూలు చేసే విధానాలపై స్పష్టతను ఇస్తుంది. రుణ రేట్లపై ఆర్బీఐ పరిమితులు విధించనప్పటికీ, బోర్డు ఆమోదం లేకుండా ఎన్బీఎఫ్సీలు వెల్లడించిన గరిష్ట రేట్లను మించరాదు.ఇదీ చదవండి: కోటక్ బ్యాంకు అలెర్ట్.. ‘డెబిట్ కార్డులు పని చేయవు’పెరుగుతున్న గృహ రుణభారం, రుణగ్రహీతలకు వారి రుణాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయాల్సి ఉంది. దీనిపై కొంత ఆందోళనలు వస్తున్న నేపథ్యంలో దానికి ప్రతిస్పందనగా ఆర్బీఐ ఈ చర్య తీసుకుంది. ఆర్బీఐ నేరుగా రుణ రేట్లను నియంత్రించనప్పటికీ ఎన్బీఎఫ్సీలు తమ రుణ ధరల్లో పారదర్శకతను కొనసాగించడానికి ఈ ఆదేశాలు ఉపయోగపడుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది సంస్థలపై కొంత ఆర్థిక ఒత్తిడిని కలిగించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
సేవల రంగం స్లో డౌన్.. రెండేళ్ల తర్వాత ఇదే ప్రథమం
న్యూఢిల్లీ: అమ్మకాలు, ఉత్పత్తి ఒక మోస్తరుగానే పెరుగుతున్న నేపథ్యంలో జనవరిలో దేశీయంగా సేవల రంగం (Services sector) వృద్ధి నెమ్మదించింది. డిసెంబర్లో 59.3గా ఉన్న హెచ్ఎస్బీసీ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ సూచీ 56.5కి పరిమితమైంది. రెండేళ్ళ తర్వాత వృద్ధి ఇంతగా నెమ్మదించడం ఇదే ప్రథమం.పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) పరిభాషలో సూచీ 50కి పైన ఉంటే వృద్ధిని, దానికన్నా తక్కువుంటే క్షీణతను సూచిస్తుంది. బిజినెస్ యాక్టివిటీ, కొత్త బిజినెస్ పీఎంఐ సూచీలు వరుసగా 2022 నవంబర్, 2023 నవంబర్ తర్వాత కనిష్ట స్థాయులకు తగ్గినట్లు హెచ్ఎస్బీసీ చీఫ్ ఇండియా ఎకానమిస్ట్ ప్రాంజల్ భండారీ తెలిపారు.సిబ్బంది ఖర్చులు, ఆహార ధరలు పెరిగిపోతుండటంతో సర్వీస్ కంపెనీల వ్యయాలు కూడా మరింత పెరిగాయి. అయితే, రాబోయే 12 నెలల్లో వ్యాపార కార్యకలాపాలు గణనీయంగా పుంజుకుంటాయని దేశీయంగా సర్వీస్ ప్రొవైడర్లు ధీమాగా ఉన్నారు. ప్రకటనలు, పోటీ సంస్థలతో పోలిస్తే మెరుగైన రేట్లు ఆఫర్ చేయడం, కొత్త క్లయింట్ల ఎంక్వైరీలు మొదలైన అంశాలు ఇందుకు కారణం. సర్వీస్ రంగానికి చెందిన 400 కంపెనీల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా హెచ్ఎస్బీసీ ఇండియా సర్వీసెస్ పీఎంఐని ఎస్అండ్పీ గ్లోబల్ రూపొందిస్తుంది. -
మన రూపాయి.. మరో కొత్త కనిష్ట స్థాయి
ముంబై: అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధభయాల కారణంగా ఇన్వెస్టర్లు రిస్కులు తీసుకోవడానికి ఇష్టపడకపోతుండటంతో రూపాయి (Rupee) మారకం విలువపై మరింతగా ఒత్తిడి పెరుగుతోంది. దీంతో దేశీ కరెన్సీ రోజురోజుకూ కొత్త కనిష్టాలకు జారిపోతోంది. తాజాగా బుధవారం డాలరుతో (US dollar) పోలిస్తే మరో 36 పైసలు క్షీణించి ఇంకో రికార్డు కనిష్ట స్థాయి 87.43కి పడిపోయింది.ఒక దశలో 87.49 కనిష్ట స్థాయిని కూడా తాకింది. అమెరికా, చైనా టారిఫ్ల ప్రభావాలను ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలిస్తుండటంతో రూపాయిపై ప్రభావం పడుతోందని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. భారత్లో రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లు తగ్గించవచ్చన్న అంచనాలు, విదేశీ మార్కెట్లలో డాలరు బలపడుతుండటం కూడా మదుపరుల సెంటిమెంటును దెబ్బతీస్తున్నాయని వివరించారు.ద్రవ్యోల్బణం నిర్దిష్ట స్థాయికి పరిమితం కావడంతో ఆర్బీఐ ఈసారి పాలసీ రేట్లను 0.25 శాతం తగ్గించవచ్చనే అంచనాలు ఉన్నాయి. మూడు రోజుల పాటు సాగే ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం బుధవారం ప్రారంభమైంది. ఫిబ్రవరి 7న విధాన నిర్ణయాలను ఎంపీసీ ప్రకటించనుంది. అమెరికా డాలరు బలోపేతం అవుతుండటంవల్లే దానితో పోలిస్తే రూపాయి మారకం విలువ తగ్గుతోందని నీతి ఆయోగ్ సభ్యుడు అరవింద్ విర్మాణీ తెలిపారు. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో పోటీ దేశం జపాన్ యువాన్తో కూడా రూపాయిని పోల్చి చూడాల్సిన అవసరం ఉందన్నారు. రూపాయిని నిర్దిష్ట స్థాయికి పరిమితం చేయడం ఆర్బీఐ విధానం కాదని, తీవ్ర స్థాయిలో ఒడిదుడుకులను కట్టడి చేసేందుకు మాత్రమే అవసరమైతే జోక్యం చేసుకుంటుందని వివరించారు. -
మొదలైన ఆర్బీఐ ఎంపీసీ సమీక్ష
ముంబై: ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) భేటీ బుధవారం ప్రారంభమైంది. కొత్త ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన ఆరుగురు సభ్యుల ఎంపీసీ కమిటీ వడ్డీ రేట్లు, పరపతి విధానంపై కీలక నిర్ణయాలు తీసుకోనుంది. వడ్డీ రేట్ల తగ్గింపునకు ఆర్బీఐ కీలకంగా చూసేది ద్రవ్యోల్బణాన్నే. వినియోగ ధరల ఆధారిత సూచీ (రిటైల్ ద్రవ్యోల్బణం) డిసెంబర్ త్రైమాసికానికి 4.5 శాతానికి తగ్గుముఖం పడుతుందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తానికి 4.8 శాతంగా ఉంటుందన్నది ఎస్బీఐ రీసెర్చ్ అంచనా. జనవరి నెల ద్రవ్యోల్బణం 4.5 సమీపంలో ఉండొచ్చని పేర్కొంది. ‘‘ద్రవ్యపరమైన ఉద్దీపనలు, వాణిజ్య యుద్ధాల పరంగా అనిశి్చతుల మధ్య ఆర్బీఐ రిస్్కలను సమతుల్యం చేయాల్సిన సున్నితమైన టాస్క్ను ఎదుర్కొంటున్నది. కనీసం స్వల్పకాలానికి రేట్ల తగ్గింపు పరంగా ఆర్బీఐకి వెసులుబాటు ఉంది’’అని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక తెలిపింది. ఫిబ్రవరి, ఏప్రిల్ సమీక్షల్లో పావు శాతం చొప్పున రేట్ల కోతలకు వెళ్లొచ్చని.. విరామం అనంతరం తిరిగి అక్టోబర్లో మళ్లీ రేట్ల కోత ఆరంభించొచ్చని తెలిపింది. మొత్తం మీద 0.75 శాతం మేర రేట్ల తగ్గింపు అవకాశాలను అంచనా వేస్తోంది. -
భారత్లో వ్యాపారంపై ఈఎఫ్టీఏ ఇన్వెస్టర్ల దృష్టి
న్యూఢిల్లీ: భారత్లో వ్యాపారావకాశాలను అందిపుచ్చుకోవడంపై విదేశీ ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరుగుతోంది. నాలుగు యూరోపియన్ దేశాల కూటమి ఈఎఫ్టీఏ నుంచి 100 మంది, ఇజ్రాయెల్కి చెందిన 200 మంది ఇన్వెస్టర్లు వచ్చే వారం భారత్ను సందర్శించనున్నారు. ఫిబ్రవరి 10 నుంచి మూడు రోజుల పాటు వారు పర్యటించనున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్ తెలిపారు. టెక్నాలజీ, తయారీ ప్లాంట్లు ఏర్పాటు చేయడంపై ఆసక్తి గల పెద్ద కంపెనీలు వస్తున్నట్లు వివరించారు. 2024లో ఈఎఫ్టీఏ, భారత్ వాణిజ్య, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈఎఫ్టీఏలో ఐస్ల్యాండ్, నార్వే, లీష్టెన్స్టెయిన్, స్విట్జర్లాండ్ సభ్యదేశాలుగా ఉన్నాయి. యూరోపియన్ యూనియన్లో చేరడానికి ఇష్టపడని దేశాలు ఏర్పాటు చేసుకున్న ఈ కూటమి.. వచ్చే 15 ఏళ్ల వ్యవధిలో భారత్లో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు హామీనిచ్చింది. దానికి ప్రతిగా స్విస్ వాచీలు, చాక్లెట్లు, కట్.. పాలిష్డ్ డైమండ్లు తదితర ఉత్పత్తులపై సుంకాలను తగ్గించేందుకు భారత్ అంగీకరించింది. ఈ ఏడాది ఆఖరు నాటికి ఈ ఒప్పందం అమల్లోకి రానుంది. 24 బిలియన్ డాలర్ల వాణిజ్యం.. ఈఎఫ్టీఏ–భారత్ మధ్య 2022–23లో ద్వైపాక్షిక వాణిజ్యం 18.65 బిలియన్ డాలర్లుగా ఉండగా 2023–24 నాటికి 24 బిలియన్ డాలర్లకు చేరింది. భారత్కు స్విట్జర్లాండ్ అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా, ఇన్వెస్టరుగా ఉంటోంది. తర్వాత స్థానంలో నార్వే ఉంది. 2000 ఏప్రిల్ నుంచి 2024 సెప్టెంబర్ మధ్య కాలంలో స్విట్జర్లాండ్ నుంచి 10.72 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. వచ్చే 15 ఏళ్లలో 100 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేస్తామని హామీ ఇచి్చన ఈఎఫ్టీఏ బ్లాక్ .. ఇందులో 50 బిలియన్ డాలర్లను ఒప్పందం అమల్లోకి వచి్చన 10 ఏళ్ల వ్యవధిలో పెట్టుబడులు పెట్టనుంది. మిగతా మొత్తాన్ని అయిదేళ్లలో ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ పెట్టుబడులతో భారత్లో 10 లక్షల పైచిలుకు ప్రత్యక్ష ఉద్యోగాల కల్పన జరుగుతుందనే అంచనాలు నెలకొన్నాయి. -
లోన్ ఈఎంఐలు తగ్గనున్నాయా?.. శుభవార్త సిద్ధం!
రుణగ్రహీతలకు శుభవార్త సిద్ధంగా ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు (0.25%) తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రెండేళ్లుగా వడ్డీ రేట్లను కదిలించకుండా స్థిరంగా కొనసాగిస్తూ వస్తున్న ఆర్బీఐ ఈసారి వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు (0.25%) తగ్గించే అవకాశం ఉన్నట్లు సమాచారం.గృహ రుణాలు, వ్యక్తిగత, కారు లోన్లు వంటి వాటికి ఈఎంఐలు (EMI) కడుతున్నవారు ఈసారి తమకు కాస్త ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నారు. కొత్తగా నియమితులైన ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన మొదటి ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం బుధవారం ప్రారంభమైంది. మూడు రోజులపాటు చర్చించిన తర్వాత వడ్డీ రేటు నిర్ణయాన్ని శుక్రవారం ప్రకటించనున్నారు.మార్కెట్ లిక్విడిటీని మెరుగుపరచడంతో పాటు, వినియోగం ఆధారిత వృద్ధిని ప్రోత్సహించడానికి కేంద్ర బడ్జెట్ ముందుకు వచ్చిన నేపథ్యంలో ఆర్బీఐ కూడా రేట్ల కోత నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రిటైల్ ద్రవ్యోల్బణం కూడా నియంత్రణలోనే అంటే ఆర్బీఐ కంఫర్ట్ జోన్ 6 శాతంలోపే ఉంది. దీనివల్ల ధరల గురించి ఆందోళన చెందకుండా ఆర్బీఐ నిర్ణయం తీసుకునే వీలు ఏర్పడింది.ఆర్బీఐ రెపో రేటు (స్వల్పకాలిక రుణ రేటు)ను ఎటువంటి మార్పు లేకుండా 2023 ఫిబ్రవరి నుండి 6.5 శాతంగా కొనసాగిస్తోంది. కోవిడ్ కాలంలో (2020 మే) ఆర్బీఐ చివరిసారిగా రెపో రేటును తగ్గించింది. ఆ తర్వాత దానిని క్రమంగా 6.5 శాతానికి పెంచింది. ఇప్పుడు వినియోగం ఇంకా మందగించడంతో రుణాలు చౌకగా చేయడం ద్వారా వృద్ధిని పెంచాలని ఆర్బీఐ చూస్తోంది. తద్వారా రుణ గ్రహీతలపై ఈఎంఐల భారం తగ్గుతుంది. -
ఏటీఎం నగదు ఉపసంహరణ మరింత భారం
ఏటీఎం ద్వారా నగదు ఉపసంహరించేవారికి త్వరలో ఛార్జీలు పెంచనున్నాయి. ఏటీఎం లావాదేవీలకు ఇంటర్ చేంజ్ ఫీజును పెంచాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) యోచిస్తోంది. ఇది ఏటీఎం ద్వారా చేసే నగదు ఉపసంహరణలను మరింత ఖరీదైనవిగా చేస్తుంది. ఐదు లావాదేవీల ఉచిత పరిమితి ముగిసిన తర్వాత చేసే నగదు లావాదేవీలకు గరిష్ట రుసుమును రూ.21 నుంచి రూ.22కు పెంచాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సిఫారసు చేసినట్లు తెలిసింది. అంతేకాకుండా ఏటీఎం ద్వారా చేసే నగదు లావాదేవీలకు ఇంటర్ చేంజ్ ఫీజు(ఇతర బ్యాంకు ఏటీఎం ద్వారా చేసే లావాదేవీలు) రూ.17 నుంచి రూ.19కి, నగదు రహిత లావాదేవీలకు రూ.6 నుంచి రూ.7కు పెరగవచ్చని సమాచారం.పెరుగుదల ఎందుకు?ద్రవ్యోల్బణం, అధిక రుణ వ్యయాలు, రవాణా, నగదు భర్తీకి సంబంధించిన ఖర్చుల కారణంగా బ్యాంకులు ఛార్జీలు పెంచుతున్నాయి. ఏటీఎం ఆపరేటర్లకు, ముఖ్యంగా మెట్రోయేతర ప్రాంతాల్లో నిర్వహణ ఖర్చులను భరించడానికి, ఏటీఎం సేవల సుస్థిరతకు సాయపడడానికి ఈ పెంపు అవసరమని బ్యాంకులు భావిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను ప్రతిబింబించేలా ఇంటర్ చేంజ్ ఫీజులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటారు.ఇదీ చదవండి: ప్రభుత్వ డివైజ్ల్లో ఏఐ టూల్స్ నిషేధం!వినియోగదారులపై ప్రభావంఈ సిఫార్సులను ఆర్బీఐ ఆమోదిస్తే వినియోగదారులు ఉచిత పరిమితికి మించి ఏటీఎం లావాదేవీలకు చెల్లించే ఫీజు పెరుగుతుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ మౌలిక సదుపాయాలు అంతగా అభివృద్ధి చెందని గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఏటీఎంల నుంచి తరచూ నగదు ఉపసంహరించుకునే వారిపై ఇది ప్రభావం చూపుతుంది. ప్రతిపాదిత ఫీజుల పెంపు ప్రభావాన్ని అంచనా వేయడానికి ఆర్బీఐ కమిటీ ఏర్పాటు చేసింది. దీని ప్రభావాన్ని అంచనా వేయడానికి నిపుణులతో సంప్రదింపులు జరుపుతోంది. బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు ఈ పెరుగుదలకు మద్దతు ఇస్తున్నాయి. -
‘చౌకగా పెట్రోల్.. ప్రజలకు రాయితీల్లేవు’
మోదీ ప్రభుత్వం ఇథనాల్ మిశ్రమ(బ్లెండెడ్) పెట్రోల్ను తీసుకొచ్చిన నేపథ్యంలో పెట్రోల్ ధరను తగ్గించాలని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాకెత్ గోఖలే రాజ్యసభలో డిమాండ్ చేశారు. ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ లీటరుకు కనీసం రూ.9 చౌకగా లభిస్తున్నప్పటికీ వినియోగదారు నుంచి పూర్తి స్థాయిలో వసూలు చేస్తున్నట్లు తెలిపారు. మోదీ ప్రభుత్వం ఈ విషయంలో ప్రజలను మోసం చేస్తోందని, ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును లాగేసుకుంటుందని విమర్శించారు. దాంతో ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలకు కారణమవుతుందని దుయ్యబట్టారు.‘మోదీ ప్రభుత్వం పెట్రోల్లో 20% ఇథనాల్ కలపాలని గతంలోనే ఆదేశించింది. ఇథనాల్ చౌకైనది మాత్రమే కాదు.. వాహన మైలేజీని కూడా గణనీయంగా ప్రభావితం చేస్తుంది. ఇది బీఎస్-IV, పాత ఇంజిన్లను నాశనం చేస్తుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ లీటరుకు కనీసం రూ.9 చౌకగా లభిస్తోంది. కానీ ప్రజలు ఈ రాయితీ పొందడం లేదు. వాస్తవ ధరకే పెట్రోల్ కొనుగోలు చేస్తున్నారు. మోదీ ప్రభుత్వం నిస్సందేహంగా ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును దొచుకుంటోంది. దాంతో ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలకు కారణం అవతుంది. ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ను తప్పనిసరి చేస్తే మోదీ ప్రభుత్వం ధరలు తగ్గించాలి’ అని ఎంపీ తెలిపారు.𝐈𝐦𝐩𝐨𝐫𝐭𝐚𝐧𝐭:𝐘𝐨𝐮 𝐚𝐫𝐞 𝐛𝐞𝐢𝐧𝐠 𝐎𝐕𝐄𝐑𝐂𝐇𝐀𝐑𝐆𝐄𝐃 𝐛𝐲 𝐚𝐭 𝐥𝐞𝐚𝐬𝐭 ₹𝟗 𝐩𝐞𝐫 𝐥𝐢𝐭𝐞𝐫 𝐚𝐭 𝐭𝐡𝐞 𝐩𝐞𝐭𝐫𝐨𝐥 𝐩𝐮𝐦𝐩. Modi Govt has mandated 20% blending of ethanol with petrol. Ethanol is not only cheaper but also significantly reduces your car… pic.twitter.com/iEBjgp9SX9— Saket Gokhale MP (@SaketGokhale) February 5, 2025ఇథనాల్ పెట్రోల్పై భిన్నాభిప్రాయాలుముడి చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, గ్రీన్ ఎన్విరాన్మెంట్ను ప్రోత్సహించడంలో భాగంగా గతంలో ప్రభుత్వం పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ను కలపాలని నిర్ణయించింది. ఇథనాల్ పెట్రోల్ కంటే తక్కువ శక్తి కంటెంట్ కలిగి ఉంటుందని అభిప్రాయాలున్నాయి. ఇది వాహనం మైలేజ్ను 3-4% తగ్గిస్తుందని వాహన నిపుణులు చెబుతున్నారు. పాత వాహనాలకు ముఖ్యంగా బీఎస్-4 ఇంజిన్లు ఉన్న వాహనాలకు అధిక ఇథనాల్ కంటెంట్ ప్లాస్టిక్, రబ్బరు, అల్యూమినియం భాగాలకు హాని కలిగిస్తుందని తెలియజేస్తున్నారు. ఇది ఇంజిన్ పనిచేయకపోవడం, మన్నిక తగ్గడానికి దారితీస్తుందంటున్నారు.ఇదీ చదవండి: అంతకంతకూ పెరుగుతున్న పసిడి ధర! తులం ఎంతంటే..పెట్రోల్లో ఇథనాల్ను కలపడం వల్ల ముడి చమురు దిగుమతులపై తక్కువ ఆధారపడే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం తెలుపుతుంది. ఇది ఇంధన భద్రతను బలోపేతం చేస్తుంది. ఇథనాల్ గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గిస్తుంది. చెరకు నుంచి ఇథనాల్ ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. -
యూఎస్-చైనాల మధ్య వాణిజ్య యుద్ధం.. భారత్కు లాభం
అమెరికా, చైనాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు(US-China trade tensions) భారత్కు కొత్త అవకాశాలను చూపిస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చైనా వస్తువులపై అమెరికా సుంకాలు విధించడంతో భారతీయ ఎగుమతిదారుల ఆర్డర్లలో పెరుగుదల నమోదవుతుందని తెలియజేస్తున్నారు. అమెరికా-చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య సంఘర్షణతో భారతదేశం లబ్ధిదారుగా మారుతుందని చెబుతున్నారు.గతంలో ఇలా..గతంలో యూఎస్-చైనాల మధ్య సుంకాల పరంగా నెలకొన్న వాణిజ్య యుద్ధాల సమయంలో భారతదేశం భారీగానే లాభపడింది. ఉదాహరణకు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత హయాంలో ప్రారంభించిన వాణిజ్య యుద్ధం కాలంలో భారత్ అమెరికాకు భారీగానే వస్తువులను ఎగుమతి చేసింది. ఆ సమయంలో అమెరికాకు ఎగుమతి చేసే దేశాల్లో ఇండియా నాలుగో అతిపెద్ద లబ్ధిదారుగా అవతరించింది. ప్రస్తుతం చైనా దిగుమతులపై సుంకాలు విధించడంతో యూఎస్ ప్రత్యామ్నాయ సరఫరాదారులను అన్వేషిస్తోంది. అందులో ప్రధానంగా భారత్వైపు మొగ్గు చూపేందుకు అవకాశం ఉంది.ఏయే వస్తువులకు గిరాకీఎలక్ట్రానిక్స్, మెషినరీ, దుస్తులు, తోలు, పాదరక్షలు, ఫర్నిచర్, ఫార్మాస్యూటికల్స్, బొమ్మలు వంటి కీలక రంగాల్లో యూఎస్-చైనా టారిఫ్ల వల్ల భారత్ లబ్ధి పొందే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనా దిగుమతులతో ముడిపడి ఉన్న అధిక ఖర్చులను నివారించడానికి యూఎస్ కొనుగోలుదారులు భారతీయ కంపెనీలపై దృష్టి సారించనున్నారు. ముఖ్యంగా భారత్, చైనా రెండింటిలోనూ తయారీ కార్యకలాపాలు కలిగి ఉన్న సంస్థలకు యూఎస్ నుంచి ఆర్డర్లు పెరుగుతాయని భావిస్తున్నారు.ఇదీ చదవండి: త్వరలో జీఎస్టీ శ్లాబ్ల సరళీకరణఆర్డర్ల పెరుగుదలఈ పరిణామంపై ప్రభుత్వ అధికారులు, పరిశ్రమ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్ పోర్ట్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్ఐఈఓ) ఎగుమతిదారుల్లో సానుకూల సెంటిమెంట్ ఉందని తెలిపింది. ఇప్పటికే చాలా మంది ఆర్డర్లు పెరిగినట్లు పేర్కొంది. ఈ వ్యవహారం భారత ఎగుమతులను పెంచుతుందని, ఆర్థిక వృద్ధికి, ఉద్యోగాల కల్పనకు దోహదం చేస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలంటే భారత మౌలిక సదుపాయాలు, సులభతర వాణిజ్యం మెరుగుపడాలని తెలియజేస్తున్నారు. ఈ అంశంపై కొన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ ప్రస్తుత విధానాలు భారతదేశానికి ప్రపంచ వాణిజ్య ఉనికిని పెంచుకోవడానికి అవకాశాన్ని అందిస్తున్నట్లు చెబుతున్నారు. -
