Movies
-
సంతాన ప్రాప్తి కోసం కత్రినా కైఫ్ భక్తి మార్గం!
దేవుడు, పూజలు అనేవి చాలా పవిత్రమైనవి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎప్పుడో ఓసారి భక్తి మార్గంలోకి వెళ్తారు. అలా కొన్నాళ్లపాటు దేవాలయాలు, పూజలు అని చాలా బిజీ అయిపోతారు. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ కూడా అలానే చేస్తోంది.'ఛావా'తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న విక్కీ కౌశల్ ని.. కత్రినా కైఫ్ 2021లో పెళ్లి చేసుకుంది. వయసులో తన కంటే చిన్నవాడైనప్పటికీ కత్రినా అతడితో కొత్త జీవితం ప్రారంభించింది. పెళ్లి తర్వాత ఒకటి రెండు మూవీస్ చేసింది గానీ ప్రస్తుతానికైతే ఈమె చేతిలో కొత్త ప్రాజెక్టులేం లేవు.(ఇదీ చదవండి: సినిమాలో ఫైట్స్ నచ్చకపోతే నన్ను చితక్కొట్టండి: 'దిల్ రుబా' నిర్మాత)కొన్నాళ్ల క్రితం కుంభమేళాలో పాల్గొన్న కత్రినా కైఫ్.. త్రివేణి సంగమంలో పుణ్యస్నానమాచరించింది. భక్తులకు ప్రసాదం కూడా పంచిపెట్టింది. ఇది జరిగిన ఎన్నిరోజులు కాలేదు ఇప్పుడు కర్ణాటకలోని ప్రసిద్ధ కుక్కే సుబ్రమణ్యస్వామి దేవాలయంలో దర్శనమిచ్చింది. కుటుంబంతో కలిసి సర్ప సంస్కార పూజలో పాల్గొంది.అయితే కుక్కే సుబ్రమణ్యస్వామి దేవాలయాన్ని దర్శిస్తే పెళ్లి కాని యువతలు త్వరలో ఓ ఇంటివారవుతారని, సంతాన ప్రాప్తి కూడా కలుగుతుందని చాలామంది నమ్ముతారు. ఇప్పుడు కత్రినా కూడా ఈ దేవాలయాన్ని సందర్శించడం, ప్రత్యేక పూజలు చేయించడం లాంటివి చూస్తుంటే పిల్లల కోసం గుళ్లు, గోపురాలు తిరిగేస్తూ భక్తి మార్గంలోకి వెళ్లిపోయిందా అనిపిస్తుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ 'ఛావా'.. డేట్ ఫిక్సయిందా?) -
నటి రన్యా రావు కేసులో భారీ ట్విస్ట్.. తరుణ్ రాజు అరెస్ట్
బెంగళూరు: కన్నడ సినీ నటి రన్యా రావు బంగారం స్మగ్లింగ్ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో ఆమె సవతి తండ్రి, డీజీపీ స్థాయి అధికారి కె.రామచంద్రరావు ప్రమేయంపై నిగ్గు తేల్చాలని కర్ణాటక ప్రభుత్వం అదనపు చీఫ్ సెక్రటరీ గౌరవ్ గుప్తాను ఆదేశించింది. ఈ మేరకు సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ అయినట్లు సీఎం కార్యాలయం మంగళవారం తెలిపింది.ఇక, అదే సమయంలో, కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో విధి నిర్వహణలో పోలీసు అధికారుల నిర్లక్ష్యం, లోటుపాట్లపైనా విచారణ చేపట్టాలని సీఐడీ విభాగాన్ని ఆదేశించింది. తక్షణమే దర్యాప్తు చేపట్టి, వారం లోగా నివేదిక అందించాలని స్పష్టం చేసింది. విచారణకు సహకరించాల్సిందిగా సంబంధిత పోలీసు విభాగాలను సీఎంవో కోరింది.రామచంద్రరావు ప్రస్తుతం కర్ణాటక స్టేట్ పోలీస్ హౌసింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. ఈ నెల 3వ తేదీన దుబాయ్ నుంచి బెంగళూరుకు చేరుకున్న రన్యా రావు వద్ద డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ)అధికారులు రూ.12.56 కోట్ల విలువైన బంగారు కడ్డీలను స్వా«దీనం చేసుకున్నారు. మరునాడు ఆమె ఇంట్లో మరికొంత బంగారం, డబ్బు స్వా«దీనం చేసుకోవడం తెలిసిందే. తరచూ దుబాయి వెళ్లి వస్తూ ఆమె బంగారాన్ని దొంగచాటుగా తీసుకువస్తోందని, విమానాశ్రయంలోని పోలీసు సిబ్బంది సోదాలు జరపకుండా ఆమెను పంపించి వేస్తున్నట్లు తేలింది. ఈ వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టించడంతో రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. కాగా, రన్యా రావు బంగారం స్మగ్లింగ్ వ్యవహారంతో మంత్రులకు సంబంధాలున్నట్లు వస్తున్న వార్తలన్నీ రాజకీయ పుకార్లేనని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కొట్టిపారేశారు. కేంద్ర విభాగాలు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. DRI Busts Smuggling Nexus: Ranya Rao’s associate, Tarun Raju, has been taken into custody as part of the ongoing smuggling investigation.#RanyaRao #TarunRaju #DRIProbe #SmugglingCase #BreakingNews #NewsX pic.twitter.com/7zE4CBQA3i— NewsX World (@NewsX) March 11, 2025హోటల్ యజమాని మనవడు అరెస్ట్ ఇదే కేసులో డీఆర్ఐ అధికారులు మంగళవారం బెంగళూరులోని అట్రియా హోటల్ యజమాని మనవడు తరుణ్ రాజును అరెస్ట్ చేశారు. అతడిని బెంగళూరులోని ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టులో హాజరు పరచగా ఐదు రోజుల కస్టడీకి అనుమతించిందని డీఆర్ఐ తెలిపింది. రన్యా రావు, తరుణ్ రాజులకు సన్నిహిత సంబంధాలున్నాయని, విదేశాల నుంచి బంగారాన్ని దొంగచాటుగా తేవడం వీరు కూడబలుక్కుని చేసిందేనని అంటోంది. రన్యా రావు వేరొకరిని పెళ్లి చేసుకోవడంతో వీరి మధ్య సంబంధాలు బెడిసి కొట్టినా చట్ట విరుద్ధ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారంది. దుబాయి నుంచి బంగారాన్ని తీసుకువచ్చేటప్పుడు రన్యా రావు తరుణ్ రాజుతో ఫోన్లో మాట్లాడినట్లు డీఆర్ఐ తెలిపింది. వీరిద్దరినీ వేర్వేరుగా, కలిపి సైతం విచారించినట్లు వివరించింది. అయితే, విచారణ సమయంలో అధికారులు తనను బెదిరించారని, మానసికంగా వేధించారని సోమవారం కోర్టు విచారణ సమయంలో రన్యా రావు ఆరోపించింది. తనను కొట్ట లేదు కానీ, పరుషంగా దూషించారని తెలిపింది. ఇష్టం లేకున్నా తనతో కొన్ని పత్రాలపై సంతకాలు చేయించారని రోదిస్తూ జడ్జికి ఫిర్యాదు చేసింది. -
కోపం తగ్గలే.. హీరోయిన్ ని మళ్లీ పక్కనబెట్టేశారు!
సినిమా సెలబ్రిటీలు పెద్దగా గొడవలు పడటానికి ఇష్టపడరు. కానీ కొన్నిసార్లు నోరుజారి లేదంటే పరిస్థితుల వల్ల ఇబ్బందులకు గురవుతుంటారు. గత కొన్నిరోజుల నుంచి హీరోయిన్ రుక్సార్ ధిల్లాన్ ఇలాంటి అనుభవాలే ఎదుర్కొంటోంది. తాజాగా 'దిల్ రుబా' ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ ఈ తరహా సంఘటనే జరిగింది.(ఇదీ చదవండి: సినిమాలో ఫైట్స్ నచ్చకపోతే నన్ను చితక్కొట్టండి: 'దిల్ రుబా' నిర్మాత)తెలుగులో కొన్ని సినిమాలు చేసిన రుక్సార్ లేటెస్ట్ మూవీ 'దిల్ రుబా'. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఈ చిత్రం.. మార్చిన 14న థియేటర్లలోకి రానుంది. కొన్నిరోజుల క్రితం ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఫొటోగ్రాఫర్లతో ఈమెకు చిన్నపాటి వివాదం జరిగింది. తనకు అసౌకర్యమని చెప్పినా సరే ఫొటోలు తీస్తున్నారని చెప్పింది. దీంతో అప్పటినుంచి మూవీ ఈవెంట్స్ కవర్ చేసే ఫొటోగ్రాఫర్స్ ఈమెని సైడ్ చేస్తున్నారు.తాజాగా హైదరాబాద్ లో మంగళవారం రాత్రి 'దిల్ రుబా' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా.. చివర్లో టీమ్ అంతా ఫొటోలకు పోజులిచ్చారు. కానీ రుక్సార్ ని మాత్రం సైడ్ అయిపోమని ఫొటోగ్రాఫర్స్ చెప్పారు. దీంతో ఆమె పక్కకు తప్పుకొంది. మరి ఈ వివాదం ఎన్నిరోజులు నడుస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) -
సినిమాలో ఫైట్స్ నచ్చకపోతే నన్ను చితక్కొట్టండి: టాలీవుడ్ నిర్మాత
ఇప్పుడు ప్రేక్షకులు చాలా తెలివైనోళ్లు. ఏ సినిమాని థియేటర్లలో చూడాలి, ఏ మూవీని ఓటీటీలో చూడాలనేది వాళ్లకు తెలుసు. దీంతో తక్కువ బడ్జెట్ తో చిత్రాల్ని తీసిన దర్శకులు, నిర్మాతలు.. ప్రేక్షకుల్ని ఆకర్షించేందుకు రకరకాల స్టేట్మెంట్స్ ఇస్తూ వైరల్ అవుతున్నారు. మొన్నీమధ్యే 'కోర్ట్' మూవీ కోసం నిర్మాత నాని.. ఇది నచ్చకపోతే త్వరలో రాబోయే తన 'హిట్ 3' చూడొద్దని అన్నాడు. ఇప్పుడైతే కిరణ్ అబ్బవరంతో 'దిల్ రుబా' అనే మూవీ తీసిన నిర్మాత రవి.. సినిమాలో ఫైట్స్ నచ్చకపోతే తనని చితక్కొట్టి బయటకు విసిరేయండని చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్)'ఫైట్స్ చూసి థియేటర్ తెరని చింపి అవతల పడేయకపోతే.. మధ్యాహ్నం నేను పెట్టే ప్రెస్ మీట్ లో అక్కడే నన్ను చితక్కొట్టేయండి. తర్వాత నన్ను బయటకు విసిరేయొచ్చు. సినిమాలో ఫైట్స్ చూసి మెస్మరైజ్ కాకపోతే నేను నిర్మాతగా మళ్లీ సినిమా తీయను. ఇది కూడా కాన్ఫిడెంట్ గా చెబుతున్నాను' అని నిర్మాత రవి చెప్పుకొచ్చారు.అయితే ఇలాంటి స్టేట్మెంట్స్ యూట్యూబ్ లో వైరల్ అవ్వడానికి, సినిమాపై కొందరి దృష్టి పడటానికి పనికొస్తాయేమో గానీ మూవీ హిట్ అవ్వాలంటే అంతిమంగా ఉండాల్సింది కంటెంట్ మాత్రమే. మరి ఈ శుక్రవారం రిలీజయ్యే 'దిల్ రుబా' ఏం చేస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: ఆ పాట వల్ల మూడురోజులు నిద్రపోలేదు: జాన్వీ కపూర్) -
సినిమా వ్యాపారాన్ని మనమే చంపేశాం: ఆమిర్ ఖాన్
‘‘గతంలో ఏ సినిమా చూడాలనుకున్నా థియేటర్కి వెళ్లేవాణ్ణి. ఎందుకంటే మూవీస్ చూసేందుకు నాకు మరో చాయిస్ లేదు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సినిమాలు విడుదలైన ఎనిమిది వారాలకే ఓటీటీల్లో రిలీజ్ చేసి, మన సినిమా వ్యాపారాన్ని మనమే చంపేశాం’’ అని బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్(Aamir Khan) ఆగ్రహావేదన వ్యక్తం చేశారు.ఈ నెల 14న ఆమిర్ ఖాన్ బర్త్ డేని పురస్కరించుకుని ‘పీవీఆర్ ఐనాక్స్’ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. ‘ఆమిర్ ఖాన్: సినిమా కా జాదూగర్’ పేరుతో ఆయన హిట్ సినిమాలను ప్రదర్శిస్తోంది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమిర్ ఖాన్, రచయిత జావేద్ అక్తర్ పాల్గొన్నారు. ‘‘గతంతో పోలిస్తే ప్రస్తుతం హిందీ చిత్రాలు ప్రేక్షకులను అలరించలేకపోతున్నాయి.బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం లేని దక్షిణాది నటుల సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రూ. 600 నుంచి 700 కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తున్నాయి. మన సినిమాలను కూడా దక్షిణాది దర్శకులు తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్కి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది?’’ అంటూ ఆమిర్ ఖాన్ను ప్రశ్నించారు జావేద్ అక్తర్. ఇందుకు ఆమిర్ స్పందిస్తూ– ‘‘దక్షిణాది, ఉత్తరాది చిత్రాలు అనే విషయం సమస్యే కాదు... దర్శకులప్రాంతీయ నేపథ్యం కూడా అప్రస్తుతం.సినిమా విడుదలైన ఎనిమిది వారాలకే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నాం. ఓటీటీలో ఎన్నిసార్లయినా ఫ్రీగా చూసే వీలుండటంతో ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గించేశారు. ఒక సినిమాని రెండు సార్లు ఎలా అమ్మాలో నాకు తెలియడం లేదు. థియేటర్లలో విడుదలైన మూడు లేదా నాలుగు నెలల తర్వాత ఓటీటీల్లో రిలీజ్ చేయాలి.అప్పుడే థియేట్రికల్ బిజినెస్ బాగుంటుంది. ప్రేమ, కోపం, పగ వంటి ఎమోషన్స్ మీద బాలీవుడ్ రచయితలు, డైరెక్టర్స్ ఎక్కువ ఫోకస్ చేయడం లేదు. కేవలం వినో దానికే పెద్ద పీట వేస్తున్నారు. పైగా మూలాలను మర్చిపోతున్నారు. దక్షిణాది చిత్రాల్లాగా భావోద్వేగాలను మిళితం చేయలేపోతున్నారు’’ అని పేర్కొన్నారు. -
ఆ ఘనత ఆయనకే దక్కుతుంది: ఆది సాయికుమార్
‘‘నా సినిమా విడుదలై సంవత్సరం దాటిపోయింది. ఈ నెల 21న ‘షణ్ముఖ’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. ఈ సినిమా ఘనత అంతా దర్శక, నిర్మాత షణ్ముగం సాప్పనికే దక్కుతుంది. మంచి సినిమాకు ప్రేక్షకుల ఆదరణ తప్పకుండా ఉంటుంది. మా చిత్రం కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని ఆది సాయికుమార్(Adi Sai kumar) చెప్పారు.షణ్ముగం సాప్పని దర్శకత్వంలో ఆది సాయికుమార్, అవికా గోర్ జంటగా నటించిన చిత్రం ‘షణ్ముఖ’. సాప్పని బ్రదర్స్ సమర్పణలో తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని, రమేశ్ యాదవ్ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆది సాయికుమార్ మాట్లాడుతూ– ‘‘మా సినిమా విడుదలకు ముందే అన్ని భాషల శాటిలైట్ హక్కులు, డిజిటల్, థియేట్రికల్ హక్కులు ఫ్యాన్సీ రేటుకు అమ్ముడు పోవడం ఆనందంగా ఉంది’’ అన్నారు.‘‘డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్గా రూపోందిన ఈ మూవీ చేయడం హ్యాపీ’’ అని అవికా గోర్ పేర్కొన్నారు. ‘‘మా సినిమాని ఏపీ, తెలంగాణలో నా మిత్రుడు శశిధర్ రెడ్డి విడుదల చేస్తున్నారు’’ అన్నారు షణ్ముగం సాప్పని. -
రామాయణం ఆధారంగా...
మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ ఇటీవల ఒడిశాలో ప్రారంభమైంది. మహేశ్బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్లు పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు రాజమౌళి.అలాగే మంగళవారం నుంచి ఈ షెడ్యూల్లో ప్రియాంకా చోప్రా కూడా పాల్గొంటున్నారని తెలిసింది. మహేశ్, పృథ్వీరాజ్, ప్రియాంకల కాంబినేషన్ సీన్స్ను చిత్రీకరిస్తున్నారట. కాగా ఈ సినిమా షూటింగ్లోని ఓ వీడియో బయటికొచ్చింది. దీంతో మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లతో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నట్లుగా తెలిసింది.అలాగే ఈ చిత్రానికి మైథలాజికల్ టచ్ ఉందని, రామాయణంలోని కొన్ని ముఖ్య సంఘటనలను స్ఫూర్తిగా తీసుకుని, నేటి ఆధునిక కాలానికి అన్వయించి, ఈ కథను విజయేంద్రప్రసాద్ రెడీ చేశారని సమాచారం. కథలో కాశీ నగరానికి కూడా ప్రాముఖ్యత ఉందట... దాంతో కాశీ నగరాన్ని పోలిన సెట్ను హైదరాబాద్లో ఏర్పాటు చేయాలనే ఆలోచనలో యూనిట్ ఉందని భోగట్టా. -
రాబిన్ హుడ్ నా పుట్టిన రోజు కానుక: నితిన్
‘‘నేను, వెంకీ కుడుముల కలిసి సోమవారం రాత్రి ‘రాబిన్హుడ్’(Robinhood) సినిమా చూశాం. ఈ మూవీ మా కెరీర్లో పెద్ద సినిమా కాబోతుందని చాలా నమ్మకం ఉంది. ఈ నెల 30న నా బర్త్డే. ‘రాబిన్హుడ్’ ఈ నెల 28న వస్తుంది. డైరెక్టర్ వెంకీ ఈ సినిమాతో నాకు బిగ్గెస్ట్ బర్త్ డే గిఫ్ట్ ఇవ్వబోతున్నారు’’ అని హీరో నితిన్ చెప్పారు. వెంకీ కుడుముల డైరెక్షన్లో నితిన్, శ్రీలీల జోడీగా నటించిన చిత్రం ‘రాబిన్హుడ్’. మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదలవుతోంది.ఈ నేపథ్యంలో మంగళవారం నిర్వహించిన ప్రెస్మీట్లో నితిన్ మాట్లాడుతూ–‘‘నేను, శ్రీలీల, రాజేంద్రప్రసాద్గారు, ‘వెన్నెల’ కిషోర్... మా మధ్య వచ్చే సన్నివేశాలు పోట్ట చెక్కలయ్యేలా నవ్విస్తాయి. మైత్రీ మూవీ మేకర్స్ లేకపోతే ఈ సినిమా ఇంత క్వాలిటీగా వచ్చేది కాదు’’ అన్నారు. శ్రీలీల మాట్లాడుతూ–‘‘ఈ సినిమాలో నేను చేసిన మీరా పాత్ర చాలా ప్రత్యేకం. ఈ చిత్రం తప్పకుండా అందర్నీ అలరిస్తుంది’’ అన్నారు.వెంకీ కుడుముల మాట్లాడుతూ–‘‘సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాను. బ్లాక్ బస్టర్ కొడుతున్నాం. ఈ సినిమాలో అతిథిగా చేసిన డేవిడ్ వార్నర్ గారికి ధన్యవాదాలు’’ అని తెలిపారు. ‘‘అద్భుతమైన కథకి వినోదం మిక్స్ చేసిన సినిమా ఇది. ఆడియన్స్ ని అలరిస్తుంది’’అని నటుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. యలమంచిలి రవిశంకర్ మాట్లాడుతూ–‘‘ఈ సినిమాలో వినోదం, మంచి యాక్షన్తో పాటు అన్ని వాణిజ్య అంశాలుఉన్నాయి. మూవీ మంచి సక్సెస్ అవుతుందని మేమంతా నమ్మకంతో ఉన్నాం’’ అని చెప్పారు. -
'కన్నప్ప'తో మంచు విష్ణు అంత రిస్క్ చేస్తారా?
మంచు విష్ణు 'కన్నప్ప' నుంచి తొలి టీజర్ రిలీజైనప్పుడు ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువొచ్చాయి. కానీ కొన్నాళ్ల ముందు విడుదల చేసిన మరో టీజర్ కి మాత్రం పర్లేదు బాగుందనే టాక్ వచ్చింది. దీనికి తోడు రెండు పాటలు కూడా వినసొంపుగా అనిపించాయి. ఇలా ఓ మాదిరి బజ్ ఏర్పడింది. ఇలా 'కన్నప్ప' గురించి కాస్తోకూస్తో అంచనాలు పెరుగుతున్న టైంలో మంచు విష్ణు రిస్క్ తీసుకున్నాడనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుత ట్రెండ్ లో భారీ బడ్జెట్ సినిమాలు చాలా వాటి ఓటీటీ డీల్స్ ముందే పూర్తవుతున్నాయి. తద్వారా పెట్టిన బడ్జెట్ కొంతమేర రికవర్ చేయొచ్చనేది నిర్మాతల ప్లాన్.(ఇదీ చదవండి: దళపతి విజయ్ పై పోలీసులకు ఫిర్యాదు)కానీ 'కన్నప్ప' విషయంలో మాత్రం మంచు విష్ణు రిస్క్ తీసుకోవాలని ఫిక్సయ్యాడట. మూవీ రిలీజ్ కి ముందు డీల్ కుదుర్చుకుంటే ఓటీటీలు ఇచ్చినంత తీసుకోవాలి. అదే రిలీజ్ తర్వాత మూవీ హిట్ టాక్ తెచ్చుకుంటే మనం డిమాండ్ చేయొచ్చని విష్ణు ప్లాన్ అట. మరి ఇందులో నిజమెంతో?కన్నప్పలో మంచు విష్ణుతో పాటు ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్ తదితరులు కీలక పాత్రలు పోషించారని టాక్. ఏప్రిల్ 25న థియేటర్లలోకి రానుంది. మరి బిగ్ స్క్రీన్ పై ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) -
ఆ పాట వల్ల మూడురోజులు నిద్రపోలేదు: జాన్వీ కపూర్
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. హిందీలో పలు సినిమాలు చేసింది గానీ పెద్దగా గుర్తింపు రాలేదు. ఎన్టీఆర్ 'దేవర'తో మంచి పాపులారిటీ తెచ్చుకుంది. ప్రస్తుతం రామ్ చరణ్-బుచ్చిబాబు మూవీలో నటిస్తోంది.తాజాగా తాను నటించిన రూహి సినిమాకు నాలుగేళ్లు పూర్తయిన సందర్బంగా ఈ మూవీలో 'నదియో పార్' పాట చిత్రీకరణ అనుభవాల్ని పంచుకుంది. దీని షూటింగ్ టైంలో తాను చాలా టెన్షన్ పడ్డాడని, మూడు రోజులు నిద్రపోలేదని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: దళపతి విజయ్ పై పోలీసులకు ఫిర్యాదు)'రూహి సినిమా తీసే సమయానికి నటిగా నాకున్న అనుభవం చాలా తక్కువ. దీంతో నదియో పార్ పాట విషయంలో చాలా టెన్షన్ పడ్డాను. భారీ లైట్స్ వెలుగులో కళ్లు తెరిచి చూడలేకపోయేదాన్ని. ఓవైపు 'గుడ్ లక్ జెర్రీ' షూటింగ్ లో పాల్గొంటూనే ఈ పాట రిహార్సల్స్ చేసేదాన్ని. పటియాలాలో రాత్రంతా షూట్ చేసి.. పేకప్ తర్వాత ప్రయాణం చేసొచ్చి పాట షూటింగ్ లో పాల్గొనేదాన్ని.''నిద్రలేకపోయినా 7 గంటల్లో ఆ పాట పూర్తిచేయగలిగాను. మళ్లీ వెంటనే గుడ్ లక్ జెర్రీ షూటింగ్ కి వెళ్లేదాన్ని. అలా మూడురోజుల పాట నిద్రపోలేకపోయాను. కానీ కెమెరా ముందుకొచ్చేసరికి మాత్రం ఎనర్జీ వచ్చేసేది' అని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
దళపతి విజయ్ పై పోలీసులకు ఫిర్యాదు
హీరో దళపతి విజయ్.. ముస్లింలని అవమానించారని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు తమిళనాడు సున్నత్ జమాత్.. చెన్నై పోలీసులకు కంప్లైంట్ చేశారని వార్తలొస్తున్నాయి. రీసెంట్ గా విజయ్ ఇచ్చిన ఇఫ్తార్ విందు దీనికి కారణమని పేర్కొన్నారు.తమిళంలో హీరోగా స్టార్ డమ్ ఉన్న విజయ్.. గతేడాది రాజకీయ అరంగ్రేటం చేశారు. తమిళ వెట్రి కళగం (టీవీకే) పేరుతో పార్టీని స్థాపించారు. వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయంగా తన ముద్ర వేసే ప్రయత్నాల్లో ఉన్నారు.(ఇదీ చదవండి: తమ్ముడి పెళ్లిలో సాయిపల్లవి డ్యాన్స్.. వీడియో వైరల్)అలా గత శుక్రవారం రాయపేట వైఎంసీఏ గ్రౌండులో ముస్లింల కోసం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. రంజాన్ ఉపవాస దీక్ష విరమించే ముందు ప్రార్థనల్లో పాల్గొన్న విజయ్.. హాజరైన వారితో కలిసి విందు కూడా చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కొన్ని వైరల్ అయ్యాయి.అయితే విజయ్ పై తమిళనాడు సున్నత్ జమాత్ ఫిర్యాదు చేసింది. ఉపవాస దీక్షలు, ఇఫ్తార్ విందులతో సంబంధం లేని తాగుబోతులు, రౌడీలు పాల్గొనడం ముస్లింలను అవమానించడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఏర్పాట్లు సక్రమంగా చేయలేదని, విజయ్ తెచ్చిన విదేశీ గార్డులు ప్రజలను అగౌరవపరిచారని తమిళనాడు సున్నత్ జమాత్ కోశాధికారి సయ్యద్ కౌస్ మీడియాతో చెప్పారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) -
ప్రముఖ ఆలయంలో స్టార్ హీరోయిన్ పూజలు
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ఆధ్యాత్మిక బాట పట్టారు. కర్ణాటకలోని ప్రముఖ కుక్కే శ్రీ సుబ్రమణ్య ఆలయాన్ని సందర్శించారు. ఇటీవలే కుంభమేళాలోనూ కత్రినా కైఫ్ పుణ్యస్నానమాచరించారు. తాజాగా శ్రీ సుబ్రమణ్య ప్రత్యేకమైన పూజులు చేశారు. అనంతరం అక్కడే నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ను పెళ్లాడిన కత్రినా కైఫ్ స్టార్ హీరోయిన్గా పలు సినిమాల్లో నటించింది. హీరో విక్కీ కౌశల్ ప్రేమాయణం నడిపిన ముద్దుగుమ్మ 2021లో అతన్ని పెళ్లాడింది. తెలుగులో వెంకటేశ్ సరసన మల్లీశ్వరి చిత్రంలో మెరిసింది. 2023లో మేరీ క్రిస్మస్, టైగర్-3 చిత్రాలతో అభిమానులను మెప్పించిన ముద్దుగుమ్మ ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్ట్లో నటించడం లేదు. ప్రస్తుతం ఆమె భర్త విక్కీ కౌశల్ నటించిన ఛావా మూవీ థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఛావాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇటీవలే తెలుగులోనూ థియేటర్లలో విడుదల చేశారు. ఇప్పటికీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు సృష్టిస్తోంది.కాగా... కత్రినా కైఫ్ ఇటీవల ఐఫా అవార్డ్స్- 2025 వేడుకలో మెరిసింది. జైపూర్లో జరిగిన ఈ వేడుకల్లో పలువురు సినీ అగ్రతారలు పాల్గొని సందడి చేశారు. ఈ అవార్డ్స్లో కిరణ్ రావు తెరకెక్కించిన లపతా లేడీస్ అత్యధిక అవార్డులు సొంతం చేసుకుంది. ఈ వేడుకల్లో బాలీవుడ్ సినీతారలు షారూఖ్ ఖాన్, రవీనా టాండన్, ఆమె కుమార్తె రాషా తడాని, అభిషేక్ బెనర్జీ వంటి ప్రముఖులు కూడా పాల్గొన్నారు. -
గ్లామరస్ జాన్వీ కపూర్.. చిన్నపిల్లలా మృణాల్ క్యూట్ నెస్!
హాయ్ నాన్న జ్ఞాపకాలు షేర్ చేసిన మృణాల్మెరుపుల డ్రస్సుతో కాక రేపుతున్న జాన్వీ కపూర్గవర్నమెంట్ స్కూల్ కి వెళ్లిన నవదీప్-తేజస్వి మదివాడరంజాన్ సీజన్.. ఛార్మినార్ దగ్గర వితికా షేర్ సందడిచీరలో క్యూట్ నెస్ తో కట్టేపడేస్తున్న బిగ్ బాస్ దివిఎర్రచీరలో కలర్ ఫుల్ గా హీరోయిన్ చాందిని చౌదరిబ్లాక్ శారీలో బాలీవుడ్ బ్యూటీ నిమ్రత్ కౌర్ గ్లామర్ View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Chandini Chowdary (@chandini.chowdary) View this post on Instagram A post shared by Poonam kaur (@puunamkhaur) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by Vedhika (@vedhika4u) View this post on Instagram A post shared by Sapthami Gowda 🧿 (@sapthami_gowda) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Kavya Thapar (@kavyathapar20) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) View this post on Instagram A post shared by moonchild (@deeptisati) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Sri Satya (@sri_satya_) View this post on Instagram A post shared by Amyra Dastur (@amyradastur) View this post on Instagram A post shared by ISWARYA MENON (@iswarya.menon) View this post on Instagram A post shared by Nimrat Kaur (@nimratofficial) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Rasha Thadani (@rashathadani) View this post on Instagram A post shared by Nehha Pendse (@nehhapendse) View this post on Instagram A post shared by Sakshi Agarwal (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Ragini Dwivedi (@rraginidwivedi) -
ఆరెంజ్ సినిమా నా ఫేవరేట్.. ఎందుకు ఫ్లాఫ్ అయిందో తెలియదు: ప్రియదర్శి
ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం కోర్ట్. విభిన్నమైన పాత్రలతో అభిమానులను మెప్పించే మరో కొత్త కథలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ మూవీలో రోషన్, శ్రీదేవి కీలక పాత్రలు పోషించనున్నారు. రామ్ జగదీశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నాని వాల్ పోస్టర్ సినిమా సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 14న థియేటర్లలో సందడి చేయనుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు ప్రియదర్శి. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ప్రియదర్శి.. రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.ప్రియదర్శి మాట్లాడుతూ..' రామ్ చరణ్ నటించిన బెస్ట్ ఫిల్స్మ్లో ఆరెంజ్ అంటే ఇష్టం. ఆ సినిమా నాకు ఇన్స్పైరేషన్. అప్పుట్లో ఆ సినిమా అంత కలెక్షన్స్ వచ్చి ఉండవు. కానీ మొన్న రిలీజైనప్పుడు సూపర్గా ఆడింది. ఆ సినిమా ఎప్పుడొచ్చినా నేను, మా చెల్లి చూసేవాళ్లం. మీరు ఆరెంజ్ సినిమాలో సూపర్గా చేశారన్న అని చెప్పేవాన్ని. ఆ సినిమా నాకు ఇప్పుడిచ్చిన చేస్తా. నాకు ఇష్టమైన డైరెక్టర్ ఆయన. అప్పుడు ఎందుకు ఆడలేదో ఇప్పటికీ నాకు అర్థం కాదు. రెండోసార్లు థియేటర్లలో చూశా. ఓటీటీలో వచ్చినప్పుడు కూడా చూశా. ముఖ్యంగా రామ్ చరణ్ అన్న యాక్టింగ్ అంటే చాలా ఇష్టం' అని అన్నారు.కాగా.. కోర్ట్ సినిమాను పోక్సో కేసు ఆధారంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్ చూస్తే ఆ విషయం అర్థమవుతోంది. ఈ చిత్రంలో ప్రియదర్శి లాయర్గా అభిమానులను అలరించనున్నారు. పోక్సో కేసు అంటే ఏంటి? ఎలాంటి శిక్షలు ఉంటాయి? అనే కోణంలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. -
25 రోజులు షూటింగ్ చేస్తే.. 2 నిమిషాలు కూడా ఉంచలేదు: ప్రియదర్శి
శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’(Game Changer). ఈ సంక్రాంతికి థియేటర్స్లో రిలీజైన ఈ చిత్రం భారీ అపజయాన్ని మూటగట్టుకుంది. శంకర్ దర్శకత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. భారీ బడ్జెట్ తీసుకొని.. సినిమాను దారణంగా తీశాడని మండిపడ్డారు. అయితే ఈ సినిమా బడ్జెట్ అనుకున్నదానికన్నా ఎక్కువ పెరగడానికి సవాలక్ష కారణాలు ఉన్నాయి. వాటిలో ఆరిస్టుల ఎంపిక కూడా ఒకటని చెప్పొచ్చు. చిన్న చిన్న పాత్రలకోసం మంచి గుర్తింపు ఉన్న నటీనటులను పెట్టాడు. పోనీ ఆ పాత్రలకు అయినా న్యాయం చేశాడా అంటే అదీలేదు. చాలా మంది నటీనటులను ఒకటి రెండు సీన్లకే పరిమితం చేశారు. అలాంటి వారిలో ప్రియదర్శి కూడా ఒకడు. ఆ సినిమాలో హీరో స్నేహితుడిగా నటించాడు. మొదటి పాట ఫస్ట్ షాట్, పెళ్లిలో డిన్నర్ సీన్ దగ్గర కొద్దిసేపు కనిపించే ప్రియదర్శి తర్వాత ఎక్కడా కనిపించడు. ‘బలగం’ సినిమాతో భారీ పాపులారిటీ సంపాదించుకున్న ప్రియదర్శి కేవలం రెండు సీన్లలో వచ్చివెళ్లడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. తాజాగా దీనిపై ప్రియదర్శి స్పందించాడు.ఆయన నటించిన కోర్టు సినిమా మార్చి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఓ యూట్యూబ్ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘గేమ్ ఛేంజర్’లో తను అంత చిన్న పాత్ర ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పారు. ‘గేమ్ ఛేంజర్’ సినిమా ‘బలగం’ కథ వినకముందు ఓకే చేశాను. అప్పుడు నేను హీరో ఫ్రెండ్ పాత్రలు చేస్తుండేవాడిని. గేమ్ ఛేంజర్లో కూడా అలాంటి పాత్రే. 25 రోజుల పాటు నేను కాల్షిట్లు ఇచ్చాను. షూటింగ్ చేశారు. కానీ ఎడిటింగ్లో ఆ సీన్లు మొత్తం తొలగించారు. నాది చిన్న పాత్ర అని తెలిసినా.. ఒప్పుకోవడానికి ఒకే ఒక కారణం శంకర్. అలాంటి డైరెక్టర్తో పని చేసే అవకాశం మళ్లీ రాకపోవచ్చు. అందుకే చిన్న పాత్ర అయినా చేశాను. 25 రోజుల పాటు షూటింగ్ చేస్తే.. 2 నిమిషాలు కూడా తెరపై చూపించలేదు. శంకర్గారితో పని చేశాననే తృప్తి మాత్రం నాకు ఉంది. దానికోసమే ఆ సినిమా చేశాను’అని ప్రియదర్శి చెప్పుకొచ్చాడు. -
బాధలో 'కాంతార' హీరోయిన్.. పోస్ట్ వైరల్
'కాంతార' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు నచ్చేసిన నటి సప్తమి గౌడ (Sapthami Gowda) బాధపడుతోంది. తన ఇంట్లో ఎంతో ప్రేమగా పెంచుకున్న కుక్క చనిపోవడంతో చాలా పెద్ద పోస్ట్ పెట్టింది. పెడ్ డాగ్ తో ఉన్న బోలెడన్ని జ్ఞాపకాల్ని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ 'ఛావా'.. డేట్ ఫిక్సయిందా?)బెంగళూరుకి చెందిన సప్తమి గౌడ.. 2020 నుంచి సినిమాల్లో నటిస్తోంది. 'కాంతార'తో దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు పరిచయమైంది. గతేడాది 'యువ' అనే మూవీ చేసింది. ప్రస్తుతం 'కాంతార' మూవీ సీక్వెల్ లో నటిస్తోంది. ఇకపోతే తన ఇంట్లో 2010 నుంచి పెంచుకుంటున్న పెంపుడు కుక్క సింబా చనిపోయిందని సప్తమి ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది.(ఇదీ చదవండి: తమ్ముడి పెళ్లిలో సాయిపల్లవి డ్యాన్స్.. వీడియో వైరల్) View this post on Instagram A post shared by Sapthami Gowda 🧿 (@sapthami_gowda) -
సల్మాన్ ఖాన్ సికందర్.. ఆ క్రేజీ సాంగ్ వచ్చేసింది!
బాలీవుడ్ స్టార్, కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తోన్న తాజా చిత్రం సికందర్. ఈ మూవీలో పుష్ప భామ రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్లోనూ రష్మిక హవా కొనసాగుతోంది. ఇటీవలే ఛావా మూవీతో ప్రేక్షకులను పలకరించిన భామ.. రంజాన్ కానుకగా మరోసారి అభిమానులను అలరించనుంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సాజిద్ నదియావాలా నిర్మిస్తున్నారు.తాజాగా సికందర్ మూవీ నుంచి క్రేజీ సాంగ్ను విడుదల చేశారు. భమ్ భమ్ భోలే అంటూ సాగే పాటను విడుదల చేశారు. హోలీ పండుగ రంగుల నేపథ్యంలో రూపొందించిన ఈ పాట సల్మాన్ ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే రిలీజైన టీజర్, జోహ్రా జబీన్ పాటకు ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సాంగ్లో కాజల్ అగర్వాల్ కూడా అభిమానులను మెప్పించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రంజాన్ కాననుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. -
ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ 'ఛావా'.. డేట్ ఫిక్సయిందా?