త్వరలో జీఎస్టీ శ్లాబ్ల సరళీకరణ
వస్తు, సేవల పన్ను (GST) శ్లాబ్లను మరింత సరళీకరించాలని జీఎస్టీ కౌన్సిల్ యోచిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. సరళమైన, క్రమబద్ధమైన పన్నుల వ్యవస్థ లక్ష్యంగా చేసుకుని జీఎస్టీ శ్లాబుల సంఖ్యను తగ్గించడం, రేట్లను హేతుబద్ధీకరించడాన్ని కౌన్సిల్ పరిశీలిస్తోందని మంత్రి హింట్ ఇచ్చారు.ప్రస్తుతం జీఎస్టీ వ్యవస్థలో 5%, 12%, 18%, 28% అనే నాలుగు అంచెలు ఉన్నాయి. ప్యాక్ చేసిన ఆహారం వంటి నిత్యావసర వస్తువులపై అత్యల్పంగా 5 శాతం, లగ్జరీ వస్తువులు వంటివాటిపై అత్యధికంగా 28 శాతం పన్ను విధిస్తున్నారు. ఇప్పటికే కొన్ని శాఖలు, వ్యాపార సంఘాల నుంచి ఈ శ్లాబ్ల సవరణకు సంబంధించి చాలా ప్రతిపాదనలు వస్తున్నాయి. ఈ శ్లాబ్ల సంఖ్యను తగ్గించేలా రానున్న జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో నిర్ణయం తీసుకుంటారని నిపుణులు అంచనా వేస్తున్నారు. నిత్యావసర వస్తువులపై జీఎస్టీ రేట్లను తగ్గిస్తారని అభిప్రాయపడుతున్నారు.సామాన్యులపై భారం పడకుండా..జీఎస్టీ రేట్లను హేతుబద్ధీకరించడం, వాటిని సరళతరం చేసే కార్యక్రమాలు దాదాపు మూడేళ్లుగా కొనసాగుతున్నట్లు ఆర్థిక మంత్రి ఉద్ఘాటించారు. జీఎస్టీ రేట్లలో మార్పులు, శ్లాబులను తగ్గించేందుకు మంత్రుల బృందాన్ని (GoM) ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిత్యావసర వస్తువులపై రేట్ల సవరణ వల్ల సామాన్యులపై భారం పడకుండా పన్ను వ్యవస్థను నిష్పక్షపాతంగా ఉండేలా చూడాల్సిన అవసరాన్ని నిర్మలా సీతారామన్ నొక్కి చెప్పారు. జీఎస్టీ సమీక్ష పరిధిని విస్తృతం చేశామని పేర్కొన్నారు. ప్రతిపాదిత మార్పులపై జీఎస్టీ కౌన్సిల్ త్వరలో నిర్ణయం తీసుకుంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: 5జీ స్పెక్ట్రమ్ వేలానికి మార్గం సుగమంఎన్నికల వేళ నిర్ణయాలపై విమర్శలు2025-26 కేంద్ర బడ్జెట్లో మధ్యతరగతి ప్రజలకు గణనీయమైన ఆదాయపు పన్ను ఉపశమనం లభించింది. దేశ ఆర్థిక మూలాలు బలంగా ఉన్నాయని, నిర్మాణాత్మక ఆర్థిక మందగమనం లేదని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. కొన్ని ప్రాంతాల్లో జరగబోయే ఎన్నికలను ప్రభావితం చేయడమే లక్ష్యంగా పన్ను మినహాయింపు ఉందన్న ఊహాగానాలను ఆమె తోసిపుచ్చారు. జీఎస్టీ శ్లాబుల తగ్గింపుతో నిత్యావసర వస్తువులు, సేవల ధరలు తగ్గడం ద్వారా వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుందని నిపుణులు భావిస్తున్నారు. పన్ను వ్యవస్థను సరళతరం చేసి మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ విస్తృత లక్ష్యానికి ఇది తోడ్పడుతుంది. -
పార్లమెంట్ సమావేశాల్లో బిజినెస్ విశేషాలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జనవరి 26 వరకు 17,654 కంపెనీలు మూతబడ్డాయని, ఇదే వ్యవధిలో 1,38,027 సంస్థలు రిజిస్టర్ అయ్యాయని కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా రాజ్యసభ(Parliament)కు రాతపూర్వకంగా తెలిపారు. 2023–24లో మూతబడిన సంస్థల సంఖ్య 22,044గాను, 2022–23లో 84,801గాను ఉంది. వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు పరిమళ్ నథ్వానీ అడిగిన ప్రశ్నకు గాను మంత్రి ఈ సమాధానం ఇచ్చారు. ఐదేళ్లలో 339 విదేశీ కంపెనీలు..2020 నుంచి విదేశీ కంపెనీల రిజిస్ట్రేషన్ తగ్గుతున్నట్లు కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా రాజ్యసభకు తెలిపారు. గత అయిదేళ్లలో 339 విదేశీ కంపెనీలు భారత్లో నమోదు చేయించుకున్నట్లు వివరించారు. 2020లో 90 విదేశీ కంపెనీలు రిజిస్టర్ చేసుకోగా ఆ తర్వాత నుంచి ఇది తగ్గుతూ వస్తోంది. 2021లో 75, 2022లో 64, 2023లో 57, 2024లో 53 సంస్థలు నమోదు చేసుకున్నాయి.ఇదీ చదవండి: బ్యాంకుల్లోకి రూ.45 వేల కోట్ల డిపాజిట్లుఉద్దేశపూర్వక డిఫాల్టర్లు 2,664గతేడాది మార్చి ఆఖరు నాటికి వ్యక్తులు, విదేశీ రుణగ్రహీతలు మినహా ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగవేసిన డిఫాల్టర్ల సంఖ్య 2,664గా ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభకు తెలిపారు. విల్ఫుల్ డిఫాల్టర్లు క్రమంగా తగ్గుతున్నారని వివరించారు. 2021–22లో 160 డిఫాల్టర్లు పెరగ్గా 2023–24లో ఇది 42కి తగ్గినట్లు వివరించారు. ఉద్దేశపూర్వక ఎగవేతలను నిరోధించేందుకు, మొండిబాకీలను తగ్గించేందుకు ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ సమగ్ర చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు. -
బ్యాంకుల్లోకి రూ.45 వేల కోట్ల డిపాజిట్లు
బడ్జెట్లో ఆదాయపన్ను తగ్గింపు, ఇతర పన్ను ప్రతిపాదనలతో బ్యాంకుల్లోకి వచ్చే డిపాజిట్లు పెరగనున్నాయి. సుమారు రూ.40,000 నుంచి 45,000 కోట్ల వరకు బ్యాంకుల్లోకి డిపాజిట్లు(Bank Deposit)గా రావొచ్చని కేంద్ర ఆర్థిక సేవల కార్యదర్శి ఎం.నాగరాజు పేర్కొన్నారు. ఒక ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్లపై ఆదాయం రూ.40,000 మించినప్పుడు (60 ఏళ్లలోపు వారికి) బ్యాంక్లు 10 శాతం మేర టీడీఎస్ వసూలు చేస్తుండగా, ఈ పరిమితిని రూ.50,000కు పెంచడం గమనార్హం. అదే 60 ఏళ్లు నిండిన వారికి రూ.50,000గా ఉన్న పరిమితిని రూ.లక్షకు పెంచుతున్నట్టు ఆర్థిక మంత్రి ప్రకటించడం తెలిసిందే.‘పన్ను రాయితీని పెంచడం వల్ల బ్యాంకింగ్ వ్యవస్థలోకి రూ.20,000 కోట్లు డిపాజిట్ల రూపంలో రావొచ్చు. సేవింగ్స్ డిపాజిట్లపై వృద్ధులు ఆర్జించే వడ్డీపై టీడీఎస్ పరిమితిని పెంచడం వల్ల మరో రూ.15,000 కోట్లు రావొచ్చు’ అని నాగరాజు వివరించారు. సీనియర్లు కాని ఇతర వ్యక్తులకు పన్ను ఆదా రూపంలోనూ మరో రూ.7,000 కోట్ల మేర డిపాజిట్లుగా వచ్చే అవకాశం ఉన్నట్టు చెప్పారు. ఇదీ చదవండి: త్వరలో భారత్ సొంత జీపీయూ క్యాన్సర్ సంస్థలతో యాక్సిస్ బ్యాంక్ జట్టుక్యాన్సర్పై పరిశోధనలు, పేషంట్ల సంరక్షణ కార్యక్రమాలకు తోడ్పాటు అందించే దిశగా దేశీయంగా మూడు ప్రతిష్టాత్మక సంస్థలతో చేతులు కలిపినట్లు యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. టాటా మెమోరియల్ సెంటర్కి చెందిన నేషనల్ క్యాన్సర్ గ్రిడ్, ఇండియన్ క్యాన్సర్ సొసైటీ, సెయింట్ జూడ్ ఇండియా చైల్డ్కేర్ సెంటర్స్ వీటిలో ఉన్నట్లు వివరించింది. తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యక్రమాల కింద ఈ ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు బ్యాంక్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ విజయ్ మూల్బగల్ తెలిపారు. ప్రధానంగా పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలు, క్యాన్సర్ నివారణ .. చికిత్సపై అవగాహన కల్పించే సంస్థలు, అలాగే పేషంట్ల సంరక్షణ మొదలైన వాటికి సహాయసహకారాలు అందించేందుకు ఇవి ఉపయోగపడగలవని పేర్కొన్నారు. సెయింట్ జూడ్ ఇండియా చైల్డ్కేర్ సెంటర్స్ సంస్థ హైదరాబాద్లో కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సహాయం అందించినట్లు వివరించారు. -
నూతన ఐటీ చట్టంలో కొత్త పన్నులుండవ్
న్యూఢిల్లీ: కొత్త ప్రత్యక్ష పన్నుల కోడ్(ఐటీ చట్టం) లో ఎలాంటి కొత్త పన్నులు ఉండబోవని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి తుహిన్ కాంత పాండే(Tuhin Kanta Pandey) స్పష్టం చేశారు. అలాగే బడ్జెట్ 2025 ద్రవ్యోల్బణానికి ఆ జ్యం పోసేది కాదన్నారు. ద్రవ్యలోటు తగ్గింపుతో, ద్రవ్యోల్బణాన్ని పెంచని బడ్జెట్ను అందించినట్టు చెప్పారు. వృద్ధికి మద్దతునిచ్చే ద్రవ్య విధానానికి అనుగుణంగా ఆర్బీఐ మానిటరీ పాలసీ కూడా ఉంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. తద్వారా వడ్డీ రేట్లలో మార్పు ఉండొచ్చన్న సంకేతాన్నిచ్చినట్టయింది.మీడియాతో మాట్లాడిన సందర్భంగా పలు అంశాలపై గందరగోళం, అయోమయాన్ని తొలగించే ప్రయత్నం చేశారు పాండే. మూలధన లాభాల పన్ను లేదా సెక్యూరిటీల లావాదేవీల పన్ను పెంపు రూపంలో ఊహించనిది ఏదైనా ఉంటుందా? అన్న ప్రశ్నకు అలాంటిదేమీ లేదని తోసిపుచ్చారు. ప్రస్తుత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే వారం వ్యవధిలో కొత్త ఆదాయపన్ను చట్టాన్ని ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడం గుర్తుండే ఉంటుంది. ఇది పూర్తిగా కొత్త బిల్లు, తిరగ రాసిందంటూ దీన్ని పార్లమెంట్ ఆమోదించాల్సి ఉందన్నారు పాండే.‘‘ఇది పన్ను రేట్లను మార్చదు. నిర్మాణాత్మకంగా పూర్తి మార్పునకు గురికానుంది. హేతుబద్దీకరణతోపాటు ప్రక్రియలను సులభంగా మార్చడం ఇందులో కనిపిస్తుంది. ఇందులో ఎన్నో సంస్కరణలు ఉంటాయి. వచ్చే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది’’అని పాండే వివరించారు. ప్రస్తుత పన్ను చట్టంతో పోల్చితే సగమే ఉంటుందన్న ఆర్థిక మంత్రి ప్రకటనను గుర్తు చేశారు. వృద్ధి నిలకడగా కొనసాగాలంటే ద్రవ్యోల్బణంపై మంచి నియంత్రణ అవసరమని, రెండింటి మధ్య సమతుల్యం అవసరమన్నారు. ఆర్బీఐ ఎంపీసీ సమావేశం ఈ నెల 5న ప్రారంభం కానుంది. 7వ తేదీన నిర్ణయాలు వెలువడనున్నాయి. ఈ సమావేశంలో రేట్ల కోత నిర్ణయం ఉంటుందా? అన్న ప్రశ్నకు.. పరిస్థితిని వారు తెలుసుకున్నారని, దీనిపై వారే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పాండే బదులిచ్చారు. -
అందరికీ అర్థమయ్యేలా.. ఆదాయ పన్ను చట్టం
వచ్చే వారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో.. ప్రభుత్వం కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని ప్రవేశపెడుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 కేంద్ర బడ్జెట్ను సమర్పిస్తూ తెలిపారు. కొత్త బిల్లు పన్ను చెల్లింపుదారులకు అర్ధమయ్యే విధంగా ఉంటుందని అన్నారు.నిజానికి కేంద్ర ప్రభుత్వం జూలై 2024లో ఆదాయపు పన్ను చట్టానికి సంబందించిన సమగ్ర సమీక్షను చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఈ చట్టాన్ని సంక్షిప్తంగా, స్పష్టంగా, చదవడానికి, అర్థం చేసుకోవడానికి సులభతరం చేయడమే దీని లక్ష్యం అని అప్పుడే వెల్లడించింది. పన్ను చెల్లింపులకు సంబంధించిన విషయాలు స్పష్టంగా ఉన్నప్పుడే.. చెల్లింపుదారులకు పన్ను ఖచ్చితత్వం లభిస్తుంది. కాబట్టి దీనిని త్వరగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.పన్ను చెల్లింపులకు సంబంధించిన విషయాల సరళీకృతం జరుగుతున్నప్పుడు.. కేపీఎంజీ జనవరి 2025లో పరిశ్రమ అభిప్రాయాలను మరియు అంచనాలను సంగ్రహించడానికి ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో 200 కంటే ఎక్కువ మంది అభిప్రాయాలను పొందుపరిచారు. ఇందులో పారిశ్రామిక తయారీ, ఆటోమోటివ్, ఆర్థిక సేవలు, వినియోగదారుల మార్కెట్లు, మౌలిక సదుపాయాలు, ఎనర్జీ అండ్ నేచురల్ రీసోర్సెస్, సాంకేతికత, లైఫ్ సైన్సెస్, ఆరోగ్య సంరక్షణ, ఫార్మా మొదలైన ఇతర రంగాలకు సంబంధించిన కార్యనిర్వాహకులు ఉన్నారు.సర్వేలో తేల్చిన విషయాలు➤సుమారు 84 శాతం మంది సరళీకరణ చాలా అవసరమని చెప్పారు. ఇందులో 30 శాతం కంటే ఎక్కువమంది లావాదేవీ వర్గాలను కవర్ చేసే టీడీఎస్ నిబంధనలను సరళీకృతం చేయాలని అన్నారు. మూలధన లాభాల పన్ను, వ్యాపార ఆదాయ గణన వంటి ఇతర అంశాలు శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.➤96 శాతం మంది ప్రభుత్వం ప్రచురించిన ఆదాయపు పన్ను వ్యాఖ్యానాన్ని రూపొందించడానికి మద్దతు ఇస్తున్నారు. ఇది చాలా స్పష్టంగా ఉందని అంటున్నారు. పన్ను సర్క్యులర్లు లేదా నోటిఫికేషన్ల నుంచి ఇప్పటికే తీసుకున్న ప్రయోజనకరమైన స్పష్టీకరణలను ఆదాయపు పన్ను చట్టంలో నేరుగా చేర్చాలని కోరుకుంటున్నారు.➤87 శాతం మంది తప్పనిసరి TDS సర్టిఫికేట్ జారీని తొలగించాలని అంటున్నారు. 61 శాతం మంది ఫేస్లెస్ ఇంటరాక్షన్లకు మద్దతు ఇస్తున్నారు. డివిడెండ్ పన్నులతో సహా అధిక ప్రభావవంతమైన పన్ను రేట్లను పేర్కొంటూ 58% మంది కార్పొరేట్ పన్ను రేట్లను తగ్గించాలని చెబుతున్నారు. 34 శాతం మంది ప్రస్తుత రేట్లు బాగానే ఉన్నాయని చెబుతున్నారు. 7 శాతం మంది నాన్ రెసిడెంట్ కంపెనీలకు మాత్రమే తగ్గింపులను కోరుకుంటున్నారని తెలుస్తోంది. -
పాత పన్ను విధానం రద్దుపై నిర్మలా సీతారామన్ క్లారిటీ
కొత్త పన్ను విధానం మరింత ఆకర్షణీయంగా తీసుకొస్తున్న.. తరుణంలో పాత పన్ను విధానం రద్దు చేసే అవకాశం ఉందని పుకార్లు పుడుతున్నాయి. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ.. పాత పన్ను విధానం రద్దు చేస్తారనే వార్తల్లో ఎటువంటి నిజం లేదని అన్నారు. ఈ విషయాన్ని ఓ సమావేశంలో వెల్లడించారు.పాత పన్ను విధానం ఔచిత్యం, ప్రణాళికల గురించి కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. భారతదేశ పన్ను వ్యవస్థ మొత్తం సరళంగా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు వెల్లడించారు. పన్ను విధానం నిబంధనలకు అనుగుణంగా ఉండాలని, దీనికోసం పాత పన్ను విధానాన్ని తొలగించాలనే ఉద్దేశ్యం తనకు లేదని అన్నారు.మొత్తం పన్ను చెల్లింపుదారులందరూ.. కొత్త పన్ను విధానానికి మారాలని కోరుకుంటున్నారా? అని ఆర్థిక మంత్రిని అడిగినప్పుడు. పాత పన్ను విధానం రద్దు చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. అంతే కాకుండా కొత్త ఆదాయ పన్ను చట్టం గురించి ప్రస్తావిస్తూ.. 1931లో తీసుకొచ్చిన పాత పన్ను చట్టం స్థానంలో అనేక మార్పులు చేపట్టినట్లు వెల్లడించారు. కాబట్టి త్వరలోనే దీనికి సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఫిబ్రవరి 7న ఏం జరగనుంది?.. అందరూ వెయిటింగ్దేశ నిర్మాణం కోసం పన్ను చెల్లింపుదారులు చేస్తున్న సేవలను గౌరవించడానికి ప్రధానమంత్రి 'నరేంద్ర మోదీ' చేసిన ప్రయత్నమే 2025 బడ్జెట్లో ఇచ్చిన పన్ను ఉపశమనం అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. గత మూడు.. నాలుగు సంవత్సరాలుగా, మేము నిరంతరం పన్ను చెల్లింపుదారులతో నిమగ్నమై ఉన్నాము. ప్రభుత్వంపై వారి నమ్మకం చెక్కుచెదరకుండా ఉండటానికి, మేము అనేక చర్యలు తీసుకున్నామని అన్నారు. -
జోరందుకున్న తయారీ రంగం
భారత తయారీ రంగం జనవరి నెలకు పటిష్టమైన వృద్ధిని నమోదు చేసింది. హెచ్ఎస్బీసీ ఇండియా తయారీ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) గత డిసెంబర్లో 56.4 శాతంగా ఉంటే, 2025 జనవరి నెలలో 57.7కు దూసుకుకెళ్లింది. ఎగుమతులు 14 ఏళ్లలోనే (2011 తర్వాత) బలమైన వృద్ధిని చూపించడం ఇందుకు మద్దతుగా నిలిచినట్టు ఈ సర్వే అభిప్రాయపడింది. 50 పాయింట్లకు పైన తయారీ పీఎంఐ నమోదు అయితే దాన్ని విస్తరణగా, అంతకు దిగువకు పడిపోతే క్షీణతగా పరిగణిస్తుంటారు.‘భారత తయారీ పీఎంఐ ఆరు నెలల గరిష్ట స్థాయికి జనవరిలో చేరుకుంది. దేశీ, ఎగుమతుల డిమాండ్ బలంగా ఉంది. ఇది వృద్ధికి మద్దతునిచ్చింది’ అని హెచ్ఎస్బీసీ ముఖ్య భారత ఆర్థిక వేత్త ప్రంజుల్ భండారీ తెలిపారు. తయారీదారులకు కొత్త ఆర్డర్లలో వృద్ధి ఉన్నట్టు, దీనికి అనుగుణంగా తమ ఉత్పత్తిని పెంచుకుంటున్నట్టు పీఎంఐ సర్వే తెలిపింది. రానున్న కాలంలో 32 శాతం సంస్థలు వృద్ధి పట్ల సానుకూల అంచనాలతో ఉంటే, కేవలం ఒక శాతం సంస్థలు క్షీణతను అంచనా వేస్తున్నట్టు వెల్లడించింది.ఇదీ చదవండి: వర్క్ ఫ్రం హోంకు స్వస్తి చెప్పిన టాప్ టెక్ కంపెనీఐపీవోకు వీడా క్లినికల్ రీసెర్చ్క్లినికల్ రీసెర్చ్ కంపెనీ వీడా క్లినికల్ రీసెర్చ్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ.185 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.3 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. కాగా.. ఇంతక్రితం కంపెనీ 2021 సెపె్టంబర్లోనూ ఐపీవో చేపట్టేందుకు వీలుగా సెబీకి ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. సెబీ నుంచి అనుమతి లభించినప్పటికీ పరిస్థితులు అనుకూలించక ఐపీవోను పక్కనపెట్టింది. కంపెనీ ప్రధానంగా వివిధ దశల ఔషధ అభివృద్ధిలో సర్వీసులు అందిస్తోంది. తొలి దశసహా చివరి దశ క్లినికల్ ట్రయల్స్ తదితర సేవలు సమకూర్చుతోంది. -
అనుకున్నదొకటి.. అయినదొకటి!
ప్రపంచంలోని రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య యుద్ధం జరుగుతోంది. ఇటీవల అమెరికా చైనా దిగుమతులపై సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో చైనా కూడా అందుకు తగ్గట్టుగా ప్రతిస్పందించింది. అమెరికా దిగుమతి చేసుకునే వస్తువులపై టారిఫ్లు విధిస్తున్నట్లు చైనా స్పష్టం చేసింది. చైనా నుంచి అమెరికా బొగ్గు, ద్రవరూపంలో ఉన్న సహజ వాయువు (ఎల్ఎన్జీ), ముడి చమురు, వ్యవసాయ యంత్రాలు, కొన్ని కంపెనీలకు చెందిన ప్రీమియం కార్లు.. వంటివాటిని బారీగానే దిగుమతి చేసుకుంటోంది. దాంతో భవిష్యత్తులో వీటిపై ప్రభావం పడుతుందని నిపుణులు భావిస్తున్నారు.ఇటీవల అమెరికా విధించిన సుంకాల పెంపునకు ప్రతిస్పందనగా చైనా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. అమెరికా అనుసరించిన సుంకాల పెంపు విధానం ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) నిబంధనలను ఉల్లంఘిస్తుందని, రెండు దేశాల మధ్య సాధారణ ఆర్థిక, వాణిజ్య సహకారానికి విఘాతం కలిగిస్తుందని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. వచ్చే సోమవారం నుంచి ఈ సుంకాల పెంపు అమల్లోకి వస్తుందని చైనా స్పష్టం చేసింది. కొత్త టారిఫ్ల్లో బొగ్గు, ఎల్ఎన్జీ ఉత్పత్తులపై 15 శాతం సుంకం, ముడిచమురు, వ్యవసాయ యంత్రాలు, ప్రీమియం కార్లపై 10 శాతం సుంకం విధిస్తున్నట్లు చైనా తెలిపింది. అమెరికాలోకి అక్రమ వలసదారులు, మాదకద్రవ్యాల ప్రవాహాన్ని నిరోధించడంలో విఫలమైన దేశాలను శిక్షించడమే లక్ష్యంగా ట్రంప్ ఇటీవల చైనా వస్తువులపై 10% సుంకం విధిస్తున్నట్లు తెలిపారు.ఇదీ చదవండి: వణికిస్తున్న బంగారం ధర! తులం ఎంతంటే..చైనా అమెరికాకు వాణిజ్య విధానానికి వ్యతిరేకంగా కౌంటర్ టారిఫ్లతో పాటు, యాంటీట్రస్ట్ చట్టాలను ఉల్లంఘించారనే అనుమానంతో స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ మార్కెట్ రెగ్యులేషన్ గూగుల్పై దర్యాప్తు ప్రారంభించింది. ఈ దర్యాప్తును అమెరికా వాణిజ్య చర్యలకు ప్రతీకార చర్యగా భావిస్తున్నారు. చైనా మార్కెట్లో గూగుల్ ఆధిపత్యానికి చెక్ పెట్టేలా పోటీదారులకు అన్యాయం చేసే ఏదైనా వ్యాపార పద్ధతులను ఉపయోగించిందా అనే దానిపై దర్యాప్తు దృష్టి సాగనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనాపై సుంకాలు విధిస్తే వాణిజ్యం పరంగా కొంత వెనక్కి తగ్గుతుందని భావించిన అమెరికాకు.. చైనా ఇలా తిరికి టారిఫ్లు విధించడం కొంత ఎదురుదెబ్బే అవుతుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే చైనా నుంచి అమెరికా దిగుమతి చేసుకునే వస్తువుల కోసం యూఎస్ భారత్వైపు చూసేలా ప్రయత్నాలు జరగాలని సూచిస్తున్నారు. -
సావరీన్ రేటింగ్కు ‘క్షీణత రిస్క్’
భారత ఆర్థిక వ్యవస్థ రుణ భారం పెరుగుతుందని, ఒకవేళ ఏవైనా పెద్ద ఆర్థిక సమస్యలు ఎదురైతే ఇది మరింత పెరగొచ్చని (దిగువ వైపు రిస్క్) ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. దీంతో సార్వభౌమ రేటింగ్ తగ్గుదల రిస్క్ పొంచి ఉన్నట్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. అదే సమయంలో మధ్య కాలానికి సంబంధించి ద్రవ్య కార్యాచరణను కట్టుబడడం, రుణ భారాన్ని తగ్గించుకునే విషయంలో విశ్వాసం పెరిగినట్లు తెలిపింది. ఇది నిర్ణీత కాలానికి సార్వభౌమ రేటింగ్ పరంగా సానుకూలం అని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది.చివరిసారిగా 2024 ఆగస్ట్లో భారత్కు బీబీబీ మైనస్-స్టెబుల్ (స్థిరత్వం) రేటింగ్ను కొనసాగిస్తున్నట్టు ఫిచ్ రేటింగ్స్ ప్రకటించింది. పెట్టుబడుల పరంగా ఇది కనిష్ట రేటింగ్. 2006 ఆగస్ట్ నుంచి భారత్కు ఇదే రేటింగ్ను ఫిచ్ కొనసాగిస్తూ వస్తోంది. 2024–25 సంవత్సరానికి జీడీపీలో ద్రవ్యోలోటును 4.8 శాతానికి కట్టడి చేయనున్నట్టు, 2025–26లో దీన్ని 4.4 శాతానికి తగ్గించుకోనున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ బడ్జెట్లో ప్రకటించడం తెలిసిందే. ఆర్థిక వృద్ధి బలహీన పడిన తరుణంలోనూ రుణ భారం తగ్గింపునకు ప్రభుత్వం కట్టుబడి ఉండడాన్ని ఫిచ్ రేటింగ్స్ భారత ప్రైమరీ సావరీన్ అనలిస్ట్ జెరేమీ జూక్ ఈ సందర్భంగా ప్రశంసించారు. అంచనాలు వాస్తవికంగా ఉన్నాయంటూ, వాటిని భారత్ సాధించొచ్చని అభిప్రాయపడ్డారు. అయితే బలహీన ఆర్థిక వృద్ధి నేపథ్యంలో ఆదాయం వసూళ్లు చెప్పుకోతగ్గ స్థాయిలో తగ్గిపోవచ్చని హెచ్చరించారు. దీనికి అదనంగా ఖర్చు నియంత్రణ చర్యలు అవసరం కావొచ్చన్నారు. వృద్ధి తటస్థం2025–26 బడ్జెట్ వృద్ధికి తటస్థంగా ఉన్నట్టు ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. పన్నుల తగ్గింపుతో వినియోగానికి ఊతమివ్వడం, స్థిరమైన మూలధన వ్యయాలు అనేవి ద్రవ్యలోటు తగ్గింపు ప్రతికూలతలను భర్తీ చేయొచ్చని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. నియంత్రణల తొలగింపు ద్వారా పెట్టుబడులను ఇతోధికం చేసే విధానం మధ్య కాలానికి వృద్ధి సానుకూలమని, విధానాల కచ్చితమైన అమలుపైనే విజయం ఆధారపడి ఉంటుందని పేర్కొంది. వృద్ధి, ద్రవ్యలోటు తగ్గింపు మధ్య సమతుల్యత అన్నది మరింత సవాలుతో కూడినదిగా తెలిపింది. రానున్న సంవత్సరాల్లో అంచనాల కంటే ఆదాయం తక్కువగా ఉండొచ్చని.. కఠినమైన వ్యయ నియంత్రణలు, మూలధన వ్యయ నియంత్రణల ప్రాముఖ్యాన్ని ఇది తెలియజేస్తున్నట్టు పేర్కొంది. మధ్య కాలానికి ద్రవ్యలోటు పట్ల ప్రభుత్వం గొప్ప స్పష్టత ఇచ్చిందని తెలిపింది. 2031 మార్చి నాటికి జీడీపీలో రుణభారాన్ని 50 శాతానికి తగ్గించుకోనున్నట్టు బడ్జెట్లో ప్రకటించడాన్ని గుర్తు చేసింది. 2025 మార్చి నాటికి అంచనాలతో పోలి్చతే 7 శాతం తగ్గనుంది. ఇదీ చదవండి: ఈసారి వడ్డీ రేట్లు తగ్గింపు..?సావరీన్ రేటింగ్ యథాతథంవచ్చే ఏడాదికి ద్రవ్య లోటును జీడీపీలో 4.4 శాతానికి కట్టడి చేసేందుకు ఆర్థిక శాఖ ప్రతిపాదించిన నేపథ్యంలో ఇండియా సావరీన్ రేటింగ్ను వెంటనే అప్గ్రేడ్ చేయబోమని రేటింగ్స్ దిగ్గజం మూడీస్ స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దే బాటలో సమర్థవంత చర్యలకు తెరతీస్తుండటాన్ని సానుకూలంగా పరిగణిస్తున్నట్లు మూడీస్ సీనియర్ వైస్ప్రెసిడెంట్ క్రిస్టియన్ డి గజ్మన్ పేర్కొన్నారు. అయితే ద్రవ్య లోటు కట్టడి, ఆర్థిక క్రమశిక్షణ తదితరాల కారణంగా మెరుగుపడనున్న రుణ సామర్థ్యం, రుణభారం తదితరాలతో సావరీన్ రేటింగ్ పెంపునకు త్వరపడబోమని తెలియజేశారు. ప్రస్తుతం మూడీస్ దేశీ సావరీన్ రేటింగ్ను సుస్థిర ఔట్లుక్తో బీఏఏఏ3గా కొనసాగిస్తోంది. ఇది కనీస ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ రేటింగ్కాగా.. తాజా బడ్జెట్లో ఆర్థిక మంత్రి సీతారామన్ ఈ ఏడాది(2024–25) ద్రవ్య లోటు 4.8 శాతానికి పరిమితం కానున్నట్లు అభిప్రాయపడ్డారు. 2025–26లో 4.4 శాతానికి కట్టడి చేసే ప్రణాళికలు ప్రకటించారు. -
ఈసారి వడ్డీ రేట్లు తగ్గింపు..?
ముంబై: కీలక వడ్డీ రేట్ల కోతను ఆర్బీఐ(RBI) ఈ వారంలో జరిగే సమీక్షతో షురూ చేయొచ్చని ప్రముఖ ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. కొత్త ఆర్బీఐ గవర్నర్గా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన సంజయ్ మల్హోత్రా ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) తొలిసారిగా ఈ నెల 5 నుంచి 7వ తేదీ మధ్య భేటీ కానుంది. ఈ సందర్భంగా రెపో రేటును (వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే రేటు) 25 బేసిస్ పాయింట్లు (0.25 శాతం) తగ్గించొచ్చని భావిస్తున్నారు.రెండేళ్లుగా కీలక రెపో, రివర్స్ రెపో (ఆర్బీఐ వద్ద బ్యాంకులు ఉంచే నిధులపై చెల్లించే రేటు)ను ఆర్బీఐ ఎలాంటి మార్పులు చేయకుండా కొనసాగిస్తోంది. కేంద్ర బడ్జెట్లో వినియోగానికి మద్దతుగా ఆదాయపన్ను విషయంలో పెద్ద ఎత్తున ఊరట కల్పించినందున, దీనికి కొనసాగింపుగా వ్యవస్థలో లిక్విడిటీ పెంపు, వృద్ధికి మద్దతుగా ఆర్బీఐ నిర్ణయాలు తీసుకోవచ్చన్న అభిప్రాయాలు వినపడుతున్నాయి. ముఖ్యంగా ద్రవ్యోల్బణం ఆర్బీఐ గరిష్ట నియంత్రణ పరిధి 6 శాతం లోపే ఉన్నందున రేట్ల తగ్గింపునకు వెసులుబాటు ఉందని నిపుణులు అంటున్నారు. సెపె్టంబర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు ఏడు కనిష్టాల త్రైమాసిక స్థాయిలో 5.4 శాతానికి పడిపోవడం గమనార్హం. ఇదీ చదవండి: షార్ట్ వీడియో ప్లాట్ఫామ్ల జోరుఇవీ సానుకూలతలు..‘రేట్ల తగ్గింపునకు రెండు బలమైన కారణాలున్నాయి. ఆర్బీఐ ఇప్పటికే లిక్విడిటీ పెంచే చర్యలకు శ్రీకారం చుట్టింది. దీంతో మార్కెట్ పరిస్థితులు మెరుగుపడ్డాయి. ఇది రేట్ల కోత ముందస్తు సూచికగా ఉంది’ అని బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనమిస్ట్ మదన్ సబ్నవిస్ తన అభిప్రాయాలు వెల్లడించారు. కేంద్ర బడ్జెట్లో చర్యలకు మద్దతుగా రెపో రేటును తగ్గించొచ్చన్నారు. ‘కేంద్ర బడ్జెట్లో ద్రవ్యపరమైన ఉద్దీపనలు ద్రవ్యోల్బణంపై గణనీయమైన ప్రభావం చూపిస్తాయని భావించడం లేదు. కనుక 2025 ఫిబ్రవరి సమీక్షలో రేట్ల కోతకు సానుకూలతలు ఉన్నాయి’ అని ఇక్రా రేటింగ్స్ రీసెర్చ్ హెడ్, చీఫ్ ఎకనమిస్ట్ అదితి నాయర్ అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఈ వారంలో రూపాయి విలువ మరింత బలహీనపడే అంతర్జాతీయ పరిణామాలు చోటుచేసుకుంటే రేట్ల కోత వాయిదా పడొచ్చన్నారు. -
రూపాయి మరింత క్రాష్ ..
ముంబై: అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ దాదాపు ప్రతి రోజు సరికొత్త రికార్డు కనిష్టాలకు పడిపోవడం కొనసాగుతోంది. సోమవారం మరో 49 పైసలు క్షీణించి 87 స్థాయిని కూడా దాటేసింది. 87.11 వద్ద క్లోజయ్యింది. కెనడా, మెక్సికో, చైనాపై అమెరికా టారిఫ్ల మోత మోగించడమనేది వాణిజ్య యుద్ధాలకు దారి తీస్తుందనే భయాలతో ప్రపంచ మార్కెట్లు క్షీణించడం .. మన రూపాయిపైనా ప్రతికూల ప్రభావం చూపింది. అమెరికా డాలరు పటిష్టంగా ఉండటం, విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటం వంటి అంశాల కారణంగా రూపాయి బలహీనంగానే ట్రేడయ్యే అవకాశాలు ఉన్నాయని మిరే అసెట్ షేర్ఖాన్ రీసర్చ్ ఆనలిస్ట్ అనుజ్ చౌదరి తెలిపారు. అమెరికా టారిఫ్లపై ఆందోళన వల్ల కూడా రూపాయి మీద ఒత్తిడి పెరగవచ్చని వివరించారు. అయితే, రిజర్వ్ బ్యాంక్ గానీ జోక్యం చేసుకుంటే రూపాయి పతనానికి కాస్త బ్రేక్ పడొచ్చని పేర్కొన్నారు. గతేడాది డిసెంబర్ 31న 85.61 వద్ద ఉన్న రూపాయి మారకం విలువ ఈ ఏడాది ప్రారంభమైనప్పటి నుంచి 1.8 శాతం క్షీణించింది.మార్కెట్ ఆధారితమైనదే..: రూపాయి మారకం విలువ మార్కెట్ ఆధారితంగానే ఉంటుందే తప్ప ప్రభుత్వం జోక్యం చేసుకుని, తగ్గించడమనేది జరగదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, లోక్సభకు ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో తెలిపారు. డాలర్ ఇండెక్స్, పెట్టుబడుల ప్రవాహాలు, వడ్డీ రేట్లు, క్రూడాయిల్ కదలికలు, కరెంటు అకౌంటు లోటు తదితర జాతీయ, అంతర్జాతీయ అంశాలెన్నో రూపాయిపై ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. రూపాయి క్షీణత వల్ల ఎగుమతులపరంగా పోటీపడేందుకు వీలవుతుందని, ఇది ఎకానమీకి సానుకూలమని చెప్పారు. -
టారిఫ్ వార్.. బొమ్మాబొరుసు!
సాక్షి, బిజినెస్ డెస్క్: ట్రంప్ దూకుడు చూస్తుంటే.. ఇతర దేశాలను కాళ్లబేరానికి తెచ్చుకునే వ్యూహంతో వెళ్తున్నట్లు కనిపిస్తోంది. రేపోమాపో మనకూ సుంక‘దండన’తప్పకపోవచ్చు. ఇప్పటికే పలుమార్లు భారత్ను ‘అమెరికాకు అతిపెద్ద టారిఫ్ ముప్పు’గా అభివర్ణించారు కూడా. డీ–డాలరైజేషన్ చర్యల నుంచి వెనక్కతగ్గకపోతే బ్రిక్స్ దేశాలపై 100 శాతం సుంకాలు విధిస్తానని కూడా హెచ్చరించారు. అయితే, అమెరికా టారిఫ్లు రెండు వైపులా పదునున్న కత్తిలాంటివని స్వయంగా ఆ దేశ ఆర్థిక వేత్తలు, నిపుణులే హెచ్చరిస్తున్నారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థలు కకావికలం అవుతాయని, దీంతో ఉత్పత్తుల రేట్లు పెరిగిపోయి.. ద్రవ్యోల్బణం ఎగబాకేందుకు దారితీస్తుందని చెబుతున్నారు. సుంకాల విధింపుతో ఎగుమతిదారులు ఆమేరకు రేట్లు పెంచుతారు. అమెరికా ప్రజలు కూడా ఆయా దేశాల ఉత్పత్తులను అధిక ధరలకు కొనుక్కోవాల్సిందేనని తేల్చి చెబుతున్నారు.మన ఎగుమతులకు లాభమేనా?ట్రంప్ టారిప్ వార్తో ప్రస్తుతానికి కొన్ని రంగాల్లో ఎగుమతిదారులకు కొంత లాభమేనని పరిశ్రమవర్గాలు ఆశాభావంతో ఉన్నాయి. ప్రస్తుతానికి మనపై సుంకాలు విధించకపోవడంతో చైనా ఉత్పత్తులతో పోలిస్తే మన ఎగుమతులకు పోటీతత్వం పెరుగుతుందని భారతీయ ఎగుమతిదారుల సంఘం (ఫియో) డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ పేర్కొన్నారు. అయితే, భారత్లోకి చైనా సహా పలు దేశాల నుంచి చౌక దిగుమతులు పోటెత్తే అవకాశం ఉందని, ఇది మన పరిశ్రమలకు ముప్పుగా మారొచ్చని మరికొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. సుంకాల విషయంలో తీవ్ర విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉండాలని కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ ప్రొఫెసర్ బిశ్వజిత్ ధార్ సూచించారు.ఆటోమొబైల్: భారత వాహన విడిభాగాల సంస్థలకు అమెరికా అతిపెద్ద ఎగుమతి మార్కెట్గా ఉంది. పరిశ్రమ అసోసియేషన్ (ఏసీఎంఏ) ప్రకారం 2024–25లో భారత్ 11.1 బిలియన్ డాలర్ల విలువైన విడిభాగాలను ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేసింది. ఇందులో 3.67 బిలియన్ డాలర్లు, అంటే 28 శాతం అమెరికాకే వెళ్లాయి. తాజాగా ఇతర దేశాలపై టారిఫ్ల పెంపుతో యూఎస్లో మన వాటా పెంచుకోవడానికి సదవకాశమని కొంతమంది పరిశ్రమవర్గాలు చెబుతున్నారు. ‘ఆహార, వ్యవసాయ రంగాలతో పాటు వాహన విడిభాగాల రంగాలు తక్షణం ప్రయోజనం పొందుతాయి. దాదాపు 20 బిలియన్ డాలర్ల విలువైన మార్కెట్ అవకాశాలకు ద్వారాలు తెరుచుకుంటాయి’అని వాణిజ్య విధాన విశ్లేషకుడు ఎస్.చంద్రశేఖరన్ పేర్కొన్నారు.టెక్స్టైల్స్: ట్రంప్ తాజా టారిఫ్లు భారత టెక్స్టైల్ రంగానికి బూస్ట్ ఇస్తాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ‘భారతీయ కంపెనీలకు సమీప భవిష్యత్తులో ఆర్డర్లు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది’అని తిరుపూర్ ఎగుమతిదారుల సంఘం (టీఈఏ) అధ్యక్షుడు కె.ఎం. చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు.ఫార్మా: భారత ఫార్మా రంగం అప్రమత్తతతో పాటు ఆశావహ ధోరణితో వేచిచూస్తోంది. ‘జెనరిక్స్లో చైనా చాలా పటిష్టంగానే ఉన్నప్పటికీ, అమెరికాకు పెద్దగా ఎగుమతి చేయడం లేదు. ప్రధానంగా యాక్టివ్ ఫార్మా ఇన్గ్రీడియెంట్స్ (ఏపీఐ), కెమికల్స్ వంటివి ఎగుమతి చేస్తోంది. ఇప్పుడు మనకు వీటిని కూడా అమెరికాకు ఎగుమతి చేసే అవకాశం లభిస్తుంది. అయితే, మనం వాటి కోసం చైనాపైనే ఆధారపడాల్సిన పరిస్థితి’అని ఫార్మా ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఫార్మెక్సిల్) మాజీ డైరెక్టర్ జనరల్ ఉదయ్ భాస్కర్ అభిప్రాయపడ్డారు.స్టీల్: ట్రేడ్ వార్ మరింత ముదిరితే సరఫరా వ్యవస్థల్లో తీవ్ర కుదుపులకు ఆస్కారం ఉంది. వివిధ దేశాల నుంచి భారత్కు దిగుమతులు పోటెత్తే అవకాశం ఉందని, పరిస్థితులను నిశితంగా గమనించి చర్యలు చేపట్టాలని జేఎస్డబ్ల్యూ స్టీల్ సీఈఓ జయంత్ ఆచార్య పేర్కొన్నారు. చైనా స్టీల్ ఉత్పత్తి భారీగానే కొనసాగనున్న నేపథ్యంలో యూఎస్ దెబ్బకు ఇతరత్రా అందుబాటులో ఉన్న దేశాలకు ఎగుమతులను మళ్లించవచ్చని ఆర్సెలర్ మిట్టల్ వైస్–ప్రెసిడెంట్ రంజన్ ధార్ తెలిపారు.ఎలక్ట్రానిక్స్: చైనా ఉత్పత్తులపై అదనపు సుంకాలతో తక్షణం ప్రయోజనం పొందే రంగాల్లో ఇదొకటి. అయితే, తక్షణం దీని ప్రయోజనం పొందేలా పాలసీ రూపకర్తలు, పరిశ్రమ వర్గాలు చర్యలు తీసుకోవాలని భారతీయ సెల్యులర్, ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) చైర్మన్ పంకజ్ మొహింద్రూ వ్యాఖ్యానించారు. భారత్ను ఎగుమతి హబ్గా చేసుకుంటున్న యాపిల్తో పాటు మోటరోలా వంటి చైనా బ్రాండ్లు మన దగ్గరున్న టాటా ఎలక్ట్రానిక్స్, ఫాక్స్కాన్, డిక్సన్ వంటి తయారీదారుల నుంచి అమెరికాకు ఎగుమతులను మరింత పెంచే అవకాశం ఉంది. యాపిల్, శాంసంగ్ దన్నుతో 2024లో భారత్ నుంచి మొబైల్ ఫోన్ ఎగుమతులు రికార్డు స్థాయిలో 20.4 బిలియన్ డాలర్లకు దూసుకెళ్లాయి. ఇందులో యాపిల్ వాటా 65 శాతం కాగా (12.8 బిలియన్ డాలర్లు), శాంసంగ్ వాటా 20 శాతంగా (4 బిలియన్ డాలర్లు) ఉంది.దిగుమతులు, రూపాయి, స్టాక్ మార్కెట్కు దెబ్బ...ట్రేడ్ వార్ 2.0... ప్రపంచ దేశాల కరెన్సీ మార్కెట్లను సైతం కుదిపేస్తోంది. అనేక దేశాల కరెన్సీలతో డాలర్ విలువ మరింత బలపడుతోంది. డాలర్ ఇండెక్స్ ఇప్పటికే 110 స్థాయికి చేరింది. దీంతో మన రూపాయి విలువ కూడా అంతకంతకూ బక్కచిక్కిపోతోంది. తాజాగా డాలరు మారకంలో 87 కిందికి పడిపోయింది. ఒకపక్క, ఎగుమతిదారులకు కాస్త ఊరట లభించినప్పటికీ.. మన వాణిజ్యం ఇప్పటికీ లోటులోనే ఉన్న నేపథ్యంలో దిగుమతులు గుదిబండగా మారుతున్నాయి. ఇక అమెరికా టారిఫ్ల ప్రభావంతో ద్రవ్యోల్బణం పెంపు భయాలు పెరిగాయి.