గత కొన్నిరోజులుగా ప్రేక్షకుల మధ్య డిస్కషన్ కి కారణమైన మూవీ 'ఛావా'. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ నటించిన ఈ పీరియాడికల్ సినిమాన ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తీశారు. ఫిబ్రవరిలో హిందీ వెర్షన్, మార్చి తొలివారంలో తెలుగు వెర్షన్ రిలీజైంది.(ఇదీ చదవండి: తమ్ముడి పెళ్లిలో సాయిపల్లవి డ్యాన్స్.. వీడియో వైరల్)హిందీలో ఎలా అయితే హిట్ టాక్ వచ్చిందో తెలుగులోనూ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో తొలి మూడు రోజులకే దాదాపు రూ.10 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. శుక్రవారం వరకు కొత్త మూవీస్ ఏం లేవు కాబట్టి ఎన్ని కోట్లు వస్తాయో చూడాలి?సరే ఈ సంగతులన్నీ పక్కనబెడితే 'ఛావా' మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ ఖరారైనట్లు తెలుస్తోంది. ఏప్రిల్ రెండో వారం నుంచి అంటే 11వ తేదీన అలా నెట్ ఫ్లిక్స్ లోకి రానుందని సమాచారం. మరి దక్షిణాది భాషల్లోనూ డబ్ చేస్తారా లేదా అనేది చూడాలి.(ఇదీ చదవండి: పెళ్లి రిసెప్షన్ లో ఫుల్ హ్యాపీగా సితార-నమ్రత-చరణ్) -
'ల్యాంప్' అలాంటి సినిమానే :హీరో వినోద్
ప్రస్తుతం ప్రేక్షకులు చిన్న సినిమా పెద్ద సినిమా అనేది తేడా లేకుండా ఏ సినిమా నచ్చితే ఆ సినిమా చూస్తున్నారు. కాబట్టి చిన్న సినిమాలు కూడా పెద్ద హిట్ అవుతున్నాయి. మా ల్యాంప్ సినిమాలో మంచి కంటెంట్ ఉంది. ఈసినిమా అందరికి నచ్చుతుందని, పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’ అన్నారు హీరో వినోద్. వినోద్, మధుప్రియ, కోటి కిరణ్, అవంతిక ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ల్యాంప్’. రాజశేఖర్ రాజ్ దర్శకుడు. ఈ నెల 14న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో తాజాగా వినోద్ మీడియాతో మాట్లాడారు.→ ల్యాంప్ సినిమా ఒక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్.వరుస హత్యలు జరుగుతున్న నేపథ్యంలో వాటిని హీరో ఎలా ఛేదించాడు అనేది కామెడీగా చూపిస్తూనే ఫైనల్ గా అసలు ఏం జరిగింది? ఎలా వాటిని ఆపాడు అనేది ఆసక్తికరంగా చూపించాం. సస్పెన్స్ మెయింటైన్ చేస్తూనే కామెడీ పండించడం నా పాత్ర హైలెట్.→ ప్రేక్షకులు ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటు ఉంటారు .ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా కొత్త రకంగా నటించే నేను , కొత్తగా నటించాలనుకునే యువతీ యువకుల్ని ప్రోత్సహిస్తూ ఉంటాను . కొత్తగా సినిమా తీయాలనుకునే యువ దర్శకులు ,ప్రొడ్యూసర్స్ కి సహకారం అందించడం కోసం మా అకాడమీ నుంచి స్టూడెంట్స్ ని కూడా వాళ్ళకి సపోర్ట్ గా ఆర్టిస్టులుగా ఇస్తూ ఉంటాను.→ ప్రస్తుతం నేను బార్బరీక్ అనే సినిమా రిలీజ్ రెడీగా ఉంది . అలాగే శాసనమా చట్టమా అనే సినిమాలో హీరో సుమన్ గారి కొడుకు క్యారెక్టర్ చేస్తున్నాను మెయిన్ లీడ్ అలాగే డైరెక్టర్ హర్ష గారు డైరెక్టర్ తల్లాడ సాయి కృష్ణ గారి కాంబినేషన్లో రెండు సినిమాల్లో లీడ్ గా నటిస్తూ ఉన్నాను .→ నటుడుగా సినిమాలు వెబ్ సిరీస్ లు రంగస్థలంలో విభిన్నమైన పాత్రలు చేయడానికి నేనెప్పుడూ రెడీ గానే ఉంటాను చేస్తున్నను కూడా అలాగే నిర్మాతగా షార్ట్ ఫిలింలు వెబ్ సిరీస్ లు మా వినోద్ ఫిలిం అకాడమీ తరుపున చాలా చేశాం త్వరలో ఒక సినిమా కూడా మొదలుపెట్టబోతున్నాం.→ అందరికీ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో మా సినిమా టికెట్ రేట్ ని 110 రూపాయలుగా నిర్ణయించాం. కాబట్టి అందరూ వచ్చి మా సినిమా చూడండి. మీరు పెట్టిన 110 రూపాయలకి రెండు వందల పది రూపాయల ఎంటర్టైన్మెంట్ మేము అందిస్తామని గ్యారెంటీ ఇస్తున్నాం -
బాలీవుడ్లో దక్షిణాది సినిమాల హవా.. అసలేం జరుగుతోందన్న జావేద్ అక్తర్
బాలీవుడ్ ప్రముఖ సినీ రచయిత జావేద్ అక్తర్ సంచలన కామెంట్స్ చేశారు. హిందీ సినిమాల్లో ఏ మాత్రం కొత్తదనం కనిపించడం లేదని అన్నారు. తాజాగా ఓ డిబేట్కు హాజరైన ఆయన అమీర్ ఖాన్తో కలిసి బాలీవుడ్ ఇండస్ట్రీపై మాట్లాడారు. హిందీ సినిమాల్లో నాణ్యత రోజు రోజుకు పూర్తిగా తగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బాలీవుడ్ సినిమాలు ప్రేక్షకులతో అన్ని సంబంధాలను కోల్పోయాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.ముఖ్యంగా దక్షిణాది నుంచి వస్తున్న సినిమాలు బాలీవుడ్లో సత్తా చాటుతున్నాయని జావేద్ అక్తర్ తెలిపారు. కనీసం ప్రేక్షకులకు తెలియని నటులతో తీసిన దక్షిణ భారత చిత్రాలు హిందీలో విడుదలై రూ. 600 నుంచి 700 కోట్ల వ్యాపారం చేస్తున్నాయని వెల్లడించారు. చివరికి మన సినిమాలను సైతం సౌత్ డైరెక్టర్స్ తీస్తున్నారని పేర్కొన్నారు. అసలు బాలీవుడ్కు ఏమైంది? అని జావేద్ అక్తర్ ప్రశ్నించారు.అయితే జావేద్ అక్తర్ కామెంట్స్పై ఇదే డిబేట్లో పాల్గొన్న అమిర్ ఖాన్ స్పందించారు. ఇక్కడ సమస్య ఉత్తరాది, దక్షిణాది కాదని అన్నారు. మనం ఎదుర్కొంటున్న సమస్య వేరే విషయమని తెలిపారు. దయచేసి మా సినిమాని చూడండి అని ప్రేక్షకులను అభ్యర్థించే ఏకైక ఇండస్ట్రీ మనదే.. లేదంటే ఎనిమిది వారాల్లో మీ ఇంట్లోనే ఓటీటీలో చూసే అవకాశం కల్పిస్తాం.. ఇదే బాలీవుడ్ బిజినెస్ మోడల్ అని అమీర్ ఖాన్ అన్నారు. ఓటీటీకి ఒకసారి సబ్స్క్రిప్షన్ చెల్లిస్తే చాలు సినిమాను ఎన్నిసార్లైనా వీక్షించవచ్చని తెలిపారు. ఒకే ఉత్పత్తిని రెండుసార్లు ఎలా అమ్మాలో నాకు తెలియదంటూ మాట్లాడారు. గతంలో ఓటీటీలు లేకపోవడం వల్ల థియేటర్లకు వెళ్లి సినిమాలు చేసేవాళ్లమని.. కానీ ఇప్పుడు మనం ఎక్కడైనా సినిమాలు చూడవచ్చని తెలిపారు. ఇప్పుడు థియేటర్లకు వెళ్లవలసిన అవసరం లేదు.. మన సొంత వ్యాపార నమూనాతో మన సినిమాలను చంపుకుంటున్నామని అమిర్ ఖాన్ అన్నారు.హిందీ సినిమా రచయితలు, దర్శకులు ఒత్తిడికి గురికాకుండా కంటెంట్పై దృష్టి పెట్టాలని అమిర్ ఖాన్ సూచించారు. వారు తమ మూలాలను, ప్రాథమిక భావోద్వేగాలను మరచిపోయారని అన్నారు. నాలో నుంచి వచ్చేదాన్ని మాత్రమే నేను చేయగలను.. అది హిట్ అవుతుందా లేదా ఫ్లాప్ అవుతుందా అని నేను ఆలోచించనని అమీర్ అన్నారు. కాగా.. ఇటీవల హన్సల్ మెహతా, వివేక్ అగ్నిహోత్రి కూడా హిందీ సినిమా ప్రస్తుత స్థితిపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. బాలీవుడ్ గ్రాఫ్ పడిపోతోందని అగ్నిహోత్రి వ్యాఖ్యానించగా.. హిందీ చిత్ర పరిశ్రమకు రీసెట్ అవసరమని మెహతా మాట్లాడారు. -
ఊరికే సారీ, థ్యాంక్స్ చెప్పి విలువ తీయొద్దు : కిరణ్ అబ్బవరం
‘ఇప్పటిదాకా మన సినిమాల్లో ఎక్స్ లవర్ వల్ల గొడవలు జరగడం, కామెడీగా చూపించడం జరిగింది. కానీ "దిల్ రూబా"లో ఎక్స్ లవర్ తో కూడా ఒక స్నేహాన్ని షేర్ చేసుకోవచ్చు, మోరల్ సపోర్ట్ ఇవ్వొచ్చనే మంచి పాయింట్ని చెప్పాం’ అన్నారు హీరో కిరణ్ అబ్బవరం(kiran abbavaram). ‘క’లాంటి సూపర్ హిట్ తర్వాత ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘దిల్ రూబా’. విశ్వ కరుణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్గా నటించింది. ఏప్రిల్ 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా కిరణ్ అబ్బవరం మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→"దిల్ రూబా"( Dilruba Movie)లో ఏదో ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేయొద్దనే మేము ముందే ప్రెస్ మీట్స్ లో కథ రివీల్ చేశాం. లవ్ లోని మ్యాజిక్ మూవ్ మెంట్స్ ను ఎంజాయ్ చేస్తారు. హీరో క్యారెక్టరైజేషన్ బాగుంటుంది. మనం సారీ, థ్యాంక్స్ ఎలా పడితే అలా చెప్పేస్తుంటాం. కానీ హీరోకు అలా చెప్పడం నచ్చదు. సారీ, థ్యాంక్స్ మాటలకు ఒక విలువ ఉందనేది అతని వెర్షన్. ఈ సినిమా చేసేప్పుడు నేను కూడా కొంత మారాను. ఊరికే సారీ, థ్యాంక్స్ చెప్పి ఆ మాటల విలువ తీయొద్దు అనుకున్నాను→ ఈ సినిమా వుమెన్ రెస్పెక్ట్ ఫీలయ్యేలా ఉంటుంది. మిగతా వారితో పాటు ఫీమేల్ ఆడియెన్స్ "దిల్ రూబా"ను బాగా ఇష్టపడతారు. 2గంటల 20నిమిషాల మూవీలో ఎక్కడా బోర్ ఫీల్ అవ్వరు. థియేటర్స్ నుంచి బయటకు వచ్చేప్పుడు ఒక మంచి మూవీ చూశామనే భావిస్తారు. "క" కంటే ముందు చేసిన సినిమా కదా ఇందులో కొత్తగా ఏదీ ఉండకపోవచ్చు అనుకుంటారు కానీ 10 టు 20 పర్సెంట్ సీన్స్ ఎక్కడైనా చూసినట్లు అనిపించినా మిగతా మూవీ మొత్తం న్యూ ఏజ్ కమర్షియల్ దారిలో వెళ్తూ ఆకట్టుకుంటుంది.→ ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఇబ్బందిపెట్టే ఒక్క మాట, ఒక్క సీన్ కూడా మూవీలో ఉండదు. నేను చేసిన సిద్ధు క్యారెక్టరైజేషన్ మీకు కంప్లీట్ గా నచ్చుతుంది. నేను ఇలాంటి హై క్యారెక్టర్ చేయలేదు. గతంలో నేను చేసిన చిత్రాల్లో సెటిల్డ్ పర్ ఫార్మెన్స్ చూశారు. ఈ చిత్రంలో నేను కొత్తగా కనిపిస్తా. ఎక్కువ రివీల్ చేయొద్దని ట్రైలర్ లో కొన్ని సీన్స్ కట్ చేయలేదు. థియేటర్ లో మూవీ చాలా ఇంటెన్స్ గా ఉంటుంది.→ మేము మూడేళ్ల క్రితమే ఈ సినిమా మొదలుపెట్టాం. అప్పటికి డ్రాగన్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు బిగిన్ కాలేదు. అయితే మా కంటే ముందు ఆ మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఆ చిత్రాలతో మా దిల్ రూబాకు ఎలాంటి పోలిక ఉండదు. ఫ్రెష్ అప్రోచ్ లో మా మూవీ వెళ్తుంటుంది. తమిళ సినిమా కాస్త బాగున్నా ఇక్కడ ప్రమోషన్ చేసి రిలీజ్ చేస్తున్నారు. మన ఆడియెన్స్ ఆదరిస్తున్నారు. కానీ మనకు తమిళనాట అంత స్కోప్ ఉండటం లేదు. మనం ఆదరించినట్లు వాళ్ల దగ్గర మన సినిమాల ఆదరణ పొందడం లేదు.→ సినిమా నా పేరు మీద థియేటర్స్ లోకి వస్తుంది కాబట్టి నేను మూవీ మేకింగ్ లో ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలో అక్కడివరకు అవుతాను. హీరోగా అది నా బాధ్యతగా భావిస్తా. ఈ ఇయర్ నావి రెండు చిత్రాలు వస్తాయి. నెక్ట్స్ ఇయర్ నుంచి ఏడాదికి మూడు సినిమాలు కనీసం రిలీజ్ చేసుకునేలా ప్లాన్ చేస్తా. దిల్ రూబా తర్వాత వెంటనే కె ర్యాంప్ మూవీ ఉంటుంది.→ గతంలో కొన్ని మూవీస్ మొహమాటానికి చేసినవి ఉన్నాయి. కానీ ఆ తప్పులకు రిగ్రెట్ కావడం లేదు. ఇకపై మంచి మూవీస్ సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తా. క సినిమా తర్వాత ప్రేక్షకులు నన్ను చూసే తీరు మారింది. మంచి సినిమా చేయాలని కష్టపడుతున్నాడు అనే పాజిటివ్ ఒపీనియన్ నాపై మొదలైంది. దాన్ని కాపాడుకుంటూ జర్నీ చేస్తా. ప్రస్తుతం నాలుగు చిత్రాలు చేస్తున్నా. ఈ నాలుగు చిత్రాలు వేటికవి పూర్తిగా భిన్నమైనవి. ఒకటి కల్ట్ లవ్ స్టోరీ, మరొకటి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్. ఇంకోటి ఫ్యామిలీ డ్రామా, నాలుగోది లంకె బిందెల వేట నేపథ్యంలో ఉంటుంది. ఈ సబ్జెక్ట్ చాలా పెద్దది. 3 పార్ట్ మూవీగా తీస్తున్నాం. -
తమ్ముడి పెళ్లిలో సాయిపల్లవి డ్యాన్స్.. వీడియో వైరల్
ప్రస్తుతం సాయిపల్లవి టైమ్ నడుస్తోంది. గతేడాది 'అమరన్' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టగా.. రీసెంట్ గా 'తండేల్'తో మరో హిట్ కొట్టింది. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ 'రామాయణ' చేస్తోంది. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుని సోదరుడు పెళ్లికి హాజరైంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్)సాయిపల్లవికి పూజా కన్నన్ అనే చెల్లి ఉంది. గతేడాది పూజకు పెళ్లి జరిగింది. ఆ వేడుకలో సాయిపల్లవి ఫుల్ సందడి చేసింది. డ్యాన్సులు, ఫొటోలు అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. ఇప్పుడు కజిన్ బ్రదన్ జిత్తుకి పెళ్లి జరగ్గా సాయిపల్లవి హాజరైంది. నీలం చీరలో బుట్టబొమ్మలా ఉంది.అలానే సాయిపల్లవి తన బంధువులతో కలిస సాంప్రదాయ పాటలకు స్టెప్పులు కూడా వేసింది. దీనికి తోడు పెళ్లికి హాజరైన పలువురు.. ఈమెతో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్ అవుతున్నాయి. పెళ్లికి వచ్చింది గానీ సాయిపల్లవి తన ఇన్ స్టాలో ఎక్కడా ఫొటోల్ని, వీడియోలని పోస్ట్ చేయలేదు. ఫ్యాన్ పేజీల్లో వాటిని అందరూ పోస్ట్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: పెళ్లి రిసెప్షన్ లో ఫుల్ హ్యాపీగా సితార-నమ్రత-చరణ్)#Saipallavi #SaiPallavi @Sai_Pallavi92 dancing at her cousin bro wedding ! Performing baduga dance ritual. ♥️🔥💃pic.twitter.com/dbMPwO8TNR— shruthi (@shruthisundar01) March 11, 2025You are my MALAR FOREVER..🥹♥️#SaiPallavi #SaiPallaviBrotherMarriage pic.twitter.com/Hpg9U00BrN— Sai Pallavi FC™ (@SaipallaviFC) March 11, 2025#SaiPallavi ❤️ at #SaiPallaviBrotherMarriageJITHU ♥️ROOPApic.twitter.com/aeRj7OiITe— Saran (@rskcinemabuff) March 11, 2025 -
'ఈగ' స్టోరీతో మరో సినిమా.. టీజర్ రిలీజ్
ఇప్పుడంటే రాజమౌళి పాన్ ఇండియా డైరెక్టర్. కానీ అప్పట్లో ఓ సాధారణ దర్శకుడిగా ఉన్నప్పుడు ఓ ఈగని హీరోగా పెట్టి సినిమా తీసేశాడు. దక్షిణాదితో పాటు హిందీలో రిలీజైన ఈ చిత్రం హిట్ అయింది. ఇప్పుడు అలా ఈగతో మలయాళంలో మరో సినిమా తీశారు. చూస్తుంటే జక్కన్న మూవీకి సీక్వెల్ లా అనిపించింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్)'ప్రేమలు', 'లియో' తదితర డబ్బింగ్ చిత్రాలతో ఓటీటీ వల్ల తెలుగు ప్రేక్షకులకు కాస్త పరిచయమైన మలయాళ నటుడు మథ్యూ థామస్. ఇతడితో పాటు ఈగని ప్రధాన పాత్రధారులుగా పెట్టి 'లవ్లీ' మూవీ తీశారు. ఏప్రిల్ 4న తెలుగులోనూ విడుదల కానుంది. ఈ క్రమంలోనే తాజాగా టీజర్ రిలీజ్ చేశారు.ఓ కుర్రాడితో ఈగ స్నేహం చేయడం, అతడికి కష్టమొస్తే ఆదుకోవడం లాంటి సీన్స్ చూపించారు. ఈగ విజువల్స్ చూస్తుంటే రాజమౌళి 'ఈగ' గుర్తొచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉండబోతుందనేది చూడాలి?(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' నటి) -
ఆ సీన్స్ చేయకపోవడానికి కారణమిదే: కరీనా కపూర్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ గురించి పరిచయం అక్కర్లేని పేరు. గతేడాది సింగం ఏగైన్, క్రూ, ది బకింగ్హమ్ మర్డర్స్ చిత్రాలతో అభిమానులను మెప్పించింది. ది బకింగ్హామ్ మర్డర్స్ మూవీలో పోలీసు పాత్రలో నటించింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన బాలీవుడ్ భామ తన సినీ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ముఖ్యంగా సినిమాల్లో ఇంటిమేట్ సీన్స్ చేయడంపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది. అలాంటి సన్నివేశాలను చేయడం తనకు ఎప్పుడూ సౌకర్యంగా అనిపించలేదని తన 25 ఏళ్ల సినీ కెరీర్ గురించి మాట్లాడింది.కరీనా కపూర్ మాట్లాడుతూ.. "ఇది మొత్తం మనం చూసే ఆలోచన విధానంపై ఆధారపడి ఉంది. లైంగికతను మానవ అనుభవంగా మనం చూడం. ఇలాంటి సీన్స్ తెరపై ఉంచే ముందు మనం దానిని మరింతగా లోతుగా చూడటం, గౌరవించడం ప్రారంభించాలి. ఇదే నా నమ్మకం," అని ఆమె అన్నారు. అలాంటి సన్నివేశాల్లో నటించడానికి మీరెందుకు ఆసక్తి చూపడం లేదని ప్రశ్నించగా.. కరీనా కపూర్ స్పందించింది. కథను అలా ముందుకు తీసుకెళ్లడం ముఖ్యం కాదని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నా.. కథ పరంగా అయితే అది తప్పనిసరి అని నేను నమ్మను.. ఎందుకంటే అలా చేయడం సౌకర్యంగా ఉండదని నాకు తెలుసు. నేను ఎప్పుడూ అలా చేయలేదు' అని తెలిపింది.(ఇది చదవండి: సీక్రెట్గా పెళ్లి.. 4 నెలలకే విడాకులు తీసుకున్న నటి!)కాగా.. కరీనా కపూర్ తన 25 ఏళ్ల సినీ కెరీర్లో తెరపై ఎప్పుడూ లైంగిక సన్నివేశాల్లో నటించలేదు. 2003లో వచ్చిన 'చమేలి' సినిమాలో కపూర్ ఒక సెక్స్ వర్కర్ పాత్ర మాత్రమే పోషించింది. ఈ సినిమాలో నటించడంపై కరీనా మాట్లాడుతూ..ఈ సినిమా ద్వారా నేను చాలా విషయాలను గ్రహించానని తెలిపింది. స్త్రీ తత్వం, అందంగా ఉండటం వంటి సాంప్రదాయ భావనలకు అనుగుణంగా ఉండవలసిన అవసరం లేదని అనిపించింది. ఈ సినిమా నా కెరీర్లో ఒక టర్నింగ్ పాయింట్ అని వివరించింది. అది చిన్న వయసులో నా ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని కరీనా కపూర్ చెప్పుకొచ్చింది. ఆ పాత్ర పోషించినందుకు నేను సంతోషంగా అనిపించిందని తెలిపింది. కాగా.. కరీనా కపూర్ కభీ ఖుషీ కభీ ఘమ్, ఐత్రాజ్, చుప్ చుప్ కే, గోల్మాన్ రిటర్న్స్, జబ్ వి మెట్, ఉడ్తా పంజాబ్ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. -
కాపీరైట్ కేసు.. హైకోర్టులో డైరెక్టర్ శంకర్కి భారీ ఊరట!
కోలీవుడ్ డైరెక్టర్ శంకర్( Shankar )కు సంబంధించిన ఆస్తులను ఈడీ అటాచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనకు మద్రాస్ కోర్టు ఊరట కల్పించింది. రోబో సినిమా కథ విషయంలో కాపీరైట్(Copyright Case) ఉల్లంఘనకు పాల్పడ్డారని శంకర్పై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఆయనకు సంబంధించిన సుమారు రూ. 10 కోట్ల ఆస్తులను కొద్దిరోజుల క్రితమే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. అయితే, ఈడీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. మరోసారి హైకోర్టులో పిటిషన్ వేశారు. గతంలో తనకు అనుకూలంగా ఇచ్చిన కోర్టు తీర్పును కూడా లెక్కచేయకుండా ఈడీ చర్యలు తీసుకోవడం ఏంటి అంటూ మరోసారి కోర్టుకు వెళ్లారు. దీంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చర్యలపై మద్రాసు హైకోర్టు స్టే విధించింది.తాను ఎలాంటి కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడలేదని మద్రాస్ హైకోర్టులో కొద్దిరోజల క్రితమే శంకర్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ఈరోజు (మార్చి 11) న్యాయమూర్తులు ఎంఎస్ రమేష్, ఎన్. సెంథిల్కుమార్ల సెషన్లో విచారణకు వచ్చింది. ఆ సమయంలో శంకర్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది పీఎస్ రామన్.. రోబో సినిమా కథ విషయంలో శంకర్ కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించలేదని మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జి వారు గతంలోనే శంకర్కు అనుకూలంగా తీర్పునిచ్చారని గుర్తుచేశారు. అయినప్పటికీ ఎన్ఫోర్స్మెంట్ విభాగం వారు శంకర్ ఆస్తులను జప్తు చేశారని న్యాయవాది కోర్టుకు తెలిపారు. సినిమాకు సంబంధంలేని ఆస్తులను కూడా ఈడీ ఎలా జప్తు చేస్తుందని ఆయన ప్రశ్నించారు. దీంతో కేసును విచారించిన న్యాయమూర్తులు.. ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయడం సాధ్యమేనా..? అని ఈడీని ప్రశ్నించారు.దర్శకుడు శంకర్కు అనుకూలంగా సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చినప్పుడు తుది ఫలితం వచ్చే వరకు వేచి చూడకుండా ఇప్పుడు ఎందుకు చర్యలు తీసుకున్నారని న్యాయస్థానం ప్రశ్నించింది. దీనిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లాయర్ స్పందిస్తూ.. నేరం రుజువైతే ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ విభాగం కేసు నమోదు చేయవచ్చని తెలిపారు. అయితే, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ చర్యల వల్ల డైరెక్టర్ శంకర్కు ఎలాంటి నష్టం జరగలేదని, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్తో ఈ కేసును ఎదుర్కోవచ్చని ఆయన తెలిపారు. కానీ, ఈడీని కోర్టు తప్పబట్టింది. శంకర్ పిటిషన్పై పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలని ఎన్ఫోర్స్మెంట్ శాఖను ఆదేశిస్తూ విచారణను ఏప్రిల్ 21కి వాయిదా వేశారు.ఏం జరిగిందంటే..?సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన బ్లాక్బస్టర్ హిట్ మూవీ రోబో. శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఈ సైంటిఫిక్ యాక్షన్ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేసింది. తమిళంలో ఎంథిరన్ పేరుతో ఈ మూవీని శంకర్ తెరకెక్కించారు. అయితే, ఈ కథను ‘జిగుబా’ను కాపీ కొట్టిసినిమా తెరకెక్కించారంటూ అరూర్ తమిళనాథన్ అనే వ్యక్తి 2011లోనే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాపీరైట్ చట్టాన్ని ఆయన ఉల్లంఘించారని పిటిషన్లో తెలిపారు. ఈ కేసు విషయంలో ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్టీఐఐ) నివేదిక శంకర్కు వ్యతిరేకంగా వచ్చింది. ఈ క్రమంలో జిగుబా కథకు, రోబో సినిమాకు మధ్య ఎలాంటి వ్యత్యాసం లేదని తేల్చేసింది. దీంతో శంకర్ కాపీరైట్ చట్టంలోని సెక్షన్ 63ని ఉల్లంఘించినట్లు ఈడీ పేర్కొంది. -
చరిత్ర తిరగరాస్తోన్న ఛావా.. ఏకంగా బాహుబలి-2 రికార్డ్ను కూడా!
బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటించిన హిస్టారికల్ చిత్రం ఛావా. ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. మొదట హిందీలో మాత్రమే రిలీజైన ఈ సినిమా తిరుగులేని వసూళ్లతో దూసుకెళ్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.700 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇటీవల తెలుగులోనూ విడుదలైన ఛావా కలెక్షన్ల పరంగా అదరగొడుతోంది.తాజాగా ఈ చిత్రం హిందీలో క్రేజీ రికార్డ్ను సొంతం చేసుకుంది. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి-2 రికార్డ్ను అధిగమించింది. ప్రభాస్ నటించిన బాహుబలి-2 హిందీలో రూ.510 కోట్ల వసూళ్లు రాబట్టింది. తాజాగా ఛావా చిత్రం ఆ రికార్డ్ను దాటేసింది. కేవలం హిందీలోనే రూ.516 కోట్ల వసూళ్లు చేసింది. కేవలం విడుదలైన 25 రోజుల్లోనే బాహుబలి-2 రికార్డ్ను బద్దలు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా హిందీ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన ఆరో సినిమాగా నిలిచింది. దీంతో విక్కీ కౌశల్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.తెలుగులోనూ దూసుకెళ్తోన్న ఛావా..బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా 'ఛావా' తెలుగులో కూడా భారీ కలెక్షన్స్ నమోదు చేస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఛావా తెలుగు వర్షన్ కలెక్షన్స్తో పాటు సినిమాలోని క్లైమాక్స్ సీన్ మేకింగ్ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. శంభాజీ మహారాజ్గా విక్కీ కౌశల్ ఈ మూవీ కోసం ఎంతలా కష్టపడ్డారో అందులో చూపించారు. ఔరంగజేబు పాత్రతో అక్షయ్ ఖన్నా మేకింగ్ విధానాన్ని కూడా చూపారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ. 530 కోట్ల మార్క్ను ఛావా చేరుకుంది. తెలుగు వర్షన్లో మాత్రం కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 10.91 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు గీతా ఆర్ట్స్ పేర్కొంది. -
అమ్మాయితో కనిపించిన చాహల్.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన భార్య ధనశ్రీ వర్మ!
భారత స్టార్ క్రికెటర్, స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిపోయాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత మరింత ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఆట కంటే వ్యక్తిగత విషయాలతో చాహల్ మరింత ఫేమస్ అవుతున్నాడు. ఇటీవల దుబాయ్ వేదికగా జరిగిన ఛాంఫియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఓ అమ్మాయితో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇది చూసిన నెటిజన్స్ ఇంతకీ ఆమె ఎవరా అని ఆరా తీస్తే ఆర్జే మహ్వాష్గా గుర్తించారు. ఇంకేముంది ఆమెతో మనోడు పీకల్లోతు డేటింగ్లో ఉన్నాడంటూ సోషల్ మీడియాలో కోడై కూస్తోంది.ఈ సంగతి పక్కనపెడితే.. యుజ్వేంద్ర చాహల్ భార్య, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ తాజాగా ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. తన భర్త చాహల్ దిగిన ఫోటోలను ఇన్స్టాలో రీ లోడ్ చేసింది. అతనితో ఉన్న ఫోటోలతో పాటు పెళ్లి ఫోటోలు కూడా అన్ని ధనశ్రీ వర్మ ఇన్స్టాగ్రామ్లో మళ్లీ దర్శనమిచ్చాయి. ఇప్పటికే ఈ జంట విడాకులు తీసుకోబోతున్నారంటూ చాలాసార్లు వార్తలొచ్చాయి. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడంతో రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు తెగ వైరలయ్యాయి. తాజాగా చాహల్ ఫోటోలు రీ లోడ్ చేయడంతో వీరిద్దరు విడాకుల రూమర్స్కు చెక్ పడే అవకాశముంది. వాటిని ఫుల్స్టాప్ పెట్టేందుకే ఇచ్చేందుకే ధనశ్రీ వర్మ ఫోటోలన్నింటినీ రీ స్టోర్ చేసినట్లు తెలుస్తోంది.కాగా.. యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ 2020లో వివాహం చేసుకున్నారు. అయితే వీరిద్దరు ఇప్పటికే కోర్టులో విడాకుల పిటిషన్ వేసినట్లు తెలుస్తోది. ఇటీవల ధనశ్రీ న్యాయవాది అదితి మోహోని ఈ విషయాన్ని వెల్లడించారు. 2024లోనే విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. మరోవైపు ధనశ్రీ వర్మ రూ. 60 కోట్ల భరణం డిమాండ్ చేసిందని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ ఆరోపణలను ఆమె కుటుంబం ఖండించింది. View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) -
'ఛావా' తెలుగులో కలెక్షన్స్ రికార్డ్.. క్లైమాక్స్ మేకింగ్ వీడియో చూశారా..?
బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా 'ఛావా' తెలుగులో కూడా భారీ కలెక్షన్స్ నమోదు చేస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఛావా తెలుగు వర్షన్ కలెక్షన్స్తో పాటు సినిమాలోని క్లైమాక్స్ సీన్ మేకింగ్ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. శంభాజీ మహారాజ్గా విక్కీ కౌశల్ ఈ మూవీ కోసం ఎంతలా కష్టపడ్డారో అందులో చూపించారు. ఔరంగజేబు పాత్రతో అక్షయ్ ఖన్నా మేకింగ్ విధానాన్ని కూడా చూపారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ. 530 కోట్ల మార్క్ను ఛావా చేరుకుంది. తెలుగు వర్షన్లో మాత్రం కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 10.91 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు గీతా ఆర్ట్స్ పేర్కొంది.ఫిబ్రవరి 14న హిందీ వర్షన్లో మాత్రమే విడుదలైన ఈ మూవీ తెలుగు డబ్బింగ్లో మార్చి 7న థియేటర్స్లోకి వచ్చేసింది. ఈ ఏడాది బాలీవుడ్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా ఛావా రికార్డు నెలకొల్పింది. మూడు వారాల తర్వాత తెలుగులో విడుదలైనప్పటికీ కలెక్షన్స్ పరంగా దుమ్మురేపుతుంది. ఫైనల్గా రూ. 20 కోట్ల మార్క్ను ఛావా టాలీవుడ్లో అందుకుంటుందని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు.ఛావా క్లైమాక్స్ మేకింగ్ఛావా సినిమాలో సంగమేశ్వర్ వద్ద జరిగిన క్లైమాక్స్ సీక్వెన్స్ చాలా కీలకంగా ఉంటుంది. మూవీకి అత్యంత బలాన్ని ఇచ్చే ఈ సీన్ను ఎలా తెరకెక్కించారో ప్రేక్షకులకు చూపారు. శంభాజీ మహారాజ్గా విక్కీ కౌశల్ను ఎలా రెడీ చేశారో చూపారు. శంభాజీ మహారాజ్గా కనిపించేందుకు తాను ఆరు నెలల పాటు శిక్షణ తీసుకున్నట్లు విక్కీ కౌశల్ ఇప్పటికే చెప్పారు. రోజుకు ఆరు నుంచి 8 గంటలకు పైగానే శిక్షణ కోసమే కేటాయించానని ఆయన అన్నారు. ఆయనలా ధృఢమైన శరీరంతో కనిపించేందుకు కండలు పెంచడమే కాకుండా సుమారు 100 కేజీల వరకు విక్కీ బరువు పెరిగిన విషయం తెలిసిందే. -
సీక్రెట్గా పెళ్లి.. 4 నెలలకే విడాకులు తీసుకున్న నటి!
బాలీవుడ్లో నటీనటులు ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఎంత సహజమో..విడిపోవడం అంతే సహజం. ఇలా పెళ్లి చేసుకోని అలా విడాకులు తీసుకున్న జంటలు చాలానే ఉన్నాయి. తాజాగా మరో జంట విడిపోయింది. బాలీవుడ్ బుల్లితెర నటి,అపోలీనా(ఫేమస్ సైన్స్ డ్రామా సిరిస్) ఫేం అదితి శర్మ తన భర్త అభిజిత్ కౌశిక్తో విడిపోయినట్లు తెలుస్తోంది. గతేడాది నవంబర్లో సీక్రెట్గా పెళ్లి చేసుకున్న ఈ జంట.. నాలుగు నెలల కూడా కలిసి కాపురం చేయలేకపోయింది.నాలుగేళ్లుగా సహజీవనం.. సీక్రెట్గా పెళ్లిబాలీవుడ్ బుల్లితెరపై అదితి శర్మకు మంచి ఫాలోయింగ్ ఉంది. సీరియళ్లతో పాటు పలు షోలలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. గత నాలుగేళ్లుగా ఆమె అభిజిత్ కౌశిక్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తుంది. ఈ విషయం బాలీవుడ్ మొత్తానికి తెలుసు. సోషల్ మీడియాలోనూ ఇద్దరు సన్నిహితంగా ఉన్న ఫోటోలను షేర్ చేసేవారు. కొన్నాళ్ల పాటు సహజీవనం చేసిన తర్వాత గతేడాది నవంబర్లో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహం అత్యంత రహస్యంగా జరిగింది. తన కెరీర్కి ఇబ్బంది కలుగొద్దని ఇలా సీక్రెట్గా పెళ్లి చేసుకున్నామని, ఇప్పుడు ఆమె ప్రవర్తన నచ్చక విడిపోయామని ఆమె భర్త అభిజిత్ కౌశిక్ చెప్పారు. అదితి ఒత్తిడితోనే పెళ్లి!తాజాగా ఆయన తన న్యాయ సలహాదారు రాకెశ్ శెట్టితో కలిసి ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. ‘అదితి నేను నాలుగేళ్లుగా కలిసి ఉంటున్నాం. గతేడాది నవంబర్ 12న మేం సీక్రెట్గా పెళ్లి చేసుకున్నాం. ఏడాదిన్నరగా అదితి నాపై ఒత్తిడి తెవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లికి ఓకే చెప్పాను. పెళ్లి విషయం బయటకు తెలిస్తే తన కెరీర్కి ఇబ్బంది అవుతుందని అదితి చెప్పడంతో మా ఇద్దరి ఫ్యామిలీల సమక్షంలో మాత్రమే పెళ్లి చేసుకున్నాం. దానికి సంబంధించిన ఫోటోలు కూడా ఉన్నాయి’ అని అభిషేక్ చెప్పారురూ.25లక్షలు డిమాండ్అదితి శర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్న అభిషేకే ఇప్పుడు విడాకులు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఆమె అపోలీనా కో స్టార్ సమర్థ గుప్తాతో సన్నిహితంగా ఉంటుందని, వారిద్దరు ఏకాంతంగా ఉన్నప్పుడు తాను చూశానని ఆరోపించాడు. ఈ కారణంగానే తాను విడాకులు కోరానని అభిషేక్ చెప్పారు. అయితే విడిపోవడానికి అదితి శర్మ కుటుంబ సభ్యులు కూడా అంగీకరిస్తూనే రూ. 25 లక్షలు డిమాండ్ చేశారని అభిషేక్ న్యాయ సలహాదారు రాకేశ్ తెలిపారు. -
ఓటీటీలో 'డ్రాగన్' సినిమా.. పోస్టర్ వైరల్
కంటెంట్ బాగుంటే చాలు భాషతో సంబంధం లేకుండా హిట్ కొట్టొచ్చని లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ మరోసారి నిరూపించాడు. ఆయన నటించిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ (Return Of The Dragon) బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అయితే, తాజాగా ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. ఈ సినిమా తమిళం, తెలుగు భాషల్లో ఫిబ్రవరి 21న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి యూత్ బాగా కనెక్ట్ అయ్యారు.మార్చి 14న హిందీలో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ రిలీజవుతుండగా ఇంతలోనే ఓటీటీ గురించి ఒక పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుంది. తెలుగు,తమిళ్,మలయాళం,కన్నడలో మార్చి 21 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుందని షోషల్మీడియాలో పోస్టర్ షేర్ అవుతుంది. దీంతో అభిమానులు కూడా వైరల్ చేస్తున్నారు. అయితే, నెట్ఫ్లిక్స్ అధికారిక సోషల్మీడియా నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. కేవలం రూ. 35 కోట్లతో తెరకెక్కించిన డ్రాగన్ బాక్సాఫీస్ వద్ద రూ. 150 కోట్ల మార్క్ కలెక్షన్లకు దగ్గరగా ఉంది. కథేంటి..?డి.రాఘవన్(ప్రదీప్ రంగనాథన్)(Pradeep Ranganathan) ఇంటర్మీడియట్లో 96 శాతం మార్కులతో పాస్ అయిన తర్వాత తాను ఇష్టపడిన అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. అయితే ఆమె తనకు బ్యాడ్ బాయ్స్ అంటేనే ఇష్టమని చెబుతూ అతని ప్రేమను రిజెక్ట్ చేస్తుంది. దీంతో రాఘవన్ బ్యాడ్ బాయ్గా మారిపోయి బీటెక్లో 48 సబ్జెక్టుల్లో ఫెయిల్ అవుతాడు. రెండేళ్ల పాటు ఖాలీగా ఉండడంతో కాలేజీలో తనను ప్రేమించిన అమ్మాయి కీర్తి(అనుపమ పరమేశ్వరన్)(Ashwath Marimuthu) బ్రేకప్ చెప్పి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది.దీంతో జీవితంలో ఎలాగైన సక్సెస్ కావాలని ఫేక్ సర్టిఫికేట్స్ వల్ల మంచి ఉద్యోగం సంపాదిస్తాడు. తనకున్న తెలివితో పెద్ద పొజిషియన్కి వెళ్తాడు. ఇల్లు, కారు కొంటాడు. బాగా ఆస్తులు ఉన్న అమ్మాయి పల్లవి (కయాదు లోహర్)తో పెళ్ళి కూడా ఫిక్స్ అవుతుంది. లైఫ్ అంతా సాఫీగా సాగుతున్న సమయంలో ఫేక్ సర్టిఫికెట్స్ గురించి ప్రిన్సిపల్కి తెలుస్తుంది. అక్కడి నుంచి అసలు కథ మొదలౌతుంది. డ్రాగన్కు ప్రిన్సిపల్ పెట్టే కండీషన్స్ ఏంటి..? బీటెక్లో 48 సబ్జెక్టులను ఎలా పూర్తి చేశాడు. కాలేజీ డేస్లో తను ప్రేమించిన అమ్మాయి కీర్తి(అనుపమ పరమేశ్వరన్) మరోసారి ఆయన జీవితంలోకి ఎందుకొస్తుంది..? ఉద్యోగం ఉందని చెప్పి పెళ్లి సెట్ చేసుకున్న పల్లవితో ఏడడుగులు వేస్తాడా..? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే(Return Of The Dragon Review ). -
ఆరు నెలలు ఆగండి.. త్రివిక్రమ్కు బన్నీ రిక్వెస్ట్!
పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్(Allu Arjun ) నటించే తదుపరి సినిమా ఏంటనేదానిపై ఇప్పుడు రకరకాల ఊహగానాలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. మొన్నటి వరకు త్రివిక్రమ్( Trivikram Srinivas)తో సినిమా ఉంటుంది.. అది కూడా భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా అని వార్తలు వినిపించాయి. ఇప్పుడేమో బన్నీ మరో తమిళ దర్శకుడితో చేతులు కలిపాడని, అదే ఇప్పుడు తెరకెక్కుతుందని అంటున్నారు. జవాన్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అట్లీ దర్శకత్వంలో బన్నీ ఓ సినిమా చేయబోతున్నాడట. ఈ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.బన్నీ కోసం స్టోరీ రెడీ చేసిన గురూజీగుంటూరుకారం తర్వాత తివిక్రమ్ శ్రీనివాస్ మరో సినిమా చేయలేదు. ఆ సినిమా రిలీజ్కి ముందే బన్నీతో సినిమా చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో బన్నీ సరికొత్త గెటప్లో కనిపించబోతున్నారనే వార్తలు కూడా వినిపించాయి. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా పూర్తి చేశారట. పుష్ప 2 రిలీజ్ అయిన వెంటనే ఈ సినిమా పట్టాలెక్కేస్తుందని అంతా భావించారు. కానీ బన్నీ తన మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. తివిక్రమ్ కంటే ముందు వేరే దర్శకుడితో ఓ సినిమా చేయాలని భావిస్తున్నాడట.నా కోసం ఆరు నెలలు ఆగండితన కోసం కథ రెడీ చేసి సిద్ధంగా ఉన్న త్రివిక్రమ్ని తాజాగా బన్నీ కలిశారు. మరోసారి ఇద్దరు స్క్రిప్ట్ గురించి చర్చించుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా బన్నీ తన మనసులో మాట చెప్పేశాడట. ఈ సినిమా షూటింగ్ కంటే ముందు మరో సినిమా చేస్తానని, 2026లో అది రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు తివ్రిక్రమ్కి వివరించారట. ఆ సినిమా షూటింగ్ ప్రారంభం అయిన కొద్ది రోజులకే.. ఈ సినిమా కూడా ప్రారంభిద్దామని, తనకోసం ఓ ఆరు నెలలు వెయిట్ చేయమని రిక్వెస్ట్ చేశారట. దీనికి త్రివిక్రమ్ కూడా అంగీకరించారట.రెండు సినిమాల షూటింగ్స్లో పాల్గొనేలా ప్లాన్ చేసుకోమని బన్నీని అడిగారట. ఆ సినిమా షూటింగ్ మొత్తం అయిపోయేవరకు తాను ఆగలేనని, మధ్యలో జాయిన్ అవుతానంటే తనకు ఓకే అని చెప్పారట. బన్నీ కూడా మొదట అట్లీ సినిమా షూటింగ్ ప్రారంభించి, తర్వాత త్రివిక్రమ్ మూవీని సెట్పైకి తీసుకురావాలనుకుంటున్నాడట. త్రివిక్రమ్ మూవీ షూటింగ్కి చాలా సమయం పడుతుంది. 2027లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అందుకే మధ్యలో అట్లీ సినిమా చేస్తే..అది వచ్చే ఏడాదిలో రిలీజ్ చేసి గ్యాప్ లేకుండా చూసుకోవాలని బన్నీ భావిస్తున్నాడట. పుష్ప 1,2 చిత్రాల కోసం ఐదేళ్లు కేటాయించిన బన్నీ..ఇప్పుడు వరుస సినిమాలతో ఫ్యాన్స్ని అలరించాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. -
హేయ్ మాగా..! 'దిల్ రూబా' కేసీపీడీ సాంగ్ వచ్చేసింది
కిరణ్ అబ్బవరం, రుక్సార్ థిల్లాన్ జంటగా నటించిన చిత్రం ‘దిల్ రూబా’ నుంచి మరో సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. విశ్వ కరుణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రవి, జోజో జోస్, రాకేశ్ రెడ్డి, సారెగమ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం మార్చి 14న విడుదల కానుంది. ‘దిల్ రూబా’ ప్యూర్ లవ్ ఎమోషన్తో అద్భుతంగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.ఈ చిత్రంలో ప్రేమకథను కొత్తగా చెప్పే ప్రయత్నం చేశామని దర్శకుడు విశ్వ కరుణ్ చెప్పారు. ఈ కథ గురించి ఆయన రెండు మాటల్లో ఇలా చెప్పారు 'ఓ రకంగా చెప్పాలంటే క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్ ఇది. ఊరికే ‘సారీ, థ్యాంక్స్’లు చెప్పటానికి హీరో ఇష్టపడడు. ఓ సందర్భంలో హీరో ‘సారీ’ చెప్పకపోవడం వల్ల అతని చుట్టూ ఉన్నవాళ్లు కూడా ఇబ్బందులపాలవుతారు. ఈ సమస్య నుంచి హీరో ఎలా బయటపడ్డాడు? అన్నదే కథ.' అంటూ హింట్ ఇచ్చారు.అలాగే ఊరికే ఎవరికీ కోపం రాకూడదని,... కోపం వస్తే దాని వెనకాల సహేతుకమైన కారణం ఉండాలని హీరో భావిస్తాడని ఆయన అన్నారు. ఈ అంశం కూడా సినిమాలో ఉందని తెలిపారు. ‘క’ సినిమా విజయం సాధించడంతో, ‘దిల్ రుబా’పై మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నామని పేర్కొన్నారు. అందుకే కథలో కొన్ని మార్పులు చేశామని చెప్పారు. కానీ కథలోని ఆత్మ ఏ మాత్రం మారలేదని ఆయన అన్నారు. -
'పుష్ప'రాజ్గా జడేజా.. వీడియో రిలీజ్ చేసిన 'చెన్నై సూపర్ కింగ్స్'
అంతర్జాతీయ క్రికెట్లో అల్లు అర్జున్ నటించిన పుష్ప మార్క్ ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. ఆటగాళ్లు వికెట్లు తీసినప్పుడు, సెంచరీ బాదినప్పుడు ఎవరైనా సంబరాలు చేసుకుంటుంటారు. కానీ, పుష్ప సినిమా విడుదల తర్వాత ట్రెండ్ మారిపోయింది. భారత క్రికెటర్స్తో పాటు ఇతర దేశాల ఆటగాళ్లు సైతం పుష్ప మార్క్ స్టైల్లో 'తగ్గేదేలే' అంటూ బన్నీని అనుకరించడం చూశాం. తాజాగా పుష్ప2 విడుదలైంది. మార్చి 22నుంచి ఐపీఎల్-2025 ప్రారంభం కానుంది. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ ఒక వీడియోను పంచుకుంది. అందులో భారత ఆల్రౌండర్ రవీంద్ర జడేజా 'పుష్ప' గాడి రూల్ సీన్ను రీక్రియేట్ చేశారు. సినిమాలో అల్లు అర్జున్ ఎంట్రీ సీన్ను వారు రీక్రియేట్ చేయడంతో అల్లు అర్జున్ అభిమానులు షేర్ చేస్తున్నారు. ఇప్పుడది నెట్టింట వైరల్ అవుతుంది.కొద్దిరోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజన్లో పుష్ప ట్రెండ్ మార్క్ తప్పకుండా కనిపిస్తుంది. బాలీవుడ్ ప్రేక్షకులకు ఈ చిత్రం బాగా దగ్గర కావడంతో ఈసారి స్టేడియంలో పుష్పరాజ్ గెటప్లో చాలామంది కనిపిస్తారు. క్రికెటర్స్ వికెట్ తీసినా, సెంచరీ కొట్టినా 'తగ్గేదేలే' అంటూ ఫోజులు ఇవ్వడం గ్యారెంటీ అని చెప్పవచ్చు. తాజాగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో జడేజా విన్నింగ్ షాట్ కొట్టిన వెంటనే పుష్ప స్టైల్లో తన బ్రాండ్ను చూపించాడు. ఆ విజువల్ నెట్టింట భారీగా వైరల్ అయింది. ఇప్పుడు తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం కూడా జడేజాతో పుష్ప బీజీఎమ్తో ఒక సీన్ రీక్రియేట్ చేసి సోషల్మీడియాలో పంచుకుంది. వైల్డ్ఫైర్ అంటూ తమ డెన్ పూర్తి సిద్ధంగా ఉందంటూ ఐపీఎల్ 2025 కప్ కోసం ఛాలెంజ్ విసిరింది.క్రికెట్లో పుష్ప మార్క్క్రికెట్ స్టేడియంలో బ్యాటింగ్కు దిగాడంటే రెచ్చిపోయే ఆసీస్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ సైతం పుష్పగాడికి అభిమాని అయిపోయాడు. పలుమార్లు 'తగ్గేదేలే' అంటూ బన్నీ అభిమానులను మెప్పించాడు. రీసెంట్గా తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి కూడా పుష్ప మార్క్ చూపించాడు. మెల్బోర్న్ టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఆసీస్పై శతకంతో అలరించిన ఆయన అర్ధశతకం నమోదు చేయగానే ‘పుష్ప’ స్టైల్లో నితీశ్ స్వాగ్ చూపించాడు. దీంతో స్టేడియంలో అభిమానులు కేరింతలు కొట్టారు. వెస్టిండీస్ ఆల్రౌండర్ డీజే బ్రావో, పాండ్యా,నజ్ముల్ ఇస్లాం,శిఖర్ ధావన్, రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్ ఇలా ఎందరో పుష్పగాడి స్వాగ్కు ఫ్యాన్స్ ఉన్నారు. View this post on Instagram A post shared by Chennai Super Kings (@chennaiipl) -
'వార్2'లో గాయపడిన స్టార్ హీరో.. సినిమా వాయిదా..!
'వార్2' విడుదల కోసం పాన్ ఇండియా రేంజ్లో అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ వార్త వారిని కాస్త ఇబ్బందిపెట్టొచ్చు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. అయితే, తాజాగా తారక్, హృతిక్ రోషన్ మధ్య ఒక సాంగ్ను మేకర్స్ ప్లాన్ చేశారట. ఈ పాట రిహార్సల్స్ చేస్తున్నప్పుడు హృతిక్ గాయపడినట్లు బాలీవుడ్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఆయన అభిమానులతో పాటు తారక్ ఫ్యాన్స్ కూడా ఆందోళన చెందుతున్నారు.హృతిక్ రోషన్–ఎన్టీఆర్ కాంబినేషన్లో ఇప్పటికే కొన్ని భారీ యాక్షన్ సీన్స్ కూడా చిత్రీకరించారు. అయితే, తాజాగా ఫైనల్ సాంగ్ కోసం షెడ్యూల్ను మేకర్స్ ఏర్పాటు చేసుకున్నారు. అందుకోసం ముంబయిలోని యశ్రాజ్ స్టూడియోస్లో భారీ సెట్ను వేశారట. ఈ పాటలో వారిద్దరితో పాటు దాదాపు 500మంది డ్యాన్సర్లు పాల్గొంటున్నారని గతంలో వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో హృతిక్ గాయపడటంతో షూటింగ్ను ఆపేశారట. ప్రస్తుతం ఆయన ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారని తెలుస్తోంది. వైద్యుల సూచనల మేరకు నెల రోజులు రెస్ట్ తీసుకోనున్నట్లు బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది ఆగష్టు 14న ఈ చిత్రం విడుదల చేస్తామని మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు. ఈ ఘటనతో వార్2 మరింత ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై చిత్ర యూనిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.‘వైఆర్ఎఫ్’ (యశ్రాజ్ ఫిలింస్) స్పై యూనివర్స్లో భాగంగా రానున్న ఈ సినిమాను ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్నారు. 2019లో విడుదలైన హిట్ మూవీ ‘వార్’ కి సీక్వెల్గా ‘వార్ 2’ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో జాన్ అబ్రహాం, కియారా అద్వానీ కీలక పాత్రలలో నటిస్తున్నారు. -
నాకిష్టమైన 'తోబుట్టువు' నువ్వే అంటూ రేర్ ఫోటో షేర్ చేసిన బ్యూటీ
సౌత్ ఇండియా టాప్ హీరోయిన్ కీర్తి సురేశ్ (Keerthy Suresh) వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత కాస్త సినిమాలకు బ్రేక్ ఇచ్చి తన కుటుంబంతో ఎంజాయ్ చేస్తుంది. అయితే, తాజాగా తన చిన్ననాటి ఫోటోను షేర్ చేసిన ఈ బ్యూటీ తన అక్క రేవతి సురేష్కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది. ఈ క్రమంలో తన సోదరితో ఆమెకు ఉన్న బంధాన్ని గుర్తుచేసుకుంది. నిర్మాత జి. సురేష్ కుమార్, నటి మేనకల కుమార్తెగా కీర్తి సురేశ్ 2013లో విడుదలైన మలయాళం సినిమా గీతాంజలితో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే, తెలుగులో 'నేను శైలజ' సినిమాతో పరిచయం అయింది.కీర్తి అక్క రేవతి సురేష్ దర్శకురాలిగా ఎంట్రీ ఇస్తున్నారు. అయితే ఇది ఫీచర్ ఫిల్మ్కి కాదు.. షార్ట్ ఫిల్మ్ కోసం కావడం విశేషం. అయితే, నేడు తన పుట్టినరోజు కావడంతో శుభాకాంక్షలు చెబుతూ కీర్తి ఇలా పోస్ట్ షేర్ చేసింది. 'నా ఒడిదుడుకుల సమయంలో నా చుట్టూ ఒక గోడలా నిలబడ్డావు. వాటిని నేను అధిగమించేందుకు నాకు అండగా నిలిచావు. నువ్వు నా పక్కన ఉంటే చాలు.. ఈ జీవితం చాలా సులువుగా ఉంటుంది. బహుశా నాకు అత్యంత ఇష్టమైన తోబుట్టువు నువ్వే అనుకుంటా' అంటూ ఒక స్మైలీ ఎమోజీని చేర్చి తన అక్కపై ఉన్న ప్రేమను కీర్తి పంచుకుంది.కీర్తి తల్లి మేనక నటి కాగా, ఆమె నాన్న సురేష్ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే ఫ్యామిలీ నుంచి కీర్తి అక్క రేవతి డైరెక్టర్గా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఆమె తీస్తున్న ఆ షార్ట్ ఫిల్మ్ పేరు ‘థ్యాంక్ యూ’. దీనికి సంబంధించిన ఫస్ట్లుక్ పోస్టర్ను కూడా కొద్దిరోజుల క్రితం వారు షేర్ చేశారు. రేవతి కూడా భరతనాట్యంలో శిక్షణ తీసుకుంది. చెన్నై శస్త్ర యూనివర్సిటీలో ఫిలిం కోర్సులో మాస్టర్స్ పట్టా అందుకుంది. View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
'కార్తీ' డబ్బింగ్ పనుల్లో బిజీ.. నెక్ట్స్ విడుదలయ్యే సినిమా ఇదే
కోలీవుడ్లో ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న నటుడు కార్తీ. ఈయన ఇటీవల నటించిన 'సత్యం సుందరం' చిత్రం మంచి విజయాన్ని సాధించింది. కాగా తాజాగా కార్తీ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాలలో సర్ధార్ 2 ఒకటి. నటుడు కార్తీ పోలీస్ అధికారిగా, సర్ధార్గా ధ్విపాత్రాభినయం చేసిన చిత్రం సర్ధార్. ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై లక్ష్మణన్ నిర్మించిన ఈ చిత్రానికి పీఎస్.మిత్రన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీంతో అదే కాంబినేషన్లో పార్ట్-2 ప్లాన్ చేశారు. ఇందులోనూ కార్తీ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఆయన సరసన నటి మాళవిక మోహన్, ఆషీకా రంగనాథ్, రజీషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నటుడు ఎస్జే.సూర్య తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న సర్ధార్ –2 చిత్రం షూటింగ్ను పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. అందులో భాగంగా చిత్ర డబ్బింగ్ కార్యక్రమాలను ప్రారంబించారు. కాగా ప్రస్తుతం నటుడు కార్తీ ఈ చిత్రానికి డబ్బింగ్ చెబుతున్నారు. ఆ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. భారీ అంచనాలు సంతరించుకున్న ఈ చిత్రానికి యువన్ శంకర్రాజా సంగీతాన్ని, జార్జ్ విల్లియమ్స్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. కాగా సర్ధార్ –2 చిత్రం త్వరలోనే తెరపైకి రానుందన్నమాట. -
అందమైన ప్రేమ కథ
నాని హీరోగా ‘దసరా’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తెరకెక్కించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నిర్మాతగా మారారు. సమ్మక్క సారక్క క్రియేషన్స్ ని స్థాపించిన ఆయన ‘ఏఐ అమీనా జరియా రుక్సానా–గులాబీ’ అనే మూవీని ప్రకటించారు. ఈ మూవీ ద్వారా చేతన్ బండి దర్శకుడిగా పరిచయమవుతున్నారు.ఈ చిత్రానికి కథను అందించడంతో పాటు చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్పై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్రలతో కలిసి శ్రీకాంత్ ఓదెల నిర్మిస్తున్నారు. ఈ సినిమాని ప్రకటించి, పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘2009లో గోదావరిఖని ప్రాంతంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందనున్న అందమైన ప్రేమకథ ‘ఏఐ అమీనా జరియా రుక్సానా–గులాబీ’.ఒక అబ్బాయిని గాఢంగా ప్రేమించే ఓ అమ్మాయి లోతైన భావోద్వేగాలను ఈ మూవీ చూపిస్తుంది. ఈ చిత్రం ప్రీప్రోడక్షన్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ఆరంభిస్తాం. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
నానిగారు సలహాలు ఇచ్చేవారు: ప్రియదర్శి
‘‘కోర్ట్’ కథ నానిగారికి బాగా నచ్చింది. దీంతో నిర్మాణంలో ఏది కావాలన్నా ఏర్పాటు చేయమని నిర్మాతలు దీప్తి, ప్రశాంతిగార్లకు చెప్పారు. వారిద్దరూ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. దీప్తిగారు సెట్స్లో ఉండేవారు. నానిగారు మాత్రం అప్పుడప్పుడు మా సినిమా రషెస్ చూసి ఏౖవైనా సలహాలు, సూచనలు ఇచ్చేవారు’’ అని ప్రియదర్శి తెలిపారు. రామ్ జగదీష్ దర్శకత్వంలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కోర్ట్’.నాని వాల్ పోస్టర్ సినిమా సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీ ఈ నెల 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ప్రియదర్శి మాట్లాడుతూ–‘‘2022లో నేను, రామ్ జగదీష్ ‘కోర్ట్’ మూవీ గురించి మాట్లాడుకున్నాం. ఇందులో లాయర్ పాత్రని ఓ పెద్ద ఆర్టిస్ట్ చేస్తే బాగుంటుందనుకున్నాడు జగదీష్. కానీ, నేనే చేస్తానని చెప్పడంతో సరే అన్నాడు. పోక్సో కేసు అంటే ఏంటి? ఎలాంటి శిక్షలు ఉంటాయి? అని చాలా పరిశోధన చేసి, ఈ మూవీ తీశాడు జగదీష్.ఈ చిత్రంలో నేను లాయర్ పాత్ర చేశాక వారిపై నాకు గౌరవం పెరిగింది. ‘కోర్ట్’ సినిమాపై ఉన్న నమ్మకంతోనే ‘ఈ చిత్రం నచ్చకపోతే నా ‘హిట్ 3’ చూడొద్దు’ అని నానిగారు చెప్పారు. నా లాంటి నటులు మంచి కథలు చేస్తేనే జనాలు థియేటర్స్కి వస్తారు.. లేదంటే రారు. ఏ సినిమా అయినా మంచి వసూళ్లు సాధిస్తే అది కమర్షియల్ హిట్టే.అలా ‘కోర్ట్’కి మంచి వసూళ్లు వస్తే నేను కమర్షియల్ హీరోనే(నవ్వుతూ). శాంతా బయోటెక్ ఫౌండర్ అండ్ చైర్మన్ కేఐ వరప్రసాద్గారి బయోపిక్ చేయాలని ఉంది. నేను నటించిన ‘సారంగపాణి జాతకం’ మూవీ ఏప్రిల్లో రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం ‘ప్రేమంటే..’ మూవీ చేస్తున్నాను. అలాగే గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఓ సినిమా చేస్తాను’’ అని చెప్పారు. -
అవార్డ్ అందుకున్న సుకుమార్ భార్య.. వైట్ డ్రెస్లో మంచు లక్ష్మీ పోజులు!
డిఫరెంట్ లుక్స్తో ఆదా శర్మ హోయలు..ఐఫా అవార్డ్స్ వేడుకల్లో మెరిసిన కత్రినా కైఫ్..అవార్డ్ అందుకున్న తబిత సుకుమార్..వైట్ డ్రెస్లో మంచు లక్ష్మీ పోజులు..వేకేషన్లో చిల్ అవుతోన్న బాలీవుడ్ భామ నీలం ఉపాధ్యాయ.. View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Thabitha Bandreddi (@thabitha_sukumar) View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Neelam Upadhyaya (@neelamupadhyaya) -
దిల్ రూబా సాంగ్ రిలీజ్ వాయిదా.. క్లారిటీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం!
కిరణ్ అబ్బవరం, రుక్సార్ థిల్లాన్ జంటగా నటించిన తాజా చిత్రం ‘దిల్ రూబా’. ఈ లవ్ ఎంటర్టైనర్ను విశ్వ కరుణ్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్లతో దూసుకెళ్తున్నారు మన యంగ్ హీరో.ఇప్పటికే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం కోసం ఏకంగా బైక్ గిఫ్ట్ ఇవ్వబోతున్నట్లు కిరణ్ అబ్బవరం ప్రకటించాడు. సినిమాలో కిరణ్ ఉపయోగించిన బైక్నే బహుమతిగా ఇవ్వబోతున్నట్లు తెలిపారు. 'దిల్ రుబా' కథని ఎవరైతే ఊహించి తమకు చెబుతారో వాళ్లకు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ బైక్ గిఫ్ట్ ఇవ్వడంతో పాటు రిలీజ్ నాడు వాళ్లతో కలిసి బైక్ పై థియేటర్ కి వెళ్లి సినిమా కూడా చూస్తానని కిరణ్ చెప్పాడు.అయితే ఇవాళ దిల్ రూబా మూవీ నుంచి నాలుగో సింగిల్ కేసీపీడీ సాంగ్ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సాయంత్రం 05:01 గంటలకు రిలీజ్ చేస్తామని వెల్లడించారు. కానీ ఊహించని విధంగా ఈ సాంగ్ రిలీజ్ వాయిదా పడింది. మంగళవారం ఉదయం 09:06 గంటలకు విడుదల చేస్తామని కిరణ్ అబ్బవరం తెలిపారు. బెస్ట్ ఇవ్వడానికి పాటను వాయిదా వేసినట్లు ట్వీట్ చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న దిల్ రుబా మార్చి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.Best ivvandaniki team still working on KCPD song . Tomorrow sharp 9:06am song release aipotundi ❤️Song 🔥#DilRuba #KCPD— Kiran Abbavaram (@Kiran_Abbavaram) March 10, 2025 -
షార్ట్ ఫిలిమ్స్ నుంచి సినిమాల వరకు..
మహబూబాబాద్ అర్బన్: మానుకోట జిల్లా అనగానే మొదట గుర్తుకువచ్చేది క్రీడలు.. అంతేనా.. విద్య, ఉద్యమాలు, పోరాటాల్లో.. పాటల రచయితలు, సంగీత దర్శకులు, ఫొటోగ్రాఫర్లు, కళాకారులుగా.. ఇలా ఎందరో సత్తా చాటుతున్నారు. మిర్చి, పసుపు, పత్తి పంటల్లో రాణిస్తున్నారు. కలెక్టర్, ఎస్పీ, పోలీస్, జవాన్, నేవీ తదితర అనేక రంగాల్లో వెలుగుతున్నారు. మానుకోట (Manukota) ముద్దుబిడ్డలుగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. జిల్లా నుంచి సినీరంగంలోనూ గుర్తింపు తెచ్చుకున్న కళాకారులు కోకొల్లలు. చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ.. పాటలు పాడుతూ ఎదుగుతున్నారు. చిన్న సినిమాలకు తొలుత సంగీతం అందించి ప్రస్తుతం పెద్దపెద్ద హీరోల సినిమాలకు పనిచేస్తున్నారు. వీడియో, కెమెరామెన్, సినిమా ఫొటోగ్రఫీ, అసోసియేట్ డైరెక్టర్ వరకు అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. దాశరథి నుంచి.. మానుకోట జిల్లా నుంచి మొదట సినిమారంగంలో చిన్నగూడూరుకు చెందిన దాశరథి కృష్ణమాచార్యులు ప్రవేశించారు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’అని తెలంగాణ ఉద్యమానికి ప్రేరణ అందించిన కవి ఆయన. తెలుగు సినిమాలకు గేయ రచయితగా రాణించారు. ‘కన్నె వయసు’సినిమాలో ‘ఏ దివిలో విరిసిన పారిజాతమో..’ పాట రాశారు. తోట రాముడు సినిమాలో ‘ఓ బంగరు రంగుల చిలకా పలకవే..’అనే పాట కూడా రాశారు. మానుకోట జిల్లా (Manukota District) కేంద్రం గుమ్ముడూరుకు చెందిన గోడిశాల జయరాజు సినీగేయ రచయిత, కవి. ప్రకృతిపై కథలు, గేయాలు రాశారు. అవి తెలుగు, హిందీ, ఇంగ్లిష్, కన్నడ సహా అనేక భాషల్లోకి అనువాదమై విస్తృత ప్రాచుర్యం పొందాయి. జయరాజు మొదట ‘అడవిలో అన్న’ సినిమాలో ‘వందనాలమ్మ’ పాట రాశారు. ‘దండోరా’ సినిమాలో ‘కొండల్లో కోయిల పాటలు పాడాలి’ అనే పాట రాశారు. కేసముద్రం మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన జె.కె.భారవి (సుదర్శన భట్టాచార్య) తెలుగు సినీ రచయితగా, దర్శకుడు, పాటల రచయితగా పేరొందారు. కన్నడ సినీరంగంలోనూ పేరు తెచ్చుకున్నారు. అన్నమయ్య, లవ్స్టోరీ, శ్రీమంజునాథ, శ్రీరామదాసు, పాండురంగడు, శక్తి, ఓం నమో వేంకటేశాయ, చిటికెల పందిరి, జగద్గురు ఆదిశంకర తదితర సినిమాల్లో నటుడిగా, రచయితగా, దర్శకుడిగా పని చేశారు. ఆత్రేయ ప్రియశిష్య పురస్కారం అందుకున్నారు. మానుకోట మండలం కంబాలపల్లి గ్రామానికి చెందిన సంగీత దర్శకుడు చక్రధర్ రచయితగా, గాయకుడిగా, నటుడిగా రాణించారు. మొదట ‘పండు వెన్నెల’ అనే మ్యూజిక్ ఆల్బమ్ చేశారు. చిరునవ్వుతో, ఇడియట్, శివమణి, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, సత్యం, దేశముదురు, నేనింతే, చక్రం, ఆంధ్రావాలా, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం తదితర 85 చిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేసి నంది అవార్డు అందుకున్నారు. బయ్యారం మండల గౌరారం గ్రామానికి చెందిన బొబ్బిలి సురేశ్ (Bobbili Suresh) సినీరంగంలో రాణిస్తున్నారు. నీదీ నాదీ ఒకే కథ, జార్జ్రెడ్డి, తోలుబొమ్మలాట, తిప్పర మీసం, గువ్వా గోరింక, విరాటపర్వం, చిల్బ్రో, టెన్త్క్లాస్ డైరీస్, మళ్లీ పెళ్లి తదితర సినిమాలకు సంగీత దర్శకుడిగా పని చేశారు. చదవండి: రాజమౌళి- మహేశ్ సినిమా.. ఒక్క లీక్ ఎంతపని చేసింది జిల్లా కేంద్రానికి చెందిన కందుకూరి అనిల్కుమార్ మొదట ప్రైవేట్ ఆల్బమ్ పాటలకు నృత్య దర్శకునిగా పని చేశారు. తరువాత పీపుల్స్వార్, పోలీస్ వెంకటరామయ్య, దండకారణ్యం సినిమాలకు నృత్య దర్శకత్వం వహించారు. తొర్రూరు పట్టణ కేంద్రానికి చెందిన గిద్దె రాంనర్సయ్య.. తెలంగాణ ఉద్యమంలో పలు గీతాలు ఆలపించారు. ఉద్యమంలో ఎంతో మందిని తన పాటలతో ఉత్తేజ పరిచారు.కంబాలపల్లి గ్రామానికి చెందిన గుర్రాల ఉదయ్ (Gurrala Uday) జేఎన్టీయూలో బ్యాచ్లర్ ఆఫ్ ఫొటోగ్రఫీ కోర్సు పూర్తి చేశారు. మొదట షార్ట్ ఫిలిమ్స్ తీశారు. ‘స్వేచ్ఛ’సినిమాతో సినీరంగంలోకి డైరెక్టర్గా అడుగుపెట్టారు. ఉత్తమ డైరెక్టర్ అవార్డు అందుకున్నారు. జంగిలిగొండ గ్రామానికి చెందిన రాజమౌళి (Rajamouli) బుల్లితెర షోల్లో నటించారు. భోళాశంకర్, ధమాక, బంగారు బుల్లోడు, అనుభవించు రాజా, చోర్ బజార్, సిల్లి ఫెలోస్ తదితర సినిమాల్లోనూ నటించారు.తెలంగాణ యాసపై సినిమాలు చేస్తా నాకు మొదట సినిమాల్లో అవకాశం కల్పించింది ఆర్.నారాయణమూర్తి. ప్రకృతితో.. నాకూ ఉన్న అనుబంధాన్ని నా పాటల్లో వివరించా. భవిష్యత్లో సినిమాల్లో రచనలు చేసే అవకాశం వస్తే వదులుకోను. నా ప్రతిభను మాజీ సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా గుర్తించి అవార్డు అందజేశారు. తెలంగాణ యాస, భాషపై మరిన్ని సినిమాలు చేస్తాను. – గొడిశాల జయరాజ్, సినీ రచయిత ‘స్వేచ్ఛ’షార్ట్ ఫిలింతో ప్రవేశం మొదట ‘స్వేచ్ఛ’షార్ట్ ఫిలింతో సినిమా రంగంలోకి అడుగు పెట్టాను. చిన్న చిన్న సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నాను. నేను రూపొందించిన ‘మేల్’సినిమా.. బెస్ట్ ఫిలిం స్క్రీన్ప్లే న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డుకు నామినేట్ అయింది. – గుర్రాల ఉదయ్, డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ ఆస్కార్ అవార్డు లక్ష్యం సినీరంగంలో మొదటి సినిమాతోనే నాకు మంచి గుర్తింపు వచ్చింది. భవిష్యత్లో పెద్ద పెద్ద హీరోలకు మంచి సంగీతం అందించి గుర్తింపు తెచ్చుకుని ఆస్కార్ అవార్డు అందుకోవాలన్నది నా కోరిక. ఇప్పటి వరకు నాకు చేయూతనిచ్చిన దర్శకులు, నిర్మాతలకు రుణపడి ఉంటా. – సురేష్ బొబ్బిలి, సంగీత దర్శకుడు కొత్తవారికి అవకాశమిస్తా టీవీ షోలు, సినీరంగంలో ఎంతో కష్టపడ్డాను. సినీ ప్రేక్షకులు, జిల్లా ప్రజల ఆశీస్సులతో ఇంతటి వాడినయ్యాను. నటనలో నైపుణ్యం ఉన్న వారికి కచ్చితంగా అవకాశం కల్పిస్తాను. పేద ప్రజలకు నా వంతుగా సేవ చేస్తున్నాను. – రాజమౌళి, జబర్దస్త్ నటుడు -
హీరోయిన్తో శుభ్మన్ గిల్ డేటింగ్.. ఆ ఒక్క ఫోటో వల్లే !
టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీని మరోసారి సగర్వంగా ముద్దాడింది. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్గా నిలిచింది. దుబాయ్ వేదికగా జరిగిన తుదిపోరులో న్యూజిలాండ్పై ఘనవిజయం సాధించిన. కివీస్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ ఫైనల్ మ్యాచ్లో నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్లో విజయం భారత్ను వరించింది. దీంతో టీమిండియా ఖాతాలో మరో ఐసీసీ ట్రోఫీ వచ్చి చేరింది. దుబాయ్లో జరిగిన పలువురు బాలీవుడ్ సినీ తారలు సైతం ఈ మ్యాచ్ను వీక్షించారు.అయితే ఈ మ్యాచ్ తర్వాత భారత ఓపెనర్ బ్యాట్స్మన్ శుభ్మన్ గిల్కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్గా మారింది. ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ అవనీత్ కౌర్తో శుభ్మన్ గిల్ డేటింగ్లో ఉన్నారంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ చూసిన ఫోటోలను అవనీత్ కౌర్ ఇన్స్టాలో పంచుకుంది. అయితే ఆ ఫోటోలు భారత్- ఆస్ట్రేలియా సెమీస్ మ్యాచ్ సందర్బంగా అవనీత్ కౌర్ తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది.తాజాగా టీమిండియా కప్ గెలవడంతో మరోసారి ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. అంతేకాకుండా గతేడాది శుభ్మన్ బర్త్ డే సందర్భంగా అవనీత్ సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలిపింది. గిల్తో దిగిన ఫోటోలను షేర్ చేసింది. దీంతో వీరిద్దరిపై మరోసారి డేటింగ్పై చర్చ మొదలైంది. ఈ రూమర్స్ నేపథ్యంలో ఆమె రాఘవ్ శర్మ అనే నిర్మాతతో డేటింగ్ చేస్తున్నట్లు కొందరు అభిమానులు పోస్టులు పెడుతున్నారు. కాగా.. క్రికెటర్ గిల్పై గతంలో కూడా సారా అలీ ఖాన్తో పాటు దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్తో రిలేషన్లో ఉన్నారంటూ వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.కాగా.. 26 ఏళ్ల అవనీత్ కౌర్ బాలీవుడ్లో పలు సినిమాలతో పాటు వెబ్ సిరీస్ల్లోనూ కనిపించింది. ఎనిమిదేళ్ల వయసులో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అవనీత్ కౌర్ మొదటిసారిగా 2010లో 'డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్స్ షోలో కనిపించింది. ఆ తర్వాత ఆమె 'డ్యాన్స్ కే సూపర్స్టార్స్'లో పాల్గొంది. ఆ తర్వాత 2012లో 'మేరీ మా' టీవీ షోతో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. ఝలక్ దిఖ్లా జా (2012), మసావిత్రిక్, ఏక్ ముత్తి ఆస్మాన్ లాంటి సీరియల్స్లో నటించింది. ఆ తర్వాత 'మర్దానీ' మూవీతో బిగ్ స్క్రీన్లోకి అడుగుపెట్టింది. 2023లో కంగనా రనౌత్ నిర్మించిన టికు వెడ్స్ షేరు చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ సరసన రొమాంటిక్ పాత్రలో కనిపించింది. కౌర్ చివరిసారిగా 2024లో వచ్చిన 'పార్టీ టిల్ ఐ డై'అనే మర్డర్ మిస్టరీలో నటించింది. View this post on Instagram A post shared by Avneet Kaur (@avneetkaur_13) -
తన పేరెత్తితేనే కన్నీళ్లు.. ఈ క్యాన్సర్ పోరాటంలో..: బుల్లితెర నటి ఎమోషనల్
సంతోషాన్ని అందరూ పంచుకుంటారు, కానీ కష్టాన్ని కూడా పంచుకున్నవారే అసలైన ఆప్తులు. ఈ విషయంలో తాను చాలా లక్కీ అంటోంది బుల్లితెర నటి హీనా ఖాన్ (Hina Khan). క్యాన్సర్తో పోరాడుతున్న తనను ప్రియుడు రాకీ జైస్వాల్ (Rocky Jaiswal) చంటిపాపలా చూసుకుంటున్నాడని చెప్తోంది. తినిపించడం, టాబ్లెట్స్ వేయడం, నడిపించడం.. ఇలా ప్రతి ఒక్కటి చూసుకుంటున్నాడంది. ఇలాంటి ప్రేమికుడు దొరికినందుకు పొంగిపోతోంది.మాటలు సరిపోవురొమ్ము క్యాన్సర్ (స్టేజ్ 3)తో పోరాడుతున్న హీనా ఖాన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ ప్రయాణంలో అర్థం చేసుకునే భాగస్వామి దొరికితే అంతకన్నా అదృష్టం మరొకటి ఉండదు. అతడి పేరెత్తినప్పుడు తన గురించి చెప్పడానికి మాటలు సరిపోవడం లేదు. నాకోసం ఎంతో చేశాడు. ఎల్లప్పుడూ చేయి పట్టుకునే నడిపించాడు. తనెప్పుడూ అంతే.. నాకోసమే ఆలోచిస్తాడు. ఎంత మంచి మనిషో కదా! తనను తలుచుకుంటేనే సంతోషంతో కన్నీళ్లు వచ్చేస్తున్నాయి. ప్రతి అమ్మాయికి ఇలాంటి అబ్బాయి దొరకాలి.అతడు ప్రేమించినంతగా నేను ప్రేమించలేనురాకీ నాకు 12 ఏళ్లుగా తెలుసు. నా ఫస్ట్ షోలో తొలిసారి అతడిని కలిశాను. ఏడునెలలపాటు ఫ్రెండ్స్గా ఉన్నాం. తర్వాత మాది స్నేహం కాదని ప్రేమని తెలుసుకున్నాం. మేము ఒకరికొకరు ప్రపోజ్ చేసుకోలేదు. కానీ ఓ రోజు ఆత్మీయంగా హగ్ ఇచ్చుకున్నప్పుడు మా మధ్య ఉన్న బంధం బలపడిందని అర్థం చేసుకున్నాం. మేము జంటగా ఎక్కడికైనా వెళ్తూ ఉండేవాళ్లం. నా క్యాన్సర్ అతడిని ఎంతో బాధించింది. నేనెప్పుడూ అతడికి ఒకటే చెప్తుంటాను.. నువ్వు ప్రేమించినంతగా నేను నిన్ను ప్రేమించలేను అని! దానికి అతడు గర్వంగా ఫీలవడు, కనీసం అవునని కూడా ఒప్పుకోడు. నేను ఎక్కువగా ఏం చేశానని? అని అమాయకంగా అడుగుతుంటాడు అని హీనా ఖాన్ చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by 𝑯𝒊𝒏𝒂 𝑲𝒉𝒂𝒏 (@realhinakhan)చదవండి: ఆటోఇమ్యూన్ వ్యాధి.. స్టెరాయిడ్స్ తీసుకుంటున్నా: టాలీవుడ్ నటి -
'రేయ్.. ఎవర్రా మీరంతా'.. థియేటర్లలోకి మళ్లీ వచ్చేస్తున్నాడు
ప్రస్తుతం టాలీవుడ్లో రీ రిలీజ్ల ట్రెండ్ నడుస్తోంది. బ్లాక్ బస్టర్ సినిమాలు మళ్లీ విడుదల చేసినా ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 14న రామ్ చరణ్ లవ్ ఎంటర్టైనర్ ఆరెంజ్ను రీ రిలీజ్ చేశారు. రామ్ చరణ్- జెనీలియా జంటగా నటించిన లవ్ అండ్ రొమాంటిక్ మూవీ థియేటర్లలో సందడి చేసింది. తాజాగా ఇటీవల మరో టాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టును ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమాకు థియేటర్లలో మరోసారి ఆడియన్స్ను అలరించింది. ఈ మూవీలో విక్టరీ వెంకటేశ్, మహేశ్ బాబు, సమంత, అంజలి కీలక పాత్రల్లో నటించారు. తాజాగా మరో సూపర్ హిట్ మూవీ రీ రిలీజ్కు సిద్ధమైంది. కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం యుగానికి ఒక్కడు(ఆయిరత్తిల్ ఒరువన్) (Yuganiki Okkadu) మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. 2010లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బిగ్ హిట్గా నిలిచింది. ఈ విజువల్ వండర్ మూవీకి సెల్వరాఘవన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కార్తీతో పాటు ఆండ్రియా, రీమాసేన్ తమ నటనతో ప్రేక్షకులను మెప్పించారు.తాజాగా యుగానికి ఒక్కడు దాదాపు 15 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ కానుంది. ఈనెల 14న థియేటర్లలో సందడి చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, అమెరికాలో రీరిలీజ్ కానుందని వెల్లడించారు. కాగా.. ఇప్పటికే ఈ సినిమా తెలుగు వర్షన్ ఆహా ఓటీటీలో అందుబాబులో ఉంది. తమిళ వర్షన్ సన్నెక్ట్స్లో స్ట్రీమింగ్ అవుతోంది.From gritty battles to heart-stopping drama❤️🔥Witness @Karthi_Offl's most captivating and raw performance in #YuganikiOkkadu on the big screens once again 🔥#YuganikiOkkaduReRelease in theatres from MARCH 14thBook your tickets now! -- https://t.co/Y4GE3fy2MiAP & TG,… pic.twitter.com/fNsmtD2UwL— Primeshow Entertainment (@Primeshowtweets) March 10, 2025 -
నితిన్ రాబిన్హుడ్.. అది దా సర్ప్రైజ్ అంటోన్న కేతిక శర్మ
నితిన్, శ్రీలీల జంటగా నటించిన తాజా యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ రాబిన్హుడ్.'భీష్మ' వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నితిన్- దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్లో వస్తోన్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదల తేదీని ప్రకటించిన మేకర్స్ ప్రమోషన్స్తో దూసుకెళ్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన మంచి రెస్పాన్స్ వస్తోంది.తాజాగా ఈ మూవీ నుంచి మూడో లిరికల్ పాటను మేకర్స్ విడుదల చేశారు. 'అది దా సర్ప్రైజ్' అంటూ సాగే ఐటమ్ సాంగ్ను విడుదల చేశారు. ఈ స్పెషల్ సాంగ్లో హీరోయిన్ కేతిక శర్మ తన డ్యాన్స్తో అలరించింది. ముఖ్యంగా కేతిక శర్మ అందాలతో అభిమానులను తెగ ఆకట్టుకుంది. ఈ పాట రాబిన్ హుడ్లో మూవీలో ప్రత్యేకమైన క్రేజ్ సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. అంతుకుముందే కేతిక శర్మ తెలుగులో రంగరంగ వైభవంగా, లక్ష్య లాంటి చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. కాగా.. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సంగీతం జీవీ ప్రకాశ్కుమార్ అందించారు. This summer heat is here with the sizzling moves and the blazing beats 🔥🔥#Robinhood third single #AdhiDhaSurprisu ft. @TheKetikaSharma out now ❤️🔥▶️ https://t.co/GvczL8HezzA @gvprakash musical.Lyrics by Academy Award Winner @boselyricistSung by @neetimohan18 &… pic.twitter.com/fRkw35ndnO— Mythri Movie Makers (@MythriOfficial) March 10, 2025 -
ఆటోఇమ్యూన్ వ్యాధి.. స్టెరాయిడ్స్ తీసుకుంటున్నా: టాలీవుడ్ నటి
కొన్నేళ్లుగా ఆరోగ్యం అస్సలు బాగుండట్లేదంటోంది బిగ్బాస్ బ్యూటీ, నటి సనా మక్బుల్ (Sana Makbul). సమంతలాగే తనకు ఆటోఇమ్యూన్ వ్యాధి వచ్చిందని వాపోయింది. శరీరంలోని కణాలు.. అవయవాలపై దాడి చేస్తున్నాయంది. తాజాగా ఓ పాడ్కాస్ట్లో సనా మక్బుల్ మాట్లాడుతూ.. కొన్ని అనారోగ్య కారణాల వల్ల నేను ఈ మధ్యే శాఖాహారిగా మారిపోయాను. నేను ఆటోఇమ్యూన్ హెపటైటిస్ రోగినని చాలామందికి తెలియదు. 2020లో బయటపడిందినాకు కాలేయ వ్యాధి ఉంది. ఇది 2020లో బయటపడింది. ఎటువంటి లక్షణాలు లేకపోవడంతో ఈ వ్యాధి ఉందన్న విషయం ఆలస్యంగా తెలిసింది. ఈ వ్యాధి కారణంగా నా శరీరంలోని కణాలు నా అవయవాలపై దాడి చేస్తున్నాయి. అది శరీరమంతటా పాకొచ్చు, కిడ్నీలపైనా దాడి చేయొచ్చు, మోకాళ్ల నొప్పులకు కారణం కావచ్చు, ఇలా ఏదైనా జరగొచ్చు. సమంతకు ఉన్న ఆటోఇమ్యూన్ వ్యాధి మయోసైటిస్. దీని వల్ల ఆమె కండరాల బలహీనతను ఎదుర్కొంటోంది. అలాగే నాకున్న ఆటోఇమ్యూన్ వ్యాధి వల్ల కాలేయం డ్యామేజ్ అవుతోంది.నయమవుతుందో.. లేదో!స్టెరాయిడ్స్, కొన్నిరకాల ఔషధాలు తీసుకున్నాను. జీవనశైలిలో వస్తున్న మార్పుల వల్ల ఇది వచ్చిందనుకుంటున్నాను. నా ఆరోగ్యం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియట్లేదు. ఈ వ్యాధి పూర్తిగా నయం అవుతుందో, లేదో కూడా తెలియదు అని చెప్పుకొచ్చింది. సనా మక్బుల్.. దిక్కులు చూడకు రామయ్య, మామ ఓ చందమామ వంటి తెలుగు సినిమాల్లో హీరోయిన్గా నటించింది. హిందీ బిగ్బాస్ ఓటీటీ మూడో సీజన్ విజేతగానూ నిలిచింది. ప్రస్తుతం మ్యూజిక్ ఆల్బమ్స్లో నటిస్తోంది.చదవండి: అవతార్ సినిమాలో ఛాన్స్.. కోట్లు ఇస్తానన్నా 'నో' చెప్పా: గోవిందా -
ఒకప్పటి హీరోయిన్ గ్లామర్ ట్రీట్.. భర్త కౌగిలిలో సాయేషా!
పట్టుచీరలో జిగేలుమని మెరిసిపోతున్న అనసూయలేటు వయసులోనూ అందంలో మాధురీ తర్వాత ఎవరైనాపెళ్లిరోజు.. భార్యని ముద్దాడేస్తున్న తమిళ హీరో ఆర్యహాట్ నెస్ తో చంపేస్తున్న ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయల్రాక్ స్టార్ లా స్టేజీపై పాటలు పాడేసిన తమిళ నటి ఆండ్రియాఉదయం ఎండలో కలర్ ఫుల్ గా కనిపిస్తున్న తృప్తి దిమ్రిఇద్దరు పిల్లలకు తల్లయినా గ్లామరస్ గా ప్రణీత View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by Kriti Sanon 🦋 (@kritisanon) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) View this post on Instagram A post shared by Arya (@aryaoffl) View this post on Instagram A post shared by Mannara Chopra (@memannara) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Fatima Sana Shaikh (@fatimasanashaikh) View this post on Instagram A post shared by Andrea Jeremiah (@therealandreajeremiah) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Manisha Koirala (@m_koirala) View this post on Instagram A post shared by Sangeerthana (@sangeerthana__vipin) View this post on Instagram A post shared by Nehha Pendse (@nehhapendse) View this post on Instagram A post shared by Madhuri Dixit (@madhuridixitnene) -
'కన్నప్ప' నుంచి లవ్ సాంగ్ రిలీజ్
మంచు విష్ణు 'కన్నప్ప' నుంచి తొలుత టీజర్ రిలీజైనప్పుడు విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. కానీ కొన్నాళ్ల క్రితం శివయ్య అంటూ సాగే పాట రిలీజ్ చేసినప్పుడు మంచి స్పందనే వచ్చేసింది. ఇప్పుడు మూవీ నుంచి మెలోడీ సాంగ్ ని విడుదల చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్)ఈ సినిమాలో మంచు విష్ణు.. తిన్నడు అనే పాత్రలో కనిపిస్తాడు. ఇతడి ప్రేయసి నెమలి అనే పాత్రలో ప్రీతి ముకుందన్ నటించింది. వీళ్లిద్దరి మధ్య తీసిన ప్రేమగీతాన్నే ఇప్పుడు రిలీజ్ చేశారు. వినడానికి, చూడటానికి ఇది బాగానే ఉండటం విశేషం.ఏప్రిల్ 25న థియేటర్లలోకి రాబోతున్న 'కన్నప్ప'లో విష్ణుతో పాటు ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, కాజల్, మోహన్ బాబు తదితరులు నటించారు. (ఇదీ చదవండి: ప్రభాస్ @ 'బక'.. ఇంతకీ దీని అర్థమేంటి?) -
బర్త్ డే పార్టీలో జంటగా సమంత, రాజ్ నిడిమోరు.. మరోసారి డేటింగ్ వార్తలు!