యూఎస్లోని సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్ల కోతకు బ్రేక్ ఇవ్వడంతో డాలర్ జోరుకు ఆజ్యం పోసినట్లయింది. ఈ ప్రభావంతో విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ) మన స్టాక్ మార్కెట్ నుండి పొలోమంటూ నిధులను వెనక్కి తీసేసుకుంటున్నారు. అక్టోబర్ నుంచి రివర్స్ గేర్లో ఉన్న ఎఫ్పీఐలు ట్రంప్ విజయం తర్వాత ఇంకాస్త జోరు పెంచారు. ఈ ఏడాది జనవరిలోనే రూ.87,000 కోట్ల విలువైన షేర్లను భారత్ మార్కెట్లలో విక్రయించడం విశేషం. దీంతో స్టాక్ సూచీలు ఇటీవలి గరిష్ట స్థాయిల నుంచి 10 శాతం పైగానే కుప్పకూలాయి. వెరసి టారిఫ్ వార్ దేశీ స్టాక్ మార్కెట్లకూ అతిపెద్ద ముప్పుగా మారుతోంది.భారత్–అమెరికా వాణిజ్య బంధం ఇలా...2023–24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశానికి అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. గతేడాది అమెరికాకు భారత ఎగుమతులు 77.51 బిలియన్ డాలర్లుగా ఉండగా, దిగుమతులు 42.2 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 35.31 బిలియన్ డాలర్ల వాణిజ్య మిగులు ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) ఏప్రిల్–అక్టోబర్ కాలంలో అమెరికాకు మన ఎగుమతులు 6.31 శాతం పెరిగి 47.24 బిలియన్ డాలర్లకు చేరుకోగా, దిగుమతులు 2.46 శాతం పెరిగి 26 బిలియన్ డాలర్లకు ఎగశాయి.అనుకూలం⇒ ఫార్మా – చైనాపై టారిఫ్ల నేపథ్యంలో మన జెనరిక్ కంపెనీలకు అవకాశాలు పెరుగుతాయి.⇒ టెలికం పరికరాలు – ఇతర దేశాలతో పోలిస్తే మన ఎగుమతులు జోరందుకుంటాయి.⇒ ఎలక్ట్రానిక్స్ – దేశీ తయారీ కంపెనీలకు అమెరికా మార్కెట్ మరింత అందుబాటులోకి వస్తుంది.⇒ టెక్స్టైల్స్ – భారతీయ కంపెనీలకు సమీప భవిష్యత్తులో ఆర్డర్లు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.⇒ ఫుడ్–అగ్రి ప్రోడక్టŠస్ – ఆహార, వ్యవసాయ రంగాలకు తక్షణ ప్రయోజనం.⇒ ఆటోమొబైల్ విడిభాగాలు – యూఎస్లో మన కంపెనీల ఎగుమతుల వాటా పెంచుకోవడానికి సదవకాశం.⇒ పెట్రోలియం ఉత్పత్తులు – ఎగుమతులు పుంజుకోవడానికి చాన్స్.⇒ ఐటీ సేవలు – రూపాయి పతనంతో మరింత ఆదాయం సమకూరుతుంది.ప్రతికూలం⇒ రూపాయి – డాలర్ భారీగా బలపడటంతో దేశీ కరెన్సీ విలువ మరింత పడిపోవచ్చు.⇒ స్టాక్ మార్కెట్ – విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలతో పెట్టబడులు తరలిపోయి.. మార్కెట్ ఇంకా పడిపోవచ్చు.⇒ ముడిచమురు – దిగుమతులు మరింత భారమై.. విదేశీ మారక నిల్వలు తగ్గిపోతాయి. ⇒ బంగారం – రూపాయి పతనంతో విదేశీ మార్కెట్తో పోలిస్తే ధరలు కొండెక్కవచ్చు.⇒ యంత్రపరికరాలు – దేశీ కంపెనీలు దిగుమతి చేసుకునే పరికరాలు, సామగ్రి ధరలు మరింత పెరుగుతాయి.⇒ వంటనూనెలు – భారత్ ఎక్కువగా దిగుమతులపై ఆధారపడటం వల్ల నూనె ధర మరింత హీటెక్కవచ్చు.⇒ ఎరువులు – వ్యవసాయానికి అవసరమైన ఎరువుల దిగుమతి భారమవుతుంది. -
ఫిబ్రవరి 7న ఏం జరగనుంది?.. అందరూ వెయిటింగ్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ 2025లో కొత్త పన్ను విధానం కింద రూ.12 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న వ్యక్తులు ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అంతే కాకుండా సీనియర్ సిటిజన్లకు TDS మినహాయింపు రూ. 50వేల నుంచి రూ. 1లక్షకు పెంచారు. ఇక త్వరలోనే రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను వెల్లడించనుంది.ఆర్బీఐ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని.. ద్రవ్య విధాన కమిటీ ఫిబ్రవరి 4 నుంచి కీలక చర్చలను నిర్వహించనుంది. మల్హోత్రా కీలక రేట్లలోని మార్పును ఫిబ్రవరి 7న ప్రకటించనున్నారు. ప్రస్తుతం అందరి చూపు దీనిపైనే ఉంది. ఆ రోజు BPS రేటు తగ్గే సూచనలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అంటే బెంచ్మార్క్ లెండింగ్ రేటు ప్రస్తుతం ఉన్న 6.5 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గే అవకాశం ఉంది.శక్తికాంత దాస్ పదవీ విరమణ తరువాత.. సంజయ్ మల్హోత్రా ఆర్బీఐ గవర్నర్ బాధ్యతలు స్వీకరించారు. మల్హోత్రా బాధ్యతలు స్వీకరించిన తరువాత జరగనున్న మొదటి ఎంపీసీ (Monetary Policy Committee) అవుతుంది. రేటు తగ్గింపు గురించి చాలా అంచనాలు ఉన్నప్పటికీ, సెంట్రల్ బ్యాంక్ పెంచడానికి క్లిష్టమైన చర్యలు తీసుకుంటోంది.ఇదీ చదవండి: బ్లాక్ బడ్జెట్ గురించి తెలుసా?: ఎప్పుడు ప్రవేశపెట్టారంటే..ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ చర్చలు ఫిబ్రవరి 4 నుంచి 7 మధ్య జరగనున్నాయి. రెపో రేటుకు సంబంధించి అధికారిక ప్రకటన ఫిబ్రవరి 7 ఉదయం 10:00 గంటలకు వెల్లడయ్యే అవకాశం ఉంది. గవర్నర్ మల్హోత్రా మధ్యాహ్నం 12:00 గంటలకు మీడియాను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రస్తుత భారత ఆర్థిక స్థితి, కేంద్ర బడ్జెట్ 2025పై తన ఆలోచనల వెనుక గల కారణాల గురించి మాట్లాడతారు. -
మధ్యతరగతి వర్గాలపై వరాల జల్లు
ఒక్క మాటలో చెప్పాలంటే సీతమ్మ కరుణించిందనే చెప్పాలి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిగురించిందనే అనాలి. త్వరలో కొత్త చట్టం తెస్తున్నట్లు చెప్పారు. అందులో ఏం ఉంటుందనే ఆతృత, ఉత్కంఠకు తెరదించుతూ, మధ్యతరగతి వర్గాలపై వరాల జల్లు కురిపించారు. ఆదాయ పన్నుకి సంబంధించి ముఖ్యమైన మార్పులు కొన్ని చేశారు. అవేమిటంటే.. ప్రస్తుతం రూ. 10 లక్షలు దాటితే 30 శాతం పన్ను ఉంటోంది. రూ. 10 లక్షలు దాటిన వారికి ఎంత ఉన్నా 30 శాతంగా ఉంది. ఈ పరిమితిని పెంచాలని డిమాండ్ వస్తోంది. తాజా మార్పుల వల్ల రూ. 24 లక్షల వరకు 30 శాతం చొప్పున పడదు. ఇది చాలా పెద్ద ఉపశమనం. బేసిక్ లిమిట్ని రూ. 4,00,000కు పెంచారు. ఇది చిన్న ఉపశమనంలాగా కనిపించినా. శ్లాబులు మార్చారుకొత్త శ్లాబులు, పన్ను రేట్లు ఇలా ఉంటాయి. ఈ మార్పుల వల్ల రూ. 12,00,000 ఆదాయం ఉన్నవారికి పన్నుభారం ఉండదు. రూ. 7 లక్షల నుంచి రూ. 12 లక్షలకు పెంచారు. చాలా సాహసోపేతమైన, గొప్ప నిర్ణయం. వేతనజీవులకు ఈ లిమిట్ను రూ. 12.75 లక్షలు చేశారు. వీరికి స్టాండర్డ్ డిడక్షన్ రూపంలో రూ. 75 వేలు మినహాయింపు లభిస్తుంది. ఇంత భారీ మినహాయింపు గతంలో ఎప్పుడూ, ఎవ్వరూ ఇవ్వలేదనే చెప్పాలి. సాహసం చేశారు. కొన్ని లక్షల మందికి పన్నుండదు. ఇంతకు తగ్గట్లుగా టీడీఎస్ విషయంలో చాలా మంచి మార్పులు తెచ్చారు. హేతుబద్ధత పేరున న్యాయం చేకూర్చారు. సీనియర్ సిటిజన్లకు వడ్డీ ఆదాయం మీద టీడీఎస్ వర్తింపును రూ. 1,00,000కు పెంచారు. చివరగా పన్నుభారం విషయంలో మార్పులు ఉండకపోయినా ఇది ముఖ్య ఉపశమనం. ఇంటికి అద్దె చెల్లించే విషయంలో సంవత్సరానికి రూ. 2,40,000 దాటితే టీడీఎస్ ఉంది. ఇక నుంచి టీడీఎస్ రూ. 6,00,000 దాటితేనే వర్తిస్తుంది. ఈ రోజుల్లో నగరంలో నెలకు అద్దె రూ. 20,000కు తక్కువ ఉండటం లేదు. ఓనర్లు మాకు బ్లాక్లో ఇవ్వండి అని పేచీ.. టీడీఎస్ వద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇకపై ఆ భయాల్లేవు. ఈ లిమిట్ని భారీగా పెంచినట్లు చెప్పవచ్చు. ఈ ఉపశమనంతో పాటు బ్లాక్ వ్యవహారాల జోలికి వెళ్లకుండా రాచమార్గంలో వెళ్లే అవకాశం కల్పించారు. మనలో చాలా మంది విదేశాల్లో కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం/సర్దుబాటు/బదిలీలు చేస్తుంటాం. ప్రస్తుతం ఏటా రూ. 7,00,000 దాటితే టీడీఎస్ కంపల్సరీ. ఆ లిమిట్ని ఇప్పుడు రూ. 10,00,000కు పెంచారు. అంతే కాకుండా విద్య నిమిత్తం ఎంతైనా పంపవచ్చు. టీడీఎస్ లేకుండా. అయితే, ‘‘సోర్స్’ మాత్రం రుణం రూపంలో ఉండాలి. ప్రస్తుతం ఒక ఇంటి మీద యాన్యువల్ వేల్యూ నిల్గా భావించవచ్చు. ఇక నుంచి ఈ జాబితాలో మరొక ఇల్లును జోడించారు. ఏతావతా రెండిళ్ల మీద మినహాయింపు పొందవచ్చు. రూల్సు మేరకు ఈ రెండూ లభ్యమవుతాయి. ఆర్థిక మంత్రి సీతారామన్గారు మినహాయింపులు పెంచకపోయినా, 80సీ మొదలైన సెక్షన్లలో మినహాయింపులు ముట్టుకోకపోయినా, వాటికి రెట్టింపు/మూడింతలు ఉపశమనం ఇచ్చారు. వినియోగం వైపు మధ్యతరగతి వాళ్లు మొగ్గు చూపేలా మార్గనిర్దేశం చేశారు. వచ్చే వారం మరిన్ని తెలుసుకుందాం.పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్ పంపించగలరు. -
యూఎస్ సుంకాలపై నిర్మలా సీతారామన్ స్పందన
అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ కెనడా, మెక్సికో, చైనా దేశాల దిగుమతులపై సుంకాలు విధించిన నేపథ్యంలో భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఓ మీడియా సమావేశంలో టారిఫ్లకు సంబంధించి అడిగిన అంశాలపై ఆమె సమాధానమిచ్చారు. అమెరికా ఇటీవల తీసుకున్న సుంకాల పెంపు నిర్ణయం వల్ల నేరుగా భారత్పై పరిణామాలను అంచనా వేయడం ప్రస్తుతం తొందరపాటు అవుతుందన్నారు. అయితే భారత్ అప్రమత్తంగా ఉందని, టారిఫ్ల అంశాలను నిశితంగా గమనిస్తున్నట్లు చెప్పారు.అమెరికా తాజాగా కెనడా, మెక్సికో దేశాలపై 25 శాతం, చైనా దిగుమతులపై 10 శాతం సుంకాలు విధించింది. ఈ సెగ భారత్కు సైతం తాకనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా విధించిన సుంకాలు ప్రభావం భారత్ కూడా ఎదుర్కొనే అవకాశం ఉందని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. ఈ వాణిజ్య సంఘర్షణ భారతీయ విధానకర్తలు, వ్యాపారుల్లో ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. ఈ తరుణంలో కేంద్రమంత్రి నిర్మతా సీతారామన్ మాట్లాడుతూ..‘అమెరికా కెనడా, మెక్సికో, చైనాలపై విధించిన సుంకాల ప్రభావం కచ్చితంగా భారత్పై ఎలా ఉంటుందో ప్రస్తుతం అంచనా వేయలేం. కానీ తప్పకుండా భారత్పై కొంత పరోక్ష ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే ఈ అంశానికి సంబంధించి భారత్ అన్నింటినీ గమనిస్తోంది. అప్రమత్తంగా ఉన్నాం’ అని స్పష్టం చేశారు. బడ్జెట్ అనంతర జరిగిన మీడియా సమావేశంలో కూడా నిర్మలా సీతారామన్ భారత్పై ఈ సుంకాల పరోక్ష ప్రభావాలను అంగీకరించారు.పరిశ్రమలకు ప్రోత్సాహంవాణిజ్య పరిధిని విస్తరించడం, ఆత్మనిర్భరత (స్వావలంబన-దేశీయ తయారీని ప్రోత్సహించడం)పై దృష్టి సారించడం వల్ల అమెరికా సుంకాల నుంచి ఎదురయ్యే ఊహించని సవాళ్ల ప్రభావాన్ని తగ్గించవచ్చని నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయంగా కొత్త మార్కెట్లను అన్వేషించడానికి పరిశ్రమలను ప్రోత్సహించడానికి ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (ఈసీజీసీ), ఎగ్జిమ్ బ్యాంక్ వంటి వాణిజ్య సంస్థలను బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు. నిత్యావసర సరుకులకు సంబంధించి దేశీయ ఉత్పత్తి సామర్థ్యాలను పెంచాలని భారత్ లక్ష్యంగా చేసుకుంది. ప్రపంచ సరఫరా గొలుసుల్లో ఏర్పడే అంతరాయాలను నిర్వహించడానికి స్థానిక పరిశ్రమలు బాగా సన్నద్ధమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: అమెరికా సుంకాలకు కారణాలు.. భారత్పై ప్రభావంటారిఫ్లు ఎందుకంటే..అక్రమ వలసలు, అమెరికాలోకి మాదకద్రవ్యాల ప్రవాహానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించే విస్తృత వ్యూహంలో భాగంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలను విధించాలని నిర్ణయించారు. ఈ టారిఫ్లు ప్రపంచ వాణిజ్యంపై గణనీయమైన ప్రభావాలను చూపుతాయని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, వ్యవసాయం వంటి పరిశ్రమలపై ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. -
అమెరికా సుంకాలకు కారణాలు.. భారత్పై ప్రభావం
అమెరికా ‘కంట్రీఫస్ట్’ విధానంతో ముందుకెళ్తోంది. అందులో భాగంగా కెనడా, మెక్సికో, చైనా దిగుమతులపై సుంకాలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. అమెరికా విధించిన సుంకాలను భారత్ కూడా ఎదుర్కొనే అవకాశం ఉందని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. ఈ వాణిజ్య సంఘర్షణ భారతీయ విధానకర్తలు, వ్యాపారుల్లో ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే అమెరికా కెనడా, మెక్సికో దేశాలపై 25 శాతం, చైనాపై 10 శాతం సుంకాలు విధించింది. ఈ సెగ భారత్కు సైతం తాకనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.అమెరికా, భారతదేశం చాలా సంవత్సరాలుగా సంక్లిష్టమైన వాణిజ్య సంబంధాన్ని కలిగి ఉన్నాయి. ఇరు దేశాల మధ్య కొన్ని అంశాలపై సహకారం ఉన్నా, కొన్నింటిపై వివాదాలున్నాయి. ఇటీవల ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO)లో ఇరు దేశాలు ఆరు దీర్ఘకాలిక వివాదాలను పరిష్కరించుకున్నాయి. ఇది ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి సానుకూల చర్యగా ఇరు వర్గాలు అభివర్ణించాయి. ఏదేమైనా, కొత్త సుంకాల భయం ప్రస్తుతం కీలకంగా మారుతుంది.టారిఫ్ భయాలకు కారణాలుముఖ్యంగా ఫార్మాస్యూటికల్స్, టెక్స్టైల్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి రంగాల్లో భారత్తో వాణిజ్య లోటుపై అమెరికా గళమెత్తింది. ఈ అసమతుల్యతలను పరిష్కరించడానికి, దేశీయ పరిశ్రమలను రక్షించడానికి సుంకాలను ఒక మార్గంగా చూస్తుంది. సుంకాలు విధించాలన్న అమెరికా నిర్ణయంలో ముఖ్యంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. భారత విదేశాంగ విధానాన్ని ప్రభావితం చేసే విస్తృత వ్యూహంలో భాగంగా అమెరికా ఆర్థిక ఒత్తిడి తీసుకురావాలని చూస్తోంది. విదేశీ పోటీ నుంచి దేశీయ పరిశ్రమలను రక్షించడానికి సుంకాలు అనుకూలమైన సాధనంగా అమెరికా పరిగణిస్తుంది. యూఎస్ ఆర్థిక ప్రయోజనాలకు ముప్పు పొంచి ఉందని భావిస్తే టారిఫ్ల విధానం భారత్కు విస్తరించే అవకాశం ఉంది.యూఎస్ సుంకాల వల్ల భారత్పై ప్రభావంఎగుమతుల క్షీణత: భారత ఎగుమతిదారులు, ముఖ్యంగా సుంకాల ద్వారా లక్ష్యంగా చేసుకున్న రంగాల్లో మార్కెట్ అవకాశాలు తగ్గడం, ఆదాయాలు క్షీణించడం వంటి ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఇది ఆ రంగాల్లో ఉపాధి, ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపుతుంది.ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు: దిగుమతి చేసుకున్న వస్తువులపై అధిక సుంకాలు భారతీయ వినియోగదారులకు ఖర్చులు పెరగడానికి దారితీస్తాయి. ఇది దేశంలో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లకు దోహదం చేస్తుంది.వాణిజ్య సంబంధాలు: టారిఫ్ల విధింపు ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను దెబ్బతీస్తుంది. ఇది ప్రతీకార చర్యలకు దారితీస్తుంది. రెండు ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీసే వాణిజ్య యుద్ధానికి తెరతీసే అవకాశం ఉంది.ఇదీ చదవండి: ఓపెన్ ఏఐ ‘డీప్ రీసెర్చ్’ ఆవిష్కరణఇప్పుడేం చేయాలంటే..సుంకాల ప్రభావాన్ని తగ్గించడానికి, దానివల్ల ఏర్పడే సమస్యలను పరిష్కరించడానికి భారత్, అమెరికా పరస్పర ప్రయోజనకరమైన విధానాలు అన్వేషించాలి. అందుకు ఇరు దేశాల మధ్య దౌత్య చర్చలు జరగాలని నిపుణులు సూచిస్తున్నారు. భారత్ ఇతర దేశాలతో వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకోవడం, ఎగుమతి మార్కెట్లను వైవిధ్యపరచడం కూడా అమెరికా మార్కెట్పై ఆధారపడటాన్ని తగ్గించేందుకు తోడ్పడుతుంది. -
జీఎస్టీ వసూళ్ల జోరు.. చాన్నాళ్లకు అత్యధికం
జనవరి నెలలో జీఎస్టీ (GST) వసూళ్లు మెరుగ్గా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే నెలలోని గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 12.3% అధికంగా రూ.1.96 లక్షల కోట్లు వసూలైనట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో దేశీ వస్తు, సేవల ద్వారా 10.4% అధికంగా రూ.1.47 లక్షల కోట్లు వసూలైంది. దిగుమతి చేసుకున్న వస్తువులపై జీఎస్టీ ఆదాయం 19.8% అధికంగా రూ.48,382 కోట్లు సమకూరింది. గతేడాది ఏప్రిల్ నుండి ఇవే అత్యధిక జీఎస్టీ వసూళ్లు కావడం విశేషం.మొత్తం జీఎస్టీ ఆదాయం జనవరి నెలకు రూ.1,95,506 కోట్లుగా ఉన్నట్టు ప్రభుత్వ ప్రకటన తెలిపింది. అదే నెలలో రూ.23,853 కోట్లు రిఫండ్లు జారీ చేసినట్టు, ఇది క్రితం ఏడాది ఇదే నెలలో పోల్చి చూసినప్పుడు 24% పెరిగినట్టు పేర్కొంది. రిఫండ్లను సర్దుబాటు చేసిన తర్వాత నికర ఆదాయం 1.72 లక్షల కోట్లు అని, ఇది 10.9% వృద్ధికి సమానమని వెల్లడించింది.జీఎస్టీ వసూళ్లు స్థిరంగా పెరుగుతుండడం ఆర్థిక వృద్ధి పుంజుకోవడానికి, వ్యాపార సంస్థల నిబంధనల అమలుకు నిదర్శనమని కేపీఎంజీ పరోక్ష పన్నుల హెడ్ అభిషేక్ జైన్ వ్యాఖ్యానించారు. రిఫండ్ల తర్వాత కూడా నికర వసూళ్లు అధికంగా ఉండడం ప్రశంసనీయమన్నారు.రాష్ట్రాల వారీగా..జనవరి నెలలో రాష్ట్రాల వారీగా జీఎస్టీ వసూళ్లలో మహారాష్ట్ర ముందుంది. రూ. 32,335 కోట్ల వసూళ్లతో అగ్ర స్థానంలో నిలిచింది. గుజరాత్ తర్వాత రూ. 12,135 కోట్లు, కర్ణాటక రూ. 14,353 కోట్లు, తమిళనాడు రూ. 11,496 కోట్లు, హర్యానా రూ. 10,284 కోట్లతో ఆ తర్వాత స్థానాలలో నిలిచాయి. ఇక అత్యల్ప జీఎస్టీ వసూళ్లలో చూసుకుంటే రూ. 1 కోటి వసూళ్లతో లక్షద్వీప్ అట్టడుగు స్థానంలో ఉంది. మణిపూర్ (రూ. 56 కోట్లు), మిజోరాం (రూ. 35 కోట్లు), అండమాన్ నికోబార్ దీవులు (రూ. 43 కోట్లు), నాగాలాండ్ (రూ. 65 కోట్లు) చివరి నుంచి తర్వాతి స్థానాలలో ఉన్నాయి. -
కొత్త పన్ను విధానంలోకి ఇక భారీగా..!