టాలీవుడ్ హీరోయిన్ సమంత ఇటీవల వార్తల్లో ఎక్కువగా నిలుస్తోంది. కొద్ది రోజుల క్రితమే చెన్నైలో జరిగిన బిహెండ్వుడ్స్ హాల్ ఆప్ ఫేమ్ అవార్డుల వేడుకకలో మెరిసింది. ఈ వేదికపై సిటాడెల్ వెబ్ సిరీస్లో నటనకు అవార్డ్ కూడా అందుకుంది. అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి 15 ఏళ్లు పూర్తి కావడంతో ప్రత్యేకమైన అవార్డ్తో సమంతను సత్కరించారు. అయితే ఈ వేడుకల్లో సిటాడెల్ డైరెక్టర్లలో ఒకరైన రాజ్ నిడిమోరు సైతం సందడి చేశారు. సమంతతో కలిసి వేదికపై కనిపించారు.అయితే గత కొన్ని నెలలుగా సమంత- రాజ్ నిడిమోరుపై డేటింగ్ వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. గతంలోనే పికిల్ బాల్ టోర్నమెంట్లోనూ ఒకరి చేయి ఒకరు పట్టుకుని కనిపించారు. ఆ సమయంలోనూ సమంతపై డేటింగ్ రూమర్స్ వినిపించాయి. తాజాగా మరోసారి సామ్- రాజ్ నిడిమోరు ఓ పార్టీలో మెరిశారు. తన స్నేహితురాలు, డిజైనర్ క్రేషా బజాజ్ పుట్టినరోజు వేడుకలకు సమంత, నిడిమోరు హాజరయ్యారు. దీంతో మరోసారి వీరిద్దరిపై నెట్టింట చర్చ మొదలైంది. నెల రోజుల్లోపే రెండోసారి జంటగా కనిపించడంతో డేటింగ్ రూమర్స్ వైరలవుతున్నాయి. తాజాగా వీరిద్దరు కలిసి బర్త్ డే పార్టీలో దిగిన ఫోటో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతోంది. ఏదేమైనా సమంత, రాజ్ నిడిమోరు క్లారిటీ ఇస్తే కానీ ఈ వార్చలకు ఇప్పట్లో చెక్ పడేలా లేదు. అయితే తమపై వస్తున్న డేటింగ్ రూమర్స్పై ఇప్పటి వరకు సామ్ కానీ, రాజ్ ఎవరూ కూడా స్పందించలేదు.ఇక సినిమాల విషయానికొస్తే సమంత గతేడాది సిటాడెల్ వెబ్ సిరీస్ ఇండియన్ వర్షన్ హనీ బన్నీలో కనిపించింది. ఈ సిరీస్లో వరుణ్ ధావన్కు జోడీగా నటించింది. ప్రస్తుతం సమంత తెలుగులో ఓ మూవీని నిర్మిస్తున్నారు. తెలుగులో చివరిసారిగా విజయ్ దేవరకొండ ఖుషిలో నటించింది. -
అవతార్ సినిమాలో ఛాన్స్.. కోట్లు ఇస్తానన్నా 'నో' చెప్పా: గోవిందా
ప్రపంచాన్నే అబ్బురపరిచిన సినిమాల్లో అవతార్ (Avatar Movie) ఒకటి. వేల కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమాలో ఆఫర్ వస్తే చేయనని చెప్పేశాడట బాలీవుడ్ నటుడు గోవిందా (Actor Govinda). అసలు అవతార్ సినిమా ఛాన్స్ తనకెలా వచ్చింది? ఎందుకు రిజెక్ట్ చేశాడు? వంటి విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. గోవిందా మాట్లాడుతూ.. అమెరికాలో నేనొక సర్దార్ను కలిశాను. ఆయనకు నేనిచ్చిన బిజినెస్ ఐడియా బాగా వర్కవుట్ అయింది. అవతార్ టైటిల్ నేనే ఇచ్చా..కొన్నేళ్ల తర్వాత ఆయన నన్ను జేమ్స్ కామెరూన్కు పరిచయం చేశాడు. జేమ్స్తో కలిసి ఓ సినిమా చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చాడు. సరేనని తనను డిన్నర్కు పిలిచి సినిమా గురించి మాట్లాడాం. ఆయన చెప్పిన కథ విని దానికి అవతార్ అన్న టైటిల్ పెడితే బాగుంటుందని చెప్పాను. సినిమాలో హీరో దివ్యాంగుడు అని చెప్పాడు. వెంటనే నేను చేయనని చెప్పేశాను. రూ.18 కోట్లు ఇస్తానన్నా వద్దన్నాను.శరీరానికి రంగు పూసుకోవడం..దాదాపు 410 రోజులు ఆయన సినిమాకే కేటాయించాలి. అది పర్వాలేదు కానీ నా శరీరానికి రంగు పూసుకునే ఉండాలి. అలా చేస్తే నేను ఆస్పత్రిపాలవుతాను. నటుడిగా నాకు శరీరం అనేది చాలా అవసరం. పెయింట్ పూసుకోవడం వల్ల ఏవైనా దుష్ఫలితాలు ఎదురైతే జీవితాంతం బాధను అనుభవించాల్సి ఉంటుంది. అలాగే ఇలాంటి మంచి సినిమాలకు నో చెప్తే అందరూ లైట్ తీసుకోలేరు. వారు దగ్గరివారైనా సరే ఇగో చూపిస్తారు. బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్గా అవతార్అలాంటప్పుడు ఏళ్ల తరబడి క్షమాపణలు చెప్తూనే ఉండాలి అని చెప్పుకొచ్చాడు. జేమ్స్ కామెరూన్ తీసిన అద్భుత చిత్రాల్లో అవతార్ ఒకటి. 2009లో రిలీజైన ఈ సినిమా ప్రపంచ బాక్సాఫీస్ను షేక్ చేసింది. తర్వాత దీనికి కొనసాగింపుగా 2022లో అవతార్: ద వే ఆఫ్ వాటర్ రిలీజైంది. గోవిందా విషయానికి వస్తే ఆయన నటించిన మూడు సినిమాలు ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయని ఇటీవల అతడే స్వయంగా ఓ షోలో వెల్లడించాడు.చదవండి: ఎన్నో దారుణమైన సౌత్ సినిమాలకంటే కంగువా బెటర్: జ్యోతిక -
SSMB29.. ఒక్క వీడియోకే కథ అల్లేస్తున్నారు!
రాజమౌళి-మహేశ్ బాబు కాంబోలో ఓ సినిమా తీస్తున్నారు. దీని షూటింగ్ ప్రస్తుతం ఒడిశాలోని కోరాపుట్ కొండల్లో జరుగుతోంది. అయితే చిత్రీకరణ జరుగుతున్న టైంలో రహస్యంగా తీసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో లీకైంది. దీన్ని చూసిన చాలామంది ఏకంగా కథ ఇదే అని కొన్ని చెప్పేస్తున్నారు.లీకైన వీడియోలో మహేశ్ బాబు నడుచుకుంటూ వస్తుండగా.. డిఫరెంట్ గా ఉండే వీల్ ఛైర్ లో పృథ్వీరాజ్ కూర్చుని ఉంటాడు. కాసేపటికి మహేశ్ ని మోకాళ్లపై కూర్చోబెడతారు. వీడియో ఇంతవరకే ఉంది. కానీ పలువురు నెటిజన్స్ మాత్రం కథ ఏమై ఉంటుందా అని చెప్పి అల్లేస్తున్నారు.(ఇదీ చదవండి: ప్రభాస్ @ 'బక'.. ఇంతకీ దీని అర్థమేంటి?)పృథ్వీరాజ్ ఏదో నిధి కోసం వెతుకుతుంటాడు. ఈ క్రమంలోనే నడవలేని స్థితికి వెళ్తాడని.. దీంతో మహేశ్ బాబుని ఆ నిధి వెతికేందుకు ఒప్పిస్తాడని.. ఇలా నోటికొచ్చినదంతా మాట్లాడుతూ సోషల్ మీడియాలో డిస్కషన్లు పెట్టేస్తున్నారు. ఇది నిజమా కాదా అనే సంగతి పక్కనబెడితే సినిమా మాత్రం జంగిల్ అడ్వెంచర్ అని మాత్రం తెలుసు.రూ.1000 కోట్ల వరకు బడ్జెట్ తో ఈ సినిమాను తీస్తున్నారని.. ప్రస్తుతం ఒడిశాలో షూటింగ్ జరుగుతోందని.. త్వరలో వైజాగ్, శ్రీలంక, కెన్యా తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ జరగనుందని సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుందో?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) -
క్రైమ్ థ్రిల్లర్ 'ది సస్పెక్ట్' ఫస్ట్ లుక్ రిలీజ్..
రుషి కిరణ్, శ్వేత, రూప, శివ యాదవ్, రజిత, ఏ కె న్ ప్రసాద్, మృణాల్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ది సస్పెక్ట్. ఈ క్రైమ్ థ్రిల్లర్ మార్చి 21న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను డైరెక్టర్ విఎన్ ఆదిత్య చేతుల మీదగా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా వి.ఎన్ ఆదిత్య మాట్లాడుతూ.. అద్భుతమైనటువంటి స్క్రీన్ ప్లే ఉన్న ది సస్పెక్ట్ చిత్రం కచ్చితంగా హిట్ కొడుతుంది. కొత్త కథతో ఈ సినిమా తెరకెక్కించడం చాలా ఆనందమని కొనియాడారు.రాధాకృష్ణ గర్నెపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను టెంపుల్ టౌన్ టాకీస్ బ్యానర్ మీద కిరణ్కుమార్ నిర్మించారు. ఈ చిత్రానికి కెమెరామెన్ రాఘవేంద్ర, మ్యూజిక్ డైరెక్టర్ ప్రజ్వల్ క్రిష్, ఎడిటర్ ప్రవీణ్ పని చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎస్ కె ఎమ్ ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా ఆంధ్ర, తెలంగాణలో మార్చి 21న విడుదల చేయబోతున్నారు.చదవండి: ఎన్నో దారుణమైన సౌత్ సినిమాలకంటే కంగువా బెటర్: జ్యోతిక -
ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా టీమిండియా.. అల్లుడిపై మామ ప్రశంసలు
టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీని మరోసారి ముద్దాడింది. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్గా నిలిచింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో న్యూజిలాండ్పై గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఫైనల్ మ్యాచ్లో నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్లో భారత స్టార్ క్రికెటర్, వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ మరోసారి క్లాస్ ఇన్నింగ్స్ ఆడారు. చివరి వరకు క్రీజ్లో ఉండి టీమిండియాను ఛాంపియన్గా నిలిపాడు. ఒక వైపు వికెట్స్ పడుతున్నా 34 పరుగుతులతో నాటౌట్గా నిలిచి విజయ తీరాలకు చేర్చాడు. దీంతో పాకిస్తాన్ హోస్ట్ చేసిన ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా టీమిండియా నిలిచింది.అయితే ఈ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా గెలవడంపై బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యంగా తన అల్లుడు కేఎల్ రాహుల్పై ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు రాహుల్ ఫోటోను షేర్ చేస్తూ ట్వీట్ చేశారు. ఇండియాకి విష్.. రాహుల్ కమాండ్ అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు. ఇది చూసిన నెటిజన్స్ సునీల్ శెట్టిని ప్రశంసిస్తున్నారు. అల్లుడికి మామ సపోర్ట్ చేయడాన్ని చూసి నెటిజన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ అన్నా రాక్స్టార్.. టీమిండియాకు కాబోయే కెప్టెన్ అంటూ ఓ నెటిజన్ రిప్లై ఇచ్చాడు. 2027లో కేఎల్ కెప్టెన్సీలో వన్డే వరల్డ్ కప్ గెలుస్తామంటూ మరో నెటిజన్ రాసుకొచ్చాడు. అల్లుడికి మామ సపోర్ట్ చేయడం గొప్ప విషయం.. మా నాన్న కూడా నాకు సపోర్ట్ చేయడు అంటూ ఓ నెటిజన్ ఫన్నీగా సునీల్ శెట్టి ట్వీట్కు స్పందించాడు. అతియాను పెళ్లాడిన కేఎల్ రాహుల్..బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టిని కేఎల్ రాహుల్ పెళ్లాడిన సంగతి తెలిసిందే. కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరు ఆ తర్వాత వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం అతియా శెట్టి గర్భంతో ఉన్నారు. త్వరలోనే వీరిద్దరు తల్లిదండ్రులు కాబోతున్నారు. సునీల్ శెట్టి తాతగా ప్రమోట్ కానున్నారు. ఏప్రిల్లో అతియా శెట్టి, కేఎల్ రాహుల్ తమ బిడ్డకు స్వాగతం పలకనున్నారు. 🇮🇳 INDIA’S WISH !!!! Rahul’s COMMAND …… pic.twitter.com/SbllRkbUgP— Suniel Shetty (@SunielVShetty) March 9, 2025 -
ఎన్నో దారుణమైన సౌత్ సినిమాలకంటే కంగువా బెటర్: జ్యోతిక
కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా నటించిన కంగువా సినిమా (Kanguva Movie) కలెక్షన్స్ కొల్లగొడుతుందనుకుంటే బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. దాదాపు మూడేళ్లపాటు కష్టపడి తీసిన ఈ సినిమా డిజాస్టర్గా నిలిచింది. సినిమా ఏమీ బాగోలేదని, చాలా బోరింగ్గా ఉందన్న విమర్శలు వచ్చాయి. దీనిపై సూర్య సతీమణి, హీరోయిన్ జ్యోతిక అప్పట్లోనే ఘాటుగా రియాక్ట్ అయింది. కంగువ అద్భుతమైన సినిమా అని.. ఇలాంటి సాహసం చేయడానికి ధైర్యం కావాలంది. తొలి అరగంట బాగోలేదంతేసూర్య (Suriya)ను చూస్తుంటే గర్వంగా ఉందని తెలిపింది. తొలి అరగంట సినిమా బాగోలేదు, అలాగే మ్యూజిక్ కూడా కాస్త ఎక్కువగా ఉన్నట్లు అనిపించిందని పేర్కొంది. తప్పులు జరగడం సహజమేనని, ఇలాంటి చిత్రంలో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయంది. ఇలాంటి మూవీకి నెగెటివ్ రివ్యూలు చూసి ఆశ్చర్యపోయానంది. డబుల్ మీనింగ్స్, ఓవర్ యాక్షన్ సీక్వెన్స్, పాత స్టోరీలతో తీసే సినిమాలకు వీళ్లెవరూ నెగెటివ్ రివ్యూలు ఇవ్వడం చూడలేదని బుగ్గలు నొక్కుకుంది.సినిమాను తొక్కేశారుకంగువా పాజిటివ్ అంశాలు కనబడలేదా? అని ప్రశ్నించింది. తొలిరోజే కంగువాపై నెగెటివిటీ చూస్తుంటే బాధగా ఉందని, కావాలనే సినిమాను తొక్కేస్తున్నారని మండిపడింది. తాజాగా డబ్బా కార్టెల్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్లో మరోసారి కంగువా సినిమా నెగెటివిటీపై స్పందించింది. జ్యోతిక (Jyotika) మాట్లాడుతూ.. కొన్ని సినిమాలు అస్సలు బాగోవు. అయినా సరే కమర్షియల్గా బాగా ఆడతాయి. వాటికి మంచి రివ్యూలు కూడా ఇస్తుంటారు. కానీ నా భర్త సినిమా (కంగువా) విషయానికి వచ్చేసరికి మాత్రం కాస్త కఠినంగా ప్రవర్తించారనిపిస్తుంది.ఎన్నో దారుణ సినిమాల కంటే కంగువా నయంసినిమాలో బాగోలేని సన్నివేశాలు కొన్ని ఉండొచ్చు. కానీ ఆ మూవీ కోసం అందరూ ఎంతగానో కష్టపడ్డారు. అది కళ్ల ముందు స్పష్టంగా కనిపిస్తోంది. అయినా సరే.. దక్షిణాదిలో ఎన్నో అద్వాణ్నమైన సినిమాలకంటే కూడా ఈ చిత్రానికే ఎక్కువ దారుణమైన రివ్యూలు ఇచ్చారు. అది చూసి నాకెంతో బాధేసింది అని చెప్పుకొచ్చింది. సుమారు రూ.350 కోట్లతో తెరకెక్కిన కంగువా కేవలం రూ.160 కోట్లు మాత్రమే రాబట్టింది. ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహించాడు.చదవండి: భారత్లో తొలి ఏఐ సినిమా.. హీరోహీరోయిన్లు కూడా.. -
శ్రీదేవి చివరి చిత్రానికి సీక్వెల్.. ఖుషీ కపూర్పై నెటిజన్స్ ట్రోల్స్!
బాలీవుడ్ అగ్రనిర్మాత, డైరెక్టర్ బోనీ కపూర్ తాజాగా ఓ సినిమాను ప్రకటించారు. తన భార్య, దివంగత నటి శ్రీదేవి నటించిన చివరి చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించునున్నట్లు వెల్లడించారు. 2017లో వచ్చిన మామ్ మూవీకి కొనసాగింపుగా తాజాగా ఉండనుందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో తన చిన్న కూతురైన ఖుషీ కపూర్ సైతం నటిస్తున్నట్లు తెలిపారు. ఐఐఎఫ్ఏ-2025 అవార్డుల వేడుకకు హాజరైన ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు.అయితే శ్రీదేవి సీక్వెల్ మూవీలో ఖుషీ కపూర్ను ఎంపిక చేయడంపై నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమెను ఎంపిక చేయడం సరైన నిర్ణయం కాదని కామెంట్స్ చేస్తున్నారు. శ్రీదేవి స్థానంలో ఖుషీ చేయడమేంటి? ఇది చూస్తుంటే పెద్ద జోక్గా ఉందంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇదే నిజమైతే డిజాస్టర్ ఖాయమని మరో నెటిజన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. దయచేసి ఈ సినిమాకు జాన్వీ కపూర్ను తీసుకోవాలని ఓ నెటిజన్ కోరాడు. వీలైతే యామీ గౌతమ్, కంగనా రనౌత్, బిపాసా బసుని తీసుకోండి కానీ.. ఖుషీ కపూర్కు నటనా నైపుణ్యాలు లేవని నెట్టింట ట్రోల్ చేస్తున్నారు.నటన విషయానికొస్తే ఖుషీ కపూర్ చివరిసారిగా ఇబ్రహీం అలీ ఖాన్తో నాదానియన్లో కనిపించింది. ఈ చిత్రం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే తాజాగా బోనీ కపూర్ చేసిన ప్రకటనతో నెటిజన్స్ తీవ్ర నిరాశకు గురువుతున్నారు. శ్రీదేవీ మూవీ సీక్వెల్లో మాత్రం ఖుషీ కపూర్ వద్దని తెగేసి చెబుతున్నారు. మామ్ సీక్వెల్ కోసం ఖుషీని ఎంపిక చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు.కాగా.. 2017లో విడుదలైన మామ్ చిత్రానికి రవి ఉద్యవార్ దర్శకత్వం వహించారు. 2018లో ఆమె మరణానికి ముందు నటించిన చివరి చిత్రమిదే. శ్రీదేవి కెరీర్లో 300వ చిత్రంగా నిలిచింది. ఈ మూవీలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, అక్షయ్ ఖన్నా, పాకిస్థానీ నటులు సజల్ అలీ, అద్నాన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీదేవి మరణానంతరం 65వ జాతీయ చలనచిత్ర అవార్డులలో మామ్ చిత్రానికి ఉత్తమ నటి అవార్డు కూడా లభించింది. -
మరో ఓటీటీలోకి క్రేజీ మిస్టరీ థ్రిల్లర్.. కేవలం తెలుగులో
ఓటీటీలో ఈ మధ్య సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిన సినిమా 'రేఖాచిత్రం'. పేరుకే మలయాళ సినిమా గానీ తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చేసింది. ప్రస్తుతం సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా.. ఇప్పుడు మరో దానిలోనూ కేవలం తెలుగు వెర్షన్ అందుబాటులోకి రానుంది.మలయాళ దర్శకులు థ్రిల్లర్ సినిమాలు తీయడంలో స్పెషలిస్టులు. అలా ఈ ఏడాది జనవరి తొలి వారంలో 'రేఖాచిత్రం' మూవీని విడుదల చేశారు. రూ.10 కోట్లతో నిర్మిస్తే రూ.70 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దాదాపు రెండు నెలల తర్వాత గత శుక్రవారం ఓటీటీలోకి వచ్చింది.(ఇదీ చదవండి: 'రేఖాచిత్రం' సినిమా రివ్యూ (ఓటీటీ))మన దగ్గర సోనీ లివ్ ఓటీటీలో చూసేవాళ్లు తక్కువని చెప్పొచ్చు. బహుశా ఇది గమనించారో ఏమో గానీ ఇప్పుడు ఆహా ఓటీటీలోకి 'రేఖాచిత్రం' తెలుగు వెర్షన్ ని రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. మార్చి 14 నుంచి ఇది అందుబాటులోకి రానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు.'రేఖాచిత్రం' విషయానికొస్తే.. 40 ఏళ్ల క్రితం తాము ఓ అమ్మాయిని హత్య చేశామని చెప్పి ఓ పెద్దాయన ఆత్మహత్య చేసుకుంటాడు. అదేరోజు ఆ ఊరిలో ఎస్ఐగా జాయిన్ అయిన వివేక్ దర్యాప్తు మొదలుపెడతాడు. ఒక్కో ఆధారం వెతుకుతూ వెళ్లేకొద్ది దొంగ దొరుకుతాడు. ఇంతకీ హత్యకు గురైన అమ్మాయి ఎవరు? ఎందుకు చంపారనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) -
భారీ ప్రాజెక్ట్లో గోపిచంద్.. డైరెక్టర్గా ఎవరంటే?
టాలీవుడ్ హీరో గోపీచంద్ ఈ ఏడాదిలో కొత్త సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. గతేడాది విశ్వం, భీమా చిత్రాలతో మెప్పించిన గోపిచంద్ కొత్త ఏడాదిలో ప్రాజెక్ట్ ప్రకటించారు. అతని కెరీర్లో 33వ చిత్రంగా నిలవనుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాన్ని హైదరాబాద్లో నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలను గోపీచంద్ ట్విటర్ ద్వారా పంచుకున్నారు.ఈ సినిమాకు సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. ఐబీ 71, ఘాజీ వంటి చిత్రాలతో సంకల్ప్ రెడ్డి ఫేమస్ అయ్యారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాస చిట్టూలి మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఇదివరకెన్నడు చూడని పాత్రలో గోపిచంద్ కనిపించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. దాదాపు 7వ శతాబ్దం నాటి సంఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి నటీనటులు, సాంకేతిక సిబ్బంది వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. Excited to announce my next from the vision of #SankalpReddy, teaming up once again with my producers @srinivasaaoffl garu & Pavan garu under @SS_ScreensNeed all your love..! pic.twitter.com/8wHOdw7d70— Gopichand (@YoursGopichand) March 10, 2025 -
ప్రభాస్ @ 'బక'.. ఇంతకీ దీని అర్థమేంటి?
ప్రభాస్ చేతిలో ఇప్పుడు బోలెడు సినిమాలున్నాయి. ప్రస్తుతానికైతే రాజాసాబ్, ఫౌజీ (వర్కింగ్ టైటిల్) ప్రాజెక్టులు చేస్తున్నాడు. దీని తర్వాత సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్' చేస్తాడు. వీటితో పాటు సలార్ 2, కల్కి 2.. ఇలా చాలానే ఉన్నాయి.ఇవి సరిపోవంటూ ఈ మధ్యే 'హనుమాన్' ఫేమ్ ప్రశాంత్ వర్మతోనూ ప్రభాస్ సినిమా ఒకటి ఓకే అయింది. దీని లుక్ టెస్ట్ కూడా అయిపోయిందని టాక్. ఈ ప్రాజెక్ట్ నుంచి ఇప్పుడు కొత్త అప్డేట్ వచ్చింది. 'బక' అనే టైటిల్ ని ఫిక్స్ చేశారని టాక్. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ షాకవుతున్నారు.(ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన 2 తెలుగు సినిమాలు)టైటిల్ చూడగానే మీకు కూడా విచిత్రంగా ధ్వనించి ఉంటుంది. అయితే మహాభారతంలోని బకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడుగా. అతడి కథనే ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్లు ప్రశాంత్ వర్మ రాశాడని, అందుకే సింపుల్ గా 'బక' అని పెట్టినట్లు తెలుస్తోంది. ఇది నిజమో కాదో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.ఇప్పటివరకు వచ్చిన పౌరాణిక, మైథలాజికల్ సినిమాలతో పోలిస్తే ఈ మూవీ భిన్నంగా ఉంటుందని, పూర్తిగా విజువల్ ఎఫెక్ట్ బేస్డ్ చిత్రమని అంటున్నారు. అలానే ఇది ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమైన సినిమా అని టాక్.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) -
భారత్లో తొలి ఏఐ సినిమా.. హీరోహీరోయిన్లు కూడా..
AI (Artificial intelligence) తలుచుకుంటే ఏదైనా చేయగలదు. అంతెందుకు ఎంచక్కా సినిమా కూడా తీసిపెట్టగలదు. హీరోహీరోయిన్లను కూడా తనే సృష్టించగలదు. వినడానికి ఒకింత ఆశ్చర్యంగా ఉన్నా ఇటువంటి ప్రయోగాలు ఆల్రెడీ జరిగిపోయాయి. ఏఐ సినిమాలు వచ్చేశాయి. ఇంతకీ భారత్లో ఏఐ తీసిన తొలి సినిమా ఏంటో తెలుసా? నైషా. వివేక్ అంచలియా ఏఐ సాయంతో దీన్ని డైరెక్ట్ చేశాడు. ఏఐ సాయంతో సినిమారోజూవారీ దినచర్యలో టెక్నాలజీ ఎంతగా భాగమైంది? భవిష్యత్తులో ఏఐ ఇంకెంత విస్తరించనుంది? మానవ సంబంధాలు ఎలా మారనున్నాయి? అనే అంశాలను నైషా సినిమాలో చూపించారు. సంగీతాన్ని కూడా ఏఐ సాయంతోనే సృష్టించారు. డేనియల్ బి జార్జ్, ప్రోటిజ్యోతి జియోష్, ఉజ్వల్ కశ్యప్ వంటి సంగీతకారులు కొన్ని మ్యూజిక్ బిట్స్ ఇస్తే దాని ఆధారంగా వారికి నచ్చిన సౌండ్ట్రాక్ రెడీ చేసేసింది. ఏఐ అడ్వాన్స్డ్ టూల్స్తో విజువల్స్ కూడా అద్భుతంగా వచ్చేలా చేశారు. ఇంతకీ హీరోహీరోయిన్లు ఎవరనుకుంటున్నారు? జైన్ కపూర్, నైషా బోస్.. వీరిని కూడా టెక్నాలజీయే సృష్టించింది.మేలో రిలీజ్ఏఐ స్టూడియో సాయంతో పోరి భుయాన్, శ్వేత వర్మ, జోసెఫ్ నిర్మించిన ఈ మూవీ ఈ ఏడాది మేలో రిలీజ్ కానుంది. ఈ సినిమా ఎలా ఉండబోతుంది? ఎమోషన్స్ను టెక్నాలజీ రక్తికట్టించగలిగిందా? లేదా? అని సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో కూడా ఏఐ చొచ్చుకుని పోతే భవిష్యత్తులో ఎటువంటి ఛాలెంజ్లు ఎదురవుతాయన్న చర్చకు సైతం నైషా నాంది పలకనుంది.విదేశాల్లో కొన్ని సినిమాలకు ఇదివరకే ఏఐ టెక్నాలజీని వాడుకున్నారు. అవేంటో కింద చూసేద్దాం..సన్స్పింగ్ (Sunspring): 2016లో వచ్చిన ఈ చిత్రానికి ఏఐ స్క్రిప్ట్ అందించింది.జోన్ అవుట్ (Zone Out): కొన్ని యాక్షన్ సన్నివేశాల కోసం ఏఐ విజువల్స్ వాడుకున్నారు. ఇది 2020లో రిలీజైంది.ద నెక్స్ట్ రెంబ్రాండ్ (The Next Rembrandt): 2016లో వచ్చిన ఈ సినిమాలో ఏఐ సాయంతో పెయింటింగ్స్ వేస్తారు.మోర్గాన్ (Morgan): సినిమా ట్రైలర్ రెడీ చేసేందుకు ఏఐ వాడారు.ఏఐ: మోర్ ద హ్యూమన్ (AI: More Than Human): సమాజంలో ఏఐ ఎలాంటి ప్రభావం చూపుతుందని డాక్యుమెంటరీ ద్వారా చక్కగా చూపించారు.ద సేఫ్ జోన్ (The Safe Zone): ఏఐ కథ రాసుకుని, డైరెక్ట్ చేసిన షార్ట్ ఫిలిం ఇది.ద ఫ్రోస్ట్ (The Frost): ఏఐ టూల్స్ ఉపయోగించి తీసిన షార్ట్ ఫిలిం.క్రిటర్జ్ (Critterz): ఏఐ నిర్మించిన యానిమేటెడ్ షార్ట్ ఫిలిం.ప్లానెట్ జెబులాన్ ఫైవ్ (Planet Zebulon Five): ఏఐ ప్రకృతిపై తీసిన డాక్యుమెంటరీ.థాంక్యూ ఫర్ నాట్ ఆన్సరింగ్ (Thank You for Not Answering): షార్ట్ యానిమేటెడ్ ఫిలిం. చదవండి: హీరోయిన్ అంజలితో రిలేషన్? కోన వెంకట్ ఆన్సరిదే.. -
'ముత్తువేల్ పాండియన్' వేట మొదలైంది
రజనీకాంత్- నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్లో వచ్చిన జైలర్ 2023 సినిమా భారీ హిట్ అయింది. ఈ చిత్రానికి సీక్వెల్ వస్తుందని వార్తలు అయితే వస్తున్నాయి కానీ అధికారికంగా షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనేది చెప్పలేదు. తాజాగా, ఈ అంశం గురించి సన్పిక్చర్స్ అప్డేట్ ఇచ్చేసింది. ‘జైలర్ 2’ సినిమా షూటింగ్ నేటి నుంచి ప్రారంభం అవుతుందని మేకర్స్ ప్రకటంచారు. ముత్తువేల్ పాండియన్ వేట ఇప్పుడే ప్రారంభమైంది అంటూ ఒక పోస్టర్ను పంచుకున్నారు.జైలర్2 షూటింగ్ ప్రారంభమైనట్లు మేకర్స్ ప్రకటించడంతో రజనీకాంత్ అభిమానులు వైరల్ చేస్తున్నారు. ‘టైగర్ కా హుకుమ్’ అంటూ పోస్ట్లు పెడుతున్నారు. ‘జైలర్ 2’ కథాంశం ప్రధానంగా గోవా నేపథ్యంలో ఉంటుందని కోలీవుడ్ సమాచారం. ఇకపోతే జైలర్ చిత్రంలో నటించిన మోహన్లాల్, శివరాజ్కుమార్ తదితర ప్రముఖ నటీనటులే నటించనున్నట్లు తెలుస్తోంది. సీక్వెల్లో కన్నడ భామ శ్రీనిధి శెట్టి నటించనున్నట్లు తెలిసింది. ఈ ఏడాది డిసెంబర్లో జైలర్2 విడుదల చేసే ప్లాన్లో మేకర్స్ ఉన్నారు.సూపర్స్టార్ రజనీకాంత్ ఏడు పదుల వయసులోనూ వరుసగా చిత్రాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఈయన ఇటీవల జ్ఞానవేల్ దర్మకత్వంలో వేట్టైయన్లో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా మెప్పించారు. అయితే, ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ చిత్రంలో రజనీకాంత్ నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా కూలీ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తి అయిపోయింది. దీంతో వెంటనే ఆయన జైలర్2 ప్రాజెక్ట్లోకి షిఫ్ట్ అయిపోయారు. -
IIFA Awards 2025: 'లాపతా లేడీస్' చిత్రానికి 10 అవార్డ్స్
'ఐఫా' అవార్డ్స్ 2025 జైపూర్లో ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో తొలి రోజు డిజిటల్ అవార్డుల ప్రదానం చేయగా.. రెండో రోజు చలనచిత్ర అవార్డులు ప్రకటించారు. అయితే, ఈ బాలీవుడ్ చిత్రం 'లాపతా లేడీస్' ఉత్తమ చిత్రంతో పాటు ఏకంగా పది విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది. ఐఫా సిల్వర్ జూబ్లీ వేడుకల కోసం బాలీవుడ్ స్టార్స్ చాలామంది హాజరయ్యారు. ఈ వేడుకల్లో షారుఖ్ ఖాన్, మాధురీ దీక్షిత్, షాహిద్ కపూర్, కృతి సనన్, కరీనా కపూర్, శ్రేయా ఘోషల్, కరణ్ జోహార్, బాబీ డియోల్ ఐఫా వేదికపై సందడి చేశారు.అవార్డ్స్ జాబితాఉత్తమ చిత్రం: లాపతా లేడీస్ఉత్తమ నటుడు: కార్తిక్ ఆర్యన్ (భూల్ భూలయ్యా 3)ఉత్తమ నటి: నితాన్షి గోయల్ (లాపతా లేడీస్)ఉత్తమ దర్శకులు: కిరణ్ రావు (లాపతా లేడీస్)ఉత్తమ సహాయనటుడు: రవి కిషన్ (లాపతా లేడీస్)ఉత్తమ సహాయనటి: జాకీ బోడివాలా (షైతాన్)ఉత్తమ నటుడు (తొలి పరిచయం): లక్ష్య లాల్వాని ( కిల్)ఉత్తమ నటి (తొలి పరిచయం): ప్రతిభా (లాపతా లేడీస్)ఉత్తమ విలన్: రాఘవ్ జాయల్ (కిల్)ఉత్తమ సంగీత డైరెక్టర్: రామ్ సంపత్(లాపతా లేడీస్)ఉత్తమ సింగర్ -మేల్: జుబిన్ నౌటియల్ (ఆర్టికల్ 370)ఉత్తమ సింగర్ - ఫిమేల్: శ్రేయా ఘోషల్ (భూల్ భూలయ్య 3)ఉత్తమ కథ (ఒరిజినల్): బిప్లాబ్ గోస్వామి (లాపతా లేడీస్)ఉత్తమ ఎడిటింగ్: జాబిన్ మార్చంట్ (లాపతా లేడీస్)ఉత్తమ స్క్రీన్ప్లే : స్నేహా దేశాయ్ (లాపతా లేడీస్)ఉత్తమ సాహిత్యం: ప్రశాంత్ పాండే (లాపతా లేడీస్) -
హీరోయిన్ అంజలితో రిలేషన్? కోన వెంకట్ ఆన్సరిదే..
రచయితగా, నిర్మాతగా రెండు దశాబ్దాలుగా సినీసీమలో కొనసాగుతున్నాడు కోన వెంకట్ (Kona Venkat). ఒకప్పుడు ఎక్కువ హిట్లు అందుకున్న ఆయన ఈ మధ్యకాలంలో జిన్నా, గీతాంజలి మళ్లీ వచ్చింది వంటి చిత్రాలతో పరాజయాల బాట పట్టాడు. హీరోయిన్ అంజలితో నిశ్శబ్ధం, డిక్టేటర్, గీతాంజలి, గీతాంజలి మళ్లీ వచ్చింది, శంకరాభరణం.. ఇలా పలు సినిమాలు చేశాడు. దీంతో దర్శకుడికి, అంజలికి మధ్య ఏదో ఉందన్న రూమర్స్ మొదలయ్యాయి. అంజలిపై సాఫ్ట్ కార్నర్వీరు రిలేషన్లో ఉన్నారని పుకార్లు వినిపించాయి. తాజాగా ఈ రూమర్స్పై కోన వెంకట్ స్పందిస్తూ.. అంజలి (Actress Anjali) పై నాకు సాఫ్ట్ కార్నర్ ఉంది. తనను చెల్లిగా, కూతురిగా, స్నేహితురాలిగా.. ఎలా పిలవమన్నా పిలుస్తాను. తన వ్యక్తిగత జీవితం చాలా తక్కువమందికే తెలుసు. తన బాల్యం సంతోషకరంగా సాగలేదు. పేరెంట్స్ దగ్గర కూడా ఎప్పుడూ లేదు. పిన్ని దగ్గరే పెరిగింది. ఆమె కూడా సరిగా చూసుకునేది కాదు.ఆస్తి కబ్జాతనకు ఒక సపోర్ట్ కావాలనిపించింది. తన బాధ చెప్పుకునేందుకు ఓ మనిషి ఉంటే బాగుండనిపించింది. నా కూతురికి ఏదైనా అవసరం ఉందంటే ఎలా నిలబడతానో అంజలికి కూడా ఎల్లప్పుడూ అలాగే నిల్చున్నాను. దాన్ని రకరకాలుగా ప్రచారం చేసుకుంటున్నారు. నేనవేవీ పట్టించుకోను. గీతాంజలి సినిమా సమయంలోనే అంజలి నాకు తొలిసారి పరిచయమైంది. అదే సమయంలో చెన్నైలో తను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆమె పిన్నివాళ్లు అంజలి ఆస్తిని కబ్జా చేశారు. అలాంటి సమయంలో నిస్వార్థంగా తనకు అండగా నిలబడే ఓ స్నేహితుడు అవసరం అనిపించింది. నా చేతుల మీదుగా ఇవ్వమని ఆశపడిందినన్ను ఫ్రెండ్, అన్న, తండ్రి, గురువు, దైవం.. ఏదనుకున్నా పర్లేదు. నేను పోలీసులతో మాట్లాడి తనకు అండగా నిలబడ్డాను. ఆమె తొలిసారి బీఎమ్డబ్ల్యూ కారు కొనుకున్నప్పుడు నా చేతుల మీదుగా ఇవ్వమని అడిగింది. సరేనని నా చేతులమీదుగా కారు తాళాలు తన చేతికిచ్చాను. దానికి నేనేదో ఆమెకు కారు గిఫ్ట్ ఇచ్చానని రాసేశారు. మా అనుబంధానికి మీరు ఏ పేరైనా పెట్టుకున్నా నేను పట్టించుకోను అని కోన వెంకట్ చెప్పుకొచ్చాడు.చదవండి: #SSMB29: వాట్ ద ఎఫ్.. రాజమౌళి? -
ఓటీటీలో సైన్స్ ఫిక్షన్ సినిమా.. ఇన్స్టా ఫేమ్ 'అమృత చౌదరి'కి ఫ్యాన్స్ ఫిదా
ప్రెజర్ కుక్కర్, లగ్గం వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు సాయి రోనక్.. ఆయన నటించిన తెలుగు సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమా రివైండ్ (Rewind Movie) సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసింది. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ సోషల్మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న అమృత చౌదరి హీరోయిన్గా నటించింది. గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం నాలుగు నెలల తర్వాత మార్చి 10న ఓటీటీలో విడుదలైంది. తెలుగుతో పాటు హిందీ భాషలోనూ రివైంట్ చిత్రం అందుబాటులో ఉంది.సాయి రోనక్, అమృత చౌదరి కాంబినేషన్తో రివైండ్ చిత్రానికి మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో సురేశ్, సామ్రాట్, వైవా రాఘవ్, జబర్దస్త్ నాగి, అభిషేక్ విశ్వకర్మ, ఫన్బకెట్ భరత్.. తదితరులు కీలక పాత్ర పోషించారు. కళ్యాణ్ చక్రవర్తి దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించాడు. శివరామ్ చరణ్ సినిమాటోగ్రాఫీ అందించగా ఆశీర్వాద్ లూక్ సంగీతం సమకూర్చాడు. ఈ మూవీ 2024 అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి ఐఎమ్బీడీ రేటింగ్ 9.4 ఉండటం విశేషం.కథేంటి..?ఈ సినిమా కథ 2019-2024 మధ్య కాలంలో జరుగుతుంది. కార్తిక్(సాయి రోనక్) ఓ సాఫ్ట్వేర్. తన స్నేహితుడు సుబ్బు అపార్ట్మెంట్లో శాంతి(అమృత చౌదరి)ని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. తను పని చేసే ఆఫీసులోనే ఆమె కూడా జాయిన్ అవ్వడంతో పరిచయం పెంచుకుంటాడు. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడతారు కానీ బయటకు చెప్పుకోరు. ఓ రోజు శాంతి ఓ ముఖ్యమైన విషయం చెప్పాలంటూ కార్తిని కాఫీ షాపుకు రమ్మని చెబుతుంది. అదే రోజు శాంతి వాళ్ల తాతయ్య(సామ్రాట్) కనిపెట్టిన టైం మిషన్ సహాయంతో కార్తిక్ ట్రైమ్ ట్రావెల్ చేసి 2019 కాలం నాటికి వెళ్తాడు. ఆ తర్వాత కార్తిక్ జీవితంలో ఎలాంటి పరిణామాలు జరిగాయి? కార్తి ట్రైమ్ ట్రావెల్ చేయాలని ఎందుకు అనుకున్నాడు? శాంతి వాళ్ల తాతయ్య కనిపెట్టిన టైమ్ మిషన్ కార్తికి ఇంటికి ఎలా చేరిది? కార్తిక్ ప్లాష్బ్యాక్ స్టోరీ ఎంటి? చివరకు శాంతి, కార్తిక్లు ఒకటయ్యారా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. View this post on Instagram A post shared by Amrutha Chowdary (@__amrutha__chowdary__) -
సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన 2 తెలుగు సినిమాలు
ఓటీటీల్లో కొన్ని సినిమాలు చాలా హడావుడితో రిలీజ్ చేస్తారు. మరికొన్నింటిని మాత్రం ఎలాంటి ప్రకటన లేకుండా సింపుల్ గా స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చేస్తారు. అలా ఇప్పుడు రెండు తెలుగు సినిమాల్ని ఓటీటీలోకి అందుబాటులోకి తెచ్చారు. ఇంతకీ అవేంటి? ఎందులో చూడొచ్చు?కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వహించిన మూవీ 'తల'. తన కొడుకునే హీరోగా పెట్టి ఈ సినిమా తీశారు. ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజ్ చేశారు. అసలు విడుదలైనట్లు కూడా తెలియనంత వేగంగా మాయమైపోయింది. ఇప్పుడు ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రెంట్ విధానంలో అందుబాటులోకి వచ్చింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్)గతేడాది నవంబర్ 8న రిలీజైన 'జాతర' అనే సినిమా కూడా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అద్దె ప్రాతిపదికన స్ట్రీమింగ్ లోకి వచ్చింది. ఒక ఊరిలో ఉండే గంగమ్మ తల్లి దేవత బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. పేరున్న నటీనటులు లేకపోవడంతో ఇదొకటి ఉందని కూడా ఎవరికీ తెలియదు.అయితే ఈ రెండు తెలుగు సినిమాల్ని నేరుగా స్ట్రీమింగ్ చేసుంటే అయిపోయేది. కానీ రెంట్ విధానంలో ఎందుకు తీసుకొచ్చారనేది ఇక్కడ అర్థం కాని ప్రశ్న. త్వరలో ఉచితంగా స్ట్రీమింగ్ అందుబాటులోకి తెస్తారేమో చూడాలి?(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' నటి) -
సినిమాల్లోకి జగ్గారెడ్డి ఎంట్రీ.. మూవీ పోస్టర్ విడుదల
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి త్వరలో సినిమా రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. త్వరలో ఒక ప్రేమ కథా చిత్రంలో ప్రత్యేక పోషిస్తున్నట్టు జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఈ క్రమంలో జగ్గారెడ్డి సినిమాకు సంబంధించిన పోస్టర్ విడుదలైంది.కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజకీయాల నుంచి కొంత రిలాక్స్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సినిమాలపై ఆసక్తితో ఉన్నట్టు జగ్గారెడ్డి తెలిపారు. తాజాగా జగ్గారెడ్డి మాట్లాడుతూ..‘నాకు సినిమా ఆఫర్ వచ్చింది. లవ్స్టోరీ చిత్రంలో ప్రత్యేక పాత్ర చేస్తున్నాను. ప్రేమికుల ప్రేమను కాపాడే క్యారెక్టర్లో జగ్గారెడ్డి కనిపిస్తాడు. మాఫీయాను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసే నాయకుడి పాత్ర పోషిస్తున్నాను. రాజకీయాల్లో ఉంటా.. సినిమాల్లో కూడా ఉంటాను. రాజకీయాల్లో నన్ను ఎవరూ తొక్కలేరు. నా ఒరిజినల్ క్యారెక్టర్ సినిమాలో చూస్తారు. ఉగాదికి సినిమా కథ విని వచ్చే ఉగాదికి సినిమా పూర్తి చేస్తాను. పీసీపీ, ముఖ్యమంత్రికి చెప్పి సమయం తీసుకుని ఏడాది పాటు సినిమాలో నటిస్తాను అని చెప్పుకొచ్చారు. ఇక, తాజాగా జగ్గారెడ్డి పోస్టర్లను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ చిత్రానికి వద్ది రామానుజం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు.. జగ్గారెడ్డి సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
ఓటీటీలో మరో ఫ్యామిలీ సిరీస్.. టీజర్ రిలీజ్
ఓటీటీలో మరో ఫ్యామిలీ సిరీస్ వచ్చేందుకు రెడీ అయిపోయింది. 90స్, ఎర్లీ 20స్ లో జరిగిన కథలతో ఇదివరకే పలు సినిమాలు, సిరీసులు రాగా.. ఇప్పుడు ఆ తరహా కాన్సెప్ట్ తోనే తీసిన 'హోమ్ టౌన్' సిరీస్ రానుంది. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. ఇది ఎలా ఉందంటే?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్)ఇప్పుడంటే సోషల్ మీడియా అందరికీ కామన్ అయిపోయింది. కానీ ఫేస్ బుక్ వచ్చిన కొత్తలో ముగ్గురు టీనేజర్స్ ఎంత సందడి చేశారు? అటు స్కూల్, ఇటు ఇంట్లో పాటు క్రికెట్ గ్రౌండ్ లోనూ వీళ్లు ఎలా అల్లరి చేశారు? అనేది తెలియాలంటే 'హోమ్ టౌన్' సిరీస్ చూడాలి.ఆహా ఓటీటీలో ఏప్రిల్ 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. రాజీవ్ కనకాల, ఝాన్సీ తప్పితే పెద్దగా తెలిసిన ముఖాలు లేవు. కానీ టీజర్ చూస్తుంటే మాత్రం పర్లేదనిపించేలా ఉంది. 90స్ లో పుట్టి పెరిగిన వాళ్లు కనెక్ట్ అయ్యేలా ఉందనిపిస్తోంది. శ్రీకాంత్ పల్లె దర్శకుడు. నవీన్ మేడారం షో రన్నర్.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' నటి) -
గోపీచంద్ మలినేనికి 'విలన్' దొరికేశాడు
బాలీవుడ్ టాప్ హీరోలలో సన్నీ డియోల్ ఒకరు అని తెలిసిందే.. ఆయనతో మన తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని ఒక సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ‘జాట్’ అనే టైటిల్తో తెరకెక్కుతున్న ఈ బాలీవుడ్ చిత్రం పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానుంది. సయామీ ఖేర్, రెజీనా హీరోయిన్స్గా నటిస్తున్నారు. అయితే, తాజాగా ఈ సినిమాలో విలన్గా బాలీవుడ్ నటుడు రణ్దీప్ హుడా నటించనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీలో ఆయన పాత్రను చూపుతూ ఒక గ్లింప్స్ను విడుదల చేశారు.జాట్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు భారీ బడ్జెట్తో సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ వేసవిలో ఏప్రిల్ 10న జాట్ సినిమా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీతో గోపీచంద్ మలినేని క్రేజ్ మరింత స్థాయికి పెరుగుతుందని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. 2023లో వీరసింహారెడ్డి చిత్రం తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'జాట్' కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
'రష్మిక'కు రక్షణ కల్పించాలంటూ అమిత్ షాకు 'కుల' పెద్దల లేఖ
పాన్ ఇండియా రేంజ్లో సత్తా చాటుతున్న కన్నడ బ్యూటీ 'రష్మిక మందన్న'కు రక్షణ కల్పించాలని ఆమె కులానికి (కొడవ) చెందిన సంఘం వారు రంగంలోకి దిగారు. ఈమేరకు వారు కేంద్రానికి లేఖ కూడా రాశారు. రీసెంట్గా 'ఛావా' సినిమా సక్సెస్ మీట్లో రష్మిక చేసిన వ్యాఖ్యలు కన్నడ నాట భగ్గుమన్నాయి. బాలీవుడ్ మీడియాతో ఆమె మాట్లాడుతూ.. 'నేను హైదరాబాద్ నుంచి వచ్చాను.. నాపై ఇక్కడి వారు చూపుతున్న ప్రేమాభిమానాలు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది.' అని చెప్పడంతో కర్ణాటకలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. సొంతూరును మరిచిపోయి ఇలా మాట్లాడటం ఏంటి అంటూ ఆమెపై కన్నడ అభిమానులు ఫైర్ అయ్యారు.రష్మికకు రక్షణగా 'కుల' పెద్దలుసౌత్ ఇండియాతో పాటు బాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ కెరీర్లో దూసుకెళ్తున్న రష్మికకు భద్రత కల్పించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రాష్ట్ర హోం మంత్రి జి. పరమేశ్వర్లకు 'కొడవ నేషనల్ కౌన్సిల్' (సీఎన్సీ) లేఖ రాసింది. రష్మిక చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెను దుమారం రేగడంతో కర్ణాటకలోని ఒక ఎమ్మెల్యేతో పాటు కన్నడ అనుకూల వర్గానికి చెందిన వారు ఆమెపై బెదిరింపులకు దిగారని (సీఎన్సీ) పేర్కొంది. దీంతో నటికి భద్రత కల్పించాలని 'కొడవ' బోర్డు కోరింది. తమ తెగకు చెందిన రష్మిక తన కృషి, ప్రతిభతో భారతీయ చిత్ర పరిశ్రమలో అఖండ విజయాన్ని సాధించిందని బోర్డు చైర్మన్ ఎన్.యు. నాచప్ప లేఖలో పేర్కొన్నారు. దేశంలోనే గొప్ప నటులుగా గుర్తింపు ఉన్న అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్ వంటి వారితో స్క్రీన్ షేర్ చేసుకుందని గుర్తుచేశారు. ఆమెకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది కాబట్టే తన అభిప్రాయాన్ని పంచుకుందన్నారు. కానీ, ఎమ్మెల్యే చేసిన ప్రకటనతో ఆమెలో భయం పెరిగిందని ఆయన అన్నారు. తాను వెనుకబడిని వర్గానికి చెందిన మహిళ కాబట్టే టార్గెట్ చేసి బెదిరిస్తున్నారు. ఇప్పటికే రష్మిక మందన్న కూడా ఫిర్యాదు చేసిందని నాచప్ప తెలిపారు. కర్ణాటకలో కొడవ వర్గం ప్రజలు ఓబీసీ కిందకు వస్తారు. రష్మిక మందన్న సామాజిక వర్గం 'కొడవ' అని తెలిసిందే.ఎమ్మెల్యే బెదిరింపులురష్మికపై కర్ణాటకలోని మండ్యాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే 'రవి గనిగ' ఫైర్ అయ్యారు. బాలీవుడ్లో ఆమె చేసిన వ్యాఖ్యలను తప్పుబడతూ ఆయన ఒక ప్రెస్మీట్ ఏర్పాటు చేశారు. జీవితాన్ని ఇచ్చిన ఇండస్ట్రీని ఆమె తక్కువ చేసిందని తెలిపారు. ఈ విషయం రష్మిక తెలుసుకోవాలని కోరారు. బెంగళూరు వేదికగా జరుగుతోన్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు కూడా ఆమె అంగీకరించలేదని ఆయన ఆరోపించారు. రష్మిక మందన్నకు సరైన గుణపాఠం చెప్పాలని ఎమ్మెల్యే రవి పిలుపునిచ్చారు. ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనని వారిపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అలాంటి వారి నట్లు, బోల్టులు ఎలా సరిచేయాలో తమకు తెలుసని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో కొడవ సామాజిక వర్గం వారు రష్మిక మందన్నకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. ఆమెకు రక్షణ కల్పించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కొడవ వర్గం లీడర్ ఒక లేఖ రాశారు. -
పార్టీలో ఫుల్ హ్యాపీగా సితార-నమ్రత-చరణ్
రీసెంట్ టైంలో పెళ్లిళ్లు చాలా జరుగుతున్నాయి. సామాన్యుల దగ్గర సెలబ్రిటీల వరకు కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. రీసెంట్ గా హైదరాబాద్ లో నిర్మాత మహేశ్వర్ రెడ్డి కుమారుడు నితీశ్ రెడ్డి పెళ్లి దుబాయిలో జరిగింది. దీనికి టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలు హాజరయ్యారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలేంటంటే?)దుబాయిలో జరిగిన పెళ్లికి చిరంజీవి, ఎన్టీఆర్, మహేశ్ బాబు, నాగార్జున కుటుంబాలు వెళ్లాయి. తాజాగా శనివారం రాత్రి హైదరాబాద్ లో రిసెప్షన్ జరగ్గా.. నమ్రత-సితార, రామ్ చరణ్-ఉపాసన దంపతులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలని నమ్రత తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. కొత్త జంట నితీష్-కీర్తిని ఆశీర్వదించింది.అయితే పార్టీలంటే ముందుండే మహేశ్ బాబు మాత్రం రాజమౌళితో తీస్తున్న సినిమా షూటింగ్ వల్ల వీటిని మిస్ అవుతున్నాడు. ప్రస్తుతం ఒడిశాలోని కోరాపుట్ ప్రాంతంలోని కొండల్లో కీలక సన్నివేశాలు తీస్తున్నారు. ఇందుకు సంబంధించి లీకైన ఓ వీడియో క్లిప్ కూడా తెగ వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' నటి) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్
మరో వారం వచ్చేసింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పరీక్షల హడావుడి నడుస్తోంది. ఈ క్రమంలోనే ఈ వారం థియేటర్లలోకి 'కోర్ట్', 'దిల్ రుబా' అనే తెలుగు చిత్రాలతో పాటు 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ' అనే డబ్బింగ్ మూవీ రిలీజ్ అవుతోంది. మరోవైపు 'యుగానికి ఒక్కడు' ఈ వారమే రీ రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' నటి)ఇవి కాకుండా ఓటీటీల్లోకి కేవలం 9 సినిమాలు-వెబ్ సిరీసులు మాత్రమే స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో అఖిల్ 'ఏజెంట్', రామం రాఘవం, రేఖాచిత్రం చిత్రాలు కాస్త ఆసక్తి రేపుతున్నాయి. ఇంతకీ ఏయే మూవీస్ ఏ ఓటీటీల్లోకి రాబోతున్నాయంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (మార్చి 10-16 వరకు)సోనీ లివ్ఏజెంట్ (తెలుగు సినిమా) - మార్చి 14అమెజాన్ ప్రైమ్వీల్ ఆఫ్ టైమ్ 3 (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - మార్చి 13బీ హ్యాపీ (హిందీ మూవీ) - మార్చి 14ఒరు జాతి జాతికమ్ (మలయాళ సినిమా) - మార్చి 14నెట్ ఫ్లిక్స్అమెరికన్ మ్యాన్ హంట్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - మార్చి 10హాట్ స్టార్పొన్ మ్యాన్ (మలయాళ సినిమా) - మార్చి 14మోనా 2 (ఇంగ్లీష్ మూవీ) - మార్చి 14జీ5వనవాస్ (హిందీ సినిమా) - మార్చి 14సన్ నెక్స్ట్రామం రాఘవం (తెలుగు మూవీ) - మార్చి 14 ఆహారేఖాచిత్రం (తెలుగు సినిమా) - మార్చి 14ఆపిల్ టీవీ ప్లస్డోప్ థీప్ (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 14(ఇదీ చదవండి: గోదావరిలో అస్థికలు కలిపిన యాంకర్ రష్మీ) -
ఓటీటీలో రచిత గ్లామరస్ సినిమా.. మొత్తం 'ఫైర్' అయిపోతారు
కోలీవుడ్లో సెన్సేషనల్ చిత్రంగా నిలిచిన సినిమా 'ఫైర్' ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈ సినిమాలో రచిత మహాలక్ష్మి గ్లామర్ డోస్ పెంచడంతో ఈ చిత్రం పేరు నెట్టింట వైరల్ అయింది. 'ఫైర్' చిత్రంలోని ఒక పాటలో ఆమె మితిమీరిన రొమాన్స్ సీన్లతో అదరగొట్టేసింది. ఇంకేముంది ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చేశాయి. తెలుగు, తమిళ్, కన్నడ సీరియల్స్లో బాగా గుర్తింపు ఉన్న ఆమెకు ఇప్పుడిప్పుడే సినిమాల్లో ఛాన్స్లు వస్తున్నాయి. ఈ క్రమంలో రచిత నటించిన తాజా చిత్రం 'ఫైర్' ఫిబ్రవరి 14న విడుదల అయింది.'ఫైర్' చిత్రంలో బాలాజీ మురుగదాస్, చాందిని తమిళరసన్, రచిత మహాలక్ష్మి, సాక్షి అగర్వాల్ నటించారు. జెఎస్కే సతీష్ కుమార్ దర్శకత్వం వహించారు. క్రైమ్,థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం కాస్త ఫర్వాలేదని టాక్ తెచ్చుకుంది. నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ మూవీని నిర్మించారు. మార్చి 14న ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానుంది. అయితే, తమిళ్లో పాపులర్ అయిన టెంట్కొట్టా (Tentkotta)లో స్ట్రీమింగ్ కానుంది. రచిత మహాలక్ష్మి ఇచ్చిన గ్లామర్ ట్రీట్కు భారీ ధరను చెల్లించి ఫైర్ చిత్రాన్ని ఆ సంస్థ కొనుగోలు చేసింది. దీంతో టెంట్కొట్టా ఓటీటీ సబ్ స్క్రైబర్స్ కూడా పెరగవచ్చని అంచనా వేస్తున్నారు.తెలుగులో రచితతెలుగులో 2013-2016 సమయంలో టెలికాస్ట్ అయిన స్వాతి చినుకులు సీరియల్లో నీలా పాత్రలో ఆమె నటించింది. 2020లో చిట్టితల్లి అనే సిరీయల్లో శకుంతల పాత్రలో మెప్పించింది. అయితే, ఆమె నటించిన కొత్త సినిమా తెలుగులో జనవరి 24న విడుదలైంది. రచిత మహాలక్ష్మి, కమల్ కామరాజు, సాత్విక్, సాహిత్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం "తల్లి మనసు". ఈ సినిమాను వి శ్రీనివాస్ (సిప్పీ) దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని ముత్యాల మూవీ మేకర్స్ పతాకంపై ముత్యాల సుబ్బయ్య తనయుడు ముత్యాల అనంత కిషోర్ నిర్మించారు. -
డేటింగ్లో 'చాహల్'.. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్కు ఆమెతో పాటు ఎంట్రీ
భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, కొరియోగ్రాఫర్, నటి ధనశ్రీ వర్మ విడాకుల వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. దాదాపు నిజమే అయినప్పటికీ అధికారికంగా ప్రకటన రాలేదు. అయితే, చహల్ మరో యువతితో డేటింగ్లో ఉన్నాడని కూడా వార్తలు వచ్చాయి. ఆర్జే మహ్వాష్తో(RJ Mahvash) డేటింగే వల్లే చహల్ కాపురంలో చిచ్చు మొదలైందని పుకార్లు కూడా వచ్చాయి. కొద్దిరోజుల క్రితమే వాటిని మహ్వాష్ తిప్పికొట్టింది. అవన్నీ రూమర్స్ మాత్రమేనని ఆమె పేర్కొంది. అయితే, తాజాగా వారిద్దరూ కలిసి చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో సందడి చేశారు. దీంతో మరోసారి నెట్టింట వైరల్ అవుతున్నారు.ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్లో భారత్, న్యూజిలాండ్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. 12 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ ఛాంపియన్స్ ట్రోఫీని టీమ్ఇండియా అందుకుంది. ఇంతటి సంబరంలో కూడా యుజ్వేంద్ర చహల్, ఆర్జే మహ్వాష్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మ్యాచ్ జరుగుతున్న సమయంలో వారిద్దరూ ప్రేక్షకుల గ్యాలరీలో సందడిగా కనిపించారు. చాలా సన్నిహితంగా ఉన్న ఫోటోలను షోషల్మీడియాలో కొందరు షేర్ చేశారు. గతంలో వీళ్లిద్దరూ రెస్టారెంట్లో కనిపించిగా ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఇలా మరోసారి సన్నిహితంగా కనిపించడంతో వారిద్దరిపై వస్తున్న డేటింగ్ వార్తలు నిజమేననే అనుమానాలు మరింత బలపడే అవకాశం ఉంది. ఒక సందర్భంలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్ కూడా ఈ జంటతో ముచ్చటించారు. ఆయన కూడా చహల్, మహ్వాష్ ఫోటోలను షేర్ చేశారు.ఆర్జే మహ్వాష్ సినీ నటి మాత్రమే కాదు.. ప్రస్తుతం ఆమె ఒక సినిమాకు నిర్మాతగా ఉన్నారు. నిర్మాణ కార్యక్రమంలో ఉన్న ఆ చిత్రం త్వరలో విడుదల కానుంది. అయితే, ఆమెకు రేడియో జాకీగా మొదట బాగా గుర్తింపు వచ్చింది. ఇప్పుడు క్రికెటర్ యుజ్వేంద్ర చహల్తో డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వస్తుండటంతో ఆమె పేరు ట్రెండ్ అవుతుంది.Following separation from actress-choreographer #DhanashreeVerma, cricketer #YuzvendraChahal was spotted with #RJMahvash watching #INDvsNZ Champions Trophy final in Dubai. pic.twitter.com/j5cjTXcdvL— Cinemania (@CinemaniaIndia) March 9, 2025 -
#SSMB29: వాట్ ద ఎఫ్.. రాజమౌళి?
ఒక ప్రొడక్టును సృష్టించడం కంటే.. దాని మార్కెటింగ్ ఎంత బాగా చేశామనేది వ్యాపారంలో పాటించాల్సిన ముఖ్య సూత్రం. మన దేశంలో.. సినిమా అనే వ్యాపారంలో దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళిని ఈ విషయంలో కొట్టగలిగేవారే లేరని ఇంతకాలం చెప్పుకున్నాం. అయితే తాజా #SSMB29 లీక్లతో ఈ విషయంలో కొన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి.సినిమా మేకింగ్లో రాజమౌళి(Rajamouli)ది ఢిపరెంట్ స్కూల్. హీరోలతో సహా ప్రతీ టెక్నీషియన్కు కార్పొరేట్ కల్చర్ తరహాలో ఐడీ కార్డు జారీ చేస్తుంటారు. సెట్స్కి మొబైల్స్ తేవడం బ్యాన్.. అంతేకాదు ఈ విషయంలో ప్రత్యేక నిఘా కూడా పెడుతుంటారు. ఇలా.. ఒక సినిమా షూటింగ్ విషయంలో ఇంత జాగ్రత్తలు పాటిస్తుంటాడు దర్శకుధీరుడు. అంతెందుకు ఓ సినిమా మేకింగ్నే(RRR) ఏకంగా ఒక డాక్యుమెంటరీగా తీయించి వదిలిన ఘనత కూడా ఈయనకే దక్కుతుంది. అలాంటిది మహేష్ బాబుతో తీస్తున్న చిత్రం విషయంలో ఎక్కడ పారపాటు.. కాదు పొరపాట్లు జరుగుతున్నాయి?.సూపర్ స్టార్ మహేష్బాబు హీరో. మళయాళ స్టార్ హీరో ఫృథ్వీ రాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) ఓ కీలక పాత్ర. ఏకంగా.. ప్రియాంక చోప్రా(Priyanka Chopra) హీరోయిన్. ఇంకా ఊహించని సర్ప్రైజ్లు ఎన్నెన్నో ఉండొచ్చు. అలాంటిది పరిస్థితి ఇలాగే కొనసాగితే.. ఇలాంటి లీక్లతో అవన్నీ బయటకు వచ్చేయవా?..ఎక్కడో ఒడిషాలో మారుమూల చోట ప్రత్యేక సెట్టింగులలో షూటింగ్ జరుపుకుంటోంది SSMB20 చిత్రం. తొలుత అక్కడి పోలీస్ అధికారులతో దిగిన ఫొటోలు బయటకు వచ్చాయి. ఆ వెంటనే అక్కడి ఛానెల్స్లో సెట్స్ను లాంగ్షాట్స్లో లైవ్ చూపించేశాయి. ఆ మరుసటి రోజే.. మహేష్ బాబు పాల్గొన్న షూటింగ్ సీన్.. అదీ చాలా క్లోజప్ షాట్లో బయటకు రావడం ఎంబీఫ్యాన్స్నే కాదు.. యావత్ చలనచిత్ర పరిశ్రమేనే షాక్కు గురి చేసింది . దీంతో ఆ వీడియోను తొలగించే చర్యలు చేపట్టినట్లు చిత్ర యూనిట్ తరఫు నుంచి ఒక ప్రకటన బయటకు వచ్చింది.ఆర్ఆర్ఆర్ తరహాలోనే.. మహేష్ బాబు సినిమాకు సైతం సెట్స్కు ఫోన్లు తేవడం నిషేధించారు. అయినప్పటికీ ఆ సీన్ను ఎవరు.. ఎలా షూట్ చేశారు?. అదీ అది అంత దగ్గరగా ఉండి మరీ?. ప్రస్తుతం ఈ అంశంపై తీవ్ర చర్చ నడుస్తోంది. సాధారణంగా రాజమౌళి సినిమా షూటింగ్లకు బయటి వాళ్లను అనుమతించరు. షూటింగ్ కోసం తెచ్చే జూనియర్ ఆర్టిస్టులకు సైతం స్ట్రిక్ ఇన్స్ట్రక్షన్స్ వెళ్తుంటాయి. అలాంటప్పుడు లీకులకు అవకాశం ఎక్కడిది?. పనిరాక్షసుడిగా పేరున్న ఆయన పెట్టిన రూల్స్ బ్రేక్ చేసిందెవరు?. కొంపదీసి.. ఇది కావాలని చేసిన లీక్ కాదు కదా! అనే చర్చ సైతం ఇప్పుడు జోరుగా నడుస్తోంది. అయితే..సినిమా ప్రమోషన్ విషయంలో రాజమౌళి స్ట్రాటజీ ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. అంతేగానీ ఇంత చెత్తగా మాత్రం ఉండదు!. సినిమా ప్రమోషన్ల కోసం నిర్మాతతో మంచి నీళ్లలా డబ్బులు ఖర్చు చేయిస్తాడనే విమర్శ కూడా జక్కన్న మీద ఉంది కదా. అలాంటప్పుడు భారీ బడ్జెట్తో.. అదీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా విషయంలో ఇలా ఎందుకు జరగనిస్తాడు?. ఏది ఏమైనా రాజమౌళి-మహేష్ బాబు సినిమా నుంచి.. అదీ షూటింగ్ మొదలైన తొలినాళ్లలోనే ఇలాంటి లీకులు కావడంతో.. వాట్ ద F*** అని ఒక్కసారిగా అనుకుంది టీఎఫ్ఐ అంతా. ఇంత చర్చ నడుస్తుండడంతో.. ఇకనైనా లీకుల విషయంలో జాగ్రత్త పడతారేమో చూడాలి మరి!.ఇదీ చదవండి: రాజమౌళికి బిగ్ షాక్.. మహేష్ బాబు వీడియో బయటకు! -
కేవలం రూ. 2500 కోసం రోడ్డుపైనే డ్యాన్స్ చేశా: వరలక్ష్మి శరత్ కుమార్
కోలీవుడ్ ప్రముఖ నటుడు శరత్ కుమార్ వారసురాలు నటి వరలక్ష్మి శరత్ కుమార్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే, ఈమె తండ్రి సపోర్ట్ లేకుండానే దక్షిణాదిలో ప్రముఖ నటిగా ఎదిగారు అన్నది వాస్తవం. నటి నయనతార భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన పోడాపోడి చిత్రం ద్వారా కథానాయకిగా ఎంట్రీ ఇచ్చిన నటి వరలక్ష్మి . శంభో కథానాయకుడిగా నటించిన ఆ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో ఆమెకు వెంటనే మరో అవకాశం రాలేదు. అలాంటి సమయంలో దర్శకుడు బాల తాను దర్శకత్వం వహించిన తారైతప్పట్టై చిత్రంలో నటించే అవకాశాన్ని కల్పించారు. ఆ చిత్రం నటి వరలక్ష్మి శరత్ కుమార్ మంచి పేరును తెచ్చిపెట్టింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో కథానాయకిగా నటించింది. అయితే, హీరోయిన్గా టాప్ స్టార్ ఇమేజ్ ని మాత్రం ఇప్పటికీ పొందలేకపోయింది. కానీ, ఆమె కథానాయకిగానే కాకుండా ప్రతి కథానాయకిగా కూడా నటిస్తూ విలక్షణ నటిగా గుర్తింపు పొందింది. అలా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం తదితర భాషల్లో నటిస్తూ దక్షిణాది నటిగా ముద్ర వేసుకుంది. డేరింగ్ నటిగా పేరు తెచ్చుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ 39 ఏళ్ల వయసులో గత ఏడాది తన చిరకాల మిత్రుడు నికోలాయ్ సచ్దేవ్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వివాహ తర్వాత తన భర్తతో పాటుగా కనిపిస్తున్న ఆమె ఇటీవల ఒక డాన్స్ కార్యక్రమంలో పాల్గొంది. ఆ డాన్స్ కార్యక్రమంలో ముగ్గురు పిల్లలకు తల్లి అయిన మరో మహిళ కూడా పాల్గొంది. తనదైన స్టెప్పులతో అదరగొట్టేసింది. ఆమె టాలెంట్ను చూసిన వరలక్ష్మీ ఫిదా అయిపోయింది. అయితే, మ్యూజిక్ వినగానే తనకు డాన్స్ చేయాలనిపిస్తుందని ఆ మహిళ తెలిపింది. దీంతో నటి వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ తాను ఇప్పటి వరకు ఎవరికీ చెప్పని ఒక రహస్యాన్ని ఈ వేదికపై చెబుతానని పేర్కొంది. గతంలో తాను కూడా ఒక్కోసారి రోడ్డుపైనే డాన్స్ చేసిన సంర్భాలను గుర్తుచేసుకుంది. తాను సినీ రంగ ప్రవేశం చేయకముందు 2500 రూపాయల కోసం మొట్టమొదటిసారిగా ఒక షో కోసం రోడ్లో డాన్స్ చేశానని చెప్పింది. రోడ్డుపై డాన్స్ చేయడం ఎవరూ తప్పుగా భావించవద్దని నటి వరలక్ష్మి శరత్ కుమార్ పేర్కొంది. -
కొలంబో కాలింగ్
కొలంబో వెళ్లనున్నాడట డ్రాగన్. ఎన్టీఆర్(Jr NTR) హీరోగా ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్ మూవీ ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్). ఇందులో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. గత నెల 20న ఈ సినిమా రెగ్యులర్ షూట్ హైదరాబాద్లోని ఓ ప్రముఖ స్టూడియోలోప్రారంభమైంది.కానీ ఈ షూటింగ్ షెడ్యూల్లో ఎన్టీఆర్ పాల్గొనలేదని తెలిసింది. అయితే ఈ సినిమా తదుపరి షెడ్యూల్లో ఎన్టీఆర్ పాల్గొంటారు. ఈ షూటింగ్ షెడ్యూల్ శ్రీలంకలోని కొలంబోలో జరగనుందట. ఆల్రెడీ యూనిట్లోని కీలక సాంకేతిక నిపుణులు కొలంబో వెళ్లి, అక్కడి లొకేషన్స్ను పరిశీలిస్తున్నారని తెలిసింది. కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 జనవరి 9న రిలీజ్ కానుంది. -
ప్రేమకథను కొత్తగా చెప్పాను: దర్శకుడు విశ్వ కరుణ్
కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) హీరోగా నటించిన తాజా చిత్రం ‘దిల్ రుబా’(Dil Ruba). ఈ చిత్రంలో రుక్సార్ థిల్లాన్, నజియా డేవిసన్ హీరోయిన్లు. విశ్వ కరుణ్(Vishwa Karun) దర్శకత్వంలో రవి, జోజో జోస్, రాకేశ్ రెడ్డిలతో కలిసి సారెగమ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా విశ్వ కరుణ్ మాట్లాడుతూ– ‘‘దర్శకుడిగా నాకిది తొలి సినిమా. ‘దిల్ రుబా’ అనే ప్రేమకథను రెడీ చేసి, కిరణ్ అబ్బవరంగారికి వినిపించాను. ఆయన ఓకే అన్నారు.ఈ చిత్రంలో ప్రేమకథను కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాం. ఓ రకంగా చెప్పాలంటే క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్ ఇది. ఊరికే ‘సారీ, థ్యాంక్స్’లు చెప్పటానికి హీరో ఇష్టపడడు. ఓ సందర్భంలో హీరో ‘సారీ’ చెప్పకపోవడం వల్ల అతని చుట్టూ ఉన్నవాళ్లు కూడా ఇబ్బందులపాలవుతారు. ఈ సమస్య నుంచి హీరో ఎలా బయటపడ్డాడు? అన్నదే కథ.అలాగే ఊరికే కోపం రాకూడదు... కోపం వస్తే దాని వెనకాల సహేతుకమైన కారణం ఉండాలని హీరో భావిస్తాడు. ఈ అంశం కూడా సినిమాలో ఉంది. ‘క’ సినిమా విజయం సాధించడంతో, ‘దిల్ రుబా’పై మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. కొన్ని మార్పులు చేశాం. కానీ కథలోని ఆత్మ ఏ మాత్రం మారలేదు. నా తర్వాతి సినిమా గురించి త్వరలోనే చెబుతాను’’ అని అన్నారు. -
మమ్మీ ప్రేమ... భయంతో...
ఓటీటీలో ఇది చూడొచ్చు అనేప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో మలయాళ చిత్రం ‘హలో మమ్మీ’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.హాలీవుడ్లో మమ్మీ సినిమాల పరంపర మీకు గుర్తుండే ఉంటుంది. పురాతన కాలంలో గ్రీకు సాంప్రదాయం ప్రకారం సజీవంగా మనుషులను రాతి కట్టడాల్లో పాతి పెట్టడంతో, అందులో చనిపోయిన వారి ఆత్మల రూపంలో తిరిగి వస్తే కథేంటి? అన్నదే హాలీవుడ్ మమ్మీల కథా కమామీషు. కాకపోతే ఈ ‘హలో మమ్మీ’ కథ మాత్రం పూర్తిగా వినూత్నం, వైవిధ్యం... మరీ ముఖ్యంగా వినోదాత్మకం. ఇదో హారర్ కామెడీ. వైశాఖ్ ఎలాన్స్ ఈ సినిమాకి దర్శకుడు.ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమ్ అవుతున్న ఈ మలయాళ సినిమా నిడివి రెండున్నర గంటలు. చూసినంతసేపు ఈ సినిమా ఓ పక్క కాస్త భయపెడుతూనే మరో పక్క గిలిగింతలు పెడుతుంటుంది. షరీఫ్, ఐశ్వర్య ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ సినిమా ఆద్యంతం వినోదభరితమనే చెప్పాలి. అంతలా ఏముందో ఈ సినిమా కథను ఓసారి తెలుసుకుందాం. స్టెఫీని బోనీ ప్రేమిస్తాడు. స్టెఫీ తన తండ్రి శామ్యూల్తో ఉంటుంది. స్టెఫీ తల్లి 20 ఏళ్ల క్రిందటే చనిపోతుంది.కానీ ఈ 20 ఏళ్లు స్టెఫీని ఆ తల్లి ఆత్మ రూపంలో అంటిపెట్టుకునే ఉంటుంది. ఎందుకంటే స్టెఫీ అంటే తల్లికి చాలా ఇష్టం. స్టెఫీ మీద ఈగ కూడా వాలనీయదు. అలాగే ఇంట్లో ఆత్మ రూపంలోనే బోలెడన్ని రూల్స్ పెడుతుంది. స్టెఫీ తల్లి ఆత్మ విషయం ఈ ప్రపంచంలో స్టెఫీకి, ఆమె తండ్రికి తప్ప మరెవరికీ తెలియదు.బోనీని స్టెఫీ ఇష్టపడినపుడు తన తల్లి విషయాన్ని బోనీకి చెబుతుంది. కానీ బోనీ వినిపించుకోడు. పెళ్లై స్టెఫీ ఇంట్లోకి అడుగుపెట్టిన తరువాత స్టెఫీ తల్లి ఆత్మ పరిచయమవుతుంది అతనికి. దాంతో బోనీ ఖంగు తింటాడు. ఇక అక్కడ నుండి కథ ఎలా మలుపులు తిరుగుతుందో ప్రైమ్ వీడియో ఓటిటీలోనే చూడాలి. కొన్ని కథలు చాలా అరుదుగా వస్తుంటాయి. వాటిని మిస్ చేసుకోకూడదు. వర్త్ఫుల్ వాచ్... ఇంకెందుకు ఆలస్యం... ‘హలో మమ్మీ’ని పలకరించండి... భయంతో కాదు... ప్రేమతో... – ఇంటూరు హరికృష్ణ -
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్.. ఈ స్పెషల్ వీడియో చూశారా?
టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఈ మూవీలో పలువురు అగ్రతారలు నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, పాటలు అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేశాయి. ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ముకేశ్కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మోహన్బాబు, మోహన్లాల్, ప్రభాస్, అక్షయ్కుమార్, కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. ఇటీవలే రెండో టీజర్ విడుదల చేసిన ఈ భారీ ప్రాజెక్ట్ ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ వీడియోను మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ మూవీ మేకింగ్కు సంబంధించిన వీడియోను పంచుకున్నారు. ఇందులో మంచు విష్ణు పలు అంశాలపై టీమ్తో చర్చిస్తూ కనిపించారు. ఈ సినిమా తెర వెనుక సంగతులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. The making of Kannappa#kannappa pic.twitter.com/hZCBKbjjYK— Vishnu Manchu (@iVishnuManchu) March 9, 2025 -
'బాలీవుడ్ నుంచి గెంటేయాలని చూశారు'.. గోవిందా సంచలన ఆరోపణలు
బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన గోవిందా బాలీవుడ్పై విమర్శలు చేశారు. బాలీవుడ్లో తనపై కుట్ర చేశారని షాకింగ్ కామెంట్స్ చేశారు. నన్ను ఇండస్ట్రీ నుంచి బయటికి పంపేందుకు కొందరు ప్రయత్నించారని వెల్లడించారు. తాను పెద్దగా చదువుకోలేదని.. వారంతా చదువుకున్న వారు కావడంతోనే నాతో ఆడుకున్నారని తెలిపారు. కేవలం నా నటన వల్లే ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నానని వెల్లడించారు. నన్ను టార్గెట్ చేసిన వారి పేర్లను వెల్లడించడం తనకు ఇష్టం లేదని పేర్కొన్నారు. కాగా.. ముఖేష్ ఖన్నా యూట్యూబ్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గోవిందా ఈ వ్యాఖ్యలు చేశారు.పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించిన గోవిందా ప్రస్తుతం పెద్దగా కనిపించడం లేదు. ఆయన చివరిసారిగా 2019 విడుదలైన రంగీలా రాజాలో కనిపించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. నటుడు తన కెరీర్లో 100 కోట్ల ప్రాజెక్ట్లను చేయలేకపోయినట్లు వెల్లడించారు. నిజం చెప్పాలంటే తాను రూ. 100 కోట్ల చిత్రాలను తిరస్కరించానని తెలిపారు. వాటిని వద్దనుకున్నప్పుడు అద్దంలో చూసుకుని నన్ను చెంపదెబ్బ కొట్టుకునేవాడినని పేర్కొన్నారు.విడాకుల రూమర్స్..గత కొద్ది కాలంగా గోవిందాపై విడాకుల రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. తన భార్య సునీతా అహుజాతో విడిపోతున్నారని వార్తలు తెగ వైరలవుతున్నాయి. వీటిపై ఇటీవలే ఆయన భార్య కూడా స్పందించింది. గోవిందను... తనను ఎవరూ విడదీయలేరని సునీతా అహుజా తేల్చిచెప్పారు. మేము విడివిడిగా ఉంటున్నా మాట వాస్తవమే.. కానీ గోవింద రాజకీయాల్లోకి ఉండడం వల్లే తాము దూరంగా ఉంటున్నట్లు తెలిపింది. పిల్లలు పెద్దవాళ్లు అవుతున్నారు.. తరచుగా పార్టీకి చెందిన పలువురు మా ఇంటికి వస్తూ ఉంటారు..అందుకే మేము పక్కనే ఉన్న మరో ఇంట్లో ఉంటున్నామని తెలిపింది. కాగా.. గోవిందా, సునీత 1987లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ కుమారుడు యశ్వర్ధన్, కుమార్తె టీనా ఉన్నారు. -
'ఈ జన్మలో నీ రుణం తీర్చుకోలేను'.. టాలీవుడ్ కమెడియన్ ఎమోషనల్ పోస్ట్
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రచ్చ రవి అందరికీ సుపరిచితమే. బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ ద్వారా పరిశ్రమలోకి అడుగు పెట్టాడు. తనదైన కామెడీ, పంచ్ డైలాగ్స్తో కమెడియన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవలే బాపు సినిమాలో రచ్చరవి నటించారు. ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించారు. నటుడిగా తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. టాలీవుడ్లో దాదాపు అందరు స్టార్ హీరోల సినిమాల్లో నటించారు.తాజాగా రచ్చ రవి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్గా మారింది. ఇవాళ తన పెళ్లి రోజు కావడంతో భార్యకు ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన ప్రేమను వ్యక్తం చేశారు. నా ప్రపంచానికి చిరుదివ్యల వెలుగును పంచుతూ నా జీవన ప్రయాణంలో తోడుగా నిలిచిన తన భార్య స్వాతిని ప్రశంసిస్తూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. ఇది చూసిన రచ్చ రవి అభిమానులు తమ అభిమాన నటుడికి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు.రచ్చ రవి తన ఇన్స్టాలో రాస్తూ..' నిన్ను పరిచయం చేసిన నీ... నా... తల్లిదండ్రుల రుణం తీరదు. నా జీవన ప్రయాణంలో నీ పూర్తి సహాయ సహకారం అందిస్తున్న నాకు తృప్తి ఉండదు. ఎన్ని ఆశలు.. కోరికలు.. ఇష్టాలు.. ఉన్నాయో నీకు వాటిని నేను తీర్చగలనో లేదో అని ఎన్నడు నేను అడగలేదు..నువ్వు చెప్పలేదు. నా ప్రపంచానికి చిరుదివ్యల వెలుగును పంచుతూ నా జీవన ప్రయాణానికి వసంతాలు పూయిస్తూ కష్టాలను భరిస్తూ దుఃఖాలను దిగమింగుకుంటూ... కాంప్రమైజ్ అవుతూ లైఫ్లో నన్ను సక్సెస్ చేయిస్తూ.... ఇదే జీవితంలో నీ ఇష్టాలు కోరికలు ఆశలను తీర్చాలని... అంత శక్తి నాకు భగవంతుడు ఇవ్వాలని.. నా నిస్వార్థ కోరిక అర్థం చేసుకొని ఇస్తాడని.... నీ రుణం కూడా తీరదని తెలిసి కూడా కనీసం వడ్డీగానైనా ప్రేమిస్తానని ప్రేమగా చూసుకుంటానని...నా సహచరికి పెళ్లిరోజు శుభాకాంక్షలు.. ఐ లవ్ యు స్వాతి..' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. View this post on Instagram A post shared by Ravi Racha (@meracharavi) -
ఫిట్నెస్పై రూమర్స్.. కరణ్ జోహార్ క్లారిటీ!
బాలీవుడ్ డైరెక్టర్, నిర్మాత కరణ్ జోహార్ తాజాగా ఐఫా అవార్డుల వేడుకలో మెరిశారు. రాజస్థాన్లోని జైపూర్ వేదికగా జరిగిన ఈవెంట్లో ఆయన సందడి చేశారు. ఇటీవల తన ఫిట్నెస్ గురించి వస్తున్న వార్తలపై తాజా ఈవెంట్లో స్పందించారు. స్లిమ్గా కనిపించడానికి గల కారణాలను వివరించాడు. తన ఫిట్నెస్కు ప్రధాన కారణం అలవాట్లేనని కరణ్ జోహార్ వెల్లడించారు. సరైన టైమ్కి తినడం, వ్యాయామం చేయడం వల్లే సాధ్యమైందని తెలిపారు. ఫిట్నెస్కు క్రమశిక్షణతో కూడిన జీవనశైలి ముఖ్యమని డైరెక్టర్ సలహా ఇచ్చాడు. దీంతో కరణ్ బరువు తగ్గడంపై వస్తున్న వార్తలకు ఆయన చెక్పెట్టారు.(ఇది చదవండి: 'ఐఫా' అవార్డ్స్ 2025 విజేతల జాబితా)కరణ్ జోహార్ బరువు తగ్గేందుకు ఓజెంపిక్ వంటి డయాబెటిక్ మందుల వాడుతున్నారని రూమర్స్ వచ్చాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన సన్నిహిత మిత్రుడు మహీప్ కపూర్ వ్యాఖ్యల తర్వాత ఆ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. ప్రముఖ నెట్ఫ్లిక్స్ షో లైవ్స్ వర్సెస్ బాలీవుడ్ వైవ్స్లో మహీప్ కపూర్ ఈ విషయంపై మాట్లాడారు. తాజాగా కరణ్ క్లారిటీ ఇవ్వడంతో ఇకపై ఆ వార్తలకు చెక్ పడనుంది. కాగా.. గతంలో స్లిమ్గా ఉంటూ తన ఫిట్నెస్ పట్ల నిబద్ధతను చాటుకున్నారు కరణ్ జోహార్. -
కష్టాల 'రాజాసాబ్'.. అసలేం జరుగుతోంది?