న్యూఢిల్లీ: తాజా బడ్జెట్లో తెరతీసిన ఆదాయ పన్ను భారీ రిబేట్లు కారణంగా కొత్త విధానంలోకి మరింత మంది వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు చేరతారని ప్రభుత్వం భావిస్తోంది. 90 శాతానికిపైగా పన్ను చెల్లింపుదారులు కొత్త విధానాన్ని ఎంపిక చేసుకోనున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) చైర్మన్ రవి అగర్వాల్ ఒక ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం 75 శాతంమంది కొత్త విధానంలో ఉన్నారు. ఆర్థిక మంత్రి సీతారామన్ రూ. 12 లక్షల వరకూ ఆదాయంపై పన్ను లేకుండా ప్రతిపాదించడంతో పలువురు కొత్త విధానంలోని మారనున్నట్లు తెలియజేశారు. పన్ను శ్లాబుల పునర్వ్యవస్థీకరణ సైతం ఇందుకు సహకరించనున్నట్లు పేర్కొన్నారు. ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వినియోగాన్ని మరింత పెంచడం ద్వారా మానవ జోక్యం లేని పన్నుల నిర్వహణకు ప్రభుత్వం, ఆదాయ పన్ను శాఖలు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు. ఆదాయాన్ని ప్రకటించడంలో సాధారణ పన్ను చెల్లింపుదారులకు సులభమైన పద్ధతులను అందుబాటులోకి తీసుకువచి్చనట్లు తెలియజేశారు. ఇందుకు ప్రవేశపెట్టిన సరళతర ఐటీఆర్–1, ముందస్తుగా నమోదయ్యే ఐటీ రిటర్నులు, మూలంవద్ద పన్ను(టీడీఎస్)లో ఆటోమాటిక్ మదింపు తదితరాలను ప్రస్తావించారు. మినహాయింపులు, తగ్గింపులవంటివి లేని నూతన పన్ను విధానంలో పన్ను చెల్లింపుదారులకు మదింపు మరింత సులభమవుతుందని పేర్కొన్నారు. వెరసి ఐటీ నిపుణుల అవసరంలేకుండానే ఐటీఆర్ను దాఖలు చేయవచ్చని తెలియజేశారు. -
ఇక ఆర్బీఐవైపు మార్కెట్ చూపు
ముంబై: లోక్సభలో వారాంతాన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు స్పందించనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. రంగాలవారీగా పెట్టుబడుల కేటాయింపులు, పథకాలు తదితర ప్రతిపాదనల ఆధారంగా స్టాక్స్ కదలికలు నమోదుకానున్నట్లు తెలియజేశారు. రూ. 12 లక్షలవరకూ ఆదాయంపై పన్ను చెల్లింపులు లేకపోవడంతో శనివారం ట్రేడింగ్లో వినియోగ రంగ కౌంటర్లు జోరు చూపాయి. బీమా రంగానికి బూస్ట్నిస్తూ ఇప్పటివరకూ 75 శాతంగా అమలవుతున్న ఎఫ్డీఐలను 100 శాతానికి పెంచుతూ బడ్జెట్లో ప్రతిపాదించారు. బడ్జెట్లో యువత, మహిళలు, రైతులకు సైతం మద్దతుగా పలు చర్యలు ప్రతిపాదించారు. ఈ బాటలో ఇన్వెస్టర్లు మరిన్ని రంగాలవైపు దృష్టిపెట్టనున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ వెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా అభిప్రాయపడ్డారు. వినియోగ రంగం మరింత జోరు చూపవచ్చని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా, యాక్సిస్ సెక్యూరిటీస్ సీఈవో, ఎండీ ప్రణవ్ హరిదాసన్ అంచనా వేశారు. 7న పాలసీ నిర్ణయాలు కొత్త ఏడాదిలో తొలిసారి పరపతి సమీక్షను చేపట్టనున్న రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం(7న) విధాన నిర్ణయాలను ప్రకటించనుంది. దాదాపు ఐదేళ్ల తదుపరి ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించవచ్చని మెహతా ఈక్విటీస్ రీసెర్చ్ సీనియర్ వీపీ ప్రశాంత్ తాప్సీ అంచనా వేస్తున్నారు. గత 11 సమావేశాలలో వడ్డీ రేట్లకు కీలకమైన రెపోను 6.5 శాతం వద్దే యథాతథంగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి కాలంలో రెపో రేటులో 2.5 శాతం కోతను అమలు చేసింది. రిటైల్ ధరల ఇండెక్స్(సీపీఐ) డిసెంబర్లో 4 నెలల కనిష్టం 5.22 శాతానికి దిగివచి్చంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 4 శాతానికి పరిమితంకానున్న అంచనాల నేపథ్యంలో ఈసారి ఆర్బీఐ రెపో రేటును పావు శాతం తగ్గించవచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. దిగ్గజాలు రెడీ ఈ ఏడాది(2024–25) మూడో త్రైమాసిక ఫలితాల సీజన్ ఇప్పటికే వేడెక్కింది. మరిన్ని దిగ్గజాలు ఈ వారం క్యూ3((అక్టోబర్–డిసెంబర్) ఫలితాలు విడుదల చేయనున్నాయి. జాబితాలో ఏషియన్ పెయింట్స్, అపోలో టైర్స్, భారతీ ఎయిర్టెల్, ఐటీసీ, ఎస్బీఐ, ఎంఅండ్ఎం, ఎల్ఐసీ, టైటన్, ఎన్హెచ్పీసీ, టాటా పవర్, పీసీ జ్యువెలర్స్ తదితరాలున్నాయి. పనితీరు ఆధారంగా ఇన్వెస్టర్లు వివిధ స్టాక్స్లో పొజిషన్లు తీసుకునే వీలున్నట్లు మార్కెట్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకోనున్నట్లు ఏంజెల్ వన్ డెరివేటివ్స్ సీనియర్ విశ్లేషకులు ఓషో కృష్ణన్ పేర్కొన్నారు.ఇతర అంశాలు ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలకూ మార్కెట్లో ప్రాధాన్యత ఉన్నట్లు నిపుణులు పేర్కొన్నారు. రూపాయి ఇటీవల బలహీనపడుతుంటే చమురు ధరలు పటిష్టంగా కదులుతున్నాయి. మరోపక్క యూఎస్ డాలరు, ట్రెజరీ ఈల్డ్స్ మరింత పుంజుకుంటే సెంటిమెంటుపై ప్రభావంపడే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే దేశీ స్టాక్స్లో విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) అమ్మకాలకు మొగ్గు చూపుతున్నారు. జనవరిలో ఎఫ్పీఐలు 8 బిలియన్ డాలర్ల విలువైన స్టాక్స్ విక్రయించినట్లు అంచనా. గత వారమిలాగత వారం(జనవరి 27–ఫిబ్రవరి1) దేశీ స్టాక్ మార్కెట్లు జోరు చూపాయి. సెన్సెక్స్ నికరంగా 1,316 పాయింట్లు(1.7 శాతం) బలపడి 77,506 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 390 పాయింట్లు(1.7 శాతం) పుంజుకుని 23,482 వద్ద స్థిరపడింది. కాగా.. ఎఫ్పీఐల అమ్మకాల కారణంగా జనవరిలో సెన్సెక్స్, నిఫ్టీ 3.5 శాతం క్షీణించగా.. మిడ్, స్మాల్ క్యాప్స్ 9 శాతం చొప్పున పతనమయ్యాయి. -
ఇది ప్రజల బడ్జెట్!!
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజల బడ్జెట్ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. అమెరికా దివంగత అధ్యక్షుడు అబ్రహాం లింకన్ వ్యాఖ్యను ఉటంకిస్తూ.. ‘ఇది ప్రజాభిప్రాయంతో, ప్రజల కోసం, ప్రజలు రూపొందించుకున్న బడ్జెట్‘గా అభివర్ణించారు. పన్నులపరంగా కొత్త రేట్లతో మధ్యతరగతికి గణనీయంగా ఊరట లభిస్తుందని ఆమె చెప్పారు. ‘వారి చేతిలో మరింతగా డబ్బు మిగులుతుంది. దీంతో వినియోగం, పొదుపు, పెట్టుబడులు పెరుగుతాయి‘ అని వివరించారు. రేట్ల కోత ఆలోచనకు ప్రధాని నరేంద్ర మోదీ పూర్తిగా మద్దతునిచ్చినప్పటికీ, బ్యూరోక్రాట్లను ఒప్పించేందుకే సమయం పట్టిందని మంత్రి వివరించారు. ద్రవ్యోల్బణంపరంగా ప్రతికూల ప్రభావాలను తగ్గించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని నిజాయితీగా పన్నులు చెల్లించే మధ్యతరగతి వర్గాలు కోరుకుంటున్న నేపథ్యంలో ఆ బాథ్యతను ప్రధాని తనకు అప్పగించారని ఆమె పేర్కొన్నారు. పన్నుపరంగా ఉపశమనం కల్పించేందుకు ప్రధాని సత్వరం అంగీకరించినప్పటికీ ఆర్థిక శాఖ, కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) అధికారులను ఒప్పించడానికి సమయం పట్టిందని చెప్పారు. సంక్షేమ పథకాలు, ఇతర స్కీములకు అవసరమైన ఆదాయాన్ని వసూలు చేసే బాధ్యత వారిపై ఉండటమే ఇందుకు కారణమని తెలిపారు. డాలరుతో పోలిస్తే తప్ప రూపాయి పటిష్టంగానే ఉంది.. బలోపేతమవుతున్న అమెరికా డాలరుతో పోలిస్తే మాత్రమే రూపాయి మారకం విలువ క్షీణించిందని, మిగతా కరెన్సీలతో పోలిస్తే స్థిరంగానే ఉందని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. స్థూల ఆర్థికమూలాలు పటిష్టంగా ఉండటమే ఇందుకు కారణమని ఆమె చెప్పారు. స్వల్ప వ్యవధిలో డాలరుతో పోలిస్తే రూపాయి 3 శాతం పడిపోవడం వల్ల దిగుమతులకు మరింతగా చెల్లించాల్సి రానుండటం ఆందోళన కలిగించే విషయమే అయినా, దేశీ కరెన్సీ అన్ని రకాలుగా బలహీనపడిందనే విమర్శలు ఆమోదయోగ్యం కావని తెలిపారు. మరోవైపు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయాలను రూ. 10.18 లక్షల కోట్ల నుంచి రూ. 11.21 లక్షల కోట్లకు నామమాత్రంగా పెంచడంపై స్పందిస్తూ.. కేవలం అంకెలను కాకుండా ఎంత సమర్థ్ధవంతంగా ఖర్చు చేస్తున్నారనేది చూడాలని మంత్రి చెప్పారు. ఏడాదిగా కసరత్తు.. గతేడాది జూలైలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచే పన్ను కోతల అంశంపై కసరత్తు జరుగుతోందని నిర్మలా సీతారామన్ తెలిపారు. తాము నిజాయితీగా పన్నులు కడుతున్నప్పటికీ, దానికి తగ్గట్లుగా తమ సమస్యల పరిష్కారానికి చర్యలు ఉండటం లేదని మధ్యతరగతి ప్రజల్లో అభిప్రాయం వ్యక్తమవుతున్న విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు ఆమె చెప్పారు. ‘మీరేం చేయగలరో చూడండి అని ప్రధాని నాకు సూచించారు. ప్రజల కోసం ఏదైనా చేయాలనే విషయంలో ఆయన స్పష్టంగానే ఉన్నారు. కాకపోతే ఆర్థిక శాఖ, సీబీడీటీ అధికారులను ఒప్పించడానికి సమయం పట్టింది. ఇలా చేయడం వల్ల తలెత్తే ప్రభావాల గురించి వారు నాకు తరచుగా గుర్తు చేసేవారు. వారిని తప్పుపట్టడానికి లేదు. ఎందుకంటే ఆదాయాన్ని సమకూర్చాల్సిన బాధ్యత వారిపై ఉంది. అయితే, అంతిమంగా అందరూ ఒక అభిప్రాయానికి రావడంతో ఇది సాధ్యపడింది‘ అని మంత్రి వివరించారు. ప్రస్తు తం దేశంలో 8.65 కోట్ల మంది ఆదాయ పన్ను రిటర్నులను దాఖలు చేస్తున్నారని, టీడీఎస్ వర్తిస్తున్నా రిటర్నులను ఫైలింగ్ చేయని వారి సంఖ్యను కూడా కలిపితే ఇది 10 కోట్లు దాటుతుందని వివరించారు. -
ఇక జీఎస్టీ రేట్లలోనూ భారీ మార్పులు?
ఆదాయపు పన్నులో సంస్కరణలు తీసుకొస్తున్న కేంద్ర ప్రభుత్వం వస్తు సేవల పన్ను (GST)లోనూ భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. కేంద్ర బడ్జెట్లో (Union Budget 2025-26) ఆదాయపు పన్ను (Income Tax) రేట్లను హేతుబద్ధీకరించిన తర్వాత, జీఎస్టీ రేట్లను కూడా ప్రభుత్వం హేతుబద్ధీకరించాలని చూస్తోందని వార్తా సంస్థ మనీకంట్రోల్ వెల్లడించింది.ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, అన్ని రాష్ట్రాలను బోర్డులోకి తీసుకురావడానికి కేంద్రం కృషి చేస్తుందని సంబంధిత వర్గాలు చెప్పినట్లు పేర్కొంది. "జీఎస్టీని హేతుబద్ధీకరించడానికి ఇప్పటికే ప్రక్రియ కొనసాగుతోంది. ఏవైనా మార్పులను ఖరారు చేయడానికి ముందు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయాన్ని తీసుకోవాలనుకుంటున్నాం" అని విషయం గురించి తెలిసిన వ్యక్తొకరు చెప్పినట్లుగా పేర్కొంది.ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజా బడ్జెట్లో రూ.12 లక్షలలోపు ఆర్జించేవారికి ఆదాయపు పన్ను నుండి మినహాయించడం ద్వారా మధ్యతరగతి ప్రజలను దాదాపు గణనీయమైన ఉపశమనాన్ని అందించారు. అలాగే ఇతరులకు కూడా పన్ను స్లాబ్లను సర్దుబాటు చేశారు. ఈ మార్పుల వల్ల ప్రభుత్వం రూ. 1 లక్ష కోట్ల ఆదాయాన్ని వదులుకోనుందని ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో వెల్లడించారు.ఇప్పటికే ఏకాభిప్రాయంజీఎస్టీ రేటు హేతుబద్ధీకరణను పరిశీలించేందుకు ప్రభుత్వం మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. గత డిసెంబరులో ఈ ప్యానెల్ దాదాపు 150 వస్తువులపై పన్ను రేట్లను సవరించడంపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. 2017 జూలైలో ఈ పరోక్ష పన్ను విధానం అమలులోకి వచ్చినప్పటి నుండి జీఎస్టీ రేటు విధానం అనేక సవరణలకు గురైంది. ప్రారంభంలో 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం ఇలా.. నాలుగు ప్రాథమిక పన్ను స్లాబ్లతో జీఎస్టీ విధానాన్ని రూపొందించగా వాటి పరిధిలోకి వచ్చే వివిధ వస్తువులను కాలానుగుణంగా పలు సర్దుబాటు చేశారు.భిన్న పన్ను స్లాబ్లు వర్గీకరణ వివాదాలు, సమ్మతి సవాళ్లను సృష్టిస్తాయని వాదిస్తూ సరళమైన జీఎస్టీ విధానం కోసం ఆర్థికవేత్తలు చాలాకాలంగా వాదిస్తున్నారు. పన్ను సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, వ్యాపారాన్ని సులభతరం చేయడానికి హేతుబద్ధీకరణ చర్యను పరిశ్రమ నాయకులు కూడా ఆశిస్తున్నారు. కస్టమ్స్ సుంకాలను తగ్గించాలని ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయం కూడా పన్ను విధానాన్ని మరింత బిజినెస్ ఫ్రెండ్లీగా మార్చడానికి ఒక అడుగుగా పరిగణిస్తున్నారు. కేంద్రం, రాష్ట్రాల ప్రతినిధులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్.. రాబోయే సమావేశాలలో రేట్ల హేతుబద్ధీకరణ కోసం తుది రోడ్మ్యాప్పై చర్చిస్తుందని భావిస్తున్నారు. -
ఖజానాకు చేరిన గత బడ్జెట్ కేటాయింపులు
భారత ప్రభుత్వం 2025-26 బడ్జెట్ను కేటాయించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను కొన్ని శాఖలు పూర్తిస్థాయిలో అప్పటి బడ్జెట్ నిధులను ఉపయోగించలేదు. మూలధన పెట్టుబడులు, వస్తువుల కొనుగోళ్లలో జాప్యం కారణంగా కొంతమేర నిధులు బూ తిరిగి ఖజానాకు చేరాయి. ఏయే విభాగాలు ఎంతమేరకు ఇలా నిధులు తిరిగి పంపాయో.. అందుకుగల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.కొన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు తమకు కేటాయించిన బడ్జెట్ను 2024-25 ఆర్థిక సంవత్సరంలో పూర్తిస్థాయిలో వినియోగించుకోలేదు. కొనుగోలు ప్రక్రియల్లో జాప్యం, ఇతర బ్యూరోక్రాటిక్ అడ్డంకుల కారణంగా రక్షణ మంత్రిత్వ శాఖ రూ.12,500 కోట్లు తిరిగి కేంద్ర ఖజానాకు జమ చేసింది. ప్రభుత్వం కఠినమైన ఆర్థిక విధానాలు, మెరుగైన ఆర్థిక నిర్వహణ పద్ధతుల ద్వారా భారీగా ఖర్చు చేయడాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఖర్చులను ఆదాయ ఉత్పత్తికి అనుగుణంగా ఉండేలా చూసుకుంటున్నాయి. ఇది ఆర్థిక జాప్యాన్ని నివారించడానికి, సమతుల్య బడ్జెట్ను నిర్వహించడానికి తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: 100 మంది వాట్సప్ యూజర్లపై స్పైవేర్ దాడి..?మెరుగైన పన్ను వసూలు యంత్రాంగాలు, పన్ను ఎగవేతను అరికట్టడంతో సహా సమర్థమైన ఆదాయ సమీకరణ ప్రయత్నాల వల్ల కొంత బడ్జెట్ను మిగిల్చింది. కొన్ని అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, విదేశీ ప్రభుత్వాల మద్దతు వల్ల ద్రవ్యలోటును నిర్వహించడానికి, బడ్జెట్ అమలు సజావుగా జరిగేలా చూడటానికి సాయపడిందని నిపుణులు తెలియజేస్తున్నారు. నిధుల రాబడి, ఆర్థిక క్రమశిక్షణ, సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణ పట్ల ప్రభుత్వం నిబద్ధతతో ఉందని చెబుతున్నారు. -
డివిడెండ్@రూ.2.56లక్షల కోట్లు
కేంద్ర బ్యాంకు ఆర్బీఐ సహా ప్రభుత్వ రంగ ఫైనాన్షియల్ సంస్థల నుంచి కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆర్థిక సంవత్సరం(2025–26)లో రూ.2.56 లక్షల కోట్లు డివిడెండ్గా అందనున్నట్లు తాజా బడ్జెట్ అంచనా వేసింది. ప్రస్తుత ఏడాది(2024–25)లో డివిడెండ్, మిగులు ద్వారా రూ. 2.34 లక్షల కోట్లమేర లభించనున్నట్లు అభిప్రాయపడింది. గత అంచనాలకంటే ఇది రూ.1,410 కోట్లు ఎక్కువకాగా.. వచ్చే ఏడాది ఇవి మరింత బలపడనున్నట్లు ఆర్థిక శాఖ భావిస్తోంది. ఇక ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర పెట్టుబడుల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి అందనున్న మొత్తం వసూళ్లు రూ.3.25 లక్షల కోట్లను తాకనున్నట్లు అంచనా. గతంలో నమోదైన రూ.2.89 లక్షల కోట్లను దాటనున్నాయి.ఎల్రక్టానిక్స్ ప్రాజెక్టులకు రూ.18,000కోట్లువచ్చే ఆర్థిక సంవత్సరంలో కీలకమైన టెక్నాలజీ ప్రాజెక్టులకు కేటాయింపులను 84 శాతం అధికంగా రూ. 18,000 కోట్లకు పెంచినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మొబైల్ ఫోన్లు, ఐటీ హార్డ్వేర్, సెమీకండక్టర్లు మొదలైన వాటి తయారీని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం, ఇండియాఏఐ మిషన్ మొదలైనవి వీటిలో ఉన్నాయి. మొత్తం మీద ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖకు కేటాయింపులు 48 శాతం పెరిగి రూ.17,566 కోట్ల నుంచి రూ.26,026 కోట్లకు చేరాయి.ఇదీ చదవండి: రూ.13 లక్షలు ఆదాయం ఉంటే ట్యాక్స్ ఇలా..అత్యధికంగా మొబైల్ ఫోన్ల తయారీకి సంబంధించిన లార్జ్ స్కేల్ ఎల్రక్టానిక్స్ మాన్యుఫాక్చరింగ్ పీఎల్ఐకి రూ. 8,885 కోట్లు కేటాయించారు. యాపిల్ ఉత్పత్తుల తయారీ సంస్థలు ఫాక్స్కాన్, టాటా ఎలక్ట్రానిక్స్ మొదలైనవి ఈ పథకం లబ్ధిదార్లుగా ఉన్నాయి. మరోవైపు, సెమీ కండక్టర్ ప్రాజెక్టులకు కేటా యింపులు, సవరించిన అంచనాలకు దాదాపు రెట్టింపై, దాదాపు రూ. 2,500 కోట్లకు చేరాయి. ఇండియాఏఐ మిషన్కి కేటాయింపులు 11 రెట్లు పెరిగి రూ. 2,000 కోట్లకు చేరాయి. డిజైన్ ఆధారిత ప్రోత్సాహక పథకానికి రెట్టింపు స్థాయిలో రూ. 200 కోట్లు కేటాయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎలక్ట్రానిక్ రంగ ప్రాజెక్టులకు కేటాయింపులను రూ. 9,766 కోట్లకు సవరించారు. -
కస్టమ్స్ టారిఫ్లు ఇక ‘ఎనిమిదే’
బేసిక్ కస్టమ్స్ డ్యూటీలను కేవలం ‘ఎనిమిదింటికి’ పరిమితం చేస్తున్నట్టు బడ్జెట్లో ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రతిపాదించారు. అయినప్పటికీ సెస్సును సర్దుబాటు చేయడం ద్వారా చాలా వస్తువులపై నికర సుంకాలను ప్రస్తుతం మాదిరే కొనసాగించే విధంగా ఈ మార్పులు చేయడం గమనార్హం. 2025–26 బడ్జెట్లో మొత్తం మీద ఏడు టారిఫ్లను తొలగించారు. 2023–24లోనూ ఇదే మాదిరిగా ఏడు టారిఫ్లను ఎత్తివేశారు. దీంతో ఇప్పుడు ‘సున్నా’ రేటు సహా మొత్తం ఎనిమిది రేట్లే మిగిలాయి. ఇది సులభతర వ్యాపార నిర్వహణకు అనుకూలిస్తుందన్నది ప్రభుత్వ ఉద్దేశ్యంగా ఉంది. దీంతో పెద్ద సంఖ్యలో ఉన్న టారిఫ్ల గందరగోళానికి తెరదించినట్టయింది. డెలాయిట్ ఇండియా పార్ట్నర్ హర్ప్రీత్ సింగ్ స్పందిస్తూ.. బడ్జెట్లో 25 శాతం, 30 శాతం, 35 శాతం, 40 శాతం టారిఫ్లను విలీనం చేసి 20 శాతానికి మార్చినట్టు.. సబ్బులు, ప్లాస్టిక్, కెమికల్స్, పాదరక్షలకు ఇది వర్తిస్తుందని చెప్పారు. అలాగే 100 శాతం, 125 శాతం, 150 శాతం టారిఫ్లను 70 శాతం టారిఫ్లో విలీనం చేసినట్టు తెలిపారు. లేబరేటరీ కెమికల్స్, ఆటోమొబైల్స్కు ఇది అమలవుతుందన్నారు. -
ఐఎఫ్ఎస్సీలో కార్యకలాపాలకు ఊతం..
ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ సెంటర్లో (ఐఎఫ్ఎస్సీ) కార్యకలాపాలకు ఊతమిచ్చే విధంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో పలు ప్రతిపాదనలు చేశారు. షిప్ లీజింగ్ యూనిట్లు, అంతర్జాతీయ కంపెనీలు ఏర్పాటు చేసే బీమా ఆఫీసులు, ట్రెజరీ కార్యాలయాలకు ప్రయోజనాలను కల్పించే ప్రణాళికలు వీటిలో ఉన్నాయి. పలు పన్ను మినహాయింపుల గడువును 2030 మార్చి వరకు వరకు పొడిగించారు. వాస్తవానికి కొన్ని మినహాయింపులు ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ముగిసిపోనున్నాయి. మరోవైపు, ఐఎఫ్ఎస్సీలోని ట్రెజరీ సెంటర్లకు సంబంధించి డివిడెండ్ నిర్వచనం క్రమబద్ధీకరణ, ఫండ్ మేనేజర్లకు సరళతరమైన విధానాలను కూడా బడ్జెట్లో కేంద్రం ప్రతిపాదించింది. అంతర్జాతీయంగా ఆర్థిక సేవల రంగంలో భారత్ పురోగమించేందుకు ఇవి దోహదపడగలవని గిఫ్ట్ సిటీ ఎండీ తపన్ రే తెలిపారు. పన్ను ప్రయోజనాల గడువు పొడిగించడం వల్ల ఇన్వెస్టర్లకు దీర్ఘకాలికంగా ఒక స్పష్టత లభిస్తుందని ధృవ అడ్వైజర్స్ పార్ట్నర్ ఆదిత్య హన్స్ చెప్పారు. -
జీఎస్టీలో కొత్త సవరణలు..