ప్రభాస్ (Prabhas) చేస్తున్న వాటిలో కాస్త తక్కువ బజ్ ఉన్న సినిమా అంటే 'రాజాసాబ్'.(The Rajasaab Movie) ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ గురించి ప్రకటన వచ్చినప్పుడు తొలుత డార్లింగ్ ఫ్యాన్స్ వద్దన్నారు. కానీ తర్వాత వచ్చిన కొంత కంటెంట్ చూసి ఓ మాదిరి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ప్రస్తుతం మాత్రం ఏం జరుగుతుందో అస్సలు అర్థం కావట్లేదు.దర్శకుడు మారుతి.. హారర్ కామెడీ కథతో తీస్తున్న మూవీ 'రాజాసాబ్'. లెక్క ప్రకారం ఈ ఏప్రిల్ 10న థియేటర్లలోకి తీసుకొస్తామని ప్రకటించారు. కానీ ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు. దీంతో వాయిదా గ్యారంటీ. కొన్నాళ్ల ముందు టీజర్ గురించి అదిగో, ఇదిగో వచ్చేస్తుందని అన్నారు. కానీ దాని అప్డేట్ ఏంటో చెప్పట్లేదు.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' నటి)మరోవైపు ఇంకా మూడు పాటలు షూటింగ్ చేయాల్సి ఉందని, కానీ హీరోయిన్లు మాళవిక మోహన్, నిధి అగర్వాల్ (Nidhi Aggerwal) డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆలస్యమవుతూనే ఉంది. మరోవైపు బడ్జెట్ ప్రాబ్లమ్ కూడా ఉందనే రూమర్స్ వినిపిస్తున్నాయి. గతేడాది చాలా ఫ్లాప్స్ వల్ల నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కాస్త ఇబ్బందుల్లో ఉందని, అందుకే 'రాజాసాబ్' లేట్ అవుతుందని అనుకుంటున్నారు.ఇవన్నీ పక్కనబెడితే ఇప్పటికే 'రాజాసాబ్' ఫుటేజ్ మూడున్నర గంటలు వచ్చిందని, పాటలు కూడా కలిపితే మరో 15 నిమిషాలు పెరుగుతుంది. కాబట్టి లింక్స్ మిస్ కాకుండా వాటిని ఎడిట్ చేయాల్సిన పెద్దపనే ఉందని అంటున్నారు. అలానే ఈ ఏడాది రాబోయే పండగల కోసం కొత్త మూవీస్ ఆల్రెడీ కర్చీఫ్ వేసేశాయి. ఇలా ఇన్ని కష్టాలు పడుతున్న 'రాజాసాబ్'.. ఈ ఏడాది రిలీజ్ అవుతుందా? లేదంటే వచ్చే ఏడాది పడుతుందా అని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: 'పుష్ప 2' దెబ్బకు ఫ్లాప్.. ఇన్నాళ్లకు ఓటీటీలోకి ఆ సినిమా) -
కస్టడీలో రన్యా రావు.. కన్నీళ్ల పర్యంతమైన నటి!
ప్రముఖ కన్నడ నటి రన్యా రావు బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడింది. దుబాయ్ నుంచి బెంగళూరు చేరుకున్న ఆమెను డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నుంచి దాదాపు 14 కేజీలకు పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే రన్యారావును అరెస్ట్ చేసిన అధికారులు రిమాండ్కు పంపించారు. ప్రస్తుతం రన్యా రావును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారుల కస్టడీలో ఉన్నారు. ఈ వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.అయితే ఇవాళ డీఆర్ఐ అధికారుల ముందు విచారణకు హాజరైన రన్యారావు కన్నీళ్ల పర్యంతమైంది. అసలు ఇందులోకి ఎందుకు వచ్చానో అంటూ తన న్యాయవాదులతో అన్నారు. నిద్రలో కూడా ఎయిర్పోర్ట్ గుర్తొస్తోందని.. అస్సలు నిద్రపట్టడం లేదని తెలిపింది. మానసికంగా కృంగిపోయానని తన లాయర్లతో రన్యా రావు చెప్పింది. విచారణ సందర్భంగా ఫుల్ ఎమోషనలైంది రన్యా రావు. మరోవైపు ఆమెపై ఇప్పటికే సీబీఐ అధికారులు కూడా కేసు నమోదు చేశారు.కాగా.. మాణిక్య సినిమాతో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన రన్యా రావు కేవలం మూడు చిత్రాల్లో మాత్రమే కనిపించింది. ఈ మూవీ తెలుగు సినిమా మిర్చి రీమేక్గా తెరకెక్కించారు. ఆ తర్వాత పటాస్ కన్నడ రీమేక్ పటాకిలో హీరోయిన్గా నటించింది. తమిళంలో వాఘా మూవీ చేసింది. ఎనిమిదేళ్లుగా వెండితెరకు దూరంగా ఉంటోంది. బంగారు అక్రమ రవాణా చేస్తుండగా మార్చి 3న దుబాయ్ నుంచి వస్తుండగా కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. -
అందాల నిధి.. డిఫరెంట్ డ్రస్సులో తమన్నా!
చాలారోజుల తర్వాత మెరిసిపోతున్న నిధి అగర్వాల్వెరైటీ ఔట్ ఫిట్ లో తమన్నా స్టైలిష్ పోజులుపెంపుడు కుక్క అస్థికల్ని గోదావరి నదిలో కలిపిన రష్మీహాట్ నెస్ తో చంపేస్తున్న బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీచీరలో కుందనపు బొమ్మలా కేక పుట్టిస్తున్న కాయదు లోహర్పసుపు చీరలో చూడముచ్చటగా తమిళ హీరోయిన్ దివ్య భారతిగ్లామర్ తో చంపేస్తున్న యంగ్ బ్యూటీ మాళవిక శర్మ View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by Shamna Kkasim ( purnaa ) (@shamnakasim) View this post on Instagram A post shared by Poonam kaur (@puunamkhaur) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Gouri G Kishan (@gourigkofficial) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Sakshi Agarwal (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Malvika Sharma (@malvikasharmaofficial) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushikapoor) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Nikhila Vimal (@nikhilavimalofficial) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) -
అందరూ ధనశ్రీని టార్గెట్ చేస్తే నేను సపోర్ట్ చేశా.. అప్పుడు..: ఉర్ఫీ
టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, కొరియోగ్రాఫర్ ధన శ్రీ వర్మ (Dhanashree Verma) విడిపోతున్నారంటూ ఈ ఏడాది ఆరంభం నుంచి పుకార్లు ఊపందుకున్నాయి. చివరకు ఆ పుకార్లను నిజం చేస్తూ ఇద్దరూ విడిపోవడానికే నిర్ణయించుకున్నారు. ఇటీవలే వీరికి ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ జంట డివోర్స్ తీసుకోనుంది అన్నప్పటినుంచి చాలామంది ధనశ్రీని టార్గెట్ చేశారు.ప్రతిసారి అమ్మాయిదే తప్పా?చాహల్ను ఒంటరిని చేసిందని, ధనశ్రీ ఏదో తప్పు చేసుంటుందని.. రకరకాలుగా విమర్శలు గుప్పించారు. ఆ సమయంలో సోషల్ మీడియా సెన్సేషన్, నటి ఉర్ఫీ జావెద్ (Uorfi Javed) ధనశ్రీకి మద్దతుగా నిలిచింది. చాహల్ జీవితాన్ని ధనశ్రీ నాశనం చేసిందన్న పోస్టుపై ఉర్ఫీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. క్రికెటర్ బ్రేకప్ చెప్పినప్పుడు, విడాకులు తీసుకుంటున్నప్పుడల్లా అమ్మాయిదే తప్పని ముద్ర వేస్తారు. ఆమెపైనే నిందలేస్తారు. ఎందుకంటే మనకు క్రికెటర్ అంటే హీరో కదా! మీకు గుర్తుందా?నిజంగా ఆ జంటల మధ్య ఏం జరిగిందనేది మనకెవరికీ తెలియదు. విరాట్ సరిగా ఆడకపోయినా కూడా అనుష్కదే తప్పన్నారు. మీకు గుర్తుందో, లేదో మరి! అంటే అక్కడ మగవాడు ఏం చేసినా అందుకు మహిళలే కారణం.. ఈ అబ్బాయిలేం చిన్నపిల్లలు కాదు. వాళ్లేం చేస్తున్నారో వారికి అన్నీ బాగా తెలుసు అని రాసుకొచ్చింది.ధనశ్రీకి సపోర్ట్ చేశానని..ఈ పోస్ట్ చూసిన ధనశ్రీ తనకు థాంక్స్ చెప్పిందంటోంది ఉర్ఫీ జావెద్. తాజాగా ఆమె ఓ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. ఈ విడాకుల వ్యవహారంలో ధనశ్రీని దారుణంగా చిత్రీకరించారు. అప్పుడామెకు మద్దతుగా ఇన్స్టాగ్రామ్లో ఓ స్టోరీ పోస్ట్ చేశాను. అప్పటికే బాధాకరమైన పరిస్థితిలో ఉన్న ఆమె అది చూసి నాకు కృతజ్ఞతలు తెలియజేసింది అని తెలిపింది.చదవండి: దారి తెలీక ఆగిపోయా.. అప్పుడు సమంత సాయం చేయడం వల్లే..: నటుడు -
రాజమౌళికి భారీ షాక్.. మహేశ్ బాబు వీడియో లీక్!
సాధారణంగా రాజమౌళి(SS Rajamouli) సినిమా షూటింగ్ స్పాట్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. సెట్లోకి ఫోన్లు కూడా అనుమతించడు. చిన్న ఫోటో కూడా బయటకు రాకుండా చాలా జాగ్రత్తగా షూటింగ్ చేస్తాడు. రిలీజ్ వరకు జనాలకు ఏం చూపించాలనుకుంటాడో అదే చూపిస్తాడు. ఆయన తెరకెక్కించిన గత సినిమాల్లో వీడియో, ఫోటో లీకులు తక్కువే. కానీ మహేశ్ బాబు సినిమా(SSMB29 )కు మాత్రం లీకుల బెడద తప్పడం లేదు. రాజమౌళి ఎంత స్ట్రిక్ట్గా ఉంటున్నా..ఆ సినిమాకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు బయటకు వెళ్తూనే ఉన్నాయి. ఇప్పటికే మహేశ్ లుక్ సంబంధించిన ఫోటో లీకైంది. తాజాగా షూటింగ్కి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చేసింది.సోషల్ మీడియాలో వైరల్ఎస్ఎస్ఎంబీ29(వర్కింగ్ టైటిల్) మూవీ షూటింగ్ ప్రస్తుతం ఒడిశాలో జరుగుతోంది. అక్కడ మహేశ్ బాబుపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈక్రమంలో మహేశ్ షూటింగ్ క్లిప్పు ఒకటి ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. కారులో నుంచి రహస్యంగా ఆ వీడియో రికార్డు చేసినట్లు తెలుస్తోంది.దయచేసి షేర్ చేయకండి.. ఫ్యాన్స్ విజ్ఞప్తిమహేశ్ బాబు(Mahesh Babu) షూటింగ్కి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయ్యొదని విజ్ఞప్తి చేస్తున్నారు ఆయన ఫ్యాన్స్. ఇలాంటి సినిమాలను బిగ్ స్క్రీన్పైనే చూడాలని, ఇలా వీడియోలు లీక్ చేస్తే ఆ మజా పోతుందని కామెంట్ చేస్తున్నారు. తెలియకుండా ఎవరైనా షేర్ చేసి ఉంటే..వెంటనే ఆ వీడియోని డిలీట్ చేయాలని కోరుతున్నారు. అలాగే చిత్రబృందం కూడా ఆ వీడియో నెట్టింట్లో కనిపించకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరి రాజమౌళి ఈ లీకులపై ఎలా స్పందిస్తారో చూడాలి.రెండు భాగాలుగా..రాజమౌళి-మహేశ్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రిలీజ్ కానుంది. ఈ పీరియాడికల్ ఫారెస్ట్ అడ్వెంచరస్ ఫిల్మ్కి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్తో పాటు ఇతర కీలక పాత్రల్లో ఎవరు నటిస్తునారనే విషయాలను రాజమౌళి గోప్యంగా ఉంచుతున్నారు. అయితే ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఇందులో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటించగా.. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడట. విజయేంద్రప్రసాద్ ఈ సినిమాకు కథ అందించారు. దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ నిర్మించిన ఈ చిత్రం తొలి భాగం 2027లో విడుదలయ్యే అవకాశం ఉందని భోగట్టా. -
ప్రెగ్నెన్సీతో 46 ఏళ్ల నటి.. ఫొటో షూట్ పిక్స్ వైరల్
జైలర్, డాక్టర్ తదితర డబ్బింగ్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ రెడిన్ కింగ్ స్లీ. హాస్యంతో పాటు మంచి డ్యాన్సర్ కూడా. లేటు వయసులో నటి సంగీతని ప్రేమించి పెళ్లిచేసుకోగా.. కొన్నాళ్ల క్రితం ప్రెగ్నెన్సీని కూడా ప్రకటించారు. తాజాగా ఫొటో షూట్ పిక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.నటుడిగా రాణిస్తున్న రెడిన్.. 40 ఏళ్లు దాటిపోయినా సరే మొన్నమొన్నటివకు సింగిల్ గానే ఉన్నాడు. ఈ క్రమంలోనే తమిళ సీరియల్ నటి సంగీతని ప్రేమించాడు. అలా 2023 డిసెంబరులో వీళ్లిద్దరూ గుడిలో సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు కూడా. సరిగ్గా ఏడాది పూర్తయిన తర్వాత అంటే గతేడాది డిసెంబరులో ప్రెగ్నెన్సీ విషయాన్ని ప్రకటించారు.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' నటి)తాజాగా సంగీత ప్రెగ్నెన్సీతొ ఫొటో షూట్ చేయించుకుంది. ఈ క్రమంలోనే రెండు ఫొటోల్ని పోస్ట్ చేసింది. ఇందులో ఓ ఫొటోలో అబ్బాయి, అమ్మాయి అని రెండు ట్యాగ్స్ పట్టుకోవడంతో ఈమెకు కవలలు పుట్టబోతున్నారా అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.దళపతి విజయ్ 'మాస్టర్' సహా పలు సినిమాల్లో సంగీత నటించినప్పటికీ, సీరియల్స్ తో పాపులారిటీ తెచ్చుకుంది. ప్రస్తుతం గర్భవతి కావడంతో కొన్ని నెలల పాటు సీరియల్స్ లో నటించడం మానేసింది సంగీత.(ఇదీ చదవండి: 'పుష్ప 2' దెబ్బకు ఫ్లాప్.. ఇన్నాళ్లకు ఓటీటీలోకి ఆ సినిమా) -
శతదినోత్సవ వేడుకలు జరుపుకొన్న గద్దరన్న చివరి చిత్రం
ప్రజాయుద్ధనౌక గద్దరన్న నటించిన చివరి చిత్రం ‘ఉక్కు సత్యాగ్రహం’(Ukku Satyagraham ). విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తెరకెక్కిన చిత్రమింది. సత్యారెడ్డి స్వీయ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. తాజాగా ఈ చిత్ర శతదినోత్సవ వేడుకలు జరిగాయి.ఈ వేడుకల్లో నంది అవార్డు గ్రహీత, ప్రముఖ దర్శక, నిర్మాత కారెం వినయ్ ప్రకాష్ ఆధ్వర్యంలో మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ, సీనియర్ నటుడు ప్రసన్న కుమార్, ప్రముఖ సినీ నిర్మాత కారం మమత, ప్రముఖ గేయ రచయిత, గాయకులు మజ్జి దేవిశ్రీ, ప్రముఖ సినీ దర్శకులు రాకేష్ రెడ్డి, యాది కుమార్, శుభశ్రీ అన్నె ఇవాంజెలిన్ తో బాటు అనేకమంది ప్రముఖ దర్శక, నిర్మాతలు నటీనటులు వైజాగ్ పౌర గ్రంథాలయంలో వెండి కిరీటంతో శాలువాలతో, గజమాలలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఉక్కు సత్యాగ్రహం చిత్ర దర్శక, నిర్మాత, హీరో సత్యారెడ్డి మాట్లాడుతూ.."తెలుగు ప్రజల జీవనాడి విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం గద్దర్ అన్న లాంటి లెజెండ్ తో ఉక్కు సత్యాగ్రహం చిత్రాన్ని నిర్మించాను.ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 150 థియేటర్లో విడుదల చేశాం. కొన్నిచోట్ల శత దినోత్సవాలు కూడా జరుపుకోవటం ఆనందంగా ఉంది. తెలుగు జాతి కోసం ఉక్కు సత్యాగ్రహం సినిమాను నిర్మించిన తను ఇండియా గొప్పతనం ప్రపంచానికి తెలియజేయడం కోసం త్వరలో "ఇండియా ద గ్రేట్ " అనే బాలీవుడ్ చిత్రాన్ని ప్రముఖ నటీనటులతో నిర్మిస్తానన్నారు.విశాఖపట్నంలో ఒక ఫిలిం స్టూడియోని కూడా నిర్మించే ఆలోచన తనకి ఉందని, ఈ స్టూడియో ద్వారా కొత్త కళాకారులని ప్రోత్సహిస్తానని చెప్పారు. -
అమిర్ ఖాన్తో పెళ్లి.. మా పేరేంట్స్ షాకయ్యారు: కిరణ్ రావు
దర్శకనిర్మాత కిరణ్రావు గురించి బాలీవుడ్లో పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్కు మాజీ భార్యగా అందరికీ సుపరిచితమే. 2005లో ఆమిర్.. కిరణ్ రావును రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఐవీఎఫ్- సరోగసి పద్ధతి ద్వారా 2011లో ఆజాద్ అనే కుమారుడు జన్మించాడు. దాదాపు 16 ఏళ్లపాటు అన్యోన్యంగా ఉన్న వీరిద్దరు 2021లో విడాకులు తీసుకున్నారు. భార్యా, భర్తలుగా విడిపోయినా స్నేహితులుగా కలిసిమెలిసి ఉంటున్నారు. కుటుంబానికి సంబంధించిన కార్యక్రమాల్లో కలిసి పాల్గొంటున్నారు. గతేడాది లపతా లేడీస్ మూవీతో సూపర్ హిట్ అందుకున్నారు కిరణ్ రావు.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన కిరణ్ రావు తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అమీర్ఖాన్తో పెళ్లి విషయం గురించి మా తల్లిదండ్రులతో చెప్పితే వారంతా షాక్కు గురయ్యారని తెలిపింది. నా పేరేంట్స్ ఆందోళన చెందారని వివరించింది. అంతేకాదు తన నిర్ణయాన్ని మరోసారి ఆలోచించుకోవాలని చెప్పారని వెల్లడించింది. అమీర్ గొప్ప నటుడని.. అతనికున్న పేరు, ప్రతిష్టలతో నీపై ఒత్తిడి ఉంటుందని సూచించారు. అయినప్పటికీ అమిర్ ఖాన్ను పెళ్లాడేందుకు నిర్ణయించుకున్నట్లు కిరణ్ రావు తెలిపారు. అమిర్ గొప్ప వ్యక్తి అని ఆమె కొనియాడారు. కాగా.. గతేడాది అమిర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ పెళ్లికి కిరణ్ రావు హాజరయ్యారు. -
దారి తెలీక ఆగిపోయా.. అప్పుడు సమంత సాయం చేయడం వల్లే..: నటుడు
ఆదర్శ్ గౌరవ్ (Adarsh Gourav).. సూపర్బాయ్స్ ఆఫ్ మాలెగావ్ సినిమాతో ఇటీవలే ప్రేక్షకులను అలరించాడు. ద వైట్ టైగర్ సినిమాతో విశేష ఆదరణ సంపాదించుకున్న ఇతడు హిందీలో దాదాపు 9 సినిమాలవరకు చేశాడు. హాస్టల్ డేజ్, గన్స్ అండ్ గులాబ్స్ వంటి వెబ్ సిరీస్లలోనూ మెప్పించాడు. తెలుగు వెండితెరకు పరిచయం కావాలని చాలాకాలంగా కలలు కంటున్నాడు. కానీ దారి తెలియక బాలీవుడ్లోనే ఆగిపోయాడు.టాలీవుడ్లో కనిపించాలన్నది ఆశఅలాంటి సమయంలో సమంత సాయం చేసిందని, తన ఒత్తిడి వల్లే తెలుగులో ప్రయత్నాలు చేసి ప్రాజెక్ట్ దక్కించుకున్నానంటున్నాడు. ఆదర్శ్ గౌరవ్ మాట్లాడుతూ.. నా మాతృ భాష తెలుగు. తెలుగు సినిమాల్లో (Tollywood) పని చేయాలని ఎంతోకాలంగా అనుకుంటున్నాను. కానీ ఎవర్ని సంప్రదించాలి? ఎలా అవకాశాలు తెచ్చుకోవాలన్నది నాకేమీ తెలియదు. ఈ విషయంలో నేను సమంతకు థాంక్స్ చెప్పుకోవాల్సిందే! సమంత సాయంతో..సిటాడెల్ సిరీస్ పూర్తయ్యాక ఆ యూనిట్ సెలబ్రేట్ చేసుకున్న పార్టీకి నేనూ వెళ్లాను. అప్పుడు నాకు తెలుగులో పని చేయాలనుందని సమంత (Samantha Ruth Prabhu)కు చెప్పాను. సరే, అలాగైతే టాలీవుడ్లో జరిగే ఆడిషన్స్కు వెళ్లు అని నొక్కి చెప్పింది. కావాలంటే కొన్ని మీటింగ్స్కు నన్ను తీసుకెళ్లేందుకు సాయం చేస్తానంది. తన మేనేజర్ సాయంతో తెలుగులో చాలామందిని కలిశాను. పలువురితో చర్చలు కూడా జరిగాయి.(చదవండి: కన్నడ స్టార్ యశ్తో విభేదాలు.. స్పందించిన సోదరి)అవన్నీ నిజ జీవితంలో..అలా ఓ దర్శకుడు పరిచయం అయ్యాడు. ప్రస్తుతం ఆయనతో సినిమా చేస్తున్నాను. ఇది సైకలాజికల్ థ్రిల్లర్గా తెరకెక్కుతోంది. నేను ఎక్కువగా అనురాగ్ కశ్యప్, విక్రమాదిత్య మోత్వానె, దిబాకర్ బెనర్జీ, జోయా అక్తర్ సినిమాలే ఎక్కువగా చూశాను. అందులో వారు చూపించే పాత్రలు నిజ జీవితంలో నాకు తారసపడినట్లే కనిపిస్తాయి. ఇకపోతే నా చిన్నతనంలో మా ఇంట్లో ఓ కఠిన నియమం ఉండేది. అదేంటంటే.. బయట ఏ భాష అయినా మాట్లాడు, కానీ ఇంట్లోకి వచ్చాక మాత్రం తెలుగు మాత్రమే మాట్లాడాలన్న నిబంధన ఉండేది.ఇప్పుడర్థమవుతోందిఅప్పుడు నాకర్థం కాలేదు కానీ ఇప్పుడు నాకెంతగానో ఉపయోగపడుతోంది. నాకు చిన్నప్పటినుంచి తెలుగు మాట్లాడే ఫ్రెండ్స్ ఎవరూ లేరు. ఈ ఇండస్ట్రీకి నేను కొత్త, ఇక్కడికి వచ్చి కొన్నాళ్లే అవుతున్నా ఏదో దగ్గరి సంబంధం ఉన్న అనుభూతి వస్తుంది. నాకు ఎవరూ తెలియకపోయినా భాష వల్ల అంతా ఒక్కటే అన్న ఫీలింగ్ వస్తోంది అని చెప్పుకొచ్చాడు. తన తెలుగు సినిమా టైటిల్, దర్శకుడెవరు? వంటి వివరాలు మాత్రం చెప్పలేదు.చదవండి: 'డ్రాగన్' నా లైఫ్లో జరిగిందే.. మనీ అడగాలంటే సిగ్గనిపించింది: డైరెక్టర్ -
'విశ్వంభర'లో శ్రీలీల.. గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర' సినిమా చేస్తున్నారు. లెక్క ప్రకారం సంక్రాంతికే రిలీజ్ అవ్వాలి కానీ ఇప్పటికీ ఇంకా షూటింగ్ నడుస్తోంది. తాజాగా శ్రీలీల కూడా చిత్రీకరణలో పాల్గొంది. ఈ క్రమంలోనే చిరు.. యువ హీరోయిన్ కి క్యూట్ బహుమతి ఇచ్చారు. ఆ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' నటి)రీసెంట్ టైంలో సరైన హిట్స్ పడకపోవడంతో శ్రీలీల.. తెలుగు సినిమాలు తగ్గించేసింది. హిందీలో ఓ మూవీ చేస్తోంది. ఇప్పుడు ఈమెని చిరు 'విశ్వంభర' కోసం తీసుకున్నారు. తాజాగా రిలీజ్ చేసిన ఫొటోలతో ఈ క్లారిటీ వచ్చేసింది. మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీలీలకు దుర్గ దేవి ప్రతిమ గల శంఖాన్ని చిరంజీవి బహుమతిగా ఇచ్చారు. ఈ ఫొటోలు చూస్తే చిరు-శ్రీలీల ఏదో పాట షూటింగ్ కోసం సిద్ధమైనట్లు కనిపిస్తున్నారు. మరి శ్రీలీల.. సినిమాలో ప్రత్యేక గీతం ఏమైనా చేస్తోందా? పాత్రలో నటిస్తుందా అనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: గోదావరిలో అస్థికలు కలిపిన యాంకర్ రష్మీ) -
సమ్మర్ కష్టమే.. ఫ్యాన్స్కి హ్యాండిచ్చిన ‘మెగా’ బ్రదర్స్!
టాలీవుడ్కి సంక్రాంతి తర్వాత సమ్మర్ మంచి సీజన్. వేసవి సెలవుల్లో పలు పెద్ద సినిమాలతో పాటు మీడియం, చిన్న చిత్రాలు కూడా విడుదల అవుతుంటాయి. స్కూల్, కాలేజీ పిల్లలకు సెలవులు ఉండడంతో వారిని టార్గెట్ చేస్తూ సినిమాలను రిలీజ్ చేస్తుంటారు. అయితే ప్రతి సమ్మర్కి కనీసం రెండు, మూడు పెద్ద సినిమాలైనా సందడి చేసేవి. కానీ ఈ సారి మాత్రం యావరేజ్ సినిమాలతోనే సరిపెట్టుకోవాలేమో. సమ్మర్లో సందడి చేస్తామని చెప్పిన మెగా హీరోలు చిరంజీవి, పవన్ కల్యాణ్.. ఫ్యాన్స్కి హ్యాండిచ్చేలా కనిపిస్తోంది. వీరితో పాటు ప్రభాస్ కూడా వేసవి సీజన్కి దూరంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.చిరంజీవి(Chiranjeevi) హీరోగా నటించిన ‘విశ్వంభర’ మూవీ సంక్రాంతికి రిలీజ్ కావాల్సింది. కానీ కొడుకు రామ్ చరణ్ కోసం చిరు వెనక్కి తగ్గాడు. దీంతో రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’సంక్రాంతికి రిలీజైంది. కానీ చిరంజీవి చేసిన త్యాగానికి గేమ్ ఛేంజర్ న్యాయం చేయలేకపోయింది. అది పక్కన పెడితే.. విశ్వంభర సమ్మర్లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ మేకర్స్ మళ్లీ మనసు మార్చుకున్నారట. సమ్మర్లో కాకుండా.. ఆగస్ట్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అదే నిజమైతే సమ్మర్లో చిరును తెరపై చూడడం కష్టమే.మరోవైపు పవన్ కల్యాణ్(Pawan Kalyan ) ‘హరిహర వీరమల్లు’ కూడా రిలీజ్ని వాయిదా వేసుకునే అవకాశం ఉంది. వాస్తవానికి ఈ చిత్రం ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ ఇంకా షూటింగ్ జరుగుతోంది. పవన్ కు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించాల్సి ఉందట.ఈ షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. వీఎఫెక్స్ వర్క్ కూడా పెండింగ్లోనే ఉంది. ఈ లెక్కన ఈ చిత్రం కూడా వేసవిలో రిలీజ్ అవ్వడ కష్టమే అంటున్నారు సినీ పండితులు.ఇక మెగా ఫ్యామిలీ హ్యాండిచ్చినా.. ప్రభాస్ అయినా సమ్మర్లో ఎంటర్టైన్ చేస్తారనుకుంటే.. అది కూడా కష్టమే అంటున్నారు. ఇంకా షూటింగ్ పూర్తి కాలేదట. ఈ చిత్రాన్ని ముందు చెప్పినట్లుగా ఏప్రిల్లో రిలీజ్ చేయడం కష్టమే అంటున్నారు. జూన్ లేదా జులైలో ఈ చిత్రం రిలీజయ్యే అవకాశం ఉంది. ఇలా పెద్ద సినిమాలన్నీ తమ విడుదలను వాయిదా వేసుకుంటే.. యావరేజ్, చిన్న చిత్రాలు మాత్రం రిలీజ్కు రెడీ అంటున్నాయి. -
సతీమణి బర్త్ డే.. భార్యకు సర్ప్రైజ్ ఇచ్చిన కేజీఎఫ్ స్టార్
కేజీఎఫ్ సినిమాలో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరో యశ్. ఈ మూవీతో దేశవ్యాప్తంగా ఫేమస్ అయిపోయారు. ప్రస్తుతం ఆయన టాక్సిక్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాకు గీతు మోహన్దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాకుండా బాలీవుడ్లో నితీశ్ తివారీ తెరకెక్కించనున్న రామాయణంలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో రావణుడి పాత్రలో యశ్ మెప్పించనున్నారు.అయితే నటి రాధిక పండిట్ను యశ్ పెళ్లాడిన సంగతి తెలిసిందే. 2016లో వీరిద్దరు వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. తాజాగా ఇటీవల మార్చి 7న యశ్ భార్య రాధిక పండిట్ బర్త్ డేను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ పుట్టినరోజు వేడుకల్లో హీరో యశ్ సతీమణికి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చాడు. ఆమె బర్త్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీలో రొమాంటిక్ సాంగ్ను ఆలపించాడు. 1981లో వచ్చిన కన్నడ మూవీలోని పాటను పాడి సతీమణికి గుర్తుండిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను రాధిక తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఇక సినిమాల విషయానికొస్తే కేజీఎఫ్ స్టార్ యశ్ చివరిసారిగా కేజీఎఫ్-2లో కనిపించారు. View this post on Instagram A post shared by Radhika Pandit (@iamradhikapandit) -
నిశ్చితార్థం చేసుకున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' నటి
'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నటి అభినయ నిశ్చితార్థం చేసుకుంది. పుట్టుకతోనే ఈమె బధిరురాలు. అంటే మాట్లాడలేదు, వినబడదు. కానీ నటిగా వరస సినిమాలు చేస్తోంది. ఇప్పుడు రహస్యంగా నిశ్చితార్థం చేసుకుని అందరికీ షాకిచ్చింది.(ఇదీ చదవండి: గోదావరిలో అస్థికలు కలిపిన యాంకర్ రష్మీ)చెన్నైకి చెందిన అభినయ.. 2008 నుంచి దక్షిణాది భాషల్లో సినిమాలు చేస్తోంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, దమ్ము, ధృవ, శంభో శివ శంభో, సీతారామం తదితర చిత్రాల్లో సహాయ పాత్రలు పోషించింది. రీసెంట్ గా 'పని' అనే మలయాళ మూవీలో హీరోయిన్ గానూ చేసింది.కొన్నాళ్ల క్రితం హీరో విశాల్ తో ఈమె రిలేషన్ లో ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి. వాటిని తోసిపుచ్చిన అభినయ.. తాను 15 ఏళ్లుగా తన చిన్నప్పటి స్నేహితుడితో ప్రేమలో ఉన్నానని, త్వరలోనే పెళ్లి చేసుకుంటామని చెప్పింది. అందుకు తగ్గట్లే ఇప్పుడు నిశ్చితార్థం చేసుకుంది. కాకపోతే కాబోయే భర్త ముఖం, వివరాలు లాంటివి బయటపెట్టలేదు.(ఇదీ చదవండి: 'పుష్ప 2' దెబ్బకు ఫ్లాప్.. ఇన్నాళ్లకు ఓటీటీలోకి ఆ సినిమా) View this post on Instagram A post shared by M.g Abhinaya (@abhinaya_official) -
'డ్రాగన్' నా లైఫ్లో జరిగిందే.. మనీ అడగాలంటే సిగ్గనిపించింది: డైరెక్టర్
కంటెంట్ బాగుంటే చాలు భాషతో సంబంధం లేకుండా సినిమాలు సక్సెస్ బాట పడతాయి. ఇటీవల వచ్చిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ (Return Of The Dragon) కూడా అదే కోవలోకి వస్తుంది. లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) హీరోగా నటించిన ఈ సినిమా తమిళం, తెలుగు భాషల్లో ఫిబ్రవరి 21న విడుదలైంది. అనుపమ పరమేశ్వరన్, కయాడు లోహర్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ రూ.120 కోట్లపైనే వసూళ్లు రాబట్టింది. తాజాగా హిందీలోనూ విడుదలకు సిద్ధమైంది. ముందడుగుఈ విషయాన్ని హీరో ప్రదీప్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. మార్చి 14న రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ హిందీలో రిలీజవుతోంది. నా సినిమాలు దేశమంతటా చూడాలని ఎప్పటినుంచో అనుకునేవాడిని. నా ఆలోచనలు ఆచరణలో అమలయ్యేందుకు తొలి అడుగు పడింది. షారూఖ్ ఖాన్ సర్, సల్మాన్ ఖాన్ సర్, ఆమిర్ ఖాన్ సర్.. మీరందరూ పక్కకు జరగండి.. నేను వస్తున్నా అని సరదాగా ట్వీట్ చేశాడు.అంత పెద్దోడివైపోయావా?ఇది చూసిన నెటిజన్లు.. ఏంటి, బాలీవుడ్ హీరోలకే ధమ్కీ ఇస్తున్నావా? అంత పెద్దవాడివైపోయావా?, ఏదేమైనా హిందీలో రీమేక్ చేయకుండా డబ్బింగ్ చేసి మంచి పని చేశారు అని కామెంట్లు చేస్తున్నారు. ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందించాడు. డ్రాగన్ సినిమా తన నిజ జీవితానికి సంబంధించిందని చిత్రదర్శకుడు అశ్వత్ మారిముత్తు తెలిపాడు. సినిమాలోని ఆ బ్యాచిలర్ రూమ్ నేను నివసించిందే!'కొన్నిసార్లు మన జీవితంలో అత్యంత ముఖ్యమైనవారికి కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోతుంటాం. వాళ్లెవరో కాదు మన స్నేహితులే! డ్రాగన్ సినిమాలో చూపించే బ్యాచిలర్ రూమ్ లైఫ్ నా నిజజీవితంలోనిదే! కేవలం పాత్రలు మాత్రమే కాదు ఆ ప్లేస్ కూడా నేను నివసించిందే.. ఇగీ, పంబు, అంబు, అజయ్, కరుప్స్, బాలాజీ, జై, మురళి, జాన్, గ్లెన్, హరి, విక్కీ.. మేమంతా కాలేజీ ఫ్రెండ్స్. అందరం రూమ్ తీసుకుని ఉండేవాళ్లం. కాలేజీ అయిపోయాక జీరోఇందులో కొందరు అప్పుడప్పుడు మా దగ్గరకు వచ్చేవారు. సినిమాలో చూపించినట్లే కాలేజ్ అయిపోయాక నేను జీరోనయ్యాను. కానీ నాలో టాలెంట్ ఉందని నమ్మి నా స్నేహితులు నాకు అండగా నిలబడ్డారు. వాళ్లు కష్టపడి సంపాదించిన జీతంలో నుంచి ఒక్కొక్కరూ రూ.2000 చొప్పున నాకు ఇచ్చేవారు. ఆ డబ్బుతో షార్ట్ ఫిలింస్ తీశాను. ఒకసారి ఏదో పోటీలో నేను రెండో రౌండ్కు సెలక్ట్ అయ్యాను. నా బెస్ట్ ఫ్రెండ్ ప్రోత్సాహంతో..కానీ ఫ్రెండ్స్ను మళ్లీ డబ్బులడగాలంటే నాకు సిగ్గుగా అనిపించింది. ఆ సమయంలో నా బెస్ట్ ఫ్రెండ్ ఇగీ.. అతడి తల్లికి ఫోన్ చేసి అశ్వత్ పోటీలో ముందుకు వెళ్లడానికి రూ.2 వేలిస్తున్నాను. మీరు అడ్జస్ట్ చేసుకోండి అని చెప్పాడు. అది నేనెన్నటికీ మర్చిపోలేను. 8 షార్ట్ ఫిలింస్ తీశా.. నా ప్రతి అడుగులో వారు తోడున్నారు. నా ఫోన్ పగిలిపోయినప్పుడు బాలాజీ ఫోన్ కొనిచ్చాడు. ఇంత మంచి మిత్రులు నా జీవితంలో ఉన్నారు. మా గ్యాంగ్లో నేనే మిగిలా..నేను అందుకున్న విజయం వారి సొంతం. థాంక్యూ బాయ్స్.. ఈ రోజు మా గ్యాంగ్లో పంబు పెళ్లి జరిగింది. అంటే ఈ గ్యాంగ్లో సింగిల్గా మిగిలింది నేనొక్కడినే' అని రాసుకొచ్చాడు. ఇందుకు తన ఫ్రెండ్స్తో దిగిన పాత ఫోటోలను జత చేశాడు. ఇది చూసిన నెటిజన్లు.. ఇంత మంచి స్నేహితులు దొరకడం నీ అదృష్టం.. నువ్వు జీవితంలో ఇంకా ఎన్నో విజయాలు అందుకోవాలి అని కామెంట్లు చేస్తున్నారు. ‘Return of The Dragon ‘ releasing in HINDI from MARCH 14 . Always wanted my movies to be watched by the whole of India, and here is our first step . Sharukh @iamsrk sir , Salman @BeingSalmanKhan sir , Aamir sir संभल जाओ, मैं आ रहा हूँ! 😂😂😂😂😂😂Link. :… pic.twitter.com/Lg99OWYIFn— Pradeep Ranganathan (@pradeeponelife) March 8, 2025Important post. Sometimes we fail to thank the most important people in our life because they are our friends and they won’t take it wrong !The bachelor room life that u see in ‘Dragon’ is almost 90 percent recreated from my life ! Not just the characters but also the place !… pic.twitter.com/k2Jzc64SFa— Ashwath Marimuthu (@Dir_Ashwath) March 8, 2025చదవండి: కన్నడ స్టార్ యశ్తో విభేదాలు.. స్పందించిన సోదరి -
25 ఏళ్ల మా బంధానికి ఆయన ఆశీస్సులే కారణం: ఖుష్బు సుందర్
సీనియర్ నటి ఖుష్బు సుందర్ అప్పట్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. తమిళంతో పాటు తెలుగులోనూ పలు స్టార్ హీరోలతో కలిసి నటించింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పలు సినిమాల్లో కనిపిస్తోంది. కోలీవుడ్తో పాటు తెలుగులోనూ పలు సినిమాల్లో నటిస్తోంది. సినిమాల్లో నటిస్తూనే 2000వ సంవత్సరంలో వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. హీరో, డైరెక్టర్ అయిన సుందర్ను ఆమె పెళ్లాడింది.తాజాగా ఇవాళ తమ 25వ వివాహా వార్షికోత్సవం జరుపుకున్నారు ఖుష్బు - సుందర్ దంపతులు. ఈ సందర్భంగా ప్రముఖ మురుగన్ ఆలయాన్ని సందర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు ఖుష్బు సుందర్న్తన భర్తతో దిగిన ఫోటోను షేర్ చేశారు. ఈ ప్రత్యేకమైన రోజున తన వెడ్డింగ్ శారీని ధరించినట్లు వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఈ జంటకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.I very proudly wear my wedding saree on my 25th anniversary today. I added few borders to give a twist. We couldn't have asked for a better way to start our day than taking the blessings of ##LordMuruga in Palani. What we have today wouldn't be possible without the blessings of… pic.twitter.com/5JobnMNkdF— KhushbuSundar (@khushsundar) March 9, 2025 -
గోదావరిలో అస్థికలు కలిపిన యాంకర్ రష్మీ
కామెడీ, రియాలిటీ షోలతో యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మీ.. రాజమండ్రి గోదావరి నదిలో అస్థికలు కలిపింది. ఇందుకు సంబంధించిన వీడియోని పోస్ట్ చేసి భావోద్వేగానికి గురైంది. జీవితాంతం నిన్ను మిస్ అవుతూనే ఉంటానని రాసుకొచ్చింది.సాధారణంగా సొంతవాళ్లు చనిపోతే వారి అస్థికలని కుటుంబ సభ్యులు.. పుణ్య నదులు, సముద్రాల్లో కలుపుతూ ఉంటారు. కానీ యాంకర్ రష్మీ మాత్రం తన పెంపుడు కుక్క చుట్కీ అస్థికలని రాజమండ్రి దగ్గరున్న గోదావరిలో కలిపింది.(ఇదీ చదవండి: స్టార్ హీరోలని చిక్కుల్లో పడేసిన గుట్కా యాడ్)తాను ఎంతగానే ప్రేమించిన శునకానికి కన్నీటి వీడ్కోలు పలికింది. ఈ మేరకు ఇన్ స్టాలో వీడియో పోస్ట్ చేసింది. 'జీవితాంతం నిన్ను మిస్ అవుతూనే ఉంటా. మరో జన్మంటూ ఉంటే నువ్వు బాధలేకుండా పుడతావని కోరుకుంటున్నాను. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినందుకు నన్ను క్షమించు. ప్రశాంతంగా వెళ్లు చుట్కీ గౌతమ్' అని రాసుకొచ్చింది.ఇకపోతే రష్మీకి కుక్కలంటే చాలా ఇష్టం. లాక్ డౌన్ లో వీధి కుక్కల తనవంతు సాయంగా ఆహారం పెట్టింది. పలు శునకాల్ని కూడా పెంచుకుంటోంది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలోనూ కుక్కల గురించి పోస్టులు పెడుతూ ఉంటుంది.(ఇదీ చదవండి: 'పుష్ప 2' దెబ్బకు ఫ్లాప్.. ఇన్నాళ్లకు ఓటీటీలోకి ఆ సినిమా) -
పారితోషికం భారీగా పెంచేసిన సాయి పల్లవి, సమంత..ఎంతంటే?
ఒకప్పుడు సినిమాల్లో నటించడానికి హీరో లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకుంటే.. హీరోయిన్లు వేలల్లో తీసుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి.. చిన్న హీరో సైతం కోట్ల రూపాయాల పారితోషికం పుచ్చుకుంటున్నాడు. ఒక్క హిట్ పడితే చాలు రెమ్యునరేషన్ని డబుల్ చేస్తున్నారు. అయితే హీరోలో పోలిస్తే హీరోయిన్లకు రెమ్యునరేషన్ చాలా తక్కువే. కానీ కొంతమంది నటీమణులు మాత్రం హీరోకి సమానంగా...ఇంకా చెప్పాలంటే రూపాయి ఎక్కువే కానీ తక్కువ కాకుండా తీసుకుంటున్నారు. మార్కెట్లో వాళ్లకు ఉన్న డిమాండ్ని బట్టి నిర్మాతలే వాళ్లకు అంతలా పెంచేస్తున్నారు.మొన్నటి వరకు ఓక్కో సినిమాకు రూ.3 కోట్లు తీసుకునే సాయి పల్లవి(Sai Pallavi).. తండేల్కి రూ.5 కోట్ల వరకు పారితోషికంగా పుచ్చుకుందట. హీరో నాగచైతన్య రెమ్యునరేషన్ కూడా ఇంచు మించు అంతే ఉంటుంది. ఇక ఇప్పుడు సాయి పల్లవి ఓ సినిమా కోసం తన పారితోషికాన్ని అమాంతం నాలుగు రెట్లు పెంచేసింది. బాలీవుడ్లో ఆమె నటిస్తున్న తొలి సినిమా ‘రామాయణ’ కోసం ఆమె దాదాపు రూ. 20 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు బాలీవుడ్ మీడియాలో పుకార్లు వచ్చాయి. అయితే ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతుంది. ఆ రెండింటికి కలిపి రూ.20 కోట్లు ఆఫర్ చేశారట నిర్మాతలు.మరోవైపు సమంత(Samantha) కూడా తన రెమ్యునరేషన్ని పెంచేసింది. ఖుషీ వరకు రూ.3 కోట్లు తీసుకున్న సామ్.. సిటాడెల్ హనీ బన్నీకి ఏకంగా రూ.8 కోట్లు పారితోషికంగా తీసుకుందట. ఇక ఇప్పుడు ఆమె నటిస్తోందన్న ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్’ వెబ్ సిరీస్ కోసం ఏకంగా రూ.10 కోట్లు పుచ్చుకున్నట్లు తెలుస్తోంది. సూపర్హిట్ సిరీస్లతో ఆకట్టుకునే దర్శకద్వయం రాజ్, డీకే (Raj and DK) ఈ వెబ్ సిరీస్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఆదిత్యరాయ్ కపూర్, సమంతతో పాటు కీలకపాత్రలో అలీ ఫజల్ కూడా నటిస్తున్నారు. -
హీరోలని చిక్కుల్లో పడేసిన గుట్కా యాడ్
సినిమా హీరోహీరోయిన్లు పలువురు ఓవైపు నటిస్తూనే మరోవైపు యాడ్స్ కూడా చేస్తుంటారు. కొన్నిసార్లు అదే యాడ్స్ వల్ల న్యాయపరమైన చిక్కుల్లో పడుతుంటారు. మొన్నీమధ్యే క్రిప్టో కరెన్సీ స్కామ్ లో తమన్నా, కాజల్ అగర్వాల్ కి పోలీసులు నోటీసులిచ్చినట్లు వార్తలొచ్చాయి. ఇప్పుడు మరో ముగ్గురు స్టార్ హీరోలు కూడా ఇలానే నోటీసులు అందుకున్నారట.ఏం జరిగింది?బాలీవుడ్ స్టార్ హీరోలైన షారుక్ ఖాన్, అజయ్ దేవగణ్, టైగర్ ష్రాఫ్.. ఓ పాన్ మసాలా యాడ్ లో నటించారు. చాన్నాళ్ల నుంచి టీవీల్లో దాన్ని టెలికాస్ట్ చేస్తున్నారు. అయితే ఈ యాడ్ లో హానికరమైన గుట్కా ఉత్పత్తిని ప్రమోట్ చేస్తున్నారని, ఇది ప్రజలని తప్పుదారి పట్టించేలా ఉందని జైపూర్ కి చెందిన లాయర్ యోగేంద్ర సింగ్ కోర్టులో ఫిర్యాదు చేశారు.(ఇదీ చదవండి: 'పుష్ప 2' దెబ్బకు ఫ్లాప్.. ఇన్నాళ్లకు ఓటీటీలోకి ఆ సినిమా)ఈ యాడ్ లో 'పలుకు పలుకులో కేసరి' అనే ట్యాగ్ లైన్ ఉపయోగించారని, కానీ సంస్థ చెప్పినట్లు ఈ ఉత్పత్తిలో అసలు కేసరి (కుంకుమ పువ్వు) కలిపి లేదని న్యాయవాది ఆరోపించారు. దీంతో మార్చి 19న కోర్టుకు హాజరు కావాలని ముగ్గురు హీరోలతో పాటు గుట్కా కంపెనీకి నోటీసులు జారీ చేసింది.ఒకవేళ కోర్టుకు ఎవరూ హాజరు కాకపోయినా విచారణ జరుగుతుందని, నోటీసులు అందుకున్న 30 రోజుల్లోగా స్పందించాలని నటులు, కంపెనీకి కోర్ట్ ఆదేశించింది.€మరి ఏం జరుగుతుందో చూడాలి? తెలుగులోనూ మహేశ్ బాబు ఇలా ఓ పాన్ మసాలా యాడ్ లో నటించాడు.(ఇదీ చదవండి: రష్మికని హింసించకండి.. నటి రమ్య కౌంటర్) -
కన్నడ స్టార్ యశ్తో విభేదాలు.. స్పందించిన సోదరి
కన్నడ స్టార్ యశ్ (Yash), నటి దీపికా దాస్ దగ్గరి బంధువులు. వీరిద్దరూ వరసకు అన్నాచెల్లెళ్లవుతారు. కానీ ఎప్పుడూ ఒకరి గురించి మరొకరు పెద్దగా మాట్లాడుకోరు, కలిసి కనిపించరు. దీంతో వీరి మధ్య ఏమైనా గొడవలున్నాయా? అన్న రూమర్లు కూడా వినిపించాయి. అయితే అలాంటిదేమీ లేదని కొట్టిపారేసింది దీపిక. దీపికా దాస్ (Deepika Das) ముఖ్య పాత్రలో నటించిన కన్నడ చిత్రం పారు పార్వతి. ఈ మూవీ ఈ వారమే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. యష్తో విభేదాలుసినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె యశ్తో విభేదాలున్నాయా? అన్న ప్రశ్నకు స్పందించింది. మా మధ్య ఎటువంటి గొడవలు లేవు. మేము బాగానే ఉన్నాం. కాకపోతే వృత్తిపరంగా ఎవరి కెరీర్ను వారే నిర్మించుకోవాలనుకున్నాం. సినిమాలను మా మధ్యలోకి రానివ్వం. మాకు ఒకరిపై మరొకరికి గౌరవం ఉంది. పదేపదే మా బంధాన్ని పబ్లిక్లో చెప్పాల్సిన పని లేదన్నది నా అభిప్రాయం.గోప్యతకే ప్రాధానంఅలాగే నేనేదైనా మంచిపని చేస్తే యశ్ నన్ను అభినందిస్తాడు. కానీ దాన్ని పబ్లిసిటీ చేయడం మాకు నచ్చదు. పాజిటివ్, నెగెటివ్ ఏదైనా కానీ చిన్న వార్త దేశమంతా చుట్టేస్తోంది. అందుకే మా వ్యక్తిగత జీవితాలను గోప్యంగానే ఉంచుకుంటాం, అందరికీ చెప్పాలనుకోం. మా కుటుంబాలు వేర్వేరు ఇళ్లలో నివసిస్తాయి. అందువల్ల ఏదైనా ప్రత్యేక సందర్భాల్లోనే మేము కలుసుకుంటూ ఉంటాం.సంతోషంగా ఉందియశ్ కన్నడ సినిమాను అగ్రస్థానంలో నిలబెట్టాడు. అతడు కొనసాగుతున్న కన్నడ చలనచిత్ర పరిశ్రమ (Sandalwood)లో నేనూ ఉండటం సంతోషంగా భావిస్తున్నాను. అతడు మున్ముందు సాండల్వుడ్ను ప్రపంచ చిత్రపటంలో నిలబెట్టాలని ఆశిస్తున్నాను అని చెప్పుకొచ్చింది. కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 సినిమాలతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ తెచ్చుకున్న యశ్ ప్రస్తుతం టాక్సిక్ మూవీ చేస్తున్నాడు.చదవండి: 'శ్రీలీల రాకతో ఈ ఐటం బ్యూటీ కెరీర్ ఖతం'.. ఇవే నచ్చదంటున్న నోరా -
ఆమ్లెట్ ఇలా కూడా వేస్తారా? ఆశ్చర్యపోతూనే ఆరగించిన నటుడు
నటుడు ఆశిష్ విద్యార్థి (Ashish Vidyarthi) భోజన ప్రియుడు. ఎక్కడ ఏ వంటకాలు బాగుంటాయని ఇట్టే చెప్పేస్తాడు. ఫుడ్ వ్లాగింగ్ పేరుతో దేశంలోని ప్రసిద్ధ వంటకాలను అన్వేషించి వాటిని అభిమానులకు పరిచం చేస్తూ ఉంటాడు. తాజాగా అతడు ఓ సరదా వీడియో షేర్ చేశాడు. సినిమా సెట్లో ఆశిష్ కోసం నటుడు నానా పటేకర్ వంటమనిషిగా మారిపోయాడు.ఆమ్లెట్ విరిగిపోకుండా ఎలా తిప్పాడంటే?ఆశిష్కు దగ్గరుండి ఆమ్లెట్ వేసిచ్చాడు. అయితే ఒకవైపు కాలిన ఆమ్లెట్ను రెండోవైపు తిప్పడానికి ప్లేటు సాయం తీసుకున్నాడు. మొదటగా పాన్లో ఆమ్లెట్ వేసి.. ఒకవైపు కాలిన తర్వాత దాన్ని ప్లేటుపై వేశాడు. తర్వాత ఆ ప్లేటుపై ఉన్నదాన్ని తిరిగి పాన్లో వేశాడు. ఆమ్లెట్ ముక్కలుగా విరిగిపోకుండా ఈ టెక్నిక్ ఉపయోగించాడన్నమాట. అది చూసి ఆశిష్ ఆశ్చర్యపోయాడు. మొదట ఇది తప్పు పద్ధతి అనుకున్నా, కానీ ఇది యునిక్ టెక్నిక్ అని కొనియాడాడు. నీ ప్రేమకు పొంగిపోయా..నానా పటేకర్ వేసిచ్చిన ఆమ్లెట్ చాలా బాగుందంటూ లొట్టలేసుకుని తిన్నాడు. ఆయన ప్రేమకు పొంగిపోయానని ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చాడు. ఆశిష్.. హిందీలో అనేక సినిమాలు చేసిన ఆయన తెలుగులో ఛత్రపతి, గుడుంబా శంకర్, పోకిరి, అన్నవరం, చిరుత, తులసి, అతిథి, అదుర్స్, అలా మొదలైంది, బాద్షా, ఆగడు, కిక్ 2, జనతా గ్యారేజ్.. ఇలా అనేక సినిమాల్లో నటించాడు. చివరగా కిల్ అనే హిందీ చిత్రంలో కనిపించాడు. View this post on Instagram A post shared by Ashish Vidyarthi (@ashishvidyarthi1) చదవండి: ఈ ఫీలింగ్ ఎంత బాగుందో.. నమ్రత నోట కూడా అదే: శిల్ప శిరోద్కర్ -
'పుష్ప 2' దెబ్బకు ఫ్లాప్.. ఇన్నాళ్లకు ఓటీటీలోకి ఆ సినిమా
కొన్నిసార్లు రాంగ్ టైంలో రిలీజ్ అవుతుండటం వల్ల కొన్నికొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతుంటాయి. అలా 'పుష్ప 2'(Pushpa 2 Movie) తెగ ఆడేస్తున్నప్పుడు థియేటర్లలో విడుదలైన ఓ హిందీ మూవీ.. దాదాపు మూడు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఇంతకీ ఏంటా చిత్రం? ఎప్పుడు స్ట్రీమింగ్ కానుంది?దిగ్గజ నటుడు నానా పాటేకర్ ప్రధాన పాత్రలో నటించిన హిందీ సినిమా 'వనవాస్'.(Vanvaas Movie) గదర్, గదర్ 2 లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తీసిన అనిల్ శర్మ దీనికి దర్శకుడు. మంచి ఫిలాసఫీ, ఎమోషనల్ కంటెంట్ తో తీశారు కానీ పుష్ప 2 ఉత్తరాదిలో మంచి జోష్ లో ఆడేస్తున్నప్పుడు అంటే డిసెంబరు 20న థియేటర్లలో రిలీజ్ చేశారు. దీంతో పెద్దగా వసూళ్లు రాలేదు.(ఇదీ చదవండి: నానా పాటేకర్ పై హీరోయిన్ పెట్టిన మీటూ కేసు కొట్టేసిన హైకోర్ట్)దాదాపు మూడు నెలల తర్వాత ఇప్పుడు 'వనవాస్' మూవీ ఓటీటీ (Vanvaas OTT) తేదీ ఖరారు చేసుకుంది. మార్చి 14 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. ఫ్యామిలీ, ఎమోషనల్ మూవీ చూడాలనుకుంటే దీనిపై ఓ లుక్కేయొచ్చు.'వనవాస్' విషయానికొస్తే.. ప్రతాప్ (నానా పాటేకర్)కి మతిమరుపు సమస్య. ఇతడి ముగ్గురు కొడుకులు ఆస్తి పంచుకునే విషయంలో గొడవ పడుతూ ఉంటారు. తండ్రి అడ్డొస్తున్నాడని చెప్పి అతడిని కాశీలో వదిలి వచ్చేస్తారు. అక్కడ ఈయనకు వీర్(ఉత్కర్ష్) పరిచయమవుతాడు. మరి ప్రతాప్ ని వీర్ ఇంటికి చేర్చాడా? చివరకు ఏమైందనదే స్టోరీ?(ఇదీ చదవండి: రష్మికని హింసించకండి.. నటి రమ్య కౌంటర్)Jo paraye bhi na kare, agar vo apne kar jaayein, toh apnon se bada paraya kaun?#Vanvaas premieres 14th March, only on #ZEE5. #ZEE5Global #VanvaasOnZEE5@nanagpatekar @khushsundar @Anilsharma_dir @1020_suman @iutkarsharma @rajpalofficial #SimratKaur @hemantgkher… pic.twitter.com/OXwXXh5aLf— ZEE5 Global (@ZEE5Global) March 9, 2025 -
‘ఛావా’ క్లైమాక్స్లో కన్నీళ్లు వచ్చాయి: బన్నీ వాసు
‘‘ఒక చరిత్రని సినిమాగా తీయడం అంత సులభం కాదు. అలాంటి ఒక కొత్త చరిత్రని ‘ఛావా’ వంటి గొప్ప సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన డైరెక్టర్ లక్ష్మణ్గారికి ధన్యవాదాలు. ఈ రోజు మనం స్వేచ్ఛ, స్వాతంత్య్రాన్ని అనుభవిస్తున్నామంటే కారణం శంభాజీ మహారాజ్లాంటి మహావీరుల త్యాగ ఫలితమే. ‘ఛావా’(Chhaava Movie) మూవీ క్లైమాక్స్లో భావోద్వేగ సన్నివేశాలు చూసి కన్నీళ్లు వచ్చాయి’’ అని నిర్మాత బన్నీ వాసు (bunny vasu)తెలిపారు. విక్కీ కౌశల్, రష్మికా మందన్న జంటగా నటించిన చిత్రం ‘ఛావా’. లక్ష్మణ్ ఉటేకర్(Laxman Utekar) దర్శకత్వం వహించారు. దినేష్ విజన్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న హిందీలో విడుదలైంది. ఈ సినిమాని గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్స్ సంస్థ తెలుగులో శుక్రవారం విడుదల చేసింది. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన థాంక్స్ మీట్లో బన్నీ వాసు మాట్లాడుతూ– ‘‘ఛావా’ కేవలం సినిమా మాత్రమే కాదు... గ్రేట్ ఎమోషన్. నాలుగు రోజుల్లోనే పాటలని పూర్తి చేసిన ఏఆర్ రెహమాన్గారికి థ్యాంక్స్’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో నా పాత్రకు వస్తున్న ఆదరణ చాలా ఆనందాన్ని ఇస్తోంది. తెలుగులో నాకు వాయిస్ ఇచ్చిన ఫణి వంశీగారికి థ్యాంక్స్’’ అని నటుడు వినీత్ కుమార్ సింగ్ తెలిపారు. ‘‘మా సినిమాని ఇంత గొప్పగా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అని మాడ్డాక్ సీఎఫ్ఓ దివ్యాంశ్ గోయల్ అన్నారు. ఈ థ్యాంక్స్ మీట్లో తెలుగు డైలాగ్ రైటర్ సామ్రాట్, తెలుగు డబ్బింగ్ డైరెక్టర్ రాఘవ, లిరిక్ రైటర్ శ్రీమణి మాట్లాడారు. -
చిలకలూరిపేట, చుండూరు మారణకాండపై సినిమా.. టీజర్ విడుదల
మన సమాజంలో చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందా.! ఇదే పాయింట్తో '23' అనే సినిమా రానుంది. తాజాగా ఈ మూవీ నుంచి టీజర్ విడుదలైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన సంచలన ఘటనలను ఆధారంగా చేసుకుని ఈ మూవీని నిర్మించారని టీజర్ను చూస్తుంటే తెలుస్తోంది. గతంలో మల్లేశం, 8 ఏ.ఎం మెట్రో, వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాజ్ రాచకొండ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా నిర్మాణంలో ఈ చిత్రం రూపొందుతుడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. '23' సినిమాలో తేజ, తన్మయ, ఝాన్సీ కీలక పాత్రలలో కనిపించనున్నారు.23 సినిమా టీజర్లోని అంశాలు తెలుగు ప్రేక్షకులలో ఆసక్తి కలిగించేలా ఉన్నాయి. 1991 సమయంలో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో జరిగిన చుండూరు మారణకాండ ఘటనతో టీజర్ ప్రారంభమవుతుంది. ఆపై 1993లో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన చిలకలూరిపేటలో బస్సు దహనంతో పాటు.. 1997లో హైదరాబాద్ జూబ్లీహిల్స్లో జరిగిన కార్ బాంబు దాడి గురుంచి తెరపైకి తీసుకొచ్చారు. ఇలా ఈ మూడు ఘటనలలో మరణించిన వారి స్టోరీ ఒకే మాదిరి ముగియగా.. హంతకుల కథ చివరకు ఏమైంది అనే పాయింట్తో '23' చిత్రంలో చూపించనున్నారు. -
అందుకే బతిమాలుతున్నా: నాని
‘‘నా కెరీర్లో ఎప్పుడూ దయచేసి ఓ సినిమా చూడండి అని అడగలేదు. కానీ ‘కోర్టు’( Court Movie) లాంటి మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు మిస్ కాకూడదని చెబుతున్నాను.. అందరూ చూడాలని బతిమాలుతున్నాను’’ అని హీరో నాని(Nani ) చెప్పారు. ప్రియదర్శి ప్రధాన ΄ాత్రలో రోషన్, శ్రీదేవి ఇతర పాత్రల్లో నటించిన చిత్రం ‘కోర్టు’. రామ్ జగదీశ్ దర్శకత్వం వహించారు. నాని వాల్ పోస్టర్ సినిమా సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్, ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి డైరెక్టర్స్ నాగ్ అశ్విన్, ప్రశాంత్ వర్మ, శైలేష్ కొలను, శ్రీకాంత్ ఓదెల, శౌర్యువ్, ఇంద్రగంటి మోహన కృష్ణ, దేవ కట్టా అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ–‘‘కోర్టు’ సినిమాకి వెళ్లాక నా మాటలు మీ అంచనాలకి సరిపోలేదనిపిస్తే... రెండు నెలల్లో రిలీజ్ అవుతున్న నా ‘హిట్ 3’ సినిమాని ఎవరూ చూడొద్దు’’ అని కోరారు. ‘‘బలగం’ తర్వాత ఎలాంటి సినిమా చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ‘కోర్టు’ చేయమని నాని అన్న చెప్పారు’’ అని ప్రియదర్శి తెలిపారు. ‘‘ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు నాగ్ అశ్విన్, శ్రీకాంత్ ఓదెల. ‘‘నానీగారు వాల్ పోస్టర్ సినిమా ద్వారా నన్ను డైరెక్టర్గా పరిచయం చేశారు. ఈ సినిమా పెద్ద సక్సెస్ సాధించాలి’’ అని ప్రశాంత్ వర్మ ఆకాంక్షించారు. ‘‘కోర్టు’ ట్రైలర్ చూశాక సినిమా అద్భుతంగా వచ్చిందనిపిస్తోంది’’ అన్నారు శైలేష్ కొలను. ‘‘ఈ సినిమాని ఆడియన్స్ సెలబ్రేట్ చేసుకుంటారని భావిస్తున్నాను’’ అని దేవ కట్టా తెలిపారు. ‘‘కోర్టు’ చాలా అందమైన సినిమా’’ అన్నారు నిర్మాత దీప్తి. ‘‘కోర్టు’ మనందరికీ జీవితం. అందరూ థియేటర్స్కి రండి’’ అన్నారు రామ్ జగదీశ్. ‘‘ఈ సినిమా ప్రోమోస్ చాలా ఆసక్తిగా ఉన్నాయి. అందరూ థియేటర్స్లో చూడాలి’’ అన్నారు ఇంద్రగంటి మోహనకృష్ణ. నటీనటులు శ్రీదేవి, రోహిణి, సురభి ప్రభావతి, హర్ష రోషన్, శ్రీనివాస్ భోగిరెడ్డి, శివాజీ, డైరెక్టర్ శౌర్యువ్, మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్, లిరిక్ రైటర్ పూర్ణాచారి తదితరులు మాట్లాడారు. -
'ఛావా' తెలుగు వర్షన్.. రెండో రోజు కలెక్షన్ల జోరు
బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా 'ఛావా' తెలుగులో కూడా సత్తా చాటుతుంది. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. విక్కీ కౌశల్, రష్మిక ప్రధానపాత్రలో నటించిన ఈ చిత్రాన్ని లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 14న హిందీ వర్షన్లో మాత్రమే విడుదలైన ఈ మూవీ తెలుగు డబ్బింగ్లో మార్చి 7న థియేటర్స్లోకి వచ్చేసింది. ఈ ఏడాది బాలీవుడ్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా ఛావా రికార్డు నెలకొల్పింది. మూడు వారాల తర్వాత తెలుగులో విడుదలైనప్పటికీ కలెక్షన్స్ పరంగా దుమ్మురేపుతుంది.ఛావా సినిమా తెలుగు వర్షన్ను గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ పతాకంపై నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేశారు. తొలిరోజే ఈ చిత్రం రూ.3 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు సంస్థ తెలిపింది. ఒక డబ్బింగ్ చిత్రానికి ఈ స్థాయిలో కలెక్షన్లు రావడం రికార్డ్ అంటూ నెట్టింట పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే, రెండో రోజు 'ఛావా' తెలుగు కలెక్షన్స్ మరింత పెరిగాయి. రెండు రోజులకు గాను టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రూ. 6.81 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. నేడు ఆదివారం కావడంతో సులువుగా రూ. 10 కోట్ల మార్క్ను దాటుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఈ చిత్రంలో శంభాజీ మహారాజ్గా విక్కీ కౌశల్ ఆయన సతీమణి యేసుబాయి భోంస్లే పాత్రలో రష్మిక మందన్న జీవించేశారని ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. కథలో కీలకమైన ఔరంగజేబు పాత్రతో అక్షయ్ ఖన్నా అదరగొట్టేశారని చెప్పవచ్చు. దీంతో ఛావా ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లు దాటేసింది. -
ఈ ఫీలింగ్ ఎంత బాగుందో.. నమ్రత నోట కూడా అదే: శిల్ప శిరోద్కర్
బిగ్బాస్ షోకు వెళ్లడం వల్ల తనకు మంచే జరిగిందంటోంది నటి శిల్పా శిరోద్కర్ (Shilpa Shirodkar). పెద్దగా కష్టపడకుండానే బరువు తగ్గిపోయానని చెప్తోంది. ఆమె లేటెస్ట్ లుక్ చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. నాజూకుగా మారిపోయారని కామెంట్లు చేస్తున్నారు. శిల్పా మట్లాడుతూ.. బిగ్బాస్ షో (Bigg Boss Reality Show)లో ఎక్కువ ఆహారం అందుబాటులో ఉండదు. దీనివల్ల మితంగానే తినేదాన్ని. ఫలితంగా 11 కిలోలు తగ్గిపోయాను. బయటకు వచ్చాక మరో రెండు కిలోలు తగ్గాను.జీవితంలోనే మొదటిసారి..మొత్తంగా 13 కిలోల పైన బరువు తగ్గాను. ఇది నాకెంతో సంతోషంగా ఉంది. నువ్వు చాలా సన్నబడిపోయావ్, నీ వయసు తగ్గిపోతుందేంటి అన్న ప్రశంసలు నా జీవితంలోనే మొదటిసారి వింటున్నాను. అవి వింటుంటే నాకు మరింత ఎనర్జీ వస్తోంది. బిగ్బాస్లో మూడు, నాలుగు నెలలపాటు ఉన్నాను. బయటకు రాగానే తొలిసారి నమ్రత (Namrata Shirodkar)ను కలిసినప్పుడు నన్ను చూసి షాకైంది. చాలా సన్నబడిపోయావ్ అంది. నన్ను చూసి నా కుటుంబం ఎంతగానో గర్విస్తోంది.మంచి డైట్..ఇప్పుడు మంచి డైట్ ఫాలో అవుతున్నాను. ఇంకాస్త బరువు తగ్గాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. ఎందుకంటే స్క్రీన్పై మనం ఉన్నదానికంటే కాస్త బొద్దుగానే కనిపిస్తాం. కాబట్టి నాకు నేను కఠిన నియమాలు పెట్టుకుంటున్నాను. రోజుకు ఒకటీ లేదా రెండు సార్లు మాత్రమే భోజనం చేయాలని నిర్ణయించుకున్నాను. గతంలో నేను లావుగా ఉన్నానని చయ్యా చయ్యా పాటకు నన్ను రిజెక్ట్ చేశారు. నాకోసం కష్టపడుతున్నా..అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని నిర్ణయించుకున్నాను. నాకోసం నేను కష్టపడుతున్నాను అని చెప్పుకొచ్చింది. శిల్ప.. ఖుదా గవా, ఏక్ ముత్తి ఆస్మాన్, త్రినేత్ర, ప్రతీక్ష, పెచాన్, ఆంఖెన్.. ఇలా ఎన్నో సినిమాలు చేసింది. తెలుగులో బ్రహ్మ అనే సినిమాలో నటించింది. హీరో మహేశ్బాబుకు శిల్ప శిరోద్కర్ మరదలు అవుతుంది. View this post on Instagram A post shared by Shilpa Shirodkar Ranjit (@shilpashirodkar73) View this post on Instagram A post shared by Shilpa Shirodkar Ranjit (@shilpashirodkar73)చదవండి: 'శ్రీలీల రాకతో ఈ ఐటం బ్యూటీ కెరీర్ ఖతం'.. ఇవే నచ్చదంటున్న నోరా -
ఆ సినిమా కోసం చాలా భయపడ్డాను: కీర్తి సురేష్
సౌత్ ఇండియా హీరోయిన్ కీర్తీ సురేష్ ముందు రకరకాల రుచికరమైన ఆహారపదార్థాలు ఎన్ని పెట్టినా, తను మాత్రం దోశ కోసమే ఎదురుచూస్తుంది. దోశ అంటే అంత ప్రాణం. ఒకరోజు హీరో నాని ఇంటికి వెళ్లినప్పుడు, డైనింగ్ టేబుల్పై ఉండే ఐటమ్స్ నచ్చక, తానే కిచెన్లోకి వెళ్లి, దోశ వేసుకొని తినింది. ఇక చిరంజీవి గారి వంటవాడికి అయితే, ‘భోళా శకంర్’ షూటింగ్ సెట్లోనూ తనకు పంపే ఆహారం ఎలా ఉండాలో ఫోన్ చేసి, చెప్పి మరీ చేయించుకునేది.చిలిపి అలవాటుచిన్నప్పుడు తరచు రుపాయి నాణేలను నోట్లో పెట్టుకోవడం అలవాటు ఉండేది. అలా రెండుసార్లు మింగేసింది. ఆ అలవాటు మానడానికి చాలా కాలమే పట్టింది. చిన్నప్పుడు ఇంట్లో ఎవరైనా తనని తిడితే, వాళ్లు రెస్ట్రూమ్కి వెళ్లినప్పుడు బయట గడియ పెట్టి వెళ్లిపోతుందట! అలా వాళ్ల అమ్మను చాలాసార్లు ఏడిపించింది. ఇప్పటికీ అలాగే చేస్తుందట!అన్నీ ఫ్లాపులేకీర్తి సినీ ప్రయాణం అనుకున్నంత సాఫీగా ఏమీ సాగలేదు. మొదట్లో తను నటించిన మూడు సినిమాలు చిత్రీకరణ మధ్యలోనే ఆగిపోయాయి. ఆపై విడుదలైన సినిమాలు కూడా అంతంతమాత్రంగానే ఆడాయి. దీంతో దశాబ్దంపాటు ఐరన్లెగ్ ముద్రను ధరించింది.చాలా భయపడ్డాకీర్తి ఎక్కువగా భయపడింది సావిత్రిగారిలా నటించడానికేనట! మహానటి సావిత్రి బయోపిక్ కోసం ముందుగా చాలామంది హీరోయిన్లను అనుకున్నా, చివరకు కీర్తికే ఆ చాన్స్ దక్కింది. ఆ సినిమాకు ఆమెను ఒప్పించడానికి డైరెక్టర్కు తలప్రాణం తోకకొచ్చింది.నా పాట..గాత్రంతోనూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచింది కీర్తి. ‘సామి స్క్వేర్’లో ‘పుదు మెట్రో రైల్’ పాట పాడింది కీర్తినే.. ‘కల్కి 2898 ఏడీ’ లోనూ బుజ్జిగా ఒక కారుకు వాయిస్ అందించింది. ఇలా నటి, గాయని మాత్రమే కాదు, స్విమ్మర్, ఫ్యాషన్ డిజైనర్ కూడా!బ్యూటీ సీక్రెట్.. ఆరోగ్యం, అందంపై చాలా శ్రద్ధ తీసుకుంటుంది కీర్తి. ఇందుకోసం, సహజమైన పద్ధతుల్నే పాటిస్తుంది. నారింజ తొక్కల పొడి, పచ్చి పసుపు, పాల మీగడ ఇలా ఇంట్లో దొరికే పదార్థాలతోనే ఫేస్ ప్యాక్ వేసుకుంటుంది. షూటింగ్ లేనప్పుడు అసలు మేకప్ వేసుకోదు.అక్క సిద్ధమైందికీర్తి ప్రస్తుతం మరో క్రేజీ ప్రాజెక్ట్తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘అక్క’ వెబ్ సిరీస్లో లేడీ డాన్గా చాలా బోల్డ్గా, వైల్డ్గా కనిపించబోతోంది. -
'శ్రీలీల రాకతో ఈ ఐటం బ్యూటీ కెరీర్ ఖతం'.. ఇవే నచ్చదంటున్న నోరా
నోరా ఫతేహి (Nora Fatehi).. ఐటం సాంగ్ డ్యాన్సరే కాదు, నటి కూడా! కానీ ఆమెకు ఎక్కువగా డ్యాన్సర్గానే గుర్తింపు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అభిషేక్ బచ్చన్ సరసన బి హ్యాపీ అనే సినిమాలో నటిస్తోంది. అయితే తనను ప్రతిసారి ఎవరో ఒకరితో పోల్చడం నచ్చదంటోందీ బ్యూటీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నోరా ఫతేహి మాట్లాడుతూ.. నేను ముక్కుసూటిగా మాట్లాడతాను. దాన్ని అందరూ తలపొగరు అనుకుంటారు. ఐటం సాంగ్స్, యాక్టింగ్..స్పెషల్ సాంగ్స్లో కనిపించనంతమాత్రాన హీరోయిన్గా చేయొద్దని ఎక్కడా లేదే! ప్రతి ఒక్కరూ ఐటం సాంగ్స్ (Item Songs) చేయొచ్చు, కావాలనుకుంటే నటించనూవచ్చు. ఈ విషయంలో అందరికీ ఒకేవిధమైన న్యాయం ఉండాలి. స్పెషల్ సాంగ్స్ చూసినప్పుడు నేను ఏమని ఫీలవుతానో తెలుసా? అమ్మాయిలు ధైర్యంగా ముందడుగు వేశారు.. అందంగా కనబడుతూనే ఇలాంటి పాటల్లో కనిపించేందుకు ఏమాత్రం వెనకడుగు వేయడం లేదని సంతోషపడతాను. నాతో పోల్చుకుంటున్నారుకానీ నచ్చని విషయం ఏంటంటే.. వారి సాంగ్ ప్రమోషన్కు నా పేరును వాడుకోవడం! ఏదైనా పాటను జనాల్లోకి తీసుకెళ్లాలనుకున్నప్పుడు నా పేరును లాగుతున్నారు. నోరాతో పోల్చితే చాలనుకుంటున్నారు. అన్ని పీఆర్ ఏజెన్సీ (PR campaigns)లు ఇదే పని చేస్తున్నాయి. కొత్త పాట రిలీజైనప్పుడల్లా నోరా కెరీర్ ముగిసినట్లే.. ఈ కొత్త బ్యూటీ నోరా కంటే 100 రెట్లు నయం.. ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు. దీని వెనక ఎవరున్నారో నాకు తెలుసు. ఎవరినీ కిందకు లాగనుఇందుకోసం ఎంత డబ్బు ఖర్చు చేస్తున్నారో కూడా బాగా తెలుసు. సేమ్, ఇలాగే అవతలివారిని కిందకు లాగుతూ ప్రచారం చేద్దామని కొన్ని పీఆర్ ఏజెన్సీలు నన్ను సంప్రదించాయి. కానీ నేనందుకు ఒప్పుకోలేదు. నన్ను నేను ఎవరితోనూ పోల్చుకోలేను. ఎవరినీ కిందకు లాగడం నాకిష్టం లేదు. నా పాట రిలీజైనప్పుడు నా పనితనం, డ్యాన్స్, ఎఫర్ట్స్.. ఇవి చూసి మాత్రమే జనాలు నన్ను మెచ్చుకోవాలి అని చెప్పుకొచ్చింది.శ్రీలీల వంటి హీరోయిన్ల రాకతో..ఈ మధ్య శార్వరి, శ్రీలీల (Sreeleela), రాషా వంటి పలువురు యంగ్ హీరోయిన్లను నోరాతో పోల్చారు. అంతేకాదు వారి రాకతో నోరా కెరీర్ ఖతమైపోయిందన్న కామెంట్లు కూడా చూశాం అంటున్నారు నెటిజన్లు. నోరా ప్రధాన పాత్రలో నటించిన బి హ్యాపీ సినిమా విషయానికి వస్తే. ఈ మూవీ మార్చి 14న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుంది.చదవండి: రన్యారావు కేసు కీలక మలుపు.. ఆమె శరీరంపై గాయాలు -
'ఐఫా' అవార్డ్స్ 2025 విజేతల జాబితా
'ఐఫా' అవార్డ్స్ 2025 జైపూర్లో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో తొలి రోజు డిజిటల్ అవార్డుల ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ, డిప్యూటీ సీఎం దియా కుమారితో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. షారుఖ్ ఖాన్, మాధురీ దీక్షిత్, షాహిద్ కపూర్, కృతి సనన్, కరీనా కపూర్, శ్రేయా ఘోషల్, కరణ్ జోహార్, బాబీ డియోల్ ఐఫా వేదికపై సందడి చేశారు. జైపుర్లో రెండు రోజుల పాటు జరగనున్న ఐఫా సిల్వర్ జూబ్లీ వేడుకలు శనివారం మొదలయ్యాయి. చిత్రసీమకు చెందిన చాలామంది నటీమణులు ‘ది జర్నీ ఆఫ్ ఉమెన్ ఇన్ సినిమా’ పేరుతో జరిగిన చర్చలో తమ వాయిస్ను వినిపించారు. పరిశ్రమలో తమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించారు. సినిమాకు సంబంధించి హీరోల్లాగే తాము కూడా ప్రేక్షకులను మెప్పిస్తున్నామని వారు తెలిపారు. ఇక్కడ అందరం సమానంగా పనిచేసినప్పటికీ పారితోషికం విషయంలో చాలా వ్యత్యాసం కొనసాగుతుందని తెలిపారు. ఈ విషయంలో నటులు కూడా స్పందించాల్సిన అవసరం ఉందని వారు ఆశించారు. ‘స్త్రీ2’ సినిమాకు భారీ వసూళ్లు వచ్చాయి. అలాంటప్పుడు ఆ సినిమాలో నటించిన హీరోయిన్కు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారో తెలిసిందే అంటూ బాలీవుడ్ కథానాయకులు తమ గళాన్ని వినిపించారు.సినిమా విభాగంఉత్తమ చిత్రం: అమర్ సింగ్ చంకిలాఉత్తమ నటి: కృతి సనన్ (దో పట్టి)ఉత్తమ నటుడు: విక్రాంత్ మాస్సే (సెక్టార్ 36)ఉత్తమ దర్శకుడు: ఇంతియాజ్ అలీ (అమర్ సింగ్ చంకిలా)ఉత్తమ సహాయ నటి : అనుప్రియ గోయెంకా (బెర్లిన్)ఉత్తమ సహాయ నటుడు: దీపక్ దోబ్రియాల్ (సెక్టార్ 36)ఉత్తమ కథ ఒరిజినల్: కనికా ధిల్లాన్ (దో పట్టి)వెబ్ సిరీస్ విభాగంఉత్తమ సిరీస్: పంచాయత్ సీజన్- 3ఉత్తమ నటి (సిరీస్): శ్రేయ చౌదరి (బాండిష్ బాండిట్స్ సీజన్ 2)ఉత్తమ నటుడు (సిరీస్): జితేంద్ర కుమార్ (పంచాయత్ సీజన్ 3)ఉత్తమ దర్శకుడు (సిరీస్): దీపక్ కుమార్ మిశ్రా (పంచాయత్ సీజన్ 3)ఉత్తమ సహాయ నటి (సిరీస్): సంజీదా షేక్ (హీరామండి: ది డైమండ్ బజార్)ఉత్తమ సహాయ నటుడు (సిరీస్): ఫైసల్ మాలిక్ (పంచాయత్ సీజన్ 3)ఉత్తమ కథ: కోటా ఫ్యాక్టరీ సీజన్ 3 View this post on Instagram A post shared by IIFA Awards (@iifa) -
మంచు విష్ణు 'ఢీ' కొట్టగలడా..?