పన్నులు ఎగవేసేందుకు ఆస్కారమున్న ఉత్పత్తులను ట్రాక్ చేసేందుకు ఉపయోగపడేలా ‘ట్రాక్ అండ్ ట్రేస్’ నిబంధన సహా వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) విధానంలో కేంద్ర బడ్జెట్ పలు సవరణలు ప్రతిపాదించింది. ఈ నిబంధన అమలు కోసం విశిష్ట గుర్తింపు మార్కింగ్కు నిర్వచనం ఇస్తూ సెంట్రల్ జీఎస్టీ చట్టంలో కొత్త నిబంధన చేర్చింది. ప్రత్యేకమైన, సురక్షితమైన, తొలగించడానికి వీలుకాని విధంగా ఉండే డిజిటల్ స్టాంప్, డిజిటల్ మార్క్ లేదా ఆ కోవకు చెందిన ఇతరత్రా గుర్తులు ‘విశిష్ట గుర్తింపు మార్కింగ్’ కిందికి వస్తాయి. సరఫరా వ్యవస్థను మెరుగ్గా పర్యవేక్షించడానికి, వ్యాపారవర్గాలను డిజిటైజేషన్ వైపు మళ్లించడానికి ఇలాంటి చర్యలు దోహదపడగలవని ఏఎంఆర్జీ అండ్ అసోసియేట్స్ సీనియర్ పార్ట్నర్ రజత్ మోహన్ తెలిపారు. -
టీడీఎస్ ఖుషి
న్యూఢిల్లీ: వ్యక్తిగత ఆదాయపన్ను పరంగా భారీ ఊరటనిచ్చిన కేంద్ర సర్కారు, మరోవైపు అద్దె చెల్లింపులపై టీడీఎస్, విదేశీ రెమిటెన్స్ల్లోనూ ఊరట కల్పించింది. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 194–ఐ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో సంస్థల మధ్య అద్దె చెల్లింపులు రూ.2.40 లక్షలు మించితే కిరాయిదారు మూలం వద్దే పన్ను (టీడీఎస్) మినహాయించాల్సి ఉంటుంది. తాజాగా ఈ పరిమితిని రూ.6 లక్షలకు (నెలవారీ అయితే రూ.50,000) పెంచుతున్నట్టు ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రకటించారు. ఎవరికి ప్రయోజనం..?తాజా ప్రతిపాదన ప్రధానంగా వ్యాపార సంస్థలకు ఊరటగా చెప్పుకోవాలి. ప్రస్తుతం వ్యక్తులు, హెచ్యూఎఫ్లకు కిరాయి చెల్లింపులు నెలవారీ రూ.50,000 (వార్షికంగా రూ.6లక్షలు) మించినప్పుడు 5 శాతం టీడీఎస్ అమలవుతోంది. అదే వ్యాపార సంస్థలు/ట్రస్ట్లు/ఎన్జీవోలు తదితర వర్గాలకు వార్షిక అద్దె రూ.2.4 లక్షలు మించినప్పుడే టీడీఎస్ అమలవుతోంది. ఇప్పుడు వ్యక్తులు, హెచ్యూఎఫ్ల మాదిరే సంస్థలకూ టీడీఎస్ అమలు పరిమితిని నెలవారీ రూ.50,000కు పెంచారు. మరింత స్పష్టత, ఏకరూపత కోసం ఈ చర్య తీసుకున్నట్టు మంత్రి సీతారామన్ తెలిపారు. ‘‘భూమి లేదా మెషినరీని కొన్ని నెలల కోసం అద్దెకు ఇచ్చినప్పుడు, నెలవారీ అద్దె రూ.50,000 మించితే టీడీఎస్లు అమలు చేయాల్సి వస్తుంది’’అని డెలాయిట్ ఇండియా ఆర్తి రాటే తెలిపారు. తక్కువ పన్ను చెల్లించే వారు, భూ/భవన యజమానులకు ఈ పెంపు ప్రయోజనం కల్పిస్తుందని క్రెడాయ్–ఎంసీహెచ్ఐ ప్రెసిడెంట్ డొమినిక్ రామెల్ అభిప్రాయపడ్డారు. కోటి మంది పన్ను కట్టక్కర్లేదు: సీతారామన్ ఐటీ శ్లాబుల్లో మార్పులు చేయడం ద్వారా ప్రజల చేతుల్లో పెద్ద ఎత్తున ఆదాయాన్ని మిగిల్చినట్టు ఆర్థిక మంత్రి సీతారామన్ వ్యాఖ్యానించారు. ‘‘రూ.12 లక్షలకు ఆదాయపన్ను మినహాయింపును పెంచడం వల్ల మరో కోటి మంది ప్రజలు పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. ప్రజల డిమాండ్లకు ప్రభుత్వం స్పందన ఇది. మధ్య తరగతికి ప్రయోజనం కల్పించేందుకు పన్ను రేట్లను తగ్గించాం’’అని మంత్రి ప్రకటించారు. కొత్తగా సులభతర ఆదాయపన్ను చట్టం కొత్త ఆదాయపన్ను బిల్లును వచ్చే వారం పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్టు మంత్రి సీతారామన్ తెలిపారు. ప్రస్తుతమున్న ఆరు దశాబ్దాల క్రితం నాటి ‘ఆదాయపన్ను చట్టం 1961’ స్థానంలో దీన్ని తీసుకొస్తున్నట్టు చెప్పారు. ‘ముందు విశ్వసించండి. తర్వాత పరిశీలించండి’ అన్న భావనతో ‘న్యాయ’ స్ఫూర్తితో ఈ బిల్లు ఉంటుందన్న సంకేతం ఇచ్చారు. ‘‘కొత్త బిల్లు చాలా స్పష్టతతో, చాప్టర్లు, పదాల పరంగా ప్రస్తుత చట్టంతో పోల్చి చూసినప్పుడు సగం పరిమాణంలోనే ఉంటుంది. పన్ను చెల్లింపుదారులు, పన్ను అధికారులు అర్థం చేసుకునేంత సరళంగా ఉంటుంది. ఫలితంగా పన్నుల స్పష్టత ఏర్పడి, వివాదాలు తగ్గిపోతాయి’’అని మంత్రి వివరించారు. కొత్త ఆదాయపన్ను బిల్లును స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపిస్తామని చెప్పారు. రూ.10 లక్షలు మించితేనే రెమిటెన్స్లపై టీసీఎస్ఆర్బీఐ లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ కింద విదేశాలకు పంపుకునే నిధుల(రెమిటెన్స్/చెల్లింపులు)పై టీసీఎస్లో మార్పు చోటుచేసుకుంది. ఏడాదిలో రూ.7లక్షలు మించితే మూలం వద్దే పన్ను వసూలు (టీసీఎస్) ప్రస్తుతం అమల్లో ఉండగా, దీన్ని రూ.10 లక్షలకు పెంచుతున్నట్టు ఆర్థిక మంత్రి ప్రకటించారు. నిర్దేశిత ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్ నుంచి రుణం తీసుకుని విదేశీ విద్య కోసం పంపుకునే రెమిటెన్స్లపై టీసీఎస్ను తొలగిస్తున్నట్టు చెప్పడం విద్యార్థుల తల్లిదండ్రులకు మరింత ఊరటనిచ్చేదే. విదేశాల్లో చదువు కోసం, ఇతర అవసరాల కోసం వెళ్లిన వారికి నిధుల అవసరం ఏర్పడొచ్చు. అలాంటప్పుడు స్వదేశం నుంచి వారికి సులభంగా నిధులు పంపుకునేందుకు ఆర్బీఐ లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ వీలు కల్పిస్తుంది. వచ్చే ఐదేళ్లలో 75,000 మెడికల్ సీట్లు పెంచనున్నట్టు ప్రకటించడం స్వాగతించదగిన నిర్ణయం. వైద్య విద్య, ఆరోగ్య సంరక్షణలో పరిశోధన, మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. తద్వారా విద్యార్థులు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందించడానికి అవసరమైన నైపుణ్యాలు అందుకుంటారు. అప్పుడే పెరిగిన మెడికల్ సీట్ల ప్రయోజనాలను నిజంగా పొందగలం. కామినేని శశిధర్ఎండి, కామినేని హాస్పిటల్స్సిమెంట్ రంగ వృద్ధికి..హౌసింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులపై పెరిగిన కేటాయింపులు నిర్మాణ సామగ్రికి డిమాండ్ను పెంచుతాయి. అలాగే సామర్థ్య విస్తరణకు దారితీస్తుంది. రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాలపై పెరిగిన పెట్టుబడులతో సిమెంట్ రంగ వృద్ధికి అవకాశాలు విస్తరిస్తాయి. సవాళ్లు ఉన్నప్పటికీ సిమెంట్ పరిశ్రమ స్థాపిత తయారీ సామర్థ్యం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6 శాతం కంటే ఎక్కువ స్థిర వార్షిక వృద్ధి రేటును సాధించడానికి ఈ చర్యలు మద్దతు ఇస్తాయి. – నీరజ్ అఖౌరీ, ప్రెసిడెంట్, సిమెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్.మెడికల్ టూరిజంకు బూస్ట్..దేశీయంగా ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను పటిష్టం చేసే దిశగా బడ్జెట్లో ప్రతిపాదనలు ఉన్నాయి. మెడికల్ టూరిస్టులకు వీసా–ఆన్–అరైవల్ సదుపాయాన్ని ప్రవేశపెట్టడంతో హెల్త్కేర్ గమ్యస్థానంగా భారత్ బలోపేతం అవుతుంది. ప్రజారోగ్యం, ఆర్థిక వృద్ధిపై చిత్తశుద్ధిని ప్రతిబింబించేలా బడ్జెట్ ఉంది. – బి. భాస్కర్ రావు, సీఎండీ, కిమ్స్పోటీతత్వాన్ని పెంచడానికి.. ప్రైవేట్ రంగంలో మూలధనాన్ని సానుకూల దిశలో కేటాయించడాన్ని ప్రోత్సహిస్తుంది. ప్రపంచం కోసం మేక్ ఇన్ ఇండియా అనే అంశం ఈ బడ్జెట్లో కీలకంగా ఉంది. తయారీ ఖర్చులను తగ్గించే ప్రయత్నాలు దేశం యొక్క ప్రపంచ పోటీతత్వాన్ని గణనీయంగా పెంచడానికి సిద్ధంగా ఉన్నాయి. – అనీష్ షా, సీఈఓ, ఎండీ, మహీంద్రా గ్రూప్.ఈవీల ఉత్పత్తికి బాసట.. బ్యాటరీ తయారీకి కీలక ముడిపదార్థాలపై దిగుమతి సుంకాలు తొలగించడం దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని పెంచుతుంది. స్థిర పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహిస్తుంది. పర్యావరణ అనుకూల ఆర్థిక వ్యవస్థకు భారతదేశాన్ని మార్చడానికి ఒక వ్యూహాత్మక చర్య. – గిరీష్ వాఘ్, ఈడీ, టాటా మోటార్స్. ఉద్యోగాలను సృష్టించడానికి..వృద్ధిని పెంపొందించడానికి, ఉద్యోగాలను సృష్టించడానికి బలమైన, నమ్మకమైన వేదికను అందిస్తుంది. రాష్ట్రాల సహకారంతో ఆరు విభాగాలలో సంస్కరణల ద్వారా వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, పెట్టుబడి, ఎగుమతుల వంటి శక్తివంతమైన ఇంజిన్లను పటిష్టం చేయడానికి చేసిన విధాన ఎంపికలు స్వాగతించదగినవి. – సంజీవ్పురి, ప్రెసిడెంట్, సీఐఐపట్టణ సంస్కరణలకు.. ఊతంప్రతి మంత్రిత్వ శాఖకు 3 సంవత్సరాల పైప్లైన్ ప్రాజెక్ట్లను రూపొందించడం ద్వారా పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యాలకు ప్రాధాన్యత ఇవ్వడం మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ప్రైవేట్ రంగ ప్రమేయాన్ని ప్రభావితం చేసే స్పష్టమైన ఉద్దేశాన్ని ప్రతిబింబిస్తుంది. దీనికి ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఫండ్ మరింత మద్దతునిస్తుంది. రూ. లక్ష కోట్ల అర్బన్ ఛాలెంజ్ ఫండ్ పట్టణ సంస్కరణలకు అంకితం. – వై.ఆర్.నాగరాజా, ఎండీ, రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. -
కీలక ఖనిజాలపై సుంకాల రద్దు
న్యూఢిల్లీ: కీలకమైన 12 ఖనిజాలు, లిథియం అయాన్ బ్యాటరీల స్క్రాప్, సీసం, కొబాల్ట్ ఉత్పత్తులు, జింకు మొదలైన వాటితో పాటు క్యాన్సర్, ఇతరత్రా అరుదైన వ్యాధుల చికిత్సలో ఉపయోగించే 36 ఔషధాలపై దిగుమతి సుంకాలను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రకటించారు. కీలక ఖనిజాలపై సుంకాల తగ్గింపుతో వాటి ప్రాసెసింగ్, రిఫైనింగ్కి ఊతం లభిస్తుందని, వాటిపై ఆధారపడిన రంగాలకు సదరు ఖనిజాల లభ్యత మెరుగుపడుతుందని పేర్కొన్నారు. సెస్సు వర్తించే 82 ఉత్పత్తుల కేటగిరీలపై సామాజిక సంక్షేమ సర్చార్జిని తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒకటికి మించి సెస్సు లేదా సర్చార్జీని విధించకుండా ప్రతిపాదన చేశారు. నౌకా నిర్మాణ సంబంధిత ప్రయోజనాలు అందడానికి సుదీర్ఘ సమయం పడుతుంది కాబట్టి ముడి వస్తువులు, విడిభాగాలపై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ (బీసీడీ) మినహాయింపును మరో పది సంవత్సరాలు పొడిగించారు. క్యాన్సర్, అరుదైన వ్యాధులు, ఇతర తీవ్ర వ్యాధులతో సతమతమవుతున్న పేషంట్లకు ఊరటనిచ్చేలా బీసీడీ నుంచి పూర్తిగా మినహాయింపు ఉండే ఔషధాల జాబితాలోకి 36 ఔషధాలను చేరుస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ డిస్ప్లేపై బీసీడీని 10 శాతం నుంచి 20 శాతానికి పెంచగా, ఓపెన్ సెల్ మొదలైన వాటిపై అయిదు శాతానికి తగ్గించారు. -
పన్ను శ్లాబుల సవరణకు కారణాలు..
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2025లో మధ్యతరగతికి ఉపశమనం కలిగించడానికి, ఆర్థిక వృద్ధిని పెంచే లక్ష్యంతో ఆదాయపు పన్ను శ్లాబ్ల్లో మార్పులు చేశారు. ఆదాయపు పన్ను శ్లాబులను తగ్గించాలని ప్రభుత్వం ఎందుకు నిర్ణయించిందో.. ఇది పన్ను చెల్లింపుదారులను ఎలా ప్రభావితం చేస్తుందో కింద తెలుసుకుందాం.డిస్పోజబుల్ ఆదాయాన్ని పెంచడంఆదాయపు పన్ను శ్లాబులను తగ్గించడానికి ప్రధాన కారణాలలో ఒకటి మధ్య తరగతి వారికి డిస్పోజబుల్ ఆదాయాన్ని(ఖర్చులు అన్ని పోను మిగిలే ఆదాయం) పెంచడం. పన్ను రేట్లను తగ్గించడం ద్వారా, వ్యక్తులు, కుటుంబాలు ఖర్చు చేయడానికి, పొదుపు చేయడానికి లేదా పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ డబ్బును కలిగి ఉంటారు. ఇది ఆర్థిక కార్యకలాపాలను పెంచడానికి దారితీస్తుంది.పొదుపు, పెట్టుబడులను ప్రోత్సహించడంపొదుపును, పెట్టుబడులను ప్రోత్సహించేలా కొత్త పన్ను విధానాన్ని రూపొందించారు. అధిక డిస్పోజబుల్ ఆదాయంతో, వ్యక్తులు దీర్ఘకాలిక వృద్ధికి దోహదపడే ఆర్థిక సాధనాలు, స్థిరాస్తి లేదా వ్యాపారాల్లో పొదుపు చేయడానికి లేదా పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ అవకాశం ఉంది.పన్ను వ్యవస్థను సరళతరం చేయడంపన్ను వ్యవస్థను సరళతరం చేయడమే లక్ష్యంగా పన్ను శ్లాబులను సవరించారు. పన్ను చెల్లింపుదారులు వారి పన్ను విధానాలను అర్థం చేసుకోవడం, వాటిని పాటించడం సులభతరం అవుతుంది. ఈ సరళీకరణ పన్ను చెల్లింపుదారులు, పన్ను అధికారులపై పరిపాలనా భారాన్ని తగ్గిస్తుంది. ఇది మరింత సమర్థవంతమైన పన్ను సేకరణకు దారితీస్తుంది.మధ్యతరగతికి మద్దతుమధ్యతరగతి ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉంటోంది. వారికి పన్ను ఉపశమనం కల్పించడం, వారి కొనుగోలు శక్తిని పెంచడానికి ఈ నిర్ణయం సాయపడుతుంది. మధ్య తరగతివారిపై పన్ను భారాన్ని తగ్గించడం ద్వారా వారి జీవన ప్రమాణాలు, మొత్తం ఆర్థిక శ్రేయస్సును మెరుగుపరచాలని ప్రభుత్వం భావిస్తోంది.పాత పన్ను విధానం రద్దు చేసేలా..?2020లో ప్రవేశపెట్టిన కొత్త పన్ను విధానం ద్వారా క్రమంగా పాత పన్ను విధానాన్ని పలుచన చేస్తున్నారు. తాజా మార్పులు పాత వ్యవస్థను పూర్తిగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులను కొత్త విధానానికి మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు.ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2025 హైలైట్స్గృహ వినియోగాన్ని ప్రేరేపించడంపెరిగిన డిస్పోజబుల్ ఆదాయం అధిక గృహ వినియోగానికి దారితీస్తుంది. ఇది ఆర్థిక వృద్ధికి కీలక శక్తిగా మారుతుంది. వినియోగదారుల చేతుల్లో ఎక్కువ డబ్బును ఉంచడం ద్వారా వస్తువులు, సేవలకు డిమాండ్ పెరుగుతుంది. తద్వారా వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి.ద్రవ్యోల్బణంపెరుగుతున్న ద్రవ్యోల్బణం, జీవన వ్యయంతో ఆదాయపు పన్ను శ్లాబులను తగ్గించడం కుటుంబాలపై కొంత ఆర్థిక ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. -
రక్షణ బడ్జెట్ రూ.6.81 లక్షల కోట్లు.. ఏం చేస్తారో తెలుసా..?
కేంద్ర బడ్జెట్ 2025-26లో రక్షణ రంగానికి రూ.6,81,210 కోట్లు కేటాయించారు. ఇది వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతీయ భద్రతా భూభాగంలో సాయుధ దళాలను ఆధునీకరించడానికి వ్యూహాత్మక నిబద్ధతను తెలియజేస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.6.22 లక్షల కోట్లతో పోలిస్తే ఈ కేటాయింపులు స్వల్పంగా పెరిగాయి. రక్షణ సామర్థ్యాలను పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.రక్షణ బడ్జెట్లోని ముఖ్యాంశాలుమూలధన వ్యయం: రూ.1,92,387 కోట్లుమూలధన వ్యయంలో కొత్త ఆయుధాలు, విమానాలు, యుద్ధనౌకలు, ఇతర సైనిక హార్డ్వేర్లలో పెట్టుబడులు పెడుతారు. 2024-25లో మూలధన వ్యయం రూ.1.72 లక్షల కోట్లు కాగా, సవరించిన అంచనాలు రూ.1,59,500 కోట్లుగా ఉన్నాయి.రెవెన్యూ వ్యయం: రూ.4,88,822 కోట్లుఇందులో రోజువారీ నిర్వహణ ఖర్చులు, జీతాలు, పింఛన్లు ఉంటాయి. సైనిక పింఛన్లకు రూ.1,60,795 కోట్లు కేటాయించడం రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమం పట్ల ప్రభుత్వ నిబద్ధతకు అద్దం పడుతోందని మంత్రి అన్నారు.ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2025 హైలైట్స్ఆధునీకరణపై దృష్టిపెంచిన బడ్జెట్ కేటాయింపులు భారత సాయుధ దళాలలో ఆధునికీకరణ అవసరాన్ని తీర్చడానికి ఉద్దేశించినవి. ఆపరేషనల్ సంసిద్ధతను పెంపొందించడానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక పరికరాలపై పెట్టుబడి పెట్టనున్నారు. సైనిక స్థావరాలు, శిక్షణ సౌకర్యాలు, లాజిస్టిక్స్తో సహా రక్షణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ఈ నిధులు ఉపయోగపడుతాయి. పటిష్టమైన రక్షణ వ్యవస్థను నిర్ధారించడానికి అత్యాధునిక ఆయుధ వ్యవస్థలు, విమానాలు, నౌకాదళ నౌకలను కొనుగోలు చేస్తారు. -
మౌలిక సదుపాయాలకు కేటాయింపులు.. దేనికి ఖర్చు చేస్తారంటే..
ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేందుకు మూలధన వ్యయాన్ని (CAPEX) పెంచడంపై బడ్జెట్లో దృష్టి సారించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బడ్జెట్లో మూలధన వ్యయం కోసం రూ.11.21 లక్షల కోట్లు కేటాయించారు. ఇది గత ఏడాది రూ.11.11 లక్షల కోట్లతో పోలిస్తే 0.9% ఎక్కువ. అయితే, 2024-25 సంవత్సరానికి సవరించిన అంచనా రూ.10.18 లక్షల కోట్లతో పోలిస్తే ఈ కొత్త కేటాయింపులు ప్రణాళికాబద్ధమైన పెట్టుబడుల్లో పెరుగుదల నమోదు చేశాయి.మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు ఆర్థిక వృద్ధికి మూలస్తంభంగా నిలుస్తాయి. ప్రభుత్వం బడ్జెట్ 2025-26లో వేసిన అంచనా పద్దుల ప్రకారం కింది విభాగాల్లో ఖర్చు చేసే అవకాశం ఉంది.ఎందుకోసం ఖర్చు చేస్తారంటే..లాజిస్టిక్స్, ప్రాంతాల్లో కనెక్టివిటీని మెరుగుపరచడానికి రోడ్డు, రైలు, నౌకాశ్రయ మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తారు. పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా స్మార్ట్ సిటీలు, పట్టణ మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెడుతారు. సమాన అభివృద్ధి, మార్కెట్ల సౌలభ్య కోసం గ్రామీణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తారు. ప్రపంచం సుస్థిర భవిష్యత్తు దిశగా పయనిస్తున్న తరుణంలో ప్రభుత్వం పునరుత్పాదక ఇంధన వనరులపై ఖర్చు చేస్తుంది. కర్బన ఉద్గారాలను తగ్గించడానికి సౌర, పవన, జలవిద్యుత్ ప్రాజెక్టులను విస్తరిస్తుంది. మొత్తం ఇంధన వినియోగాన్ని తగ్గించడానికి ఎనర్జీ ఎఫిషియెన్సీ టెక్నాలజీలపై ఇన్వెస్ట్ చేస్తుంది.డిజిటలైజేషన్ కోసం..సుస్థిర వ్యవసాయ, పారిశ్రామిక పద్ధతులను ప్రోత్సహిస్తుంది. డిజిటలైజేషన్పై, ఈ విభాగంలో వినూత్న విధానాల అమలుకు ఖర్చు చేస్తారు. డిజిటల్ వృద్ధికి తోడ్పడటానికి బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ, 5జీ నెట్వర్క్లను పెంచేందుకు కృషి చేస్తారు. పబ్లిక్ సర్వీస్ డెలివరీ, పారదర్శకతను మెరుగుపరిచేందుకు ఈ-గవర్నెన్స్ ప్లాట్ఫామ్లపై ఇన్వెస్ట్ చేస్తారు. డిజిటల్ బెదిరింపుల నుంచి రక్షించడానికి సైబర్ సెక్యూరిటీ సదుపాయాలను బలోపేతం చేస్తారు.హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి ఆసుపత్రులు, క్లినిక్లు, వైద్య పరిశోధన సౌకర్యాలను ఏర్పాటు చేస్తారు. విద్యా నాణ్యతను పెంచడానికి పాఠశాలలు, కళాశాలలు, వృత్తి శిక్షణా కేంద్రాలపై పెట్టుబడి పెడుతారు. ఇన్నోవేషన్ను ప్రోత్సహించడానికి హెల్త్ కేర్, ఎడ్యుకేషన్లో రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం ఖర్చు చేస్తారు.ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2025 హైలైట్స్ఎంఎస్ఎంఈలపై..సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు) భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్నాయి. వృద్ధి, ఉద్యోగాల సృష్టిని ప్రోత్సహించడానికి ఎంఎస్ఎంఈలకు రుణాలు అందుబాటులో ఉంచేందుకు మూలధనాన్ని ఖర్చు చేస్తారు. ఎంఎస్ఎంఈలకు అనుగుణంగా ఇండస్ట్రియల్ పార్కులు, లాజిస్టిక్స్ హబ్లను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ఉత్పాదకతను మెరుగుపరచడానికి కొత్త సాంకేతికతలను అవలంబించడంలో ఎంఎస్ఎంఈలకు మద్దతు ఇవ్వాలి. -
బీమా రంగంలో 100 శాతం ఎఫ్డీఐలు
అధికమొత్తంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ 2025 ప్రసంగంలో కీలక ప్రకటన చేశారు. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) పరిమితిని 74% నుంచి 100%కు పెంచుతున్నట్లు తెలిపారు. ఈ మార్పు చాలా బీమా రంగంలో అవసరమైన మూలధనం సమకూరుతుందని, పోటీని పెంచుతుందని, దేశవ్యాప్తంగా బీమా వ్యాప్తిని మెరుగుపరుస్తుందని నిపుణులు భావిస్తున్నారు.ఈ చర్య 2047 నాటికి ‘అందరికీ బీమా’ అనే ప్రభుత్వ విజన్కు అనుగుణంగా ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. విదేశీ పెట్టుబడులకు సంబంధించిన ప్రస్తుత నిబంధనలు, షరతులను సమీక్షించి కేంద్రం వాటిని సరళీకృతం చేయనుంది. ఎఫ్డీఐ పరిమితిని పెంచడం వల్ల మరిన్ని గ్లోబల్ ఇన్సూరెన్స్ కంపెనీలను ఆకర్షించడం, పోటీని పెంచడం, కొత్త మార్కెట్ను తీసుకురానున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఈ సంస్కరణ బీమా సంస్థలు ఒకే విధానంతో తమ వ్యాపారాన్ని నిర్వహించడానికి, కార్యకలాపాలను మరింత క్రమబద్ధీకరించడానికి అనుమతిస్తుంది.ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2025 హైలైట్స్హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బీఐ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్.. వంటి ప్రధాన బీమా కంపెనీల షేర్లు ఈ ప్రకటన తర్వాత భారీగా లాభపడ్డాయి. ప్రభుత్వ నిర్ణయం వల్ల ప్రపంచ స్థాయి నైపుణ్యాలు, వనరులను తీసుకువచ్చేందుకు, మెరుగైన రిస్క్ మేనేజ్మెంట్కు దోహదం చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
టీడీఎస్లో మార్పులు.. అద్దె ఆదాయంపై భారీ ఊరట
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 బడ్జెట్లో టీడీఎస్కి కీలక మార్పులను ప్రకటించారు. సీనియర్ సిటిజన్లకు, ఇళ్లు, భవనాలపై అద్దె ఆదాయాన్ని పొందేవారికి భారీ ఊరట కల్పించారు. అద్దె ఆదాయంపై వార్షిక టీడీఎస్ మినహాయింపు పరిమితిని రూ.2.4 లక్షల నుండి రూ.6 లక్షలకు పెంచారు."ఇది టీడీఎస్ వర్తించే లావాదేవీల సంఖ్యను తగ్గిస్తుంది. తద్వారా చిన్న చెల్లింపులను స్వీకరించే చిన్న పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూరుతుంది" అని సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. రేట్ల సంఖ్యను తగ్గించడం, పరిమితి మొత్తాలను పెంచడం ద్వారా టీడీఎస్ ఫ్రేమ్వర్క్ను సరళీకృతం చేసే ప్రణాళికలను కూడా ఆమె వివరించారు.టీడీఎస్లో ప్రధాన మార్పులు ఇవే..సీనియర్ సిటిజన్లకు పన్ను రహిత ఆదాయ పరిమితి రూ.50 వేల నుంచి రూ.1లక్షకు పెంపుఅద్దె ఆదాయంపై టీడీపీ పరిమితి వార్షికంగా రూ.2.4 లక్షల నుండి రూ.6 లక్షలకు పెంపు.లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) కింద చెల్లింపులపై వసూలు చేసే టీసీఎస్ పరిమితిని రూ.7 లక్షల నుండి రూ.10 లక్షలకు పెంపుపాన్ కార్డు లేని పన్ను చెల్లింపుదారులకు అధిక టీడీఎస్ నిబంధన వర్తిస్తుంది. విద్యా రుణాల చెల్లింపులపై టీసీఎస్ పూర్తీగా తొలగింపుఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2025-26 ముఖ్యాంశాలు -
రూ.50.65 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్ సమగ్ర స్వరూపం
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను మొత్తంగా రూ.50,65,345 కోట్ల కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మొత్తం రెవెన్యూ వసూళ్లను రూ.రూ.34,20,409 కోట్లుగా అంచనా వేశారు. మూలధన వసూళ్లలో రూ.16,44,936 కోట్లుగా ఉండబోతున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు. బడ్జెట్ 2025-26 సమగ్ర స్వరూపం కింది విధంగా ఉంది.బడ్జెట్ 2025-26 సమగ్ర స్వరూపంరెవెన్యూ వసూళ్లు రూ.34,20,409 కోట్లుపన్ను వసూళ్లు రూ.28,37,409 కోట్లుపన్నేతర వసూళ్లు రూ.5,83,000 కోట్లుమూలధన వసూళ్లు రూ.16,44,936 కోట్లురుణాల రికవరీ రూ.29,000 కోట్లుఇతర వసూళ్లు రూ.47,000 కోట్లుఅప్పులు, ఇతర వసూళ్లు రూ.15,68,936 కోట్లుమొత్తం ఆదాయం రూ.50,65,345 కోట్లుమొత్తం వ్యయం రూ.50,65,345 కోట్లురెవెన్యూ ఖాతా రూ.39,44,255 కోట్లువడ్డీ చెల్లింపులు రూ.12,76,338 కోట్లుమూలధన ఆస్తుల కోసం కేటాయించిన గ్రాంట్లు రూ.4,27,192 కోట్లుమూలధన ఖాతా రూ.11,21,090 కోట్లువాస్తవ మూలధన వ్యయం రూ.15,48,282 కోట్లురెవెన్యూ లోటు రూ.5,23,846 కోట్లునికర రెవెన్యూ లోటు రూ.96,654 కోట్లుద్రవ్య లోటు రూ.15,68,936 కోట్లుప్రాథమిక లోటు రూ.2,92,598 కోట్లురూపాయి పోక..పెన్షన్లు 4 పైసలువడ్డీ చెల్లింపులు 20 పైసలుకేంద్ర పథకాలు 16 పైసలుప్రధాన సబ్సిడీలు 6 పైసలుడిఫెన్స్ 8 పైసలురాష్ట్రాలకు తిరిగి చెల్లించే ట్యాక్స్లు 22 పైసలుఫైనాన్స్ కమిషన్కు చెల్లింపులు 8 పైసలుకేంద్ర ప్రాయోజిక పథకాలు 8 పైసలుఇతర కేంద్ర ప్రాయోజిత పథకాలు, ఖర్చులు 8 పైసలుఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2025 హైలైట్స్రూపాయి రాక...ఇన్కమ్ ట్యాక్స్ 22 పైసలుఎక్సైజ్ డ్యూటీ 5 పైసలుఅప్పులు, ఆస్తులు 24 పైసలుపన్నేతర ఆదాయం 9 పైసలుమూలధన రశీదులు 1 పైసలుకస్టమ్స్ ఆదాయం 4 పైసలుకార్పొరేషన్ ట్యాక్స్ 17 పైసలుజీఎస్టీ, ఇతర పన్నులు 18 పైసలు -
Budget 2025-26: ధరలు తగ్గేవి ఇవే..
కేంద్ర బడ్జెట్ 2025-26లో కొన్ని రకాల వస్తువలపై కేంద్ర ప్రభుత్వం కస్టమ్ డ్యూటీని పూర్తీగా మినహాయించింది. ప్రాథమిక కస్టమ్ డ్యూటీ (BCD) నుండి పూర్తిగా మినహాయించిన వస్తువుల జాబితాలో 36 ప్రాణ రక్షక మందులు, వెట్ బ్లూ లెదర్, లిథియం బ్యాటరీలు ఉన్నాయి.ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం (ఫిబ్రవరి 1) వరుసగా ఎనిమిదో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెడుతున్న సందర్భంగా ఈ మినహాయింపులు ప్రకటించారు. దీంతో వీటి ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. ప్రాథమిక కస్టమ్ డ్యూటీ నుండి పూర్తిగా మినహాయించిన వస్తువులు ఇవే..ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2025 ముఖ్యాంశాలు36 ప్రాణ రక్షక ఔషధాలుఈవీల తయారీకి ఉపయోగించే 35 రకాల ముడిపదార్థాలువెట్ బ్లూ లెదర్లిథియం బ్యాటరీలు స్క్రాప్కోబాల్ట్ ఉత్పత్తులుఎల్ఈడీలుజింక్12 క్లిష్టమైన ఖనిజాలుచేపల పేస్ట్పై సుంకం 30% నుంచి 5%కి తగ్గింపు -
రూ.12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు
కొత్త పన్ను విధానం కింద రూ.12 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న వ్యక్తులు ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025 బడ్జెట్ సందర్భంగా కీలక ప్రకటన చేశారు. పన్ను వ్యవస్థను సరళతరం చేయడానికి, పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు చెప్పారు. కొత్త పన్ను విధానం ఆకర్షణీయమైన పన్ను రేట్లను అందిస్తుంది. వివిధ మినహాయింపులు, మినహాయింపుల అవసరాన్ని తొలగిస్తుందని చెప్పారు. ఇందులోని కీలక ఫీచర్లు ఇవే..కొత్త పన్ను విధానం ప్రకారం.. వార్షికంగా రూ.12 లక్షల వరకు ఆదాయం ఉన్న వ్యక్తులు ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. పాత విధానంతో పోలిస్తే కొత్త విధానంలో తక్కువ పన్ను రేట్లు విధిస్తారు. ఉదాహరణకు, రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల మధ్య ఆదాయంపై 15 శాతం, రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల మధ్య ఆదాయంపై 20 శాతం పన్ను ఉంది. కొత్త విధానం ప్రకారం రూ.12 లక్షల ఆదాయం ఉన్నవారికి పన్ను రూపంలో రూ.80 వేలు ఆదా అవుతుంది. ఇతర శ్లాబుల్లో కూడా మార్పులు ఉంటాయని నిర్మలమ్మ ప్రకటించారు. రూ.25 లక్షల ఆదాయం ఉన్నవారికి రూ.1.10 లక్షలు ఆదా అవుతుందని చెప్పారు.కొత్త పన్ను విధానంలో శ్లాబుల సవరణరూ.0-4 లక్షలు - సున్నారూ.4-8 లక్షలు - 5%రూ.8-12 లక్షలు - 10%రూ.12-16 లక్షలు - 15%రూ.16-20 లక్షలు - 20%రూ.20-24 లక్షలు - 25%రూ.24 లక్షల పైన 30 శాతంఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2025 హైలైట్స్ఈ కొత్త విధానం పన్ను సౌలభ్యాన్ని సులభతరం చేయడం, వాటిని మరింత క్రమబద్దీకరించడానికి తోడ్పడుతుందని కేంద్రమంత్రి సీతారామన్ చెప్పారు. ఇది దేశవ్యాప్తంగా లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. పన్ను భారాన్ని తగ్గించడం, పన్ను ఫైలింగ్ ప్రక్రియను సరళతరం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. డిస్పోజబుల్ ఆదాయాన్ని పెంచుతుందని, ఆర్థిక వృద్ధిని ప్రేరేపిస్తుందని భావిస్తున్నారు. ఎలా లెక్కిస్తారంటే..నూతన విధానంలో కొత్త శ్లాబుల ప్రకారం మొదటి రూ.4లక్షల్లోపు ఆదాయం ఉంటే పన్ను పరిధిలోకి రారు. స్టాండర్డ్ డిడక్షన్తో కలిపి చూసుకుంటే రూ.12.75 లక్షల ఆదాయం దాటని వేతన జీవులు, పెన్షనర్లు రూపాయి పన్ను చెల్లించక్కర్లేదు. రూ.4–12లక్షల ఆదాయంపై సెక్షన్ 87ఏ కింద రిబేట్ అమల్లో ఉంది. దీనికి రూ.75వేల స్టాండర్డ్ డిడక్షన్ అదనం. అంటే మొత్తంగా రూ.12,75,000 లక్షల ఆదాయం వరకు పన్ను చెల్లించక్కర్లేదు. తాజా బడ్జెట్లో రిబేట్ను రూ.60 వేలుగా నిర్ణయించారు. ఇది ఇప్పటివరకు రూ.25,000గా ఉండేది. కాబట్టి రూ.12.75 లక్షల వరకు ఎలాంటి పన్నూ చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే స్థూల ఆదాయం రూ.12.75 లక్షలకు ఒక్క రూపాయి దాటినా రిబేటు వర్తించదు. అలాంటి వారు పైన పేర్కొన్న శ్లాబుల ప్రకారం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.ఇప్పటి వరకు కొత్త పన్ను విధానం ప్రకారం పన్ను వర్తించని ఆదాయం రూ.7 లక్షలుగా ఉంది. స్టాండర్డ్ డిడక్షన్స్ రూ.75 వేలు కలుపుకొని రూ.7.75 లక్షల వరకు ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. దీన్ని తాజాగా రూ.12.75 (ప్రామాణిక తగ్గింపు రూ.75వేలు, రిబేట్ కలిపి)కు సవరించారు. -
వచ్చే వారం కొత్త ఆదాయపు పన్ను బిల్లు
పన్ను సంస్కరణలను మరింత ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ 2025 ప్రసంగంలో వచ్చే వారం కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. పన్ను చెల్లింపుదారుల సౌలభ్యాన్ని పెంచడానికి, పన్ను వ్యవస్థను క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం దశాబ్దకాలంగా చేస్తున్న ప్రయత్నాలను ఈ ప్రకటన నొక్కి చెబుతుందని కొందరు విశ్వసిస్తున్నారు.ఫేస్ లెస్ అసెస్ మెంట్, ట్యాక్స్ పేయర్ చార్టర్, రిటర్నులను వేగంగా ప్రాసెస్ చేయడం వంటి కీలక అంశాలను ఆర్థిక మంత్రి ప్రస్తావించారు. దాదాపు 99% రాబడులు ప్రస్తుతం స్వీయ మదింపు(సెల్ఫ్ అసెస్మెంట్)పై ఆధారపడి ఉన్నాయన్నారు. పన్ను విధానాలను ముందుగా కేంద్రం విశ్వసించిన తర్వాతే వాటి మార్పులను పరిశీలిస్తుందని స్పష్టం చేశారు. ఈ విధానం పన్ను చెల్లింపుదారులు, ప్రభుత్వం మధ్య నమ్మకాన్ని పెంపొందిస్తున్నారు.ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2025 హైలైట్స్కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టడం వల్ల పన్నుల వ్యవస్థలో గణనీయమైన మార్పులు వస్తాయని, పన్నుల నిర్మాణాన్ని సరళతరం చేయడపై దృష్టి పెడుతారని కొందరు భావిస్తున్నారు. ఈ చర్య దేశవ్యాప్తంగా పన్ను చెల్లింపుదారులపై విస్తృత ప్రభావాలను చూపుతుందని చెబుతున్నారు. ఇది ప్రభుత్వ సంస్కరణల ఎజెండాను మరింత ముందుకు తీసుకెళుతుందని భావిస్తున్నారు. -
బడ్జెట్ 2025: గిగ్ వర్కర్లకు ఇక మంచిరోజులు
న్యూఢిల్లీ, సాక్షి: అసంఘటిత రంగాల ఉద్యోగులకు(గిగ్ వర్కర్లకు) కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. బడ్జెట్(Union Budget 2025) ద్వారా వాళ్లకు గుర్తింపుతో పాటు ఆరోగ్య బీమా సదుపాయం కల్పించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో కోటి మంది గిగ్ వర్కర్స్కు లాభం చేకూరనుంది. ఈ-శ్రమ్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశంతో పాటు ఆరోగ్య బీమా సదుపాయం కల్పించాలని నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) తన బడ్జెట్ ప్రసంగంలో వినిపించారు. ఈ నిర్ణయంతో గిగ్ వర్కర్లకు ఐడెంటిటీ కార్డులు ఇవ్వనున్నారు. అలాగే.. ప్రధాన మంత్రి ఆరోగ్య యోజన(PM-JAY) కింద ఉద్యోగి కుటుంబానికి ఏడాది ఐదు లక్షల దాకా ఆరోగ్య బీమా సదుపాయం కల్పిస్తారు. అలాగే గిగ్ వర్కర్ల సామాజిక భద్రత త్వరలో కోసం ప్రత్యేక పథకం తీసుకురానున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వీటితో పాటు ఆయుష్మాన్ భారత్, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలనూ వర్తింపజేసే ప్రతిపాదనలు ఉన్నట్లు తెలిపారామె. గిగ్ వర్కర్లు అంటే..తాత్కాలికంగా.. తమకు ఉన్న వీలును బట్టి ఉద్యోగాలను చేసేవాళ్లను గిగ్ వర్కర్లు అంటారు. ప్రత్యేకించి.. యాప్ల ద్వారా సేవలందించే ఉద్యోగాల్లో ఎక్కువ మంది ఉన్నారు. డెలివరీ యాప్లు, రైడ్ యాప్లతో పని చేసే ఉద్యోగులతో పాటు ఫ్రీలాన్సర్లు, ఆన్లైన్ ట్యూటర్లు ఈ విభాగంలోకి వస్తారు. అయితే.. సంప్రదాయ ఉద్యోగులకు ఉన్నట్లు వీళ్లకు ఉద్యోగ భద్రత లేదు. అది కల్పించాలని ఉద్యమాలు నడుస్తున్నా.. ఈ తరహా ఉద్యోగాల్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వాలు ఇంతకాలం తీవ్రంగా భావించాలేదు. ఈ నేపథ్యంలో తాజా నిర్ణయాలు.. రాబోయే రోజుల్లో వాళ్లకు మంచి రోజులు వస్తాయనే సంకేతాలు అందించాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా.. పది కోట్లకు పైగా గిగ్ వర్కర్లు ఉన్నట్లు అంచనా. 2030 నాటికి ఆ సంఖ్య 23 కోట్లకు చేరుతుందని నీతి ఆయోగ్ అంచనా వేస్తోంది. కిందటి బడ్జెట్లో గిగ్ వర్కర్ల కోసం కొన్ని ప్రతిపాదనలు చేసినప్పటికీ అవి ఆచరణలోకి రాలేదు. అయితే ఈసారి బడ్జెట్లో కచ్చితమైన నిర్ణయాలు ప్రకటించడం గమనార్హం. -
బడ్జెట్లో వ్యవసాయ రంగం అప్డేట్స్.. ‘ధన్ ధాన్య కృషి యోజన’ ప్రారంభం
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. భారతదేశం అంతటా రైతులకు ఉత్పాదకత, సుస్థిరత, మార్కెట్ సౌలభ్యాన్ని పెంచడంపై బడ్జెట్ దృష్టి పెడుతుందన్నారు. బడ్జెట్లో ప్రధానంగా వ్యవసాయంపై ఫోకస్ పెడుతున్నట్లు పేర్కొన్నారు.ధన్ ధాన్య కృషి యోజనతక్కువ ఉత్పాదకత, సగటు కంటే తక్కువ రుణ పారామితులు ఉన్న 100 జిల్లాలను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం ధన్ ధాన్య కృషి యోజనను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం ద్వారా, రుణ సౌలభ్యాన్ని మెరుగుపరచడం ద్వారా 1.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చడం ఈ పథకం లక్ష్యమని చెప్పారు.రీసెర్చ్ లింక్డ్ ఇన్సెంటివ్ (ఆర్ఎల్ఐ) పథకంవ్యవసాయంలో ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, విజయవంతమైన పరిశోధనలు, వాటి అభివృద్ధి ఫలితాల కోసం ఆర్థిక ప్రోత్సాహకాలను అందించేందుకు రీసెర్చ్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ను బడ్జెట్లో ప్రవేశపెట్టారు. అధిక దిగుబడినిచ్చే, వాతావరణాన్ని తట్టుకునే పంటల అభివృద్ధిని వేగవంతం చేయడమే ఈ పథకం లక్ష్యం.ఏకీకృత విత్తన నమోదు ప్రక్రియవిత్తన నమోదు కోసం వన్ నేషన్, వన్ లైసెన్స్ విధానాన్ని బడ్జెట్ ప్రతిపాదిస్తుంది. ఈ ప్రక్రియను క్రమబద్ధీకరించేందుకు, రైతులకు అధిక నాణ్యమైన విత్తనాలు సకాలంలో అందుబాటులో ఉండేలా చూసేందుకు ఈ విధానం ఎంతో ఉపయోగమని నిర్మాలా సీతారామన్ చెప్పారు.వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) సరళీకరణవ్యవసాయ పెట్టుబడులకు జీఎస్టీ ఫ్రేమ్ వర్క్ను సరళతరం చేయడం, నిత్యావసర వస్తువులను మరింత చౌకగా, సుస్థిరంగా మార్చడానికి బడ్జెట్లో చర్యలు సాగనున్నాయి.భారతదేశ వ్యవసాయ విస్తరణలో కీలక చోదకాలుగా ఉన్న ఉద్యానవన, పశుసంపద, చేపల పెంపకం వంటి అధిక విలువ ఆధారిత రంగాల వృద్ధికి బడ్జెట్ ప్రాధాన్యత ఇస్తుందన్నారు.ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2025 హైలైట్స్ప్రభావం ఇలా..2025-26 కేంద్ర బడ్జెట్లో పేర్కొన్న కార్యక్రమాలు వ్యవసాయ ఉత్పాదకతను గణనీయంగా పెంచుతాయని, మార్కెట్ ప్రాప్యతను మెరుగుపరుస్తాయని, వ్యవసాయ పద్ధతుల సుస్థిరతను నిర్ధారిస్తాయని భావిస్తున్నారు. సృజనాత్మకత, పరిశోధన, క్రమబద్ధీకరించిన ప్రక్రియలపై దృష్టి పెట్టడం ద్వారా వ్యవసాయ రంగానికి మేలు చేకూరుతుందని అంచనా వేస్తున్నారు. -
దటీజ్ నిర్మలా సీతారామన్
ఆర్థిక మంత్రి 'నిర్మలా సీతారామన్' కాసేపట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. తద్వారా.. వరుసగా ఎనిమిదిసార్లు పద్దును సమర్పించిన ఆర్థిక మంత్రిగా ఆమె రికార్డుల్లోకి ఎక్కనున్నారు. వికసిత భారత్ లక్ష్యంగా ఈసారి బడ్జెట్ ఉండనున్నట్లు కేంద్రం ఇప్పటికే సంకేతాలిచ్చింది. అంతే కాకుండా.. మధ్యతరగతి ప్రజలపై భారాన్ని తగ్గించే కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉందని ప్రధాని మోదీ మాటలను బట్టి అర్థమవుతోంది.ఇప్పటి వరకు ఏడు బడ్జెట్లను ప్రవేశపెట్టిన నిర్మలమ్మ.. ఎనిమిదోసారి బడ్జెట్ చదవనున్నారు. ఇప్పటి వరకు ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ సొంతం. ఈయన 10 బడ్జెట్లను ప్రవేశపట్టారు. సీతారామన్ కూడా ఈ సంఖ్యకు చేరువలో ఉన్నారు. సుదీర్ఘంగా బడ్జెట్ ను చదివి వినిపించిన ఘనత కూడా ఈమె సొంతం చేసుకున్నారు.బడ్జెట్ గురించి ఆసక్తికర విషయాలు➤భారతదేశంలో మొట్టమొదటిసారి 1947 నవంబర్ 26న 'షణ్ముఖం చెట్టి' బడ్జెట్ సమర్పించారు.➤అత్యధిక బడ్జెట్లు ప్రవేశపెట్టిన వ్యక్తిగా మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ రికార్డు సృష్టించారు.➤ఫిబ్రవరి 1, 2020న నిర్మలా సీతారామన్ 2 గంటల 40 నిమిషాల పాటు సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం చేసి రికార్డ్ క్రియేట్ చేశారు.➤1977లో హిరూభాయ్ ముల్జీభాయ్ పటేల్ చేసిన మధ్యంతర బడ్జెట్ ప్రసంగం.. ఇప్పటివరకు అతి చిన్న బడ్జెట్గా నిలిచింది. ఎందుకంటే ఇది కేవలం 800 పదాలతో కూడిన బడ్జెట్.➤ప్రారంభంలో సాయంత్రం 5 గంటలకు బడ్జెట్ను సమర్పించేవారు. కానీ 1999లో అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా ఉదయం 11 గంటలకు బడ్జెట్ను ప్రవేశపెట్టడంతో సమయాన్ని మార్చారు. అప్పటి నుంచి ఉదయం 11 గంటలకు బడ్జెట్ను సమర్పిస్తున్నారు.➤2017లో బడ్జెట్ సమర్పణ తేదీని ఫిబ్రవరి 1కి మార్చారు. అప్పటి వరకు ఫిబ్రవరి 29న బడ్జెట్ సమర్పించేవారు. -
బడ్జెట్: ఆదాయపు పన్నుల్లో అనూహ్య మార్పులు?
"మనం వికసిత్ భారత్ దిశగా అడుగులేస్తున్నాం. ఈ బడ్జెట్ సమావేశాలు దేశానికి కొత్త శక్తినీ, ఉత్సాహాన్నీ అందించాలి. అలాగే అందరికి సిరిసంపదలు సమకూర్చే ఆ మహాలక్ష్మి దేవికి వినమ్రంగా చేతులెత్తి మొక్కుతున్నా.. మధ్య తరగతి వర్గాలు, పేదలకు ఆ మాత ప్రత్యేక ఆశీర్వాదాలు అందించాలి".నిన్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విలేకర్లతో అన్న మాటలివి. ఈ మాటల్ని తేలిగ్గా తీసిపారేయకూడదు. వాటిని విశ్లేషిస్తే ఎన్నో పరమార్ధాలు ధ్వనిస్తాయి.ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రవేశ పెట్టబోయే బడ్జెట్లో పేద, మధ్య తరగతి వర్గాలకు ఏదో కచ్చితమైన మేలు జరగబోతోందనే విషయం ప్రధాని మాటల్లో పరోక్షంగా ధ్వనించిందనే చెప్పొచ్చు.మోదీ 3.O సర్కారు కొలువు తీరిన తర్వాత వస్తున్న తొట్టతొలి పూర్తి స్థాయి బడ్జెట్ ఇది. దీంతో ఈ బడ్జెట్కు ఎనలేని ప్రాధాన్యం ఏర్పడింది. అంతే కాదు.. ఈసారి విస్తృత స్థాయిలో పన్ను సంస్కరణలు చోటుచేసుకోవచ్చని, ఆదాయపు పన్నుల్లో అనూహ్య మార్పులకు ఆస్కారం ఉందనే మాటలు గట్టిగానే వినిపిస్తున్నాయి.బడ్జెట్ అనేసరికి ఆశలు సహజం.ముఖ్యంగా మధ్య తరగతి, ఉద్యోగ వర్గాలు తమకు మేలు చేసే నిర్ణయాల కోసం ఎప్పటికప్పుడు ఆతృతతో ఎదురుచూస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఆదాయపు పన్నుల విషయంలో వీరి అంచనాలు కోటలు దాటుతాయి. వాస్తవానికి నిజాయతీగా పన్ను చెల్లించే వర్గం ఏదైనా ఉందా? అంటే అది ఉద్యోగులే. వీరికి జీతభత్యాలు చెల్లించేటప్పుడే టీడీఎస్ రూపంలో పన్ను వసూళ్లు జరిగిపోతాయి. కానీ ట్యాక్స్ల విషయానికొస్తే మాత్రం ఏళ్ల తరబడి స్వల్ప మార్పులతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ఫలితంగా అధిక పన్నులు చెల్లిస్తూ, అక్కరకు రాని ఆదాయాలతో మధ్య తరగతి, ఉద్యోగ వర్గాలు అల్లాడుతూనే ఉంటున్నాయి. కాబట్టి పన్ను రేట్లు తగ్గించడం, ట్యాక్స్ స్లాబుల్లో మార్పులు చేయడం ద్వారా గట్టి ప్రయోజనమే దక్కాలని ఈ వర్గాలు కోరుకోవడంలో తప్పు లేదు. పన్నుల విషయానికొస్తే..* కొత్త స్లాబ్ ప్రకారం ప్రస్తుతం రూ.3 లక్షల వరకు ఎలాంటి పన్నూ చెల్లించనక్కర్లేదు. ఆదాయాలు పెరిగినప్పటికీ, రేట్లు పెరిగి, ఖర్చులూ విస్తృతమైన నేపథ్యంలో ఈ పన్ను మినహాయింపు పరిమితిని రూ. 5 లక్షలకు పెంచాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఇదే కనుక జరిగితే పన్ను చెల్లింపుదారులకు మరింత వెసులుబాటు కలుగుతుంది. తద్వారా వారికి ఖర్చు పెట్టే సామర్ధ్యం పెరిగి, ఆర్ధిక వ్యవస్థ పురోగమించేందుకు ఆస్కారం ఏర్పడుతుంది.* పాత, కొత్త పన్ను విధానాలు రెంటిలోనూ స్టాండర్డ్ డిడక్షన్ ను పెంచాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం... పాత పన్ను విధానం ప్రకారం రూ.50,000 వరకు, కొత్త ట్యాక్స్ స్లాబుల ప్రకారం రూ.75,000 వరకు స్టాండర్డ్ డిడక్షన్ లభిస్తోంది.* రూ. 10 లక్షలవరకు పన్నులు ఉండకూడదని, రూ.15 లక్షలు పైబడి రూ.20 లక్షల లోపు ఆదాయాలకు 25% రేటుతో ఓ కొత్త స్లాబ్ ప్రవేశపెట్టాలని మరికొన్ని వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.* రూ. 15 లక్షలు పైబడిన అధికాదాయ వర్గాల వారి నుంచి ప్రస్తుతం 30% పన్ను వసూలు చేస్తూండగా... దీన్ని రూ.18 లక్షలకు, ఇంకా వీలైతే రూ. 20 లక్షలకు పెంచాలనే డిమాండ్లు వినవస్తున్నాయి. అంటే కొత్త ట్యాక్స్ విధానంలో మరిన్ని మినహాయింపులు, డిడక్షన్లు ఇవ్వాలని కూడా కోరుతున్నారు.* మధ్య తరగతి, ఉద్యోగ వర్గాల ప్రధాన కల సొంత ఇంటిని సమకూర్చుకోవడం. ఇందుకోసం వాళ్ళు రుణాలపైనే ఆధారపడతారు. కొత్త విధానం ప్రకారం.. తొలిసారి ఇల్లు కొనుక్కునేవాళ్లకు ఈ రుణాల తిరిగి చెల్లింపులో అసలు మొత్తంపై ప్రస్తుతం సెక్షన్ 80 సీ కింద లభిస్తున్న డిడక్షన్ ను రూ. 1.5 లక్షల నుంచి రూ.2.5 లక్షలకు పెంచాలని వీరు కోరుతున్నారు. అలాగే సెక్షన్ 24 బీ కింద వడ్డీ తగ్గింపు పరిమితిని కూడా రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచాలనే డిమాండ్లూ వినిపిస్తున్నాయి.ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రస్తుతం క్రెడిట్-లింక్డ్ సబ్సిడీ విధానం అందుబాటులో ఉంది. దీన్ని తమకూ వర్తింప చేయాలని ఆశిస్తున్నారు.పాత విధానంలో ప్రస్తుత స్లాబ్ రేట్లురూ. 2,50,000 వరకు 0రూ. 2,50,001 - రూ. 5,00,000: 5% రూ. 5,00,001 - రూ. 10,00,000: 20%రూ.10,00,000 పైన: 30 %కొత్త విధానంలో ప్రస్తుత స్లాబు రేట్లురూ .3,00,000 వరకు: 0%, రూ. 3,00,001 - 7,00,000: 5%, రూ. 7,00,001 - 10,00,000: 10%, రూ. 10,00,001 - 12,00,000: 15%, రూ. 12,00,001 - 15,00,000 : 20% రూ. 15,00,001 ఆపైన: 30%.ఆదాయం రూ. 7 లక్షలు మించకపోతే... అదనంగా రూ. 25,000 వరకు ట్యాక్స్ రిబేటు కూడా లభిస్తుంది. * వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు వారి ఆదాయం రూ. లక్షల లోపు ఉంటే 87A సెక్షన్ కింద రిబేటు పొందవచ్చు. అంటే వారు ఎలాంటి పన్నూ చెల్లించనక్కర్లేదు. మోదీ నిన్న చెప్పినట్లు.. ఆ లక్ష్మీ కటాక్షం సీతారామన్ చేతుల్లోంచి పేద, మధ్యతరగతి.. ఉద్యోగ వర్గాలకు ఎంతవరకు సిద్ధిస్తుందో చూద్దాం.-బెహరా శ్రీనివాస రావు, ఆర్ధిక నిపుణులు. -
ఈ పొద్దు.. ఆశల పద్దు!
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్పై మహా నగరం ఆశలు పెట్టుకుంది. మౌలిక వసతులు, ఇతర రంగాలకు ప్రాధాన్యం ఉంటుందని, నిధుల కేటాయింపులు ఉంటాయని నగర వాసులు ఎదురుచూస్తున్నారు. ఎంఎంటీఎస్ కొత్త రైళ్లతో పాటు చర్లపల్లి టెర్మినల్ నుంచి పూర్తి స్థాయిలో నగరంలోని అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ, పుణ్య క్షేత్రాలకు మరిన్ని రైళ్లను అందుబాటులోకి తెస్తారని ఆశిస్తున్నారు. మూసీ పునరుజ్జీవానికి కేంద్రం నిధులు కేటాయించాలని కోరిన రాష్ట్ర ప్రభుత్వ విన్నపానికి అనుకూలంగా స్పందిస్తుందని భావిస్తున్నారు. విశ్వ నగరిగా విస్తరిస్తున్న భాగ్యనగరంలో ఐటీ రంగానికి మరింత బూస్ట్ ఇచ్చేలా కేంద్రం కరుణిస్తుందని, బల్దియా పరిధిలో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పెద్దపీట వేస్తారని అంతా ఆశాభావంతో ఉన్నారు. –సాక్షి, సిటీబ్యూరోబల్దియాను ఆదుకునేనా?కేంద్ర బడ్జెట్లో జీహెచ్ఎంసీకి ఏ మేరకు కేటాయింపులుంటాయోనన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. నగరంలో వివిధ కార్యక్రమాలు చేపడుతున్న జీహెచ్ఎంసీ పలు కార్యక్రమాలకు కేంద్రంపై ఆశలు పెంచుకుంది. గృహ నిర్మాణానికి పీఎంఏవై నిధులతోపాటు ఫ్లై ఓవర్లు, రహదారుల అభివృద్ధి, వరద సమస్యల పరిష్కారం, విపత్తుల నిర్వహణ, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం తదితరాల కోసం రూ. 10 వేల కోట్లకు పైగా కేంద్రాన్ని కోరింది. వరద ముంపు సమస్యల పరిష్కారంతో పాటు చెత్త సమస్య పరిష్కారానికి నిధులు అడిగింది. హైదరాబాద్ వారసత్వాన్ని పరిరక్షించేందుకు పురాతన కట్టడాల పరిరక్షణ తదితరమైన వాటి కోసం కోరింది. రోజురోజూకూ పరిధి పెరుగుతూ, విస్తృతమవుతున్న జనాభాకనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు నిధులవసరముంది. బల్దియా కోరికల్లో ఎన్నింటికి నిధులిస్తారోనని జీహెచ్ఎంసీ వర్గాలు వేచి చూస్తున్నాయి.కొత్త రైళ్లకు పచ్చజెండా ఊపేనా? రెండో దశలో భాగంగా అటు మేడ్చల్ నుంచి ఇటు ఉందానగర్ వరకు. ఘట్కేసర్ నుంచి తెల్లాపూర్ వరకు ఎంఎంటీఎస్ లైన్లు పూర్తయ్యాయి. నాంపల్లి, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి ప్రయాణికులు ఎక్కడికైనా అతి తక్కువ చార్జీలతో రాకపోకలు సాగించే సదుపాయం ఉంది. ప్రయాణికుల డిమాండ్ మేరకు రైళ్లు లేకుండాపోయాయి. కొత్త లైన్లతో పాటు 9 బోగీలతో కూడిన కొత్త ఎంఎంటీఎస్ రైళ్లను కూడా కొనుగోలు చేయాలనే ప్రతిపాదన ఉంది. కానీ ఇప్పటి వరకు ఒక్క రైలు కూడా కొనుగోలు చేయలేదు. దీంతో ఉన్న రైళ్లనే వివిధ ప్రాంతాల మధ్య నడుపుతున్నారు.చర్లపల్లికి ఏదీ కనెక్టివిటీ..మార్చి నుంచి పలు రెగ్యులర్ రైళ్లు చర్లపల్లి నుంచి రాకపోకలు సాగించనున్నాయి. చర్లపల్లి టెరి్మనల్ను ఎంతో ప్రతిష్టాత్మకంగా పునరభివృద్ధి చేసి ప్రారంభించినప్పటికీ పూర్తిస్థాయి కనెక్టివిటీ లేదు. ప్రయాణికులు వివిధ ప్రాంతాల నుంచి చర్లపల్లికి చేరుకొనేలా ఎంఎంటీఎస్ సేవలను పెంచాలి. కాచిగూడ, నాంపల్లి, సికింద్రాబాద్ స్టేషన్లతో పాటు నగరంలోని ఏ ఎంఎంటీఎస్ స్టేషన్ నుంచైనా బయలుదేరి చర్లపల్లికి వెళ్లేలా సరీ్వసులను విస్తరించాల్సి ఉంది.యాదాద్రి ఎంఎంటీఎస్ నత్తడనక..గత ఏడాది బడ్జెట్లో యాదాద్రికి ఎంఎంటీఎస్ పొడిగింపునకు రూ.10 కోట్లు కేటాయించారు. కానీ రైల్వేశాఖ, రాష్ట్రప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు, వనరులు, భూమి, తదితర మౌలిక సదుపాయాల కొరత వెంటాడుతోంది. ఘట్కేసర్ నుంచి రాయగిరి వరకు 33 కిలోమీటర్లు పొడిగించేందుకు 2015లో ప్రణాళికలను సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్టు కోసం రూ. 430 కోట్లతో అంచనాలు రూపొందించారు.కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ లభించలేదు. రైల్వేశాఖ ఇప్పటి వరకు రెండు దఫాలుగా రూ.60 కోట్లు మాత్రం కేటాయించింది. కానీ పనులు ప్రారంభించలేదు.పుణ్యక్షేత్రాలకు వెళ్లేదెలా? హైదరాబాద్ నుంచి అయోధ్య, షిరిడీ, శబరిమల తదితర పుణ్యక్షేత్రాలకు లక్షలాది మంది భక్తులు రాకపోకలు సాగించే అనేక ప్రాంతాలకు డిమాండ్కు సరిపడా రైళ్లు లేకపోవడంతో ఐఆర్సీటీసీ ప్యాకేజీలపై ఆధారపడాల్సి వస్తోంది. మరోవైపు ప్రత్యేక రైళ్లు ప్రకటిస్తే తప్ప రైలెక్కడం సాధ్యం కాదు. షిరిడీకి ప్రస్తుతం అజంతా ఎక్స్ప్రెస్ ఒక్కటే ఉంది. శబరిమలకు కూడా ఒక్క రైలే అందుబాటులో ఉంది. అయోధ్యకు వెళ్లేందుకు దానాపూర్ ఎక్స్ప్రెస్ మాత్రమే ఉంది. పదేళ్లుగా రైళ్ల పెంపు లేకుండాపోయింది.ఆశల మూసీ భాగ్యనగరానికి మణిహారమైన మూసీ నదికి పునరుజ్జీవం కల్పించాలన్న రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మూసీ శుద్ధి, వ్యర్థాలు, వరదల నియంత్రణ వ్యవస్థ, సుందరీకరణ, బృహత్ ప్రణాళిక రూపకల్పనలపై మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఆర్డీసీఎల్) దృష్టి సారించింది. మూసీ పునరుజ్జీవానికి రూ.14,100 కోట్ల బడ్జెట్ను అవసరం అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ మేరకు శనివారం కేంద్ర బడ్జెట్లో సహాయం అందుతుందని ఎంఆర్డీసీఎల్ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మూసీ నదికి పునరుజ్జీవం కల్పించడంతో పాటు పట్టణ నీటి నాణ్యతను మెరుగుపర్చడం, సుస్థిర ప్రగతిని సాధించేందుకు దశల వారీగా నిధులు కేటాయించాలని కోరారు.మూసీ పునరుజ్జీవంలో భాగంగా తొలిదశలో బాపూఘాట్, మీరాలం ట్యాంక్ వద్ద అభివృద్ధి పనులను చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. బాపూఘాట్ వద్ద రక్షణ శాఖకు చెందిన 220 ఎకరాల భూ సమీకరణతో పాటు రిజర్వాయర్, మురుగు నీటి అప్గ్రేడ్లు, మూసీ నదిపై హెరిటేజ్ వంతెనల నిర్మాణం తదితరాల వ్యయాలను బడ్జెట్లో కేటాయింపులు చేయాలని కోరారు.మూసీని ఆదాయ వనరుగా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోంది. పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్íÙప్ (పీపీపీ) ద్వారా పర్యాటకం, ఆతిథ్యం, స్థిరాస్తి రంగాల నుంచి కార్పొరేట్ సోషల్ రెస్సాన్సిబులిటీ (సీఎస్ఆర్) కింద నిధులను సమీకరించనున్నారు. మూసీ చుట్టూ ఉమ్మడి అభివృద్ధి ప్రాజెక్ట్లు, రియల్ ఎస్టేట్ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు స్పానర్íÙప్లు, పేర్ల హక్కులు, పర్యాటక కార్యకలాపాలతో ఆదాయ వనరులను సృష్టించనున్నారు.ఐటీ బూస్ట్..‘సాఫ్ట్వేర్ ట్రయినింగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా’గా పిలిచే హైదరాబాద్ ఐటీ రంగం బడ్జెట్పై కోటి ఆశలు పెట్టుకుంది. దేశీయ సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో రాష్ట్రం వాటా 31 శాతంఆ ఉంటుంది. ప్రధానంగా ఐటీ రంగం కేంద్రీకృతమైన హైదరాబాద్లో సుమారు 1,500లకు పైగా కంపెనీలలో 9 లక్షలకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారం చేపట్టాక గ్రేటర్లో నాల్గో నగరంగా ఫ్యూచర్ సిటీని నిర్మించాలని సంకల్పించారు. ఇందులో ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సిటీతో పాటు ఐటీ రంగానికి అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. తాజాగా కేంద్రం ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో ఏఐ సిటీతో పాటు ఐటీ పార్క్లకు ప్రత్యేక కేటాయింపులు, పన్ను మినహాయింపులతో పాటు ఐటీ మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రత్యేక కేటాయింపులు చేయాలని పరిశ్రమ నిపుణులు కోరుతున్నారు.హైదరాబాద్లో ఐటీ, ఐటీఈఎస్ ఎగుమతులు 2023–24 ఆర్థిక సంవత్సరంలో 11.3 శాతం వృద్ధిని నమోదు చేసింది. మార్చి 31తో ముగియనున్న సంవత్సరానికి తెలంగాణ ఐటీ ఎగుమతులు రూ.2.7 లక్షల కోట్లకు చేరుతాయని అంచనా వేశారు. మధ్య తరగతి జీతభత్యాలకు పన్ను మినహాయింపులతో కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్టార్టప్స్ కోసం పన్నులను హేతుబద్దీకరించాలని, నైపుణాభివృద్ధికి బడ్జెట్లో అధిక ప్రాధాన్యమివ్వాలని కోరారు. ఎంఎస్ఎంఈ రంగానికి దన్నుగా నిలిచేలా బడ్జెట్లో కేటాయింపులు చేయాలిజలమండలిపై దయ చూపేనా..లక్డీకాపూల్: కేంద్ర బడ్జెట్పై జలమండలి ఆశలు పెట్టుకుంది. నలువైపులా విస్తరిస్తున్న çమహా హైదరాబాద్ పరిధిలో మురుగు నీటి నెట్వర్క్ సమగ్ర సీవరేజీ మాస్టర్ ప్లాన్ ప్రాజెక్టు కోసం సుమారు రూ.17,212.69 కోట్లు, మూసీ ప్రక్షాళనలో భాగంగా నదిలో మురుగు నీరు చేరకుండా ఇరువైపులా 55 కి.మీ (మొత్తం 110 కి.మీ) కాల్వల ట్రంక్ సీవర్స్ మెయిన్స్, లార్జ్ సైజ్ బాక్స్ డ్రెయిన్స్, కొత్త సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణాల ప్రాజెక్టు నిర్మాణాల కోసం మరో రూ.10 వేల కోట్లు కేటాయించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించింది. ఈ రెండు పథకాలను అమృత్ పథకం– 2.0 కి చేర్చాలని లేదా ప్రత్యేక ప్రాజెక్టుగా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసింది.రైల్వే బ్రిడ్జిల అభివృద్ధికి రూ.500 కోట్లు కావాలికేంద్ర ప్రభుత్వానికి ఎంపీ ఈటల ప్రతిపాదనలుదేశంలో అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజిగిరిలో రైల్వే అండర్ బ్రిడ్జిలు, ఓవర్ బ్రిడ్జిలను అభివృద్ధి చేయటంతో పాటు రైల్వే క్రాసింగ్, రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ తదితర పనులకు కేంద్ర బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించాలని కోరుతూ స్థానిక ఎంపీ ఈటల రాజేందర్ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశారు. శనివారం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈటల తన నియోజకవర్గ పరిధిలో రైల్వే అభివృద్ధి, ఆధునికీకరణ పనుల కోసం బడ్జెట్లో నిధుల కేటాయింపుపై ప్రతిపాదనలతో కూడిన నివేదికను అందజేశారు.మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని బోల్లారం నుంచి సికింద్రాబాద్ వరకు ఉన్న 12 అండర్, ఓవర్ సింగిల్ బ్రిడ్జిలను పెరుగుతున్న కాలనీలు,బస్తీలకు అనుగుణంగా.. మారుతున్న పట్టణీకరణకు తగ్గట్టుగా ట్రాఫిక్ సమస్య నుంచి ప్రజలను గట్టేక్కించేందుకు డబుల్ బ్రిడ్జిలుగా అభివృద్ధి చేయాలని కేంద్రానికి సమర్పించిన ప్రతిపాదనల్లో పేర్కొన్నారు.యాభై ఏళ్ల క్రితం నాటి రైల్వే క్రాసింగ్లు, రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాని ఎంపీ ఈటల కోరారు. ఈ నేపథ్యంలోనే రైల్వే అభివృద్ధి పనులకు సుమారు రూ.500 కోట్ల ని«ధులు అవసరమవుతాయని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరానికి సమాంతరంగా శివారు మేడ్చల్ జిల్లాను అభివృద్ధి చేసేందుకు అమృత్ పథకంలో అత్యధిక నిధులు కేటాయిచాలని కోరారు.