మంచు విష్ణు కెరీర్లో ‘ఢీ’ సినిమాది ప్రత్యేకమైన స్థానం. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్బస్టర్గా నిలిచింది. జెనీలియా కథానాయికగా నటించిన ఈ చిత్రంలో శ్రీహరి, బ్రహ్మానందం, సునీల్, చంద్రమోహన్ తదితరులు నటించారు. 2007లో విడుదలైన ఈ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది.కొంతకాలంగా ఇండస్ట్రీలో రీరిలీజ్ల ట్రెండ్ కొనసాగుతుంది. గతంలో సూపర్ హిట్ అందుకున్న చిత్రాలను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ థియేటర్స్లలో సందడి చేసింది. ఇప్పుడు ఢీ సినిమాను మార్చి 28 రీ-రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే, ఆ సమయంలో పెద్ద సినిమాలు ఉండటంతో వాటిని ఢీ కొట్టగలదా అనే సందేహాలు ఉన్నాయి.మార్చి 28 రెండు కొత్త సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. నితిన్ ‘రాబిన్ హుడ్’ విడుదల కోసం మైత్రి మూవీస్ భారీ స్కెచ్ వేసి ఉంది. ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. అదే సమయంలో ‘మ్యాడ్ స్క్వేర్’ రంగంలోకి దిగుతుంది. సితార బ్యానర్ ఇప్పటికే ప్రమోషన్స్ మొదలు పెట్టింది. మార్చి 27న విక్రమ్ ‘వీరధీర శూర పార్ట్ 2’ విడుదల కానుంది. అదే తేదీన మోహన్ లాల్ ‘ఎల్2 ఎంపురాన్’ విడుదల కానుంది. ఈ సినిమాకు తెలుగులో కూడా మంచి బజ్ ఉంది. ఇలాంటి సమయంలో 'ఢీ' కొట్టడం చాలా కష్టం అని నెట్టింట అభిమానులు చర్చించుకుంటున్నారు. మరో తేదీ చూసుకుని ఈ చిత్రాన్ని విడుదల చేస్తే మంచి కలెక్షన్స్ తప్పకుండా రాబడుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. -
రన్యారావు కేసు కీలక మలుపు.. ఆమె శరీరంపై గాయాలు
బంగారం అక్రమ రవాణా కేసులో పట్టుబడిన నటి రన్యారావు(34) కేసు కీలక మలుపు తిరిగింది. తాజాగా ఆమెపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. ఇక నుంచి ఆమె సీబీఐ బోనులోకి వెళ్లాల్సిందే. వారు అడిగే ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరి కావాల్సిందే. మరో రెండు రోజుల్లో ఆమెను సీబీఐ అధికారులు విచారించనున్నారు. రన్యారావును పోలీసులు విచారిస్తున్న క్రమంలో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం బంగారం అక్రమ రవాణా మాత్రమే కాకుండా సంఘవిద్రోహ శక్తులతో కూడా ఆమెకు సంబంధాలు ఉన్నట్లు వారు కనుగొన్నారు. సౌదీ అరేబియాతో పాటు అమెరికా, పశ్చిమాసియా, ఐరోపా దేశాలలో కూడా రన్యారావు ప్రయాణించినట్లు అధికారులు గుర్తించారు. ఈ కారణంతోనే సీబీఐ రంగంలోకి దిగింది.రన్యారావు నుంచి ఇప్పటికే 14 కిలోల బంగారు బిస్కెట్లు, రూ.2 కోట్ల విలువైన ఆభరణాలు, సుమారు రూ.3 కోట్ల నగదును డీఆర్ఐ అధికారులు జప్తు చేశారు. ఆమె వద్ద మొత్తం రూ. 18 కోట్ల ఆస్తులను గుర్తించినట్లు తెలుస్తోంది. ఆమెకు సంబంధించిన ఫోన్స్తో పాటు ల్యాప్టాప్లను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. ప్రస్తుతం ఆమె డీఆర్ఐ అధికారుల విచారణలో ఉంది. త్వరలో సీబీఐ అధికారులు కూడా ఆమెను ప్రశ్నించనున్నారు. వారు ఇప్పటికే పలు ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు.రన్యారావును విచారించిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సంచలన విషయాలను తెలిపింది. ఆమె శరీరంపై పలుచోట్ల గాయాలున్నాయని తెలిపింది. అయితే, దుబాయ్కి వెళ్లక ముందే తనకు ఈ గాయాలు అయినట్లు ఆమె తెలియజేసిందని అధికారులు చెప్పారు. దీంతో ఆమెకు అవసరం అయితే వైద్య సాయం అందించాలని జైలు అధికారులను కోర్టు సూచించింది. రన్యారావు విచారణలో భాగంగా తమకు సహకరించడం లేదని డీఆర్ఐ అధికారులు కోర్టుకు తెలిపారు. -
ఏ ఎండకు ఆ గొడుగు పట్టేస్తే ఎలా.. డ్రాగన్ బ్యూటీపై సెటైర్స్
సినిమా రంగంలోనైనా, రాజకీయరంగంలోనైనా చెప్పేదొక్కటి చేసే దొక్కటి. ఈ రంగాల్లో సందర్భాన్ని బట్టి మాట మార్చడం చాలా మంది విషయంలో సహజమే. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, డ్రాగన్ నటి కయాదు లోహార్నే కారణం. ఈ అస్సామీ బ్యూటీ 21 ఏళ్ల పరువంలోనే నటిగా ఎంట్రీ ఇచ్చారు. అలా మొదట్లో కన్నడంలో ముగిల్పేట అనే చిత్రంలో కథానాయకిగా నటించారు. ఆ తరువాత మలయాళంలో పథోన్పత్తం నూత్తాండు అనే చిత్రంలో ఎంట్రీ ఇచ్చారు. ఆపై తెలుగులో 2022లో అల్లూరి అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అదే విధంగా మరాఠీ భాషలోనూ ప్రేమ్ యు అనే చిత్రంలో నటించారు. అలా రెండేళ్లలోనే నాలుగు భాషలను చుట్టేసిన ఈ అమ్మడికి తాజాగా తమిళంలో నటించిన డ్రాగన్ చిత్రంతో సంచలన విజయం వరించింది. ఇప్పుడు దక్షిణాదిలో క్రేజీ కథానాయకిగా మారిపోయారు. కాగా తాజాగా అధర్వకు జంటగా ఇదయం మురళి అనే చిత్రంలో నటిస్తున్నారు. అదే విధంగా మరో తెలుగు చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. కాగా తెరపై అందాలను ఆరబోయడంలో ఏమాత్రం వెనుకాడని ఈ అమ్మడి తన నోటీకొచ్చింది మాట్లాడేస్తుండటంతో నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గన కయాదు లోహర్ను సెలబ్రిటీ క్రష్ ఎవరు అన్న ప్రశ్నకు దళపతి విజయ్ తన సెలబ్రిటీ క్రష్ అని చెప్పారు. ఆన నటన తనకు చాలా ఇష్టం అని కూడా పేర్కొన్నారు. ఆయన నటించిన చిత్రాల్లో తెరి అంటే చాలా ఇష్టం అని చెప్పారు. అయితే అలా అన్న కొద్ది రోజుల్లోనే తన ఇన్స్ట్రాగామ్లో అభిమానులతో ముచ్చటిస్తూ తనకు నచ్చిన హీరో ధనుష్ అనీ, ఈ విషయంలో మరొకరికి చోటు లేదు అని చెప్పారు. దీంతో ఈ బ్యూటీ వ్యవహారాన్ని గమనించిన నెటిజన్లు ఏ ఎండకు ఆ గొడుగు పట్టే నటి అంటూ ఆడేసుకుంటున్నారు. అలా కయాదు లోహర్ వారికి దొరికిపోయారు. అయినా, సినిమాల్లో ఇదంతా సహజమే అంటున్నారు సినీ ప్రముఖులు. -
Sakshi Excellence Awards 2025: సినీ ప్రతిభకు క్లాప్స్
తెలుగు ప్రజల ప్రాథమిక వినోదం సినిమా. ప్రతి శుక్రవారం కొత్త రిలీజుకై ఎదురు చూసే ప్రేక్షకులు తమ ఇష్టాఇష్టాలతో జాతకాలు మారుస్తుంటారు. వీరిని మెప్పించేందుకు హీరో, హీరోయిన్లు, నిర్మాత–దర్శకులు అనుక్షణం కొత్త ఆలోచనలు చేస్తుంటారు. 2023 ఎన్నో ఘనవిజయాలను చూసింది. అలాగే 2024లోనూ తెలుగు సినిమా ఘన విజయాలు చూసింది... ఘనతలు సాధించింది. చంద్రమోహన్ వంటి గొప్ప నటుణ్ణి కోల్పోయింది. అందుకే చంద్రమోహన్కు నివాళి అర్పిస్తూ ఈ వేడుకను నిర్వహించింది ‘సాక్షి’. వేయి చిత్రాల్లో నటించిన గొప్ప నటి రమాప్రభకు ‘లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు’ బహూకరించడం తనను తాను గౌరవించుకోవడంగా భావిస్తోంది ‘సాక్షి’. మాతో పాటు మీరూ క్లాప్స్ కొడుతూ వేడుకలోకి రండి.‘సాక్షి’ టీమ్కి ధన్యవాదాలు. యాక్చువల్లీ... ఇది నాకు సర్ప్రైజ్. ఈ అవార్డుని అసలు ఊహించలేదు. నేను కాలేజీలో లెక్చరర్గా చేస్తూ... జాబ్ వదిలేసి సినిమాల్లోకి వద్దామనుకున్నప్పుడు ... నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించిన నా గురువు రామ్మోహన్రావుగారికి ఈ అవార్డు అంకితం ఇస్తున్నాను. థ్యాంక్యూ... సార్. మీ లవ్ అండ్ సపోర్ట్కి. – 2024 ‘తెలుగు పర్సన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అందుకున్న సందర్భంగా దర్శకుడు సుకుమార్∙అవార్డు అందుకుంటున్న సుకుమార్ మా హీరో బన్నీ (అల్లు అర్జున్), నిర్మాతలు నవీన్, రవిగార్లు, దేవిశ్రీ ప్రసాద్లతో పాటు నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ ఎంతో సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్. ‘పుష్ప 2’ థ్యాంక్స్ మీట్లో నేను కొందరికి థ్యాంక్స్ చెప్పలేకపోయాను. సెట్స్లో నాతోపాటు ఏకధాటిగా పని చేసిన పాండు, ఆర్ట్ అసిస్టెంట్ మధు, నాతోపాటు ఐదేళ్లు వేరే సినిమా చేయకుండా పని చేసిన కూలీ గ్యాంగ్కి ప్రత్యేక కృతజ్ఞతలు. సహ నిర్మాతలు ప్రవీణ్, సతీష్గార్లు, ప్రశాంతిగారికి థ్యాంక్స్. – ‘పుష్ప 2’కి పాపులర్ డైరెక్టర్ అవార్డు అందుకున్న సందర్భంగా సుకుమార్నా సినిమా ప్రయాణం చాలా పెద్దది. నేను ఇండస్ట్రీకి వచ్చి 63 సంవత్సరాలు అయింది. ఈ పెద్ద ప్రయాణంలో ఐదు తరాలతో కలిసి నటించాను. అలాంటి నాకు ఈ జీవిత సాఫల్య పురస్కారం ఇచ్చినందుకు ‘సాక్షి’ యాజమాన్యానికి, భారతీగారికి ధన్యవాదాలు. సరైన సమయంలో... సరైన వయసులో నాకు ఈ అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్యూ భారతమ్మా. – నటి రమాప్రభ‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్’ సందర్భంగా దివంగత చంద్రమోహన్గారికి నివాళి అర్పిస్తూ, మా కుటుంబాన్ని ఆహ్వానించినందుకు ‘సాక్షి’ మీడియా గ్రూప్కి కృతజ్ఞతలు. నేను, మా పెద్దమ్మాయి మీనా మోహన్, మా చిన్నమ్మాయి డాక్టర్ మాధవి హైదరాబాద్లో లేకపోవడం వల్ల వ్యక్తిగతంగా ఈ వేడుకకి హాజరు కాలేకపోయాం. మా తరఫున మా మేనల్లుడు శివలెంక కృష్ణప్రసాద్ ఈ వేడుకలో పాల్గొని, మా అందరి తరఫున కృతజ్ఞతలు చెబుతారు. – జలంధర, చంద్రమోహన్ సతీమణిచంద్రమోహన్గారి రెండో అక్క కొడుకుని నేను. 1978లో ‘సీతామాలక్ష్మి’ సినిమా సమయంలో ఆయన వద్దకు నేను ఉద్యోగం కోసం వెళ్లాను. అప్పుడు ఆయన నా వ్యక్తిగత విషయాలు చూసుకో అన్నారు. అలా మావయ్య వద్ద చేరాను. ‘నిర్మాత కావొద్దు... టెక్నీషియన్గా అయినా పర్వాలేదు’ అని కూడా ఆయన అన్నారు. కానీ, నేను మాత్రం నిర్మాతగా నా తొలి సినిమానే మావయ్య, రాజేంద్రప్రసాద్లతో ‘చిన్నోడు పెద్దోడు’ తీశా. ఆ తర్వాత బాలకృష్ణగారితో ‘ఆదిత్య 369’తో పాటు నాలుగు సినిమాలు చేశాను. ఈ మధ్య కాలంలో ‘యశోద’ మూవీ తీశాను. చంద్రమోహన్గారు 1965లో ఇండస్ట్రీకి రాగా 1966లో మొదటి మూవీ చేశారు. మన తెలుగు వాళ్లే కాకుండా మిగతా భాషల్లో కూడా ఆయనకి అప్రిషియేషన్ ఉండేది. శివాజీ గణేశన్, ఎంజీఆర్గార్లతో పాటు అందరూ ఆయన్ని అభినందించేవారు. 1977–78 నుంచి ఆయన పూర్తి స్థాయిలో హీరోగా మారి దాదాపు 160 సినిమాలు చేశారు. దాదాపు 54 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ ఎన్నో పాత్రలు వేశారు. మావయ్యగారి ‘సుఖ దుఃఖాలు’ మూవీ చూసి, మహానటుడు ఎస్వీ రంగారావుగారు మావయ్యతో ‘బాంధవ్యాలు’ అనే సినిమా నిర్మించారు. చంద్రమోహన్గారిలాంటి మంచి నటుడికి, మంచి వ్యక్తికి మేనల్లుడు కావడం నా అదృష్టం. మావయ్య నటనని, చిత్రసీమకు ఆయన చేసిన సేవలను పురస్కరించుకుని గుర్తింపు ఇచ్చినందుకు ‘సాక్షి’ మేనేజ్మెంట్కి మా కుటుంబం తరఫున కృతజ్ఞతలు. – నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‘పుష్ప 2’ చిత్రానికి ఇది తొలి అవార్డు. ‘సాక్షి’ అవార్డుతోప్రారంభం అయింది. ఇక్కడి నుంచి ఇంకా చాలా అవార్డులు రావాలని, వస్తాయని నమ్ముతున్నాను. పదేళ్ల క్రితం ‘శ్రీమంతుడు’ చిత్రానికి ఇదే వేదికపై ఇదే ‘సాక్షి’ అవార్డుని భారతీగారు తన గోల్డెన్ హ్యాండ్స్తో ఇచ్చారు. అప్పటి నుంచి మా ప్రయాణం సినిమా సినిమాకి పెరుగుతూ వస్తోంది. ‘సాక్షి’ మొదటి అవార్డుతో మొదలైన మా ప్రయాణంలో ఇప్పటికి మా మైత్రీ మూవీ మేకర్స్కి దాదాపు 50 నుంచి 100 అవార్డులు వివిధ సంస్థల నుంచి వచ్చాయి. అందులో జాతీయ అవార్డు కూడా ఉండటం గొప్పగా భావించే అంశం. థ్యాంక్యూ వెరీ మచ్ టు ‘సాక్షి’. ‘పుష్ప 2’ని బెస్ట్ ఫిల్మ్గా ఎంపిక చేసిన జ్యూరీకి కృతజ్ఞతలు. మా హీరో అల్లు అర్జున్కి బెస్ట్ యాక్టర్గా ‘సాక్షి’ అవార్డు రావడం హ్యాపీగా ఉంది. అల్లు అర్జున్గారు ఇక్కడ ఉండి ఉంటే తప్పకుండా వచ్చి అవార్డు తీసుకునేవారు. ఆయన తర్వాతి సినిమా ట్రాన్స్ఫర్మేషన్ కోసం సిద్ధం అవుతుండటం వల్ల రాలేకపోయారు. – నిర్మాత యలమంచిలి రవిశంకర్‘లక్కీ భాస్కర్’లో నా నటనని గుర్తించి ‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డు’ ఇచ్చినందుకు థ్యాంక్స్. ఈ అవార్డు అందుకోవడం గౌరవంగా ఉంది. ఇది నాకు తొలి అవార్డు కావడంతో ఎక్స్ట్రా స్పెషల్. మా నిర్మాతలు చినబాబు, నాగవంశీగార్లకు, సుమతి వంటి మంచి పాత్ర ఇచ్చిన డైరెక్టర్ వెంకీ అట్లూరిగారికి థ్యాంక్స్. ఈ అవార్డు నా జీవితంలో ఓ భాగం. – హీరోయిన్ మీనాక్షీ చౌదరి నాకు ఇది తొలి అవార్డు. ‘క’ సినిమాని నిర్మించిన చింతా గోపాలకృష్ణా రెడ్డిగారికి, నాకు ఇంత మంచి సినిమా ఇచ్చిన దర్శకులు సుజీత్, సందీప్లకు ధన్యవాదాలు. ‘క’కి పని చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ థ్యాంక్స్. పీపుల్స్ ఛాయిస్ అవార్డు రావడం ఆనందంగా ఉంది. నన్ను ఆదరించి, సపోర్ట్ చేసిన ప్రేక్షకులందరికీ ఈ అవార్డుని అంకితం ఇస్తున్నాను. నన్ను గుర్తించి అవార్డు ఇచ్చిన ‘సాక్షి’కి కృతజ్ఞతలు. – హీరో కిరణ్ అబ్బవరంమా ‘హను–మాన్’ సినిమానిప్రోత్సహించిన ఆడియన్స్కు, ఎఫర్ట్స్ పెట్టిన దర్శకుడు ప్రశాంత్, మమ్మల్ని నమ్మిన నిర్మాత నిరంజన్ రెడ్డిగారికి థ్యాంక్స్. ఇలా అవార్డ్స్తో ప్రతిభనుప్రోత్సహిస్తున్నందుకు ‘సాక్షి’ యాజమాన్యానికి థ్యాంక్స్. సుకుమార్గారి చేతుల మీదగా అవార్డు అందుకోవడం హ్యాపీ. నేపాల్, చైనా–టిబెట్ బోర్డర్ లొకేషన్స్లో మా సినిమా షూటింగ్ జరిపినప్పుడు అక్కడి వారు... ఇది ఏ సినిమా అంటే.. తెలుగు సినిమా అన్నాం. వెంటనే వాళ్లు ‘హో పుష్ప’ అన్నారు. మేం ‘పుష్ప’ టీమ్ కాదు కానీ ‘పుష్ప’ సినిమా తీసిన ల్యాండ్ నుంచి వచ్చాం అని చె΄్పాం. – హీరో తేజ సజ్జా‘క’ సినిమాకు మాకు అవకాశం ఇచ్చిన నిర్మాత గోపాలకృష్ణా రెడ్డిగారు, మమ్మల్ని నమ్మిన కిరణ్ అబ్బవరంగారికి థ్యాంక్స్. ‘సాక్షి’కి చాలా థ్యాంక్స్. ఇది మా ఫస్ట్ అవార్డు. మాకెంతో ప్రత్యేకం. కంటెంట్ను నమ్మి సినిమా తీద్దామనుకున్నాం. స్ట్రాంగ్ కంటెంట్ చెబుదామనుకున్నాం... కంటెంట్ను నమ్మి చేసినందుకు మమ్మల్ని ఇక్కడివరకు తీసుకొచ్చిన తెలుగు ఆడియన్స్కు ధన్యవాదాలు. ఈ అవార్డును వారికి అంకితం ఇద్దామనుకుంటున్నాం. – దర్శకులు సుజిత్ అండ్ సందీప్ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును ఇచ్చిన ‘సాక్షి’కి థ్యాంక్స్. మా అమ్మానాన్నలకు, యూ ట్యూబ్ ద్వారా ఎంతో నేర్పించిన షార్ట్ ఫిల్మ్ మేకర్స్కి, ఎలా సినిమా తీయాలో నేర్పించిన ప్రతి దర్శకుడికి ధన్యవాదాలు. ప్రతి డెబ్యూ డైరెక్టర్ పడే కష్టాలన్నీ పడ్డాను. రైట్ స్క్రిప్ట్కి, రైట్ ప్రొడ్యూసర్ అవసరం అంటారు. నిహారిక కొణిదెల, ఫణి ఎడపాకగార్ల ద్వారా ఆ అవకాశం దక్కింది. ‘ఇది చిన్న సినిమా (‘కమిటీ కుర్రోళ్లు) కాదు.. ఎంత బడ్జెట్ కావాలో అంత పెడతాం’ అన్నారు. అందుకే ఈ అవార్డు నిహారిక, ఫణిగార్లకు అంకితం. – దర్శకుడు యదు వంశీ‘నాకు ఫస్ట్ క్లాస్లో సాంస్కృతిక విభాగంలో బహుమతి ఇచ్చారు. నాకు ఊహ తెలిశాక అది ఫస్ట్ అవార్డు కావడంతో ఇప్పటికీ గుర్తు. ఇప్పుడు నా సినిమా (‘డ్రింకర్ సాయి’)కి హీరోగా ‘సాక్షి’ అవార్డు రావడం హ్యాపీగా ఉంది. ‘సాక్షి’కి థ్యాంక్స్. ఈ అవార్డు జీవితాంతం గుర్తుండిపోతుంది. 2025లో నా తొలి హ్యాపియెస్ట్ మూమెంట్ ఇది. – హీరో ధర్మఇలాంటి అవార్డులు ఇచ్చినప్పుడు సరికొత్త కథలు రావడానికిప్రోత్సాహకంగా ఉంటుంది. దర్శకుడిగా నాకిది (‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’) తొలి సినిమా అయినప్పటికీ చాన్స్ ఇచ్చిన గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద బ్యానర్కి థ్యాంక్స్. – డైరెక్టర్ దుష్యంత్ఈ అవార్డు ఇచ్చినందుకు ‘సాక్షి’కి థ్యాంక్స్. ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ని ఆదరించిన ప్రేక్షకులకూ మరోసారి ధన్యవాదాలు. – నిర్మాత ధీరజ్ మొగిలినేనిమా సినిమాకి అవార్డు ఇచ్చినందుకు ‘సాక్షి’కి, భారతీ మేడమ్కి ధన్యవాదాలు. – హీరో సుహాస్వ] ూ దర్శక–నిర్మాతలకు, గీతా ఆర్ట్స్కి, ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ని సపోర్ట్ చేసిన ఆడియన్స్కి థ్యాంక్స్ – హీరోయిన్ ఎన్. శివాని‘హాయ్ నాన్న’ విడుదలై చాలా రోజులు గడిచిపోయాయి. కానీ, ఆ సినిమా గెలుచుకుంటున్న ప్రేమ, అవార్డులు, రివార్డులు... ఇలా కొనసాగుతూనే ఉన్నాయి. మరోసారి ఈ మూవీని సెలబ్రేట్ చేస్తున్నందుకు ‘సాక్షి’కి, జ్యూరీ మెంబర్లకు కృతజ్ఞతలు. మా సినిమాని వివిధ విభాగాల్లో ఎంపిక చేసినందుకు, అలాగే నన్ను బెస్ట్ యాక్టర్గా ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు. నేను వేరే దేశంలో ఉండటం వల్ల అవార్డు ఫంక్షన్కి రాలేకపోయాను. – హీరో నాని‘హాయ్ నాన్న’ విడుదలై ఏడాదికి పైగా అయినప్పటికీ ఇప్పటికీ ప్రేక్షకులు అదే అభిమానం చూపిస్తుండటం అపురూపమైనది. బెస్ట్ యాక్ట్రస్గా ఈ అవార్డు ఇచ్చినందుకు ‘సాక్షి’కి కృతజ్ఞతలు. నేను ఫంక్షన్కి రానందుకు క్షమించాలి. నాని, శౌర్యువ్, బేబి కియారా, నిర్మాతలు, సంగీత దర్శకుడు... ఇలా వీరందరూ లేకుంటే ఈ సినిమా ఉండేది కాదు. – హీరోయిన్ మృణాల్ ఠాకూర్‘హాయ్ నాన్న’కి ఈ అవార్డు ఇచ్చిన ‘సాక్షి’కి, భారతీగారికి ధన్యవాదాలు. ఎన్నో అవార్డులు గెలుచుకున్నాం. ఫిల్మ్ఫేర్, ఐఫా, సైమా అవార్డులొచ్చాయి. వీటన్నిటికన్నా ఒక తెలుగు అవార్డు (సాక్షి ఎక్సలెన్స్) అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డుని నా నిర్మాతలకి, నటీనటులకి, సాంకేతిక నిపుణులకు అంకితం ఇస్తున్నా... ప్రత్యేకించి నానీగారికి. ఎందుకంటే ఒక కొత్త డైరెక్టర్ని నమ్మి ఇలాంటి ఒక సున్నితమైన కథ, అందులోనూ ‘దసరా’ లాంటి సినిమా తర్వాత ఆయన ‘హాయ్ నాన్న’ని ఒప్పుకుని చేసినందుకు రుణపడి ఉంటాను. – డైరెక్టర్ శౌర్యువ్మా సినిమాకి అవార్డు ఇచ్చిన సాక్షి యాజమాన్యానికి, జ్యూరీ మెంబర్లకు థ్యాంక్స్. ‘బలగం’ అనేది పీపుల్స్ ఛాయిస్ మూవీ. ఈ సినిమా క్రెడిట్ వేణుకి దక్కుతుంది. – నిర్మాత హన్షితా రెడ్డి‘బలగం’ చిత్రానికి పీపుల్స్ ఛాయిస్ విభాగంలో అవార్డు అందించిన ‘సాక్షి’వారికి థ్యాంక్స్. వైఎస్ రాజశేఖర రెడ్డిగారు మా నాన్నకి చాలా క్లోజ్. మా ఆటోమొబైల్ బిజినెస్లో ఓ షాప్ ఓపెనింగ్ని రాజశేఖర రెడ్డిగారి చేతుల మీదుగా చేయించాలని మా నాన్న మూడు నెలలు వేచి ఉండి, ఆయన చేతుల మీదుగానేప్రారంభింపజేశారు. ఇప్పుడు మేం నిర్మించిన ‘బలగం’కి వాళ్ల సంస్థ (సాక్షి) నుంచి మాకు అవార్డు రావడం, అది కూడా మా ఫస్ట్ మూవీ కావడం హ్యాపీగా ఉంది. – నిర్మాత హర్షిత్ రెడ్డి‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్’ టెన్త్ ఎడిషన్లో అవార్డు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డు మాకో మధురమైన అనుభూతి. ‘బేబీ’ సక్సెస్కు కారణమైన నా స్నేహితుడు సాయి రాజేశ్కు మరోసారి కృతజ్ఞతలు. – నిర్మాత ఎస్కేఎన్ ‘సాక్షి ఎక్సలెన్స్’ అవార్డు తీసుకోవడం, పైగా బెస్ట్ క్రిటికల్లీ ఎక్లై్లమ్డ్ ఫిల్మ్కు తీసుకోవడం అనేది ఇంకా సంతోషం. – దర్శకుడు సాయి రాజేశ్2023 నా లైఫ్లో స్పెషల్ ఇయర్. మా ‘బేబీ’ ద్వారా మాకు చాలా లవ్, ఎంకరేజ్మెంట్ దొరికింది. ‘బేబీ’ సినిమా నా లైఫ్లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ‘బెస్ట్ డెబ్యూ యాక్ట్రస్’ అవార్డు ఇచ్చిన ‘సాక్షి’కి ధన్యవాదాలు. ఈ అవార్డు తీసుకోవడం చాలా ఎంకరేజింగ్గా, మోటివేటివింగ్గా ఉంది. – హీరోయిన్ వైష్ణవీ చైతన్య ‘బలగం’ వంటి ఒక మించి కథని నమ్మి నాకు అన్ని రకాలుగా సహకారం అందించి, నన్ను ముందుకు నడిపించిన ‘దిల్’ రాజు, హన్షిత, హర్షిత్, శిరీష్గార్లకు ధన్యవాదాలు. జీవితాంతం వీళ్లందరికీ రుణపడి ఉంటాను. జీవితాంతం గుర్తుంచుకునే మరపురాని అనుభూతిని ఇచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్... అలాగే వారికి జన్మజన్మలు రుణపడి ఉంటాను. మా ‘బలగం’ విజయం కానీ, ఏ అవార్డు అయినా కానీ మా యూనిట్ అందరికీ దక్కుతుంది. – దర్శకుడు వేణు యెల్దండినన్ను నమ్మిన నిర్మాత నాగవంశీగారికి ఈ అవార్డు (బెస్ట్ డెబ్యూ డైరెక్టర్)ని అంకితం ఇస్తున్నాను. అలాగే మా ‘మ్యాడ్’ ముగ్గురు హీరోలకి, నిర్మాత చినబాబుగారికి, ఎడిటర్ నవీన్ నూలిగార్లకు థ్యాంక్స్. ‘మ్యాడ్ 2’ కూడా రాబోతోంది. టీజర్ కూడా విడుదలైంది. ఈ చిత్రం కూడా తొలి భాగం అంత క్రేజీగా ఉంటుంది. దయచేసి అందరూ చూడండి. ఇది నా మొదటి అవార్డు.. చాలా ప్రత్యేకం. ‘సాక్షి’కి ప్రత్యేక కృతజ్ఞతలు. – డైరెక్టర్ కల్యాణ్ శంకర్ -
తెలుగు హీరో... హిందీ విలన్
తెలుగు తెరపై బాలీవుడ్ హీరోయిన్ల హవా ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. కానీ ఇప్పుడు బాలీవుడ్ నటులు కూడా తెలుగు సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే తెలుగు సినిమాల్లో ఎక్కువగా విలన్ రోల్స్ చేసేందుకే బాలీవుడ్ యాక్టర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఇలా తొలిసారిగా తెలుగు తెరపై విలన్గా కనిపించనున్న కొందరు బాలీవుడ్ యాక్టర్స్, వారు ఓకే చేసిన సినిమాలు వివరాలు ఇలా ఉన్నాయి.మల్టీ మిలియనీర్‘నీర్జా, పద్మావత్, సంజు, గంగుభాయి కతియావాడి’ వంటి చిత్రాలతో నటుడిగా బాలీవుడ్లో నిరూపించుకున్నారు జిమ్ సర్భ్. ఈ నటుడికి టాలీవుడ్ ఎంట్రీ చాన్స్ లభించింది. నాగార్జున–ధనుష్ హీరోలుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర’ అనే మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ మూవీలో ఓ మల్టీ మిలియనీర్ పాత్రను జిమ్ సర్భ్ చేస్తున్నారు.తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ పీరియాడికల్ ఫిల్మ్ను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి ఎస్వీసీఎల్ఎల్పీ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్ హైప్రొడక్షన్ వాల్యూస్తో నిర్మిస్తున్నారు. జూన్ 20న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాల్లో ధనుష్ భిక్షగాడిగా కనిపిస్తారని, ఓ ఆఫీసర్గా నాగార్జున, మల్టీ మిలియనీర్ పాత్రలో జిమ్ సర్భ్ కనిపిస్తారని తెలిసింది. ఓ బలమైన సామాజిక అంశం, డబ్బు ప్రధానాంశాలుగా ‘కుబేర’ కథనం సాగుతుందని సమాచారం.ఇటు ఓజీ... అటు జీ2‘మర్డర్, గ్యాంగ్స్టర్, ముంబై సాగ, టైగర్ 3, వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై’ వంటి పలు బాలీవుడ్ సినిమాల్లో నటించిన ఇమ్రాన్ హష్మి గురించి తెలుగు ఆడియన్స్కు తెలిసిందే. ఈ హీరో టాలీవుడ్ ఎంట్రీ ఇప్పుడు ఖరారైంది. ప్రజెంట్ రెండు తెలుగు సినిమాల్లో విలన్గా నటిస్తున్నారు ఇమ్రాన్ హష్మి. పవన్ కల్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలోని గ్యాంగ్స్టర్ ఫిల్మ్ ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్ – ప్రచారంలో ఉన్న టైటిల్)లో ఇమ్రాన్ హష్మీ ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. ఓమి భావ్ అనే పాత్రలో హష్మి కనిపించనున్నట్లుగా తెలిసింది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది.వీలైనంత తొందరగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసి, ఈ ఏడాదే రిలీజ్ చేయాలని చిత్రయూనిట్ ΄్లాన్ చేస్తోంది. మరోవైపు అడివి శేష్ ‘జీ 2’ (గూఢచారి 2) చిత్రంలోనూ ఇమ్రాన్ హష్మి ఓ లీడ్ రోల్లో నటిస్తున్నారు. అడివి శేష్ హీరోగా తెరకెక్కుతున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీలో బాలీవుడ్ నటి వామికా గబ్బి మరో లీడ్ రోల్లో నటిస్తున్నారు. కాగా ‘జీ 2’ సినిమా షూటింగ్లో ఆల్రెడీ ఇమ్రాన్ హష్మీ జాయిన్ అయ్యారు. గత ఏడాది అక్టోబరులో ‘జీ 2’ కోసం ఓ యాక్షన్ సీక్వెన్స్ను చిత్రీకరిస్తుండగా ఇమ్రాన్ గాయపడ్డారు. కానీ ఆ తర్వాత తిరిగి షూటింగ్లో పాల్గొన్నారు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వినయ్ కుమార్ సిరిగినీడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ఈ ఏడాదే రిలీజ్ కానుంది. కాగా అడివి శేష్ హీరోగా నటించిన సూపర్ హిట్ ఫిల్మ్ ‘గూఢచారి’కి సీక్వెల్గా ‘జీ 2’ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇలా ఒకేసారి రెండు తెలుగు సినిమాల్లో విలన్గా నటిస్తూ, డబుల్ విలన్గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఇమ్రాన్ హష్మి.ఇన్స్పెక్టర్ స్వామిఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ చిత్రం విజయ్ సేతుపతి ‘మహారాజా’, మలయాళ చిత్రం ‘రైఫిల్ క్లబ్’ వంటి చిత్రాల్లో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ నటన తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. దీంతో అనురాగ్ కశ్యప్ యాక్టర్గా తెలుగులో ఓ స్ట్రయిట్ ఫిల్మ్ చేస్తే బాగుంటుందని కొందరు తెలుగు ఆడియన్స్ ఆశపడ్డారు. వారి ఆశ నిజమైంది. అడివి శేష్ హీరోగా ‘డెకాయిట్: ఓ ప్రేమకథ’ అనే సినిమా రూపొందుతోంది.ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో ఏక కాలంలో రూపొందుతున్న ఈ సినిమాకు షానీల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ సినిమాలోని ఇన్స్పెక్టర్ స్వామి అనే కీలక పాత్రలో అనురాగ్ కశ్యప్ నటిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణలో ఆయన పాల్గొన్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నెక్ట్స్ షెడ్యూల్ చిత్రీకరణ మహారాష్ట్రలో ఉంటుందని తెలిసింది. కథ రీత్యా... ఇద్దరు ప్రేమికులు బ్రేకప్ చెప్పుకుంటారు. కొన్ని పరిస్థితుల కారణంగా వారికి ఇష్టం లేకపోయినా... వీరిద్దరూ కలిసి ఓ క్రైమ్ చేయాల్సి ఉంటుంది.ఈ క్రైమ్ను అడ్డుకోవాల్సిన బాధ్యత ఇన్స్పెక్టర్ స్వామిది. మరి... క్రిమినల్స్ అయిన ఈ ప్రేమికులను పోలీసాఫీసర్గా ఇన్స్పెక్టర్ స్వామి పట్టుకున్నాడా? అనేది ‘డెకాయిట్’ సినిమా చూసి తెలుసుకోవాలి. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రేమ, ద్రోహం, ప్రతీకారం, భావోద్వేగం వంటి అంశాల మేళవింపుతో రూపొందుతున్న ‘డెకాయిట్’ మూవీ ఈ ఏడాదే రిలీజ్ కానుంది. మరోవైపు నటుడిగానే కాదు... ‘పాంచ్, బాంబే టాకీస్, అగ్లీ, మ్యాడ్లీ, దో బార’ వంటి హిందీ చిత్రాలతో అనురాగ్ కశ్యప్ బాలీవుడ్లో దర్శకుడిగా పాపులర్ అన్న సంగతి తెలిసిందే. అలాగే నిర్మాతగానూ, రైటర్గానూ ఆయన రాణిస్తున్న విషయం కూడా విదితమే.అర్జున్కు విలన్గా...స్క్రీన్పై నందమూరి కల్యాణ్రామ్తో ఢీ అంటే ఢీ అంటున్నారు బాలీవుడ్ యాక్టర్ సోహైల్ ఖాన్. నందమూరి కల్యాణ్రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతోంది. సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి, సోహైల్ ఖాన్, శ్రీకాంత్, ‘యానిమల్’ పృథ్వీరాజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ మూవీలో ఐపీఎస్ ఆఫీసర్గా నటిస్తున్నారు విజయశాంతి. ఇక ఈ మూవీలో విలన్గా నటిస్తున్నారు సోహైల్ ఖాన్. ‘పార్ట్నర్, వీర్, దబాంగ్ 3’ వంటి చిత్రాల్లో నటుడిగా అభినందనలు అందుకున్న సోహైల్ ఖాన్కు తెలుగులో ఇదే తొలి చిత్రం కావడం విశేషం. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. టాకీ పార్టు పూర్తయింది. రామ్చరణ్కు విలన్గా...రామ్చరణ్కు విలన్గా కనిపించనున్నారు బాలీవుడ్ యంగ్ హీరో దివ్యేందు. హీరో రామ్చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్లో ఓ పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (ప్రచారంలో ఉన్న టైటిల్) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, జగపతిబాబు, శివరాజ్కుమార్, దివ్యేందు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ ఈ వారంలోప్రారంభం కానుందని తెలిసింది.కాగా ఈ మల్టీ స్పోర్ట్స్ (క్రికెట్, కుస్తీ తదితర క్రీడలు) డ్రామాలో దివ్యేందు ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆల్రెడీ దివ్యేందు ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. కాగా ఈ సినిమాలో రామ్చరణ్ పాత్రకు విలన్గా కనిపిస్తారట దివ్యేందు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కానుంది. మార్చి 27న రామ్చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టీజర్ రిలీజ్ కావొచ్చని, దీపావళికి ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉందనీ సమాచారం. మరోవైపు ‘ప్యార్కా పంచనామా, టాయిలెట్: ఏక్ ప్రేమకథ, ఓల్డ్ కపుల్’ వంటి బాలీవుడ్ చిత్రాల్లో నటుడిగా రాణించారు దివ్యేందు. కాగా ‘మిర్జాపూర్, సాల్ట్ సిటీ, ది రైల్వే మెన్’ వంటి వెబ్ సిరీస్లతో దివ్యేందు మరింత పాపులర్ అయ్యారు. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి వస్తున్నారు. కొందరు బాలీవుడ్ యాక్టర్స్ ఆల్రెడీ తెలుగులో బిజీ అయిపోయారు. బాలకృష్ణ హీరోగా చేసిన ‘భగవంత్ సింగ్ కేసరి’లో అర్జున్ రామ్పాల్, ‘డాకు మహారాజ్’లో బాబీ డియోల్ విలన్స్గా నటించారు. కాగా పవన్ కల్యాణ్ ‘హరిహరవీర మల్లు’ చిత్రంలో ఎంతో కీలకమైన ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ యాక్ట్ చేస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ ‘దేవర 2’ చిత్రంలోనూ బాబీ డియోల్ విలన్గా కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. గత ఏడాది విడుదలైన రామ్ ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీలో ఫుల్ లెంగ్త్ విలన్ రోల్ చేశారు సంజయ్ దత్. ఇప్పుడు ప్రభాస్ ‘రాజా సాబ్’, సాయిదుర్గా తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ చిత్రాల్లోనూ లీడ్ రోల్స్ చేస్తున్నట్లుగా తెలిసింది. అలాగే ప్రభాస్ ‘ఫౌజి’ చిత్రంలో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ లీడ్ యాక్టర్స్గా చేస్తున్నారు. నాగార్జున–నానీల ‘దేవదాసు’ (2018)లో విలన్గా యాక్ట్ చేసిన కునాల్ కపూర్ ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’లో మళ్లీ విలన్గా యాక్ట్ చేస్తున్నారని తెలిసింది. ప్రభాస్ ‘కల్కి’లో అమితాబ్ బచ్చన్ ఎంతటి బలమైన రోల్ చేశారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ‘కల్కి 2’లోనూ అమితాబ్ బచ్చన్ రోల్ కొనసాగుతుందని తెలిసిందే... ఇలా విలన్స్గా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా నటిస్తున్న బాలీవుడ్ యాక్టర్స్ మరికొందరు ఉన్నారు.– ముసిమి శివాంజనేయులు -
కల్యాణ్ రామ్.. అర్జున్ సన్నాఫ్ వైజయంతి
కల్యాణ్ రామ్ కొత్త మూవీకి టైటిల్ ఫిక్స్ చేశారు. గత కొన్నిరోజుల నుంచి అనుకుంటున్నట్లే ఓ పేరుని టైటిల్ గా అధికారికంగా ఇప్పుడు ప్రకటించారు. ఈ మేరకు క్రేజీ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఇందులో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు.'బింబిసార'తో హిట్ కొట్టిన కల్యాణ్ రామ్.. దీని తర్వాత రెండు ఫ్లాప్స్ చవిచూశాడు. దీంతో కాస్త గ్యాప్ తీసుకుని ఓ మూవీ చేస్తున్నాడు. ఇందులో విజయశాంతి కీలక పాత్ర పోషిస్తుండటంతో అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు వీళ్లిద్దరూ తల్లికొడుకులుగా నటిస్తున్నారని క్లారిటీ వచ్చింది. ఈ మేరకు 'అర్జున్ సన్నాఫ్ వైజయంతీ' అనే టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఎన్టీఆర్ లుక్ పై ఎందుకింత ట్రోలింగ్?)పోలీస్ డ్రస్సులో విజయశాంతి, పక్కనే కల్యాణ్ రామ్ నడుస్తున్నట్లు ఉన్న లుక్ ఆకట్టుకుంటోంది. 'ప్రతి స్త్రీ ఒక కొడుకును పెంచుకుంటుంది. వైజయంతి ఐపీఎస్ ఇక్కడ అర్జున్ అనే సైన్యాన్ని పోషిస్తోంది'' అని పేర్కొన్నారు. .గతంలోనూ విజయశాంతి.. వైజయంతి పేరుతో ఓ సినిమా చేశారు. అందులో ఆర్మీ ఆఫీసర్ కాగా.. ఇప్పుడు పోలీస్ గా నటిస్తున్నారు. ఇందులో కల్యాణ్ రామ్ సరసన సయీ మంజ్రేకర్ హీరోయిన్. ప్రదీప్ చిలుకూరి దర్శకుడు. త్వరలో రిలీజ్ వివరాలు వెల్లడిస్తారు.(ఇదీ చదవండి: 'రేఖాచిత్రం' సినిమా రివ్యూ (ఓటీటీ)) -
హీరోయిన్ 'మీటూ' కేసు కొట్టేసిన హైకోర్ట్
దాదాపు ఆరేడేళ్ల క్రితం మీటూ(#Me too) ఉద్యమం దేశవ్యాప్తంగా తీవ్రంగా నడిచింది. పలువురు హీరోయిన్లు, నటీమణలు.. తమకెదురైన లైంగిక వేధింపుల గురించి బయటపెట్టారు. మిగతా వాళ్ల సంగతేమో గానీ హీరోయిన్ తనుశ్రీ దత్తా- నానా పాటేకర్ వ్యవహారం మాత్రం హాట్ టాపిక్ అయిపోయింది. ఏం జరిగింది?హీరోయిన్ గా తనుశ్రీ దత్తాకు కాస్త గుర్తింపు ఉంది. తెలుగులోనూ బాలకృష్ణ 'వీరభద్ర' చిత్రంలో నటించింది. అసలు విషయానికొస్తే 2018లో ఈమె ప్రముఖ నటుడు నానా పాటేకర్ పై సంచలన ఆరోపణలు చేసింది. 2008లో 'హార్న్ ఓకే ప్లీజ్' సినిమా కోసం ఓ పాట షూట్ చేస్తున్న టైంలో నానా పాటేకర్ సహా మరో ముగ్గురు తనని వేధించారని తనుశ్రీ ఆరోపించింది.(ఇదీ చదవండి: రష్మికని హింసించకండి.. నటి రమ్య కౌంటర్)తనుశ్రీ బహిరంగంగానే ఈ కామెంట్స్ చేసింది. ఈ క్రమంలోనే పోలీసులు అప్పుడు కేసు కూడా నమోదు చేశారు. విచారణలో మాత్రం ఇలాంటిదేం జరగలేదని తేల్చారు. నటి ఆరోపణలన్నీ అవాస్తవాలని కోర్టుకి నివేదిక సమర్పించారు. దీనిపై 2019లో తనుశ్రీ దత్తా మరోసారి పిటిషన్ దాఖలు చేసింది. చాలా వాయిదాల తర్వాత ఇప్పుడు కేసుపై ముంబై హైకోర్టు తీర్పు ఇచ్చింది. చట్ట ప్రకారం మూడేళ్ల లోపు ఫిర్యాదు చేస్తేనే విచారణకు అర్హత ఉందని, పదేళ్ల నాటి ఘటనని విచారించడం కుదరదని న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. దీంతో నానా పాటేకర్ కి బిగ్ రిలీఫ్ దొరికిందని చెప్పొచ్చు. ప్రస్తుతం నానా పాటేకర్.. మహేశ్ బాబు-రాజమౌళి మూవీలో నటిస్తున్నారని సమాచారం.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 34 సినిమాలు)) -
కష్టాల్లో ఉన్నప్పుడు అమ్మ ఇంటికి రావొద్దంది: చిరంజీవి సోదరి
పిల్లలు ఇబ్బందుల్లో ఉంటే ఆ తల్లి అల్లాడిపోతుంది. అదే సమయంలో ఆ ఇబ్బందులను ఎలా ఎదుర్కోవాలో కూడా నేర్పుతుంది. చిరంజీవి తల్లి అంజనమ్మ తన కూతుర్లకు విలువైన సలహాలు ఇచ్చి వారిని బలంగా నిలబెట్టింది. ఏ కష్టం వచ్చినా సరే ఎవరి మీదా ఆధారపడకూడని, ఆధారపడితే నీ ఆత్మగౌరవాన్ని కోల్పోయినట్లేనని చెప్పేదట. మహిళా దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi Konidela), నాగబాబు, అంజనమ్మ, మెగా సిస్టర్స్ విజయ దుర్గా, మాధవి ముచ్చట్లు పెట్టారు. ఈ సందర్భంగా ఎన్నో విషయాల్ని పంచుకున్నారు.కష్టాల్లో ఉన్నా ఒంటరిగా పోరాడాలందివిజయదుర్గ (Vijaya Durga) మాట్లాడుతూ .. ‘మా అమ్మ ఎప్పుడూ కూడా మమ్మల్ని స్వతంత్ర భావాలతోనే పెంచారు. ఎప్పుడూ ఎవరి మీదా ఆధారపడకూడదు. నీ కాళ్ల మీద నువ్వు నిలబడాలి.. సొంతంగా ఎదగాలి.. సొంతంగా నిలబడాలి అని చెబుతూ ఉండేవారు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు కూడా నువ్వు ఒక్కదానివే పోరాడాలి. ఎవరి దగ్గరా ఉండకూడదు, మా దగ్గర కూడా ఉండొద్దు. నీ ఇద్దరు పిల్లలతో నువ్వే ఉండు అని చెప్పారు. ఎవరి దగ్గరైనా ఉంటే నీ గౌరవం తగ్గిపోతుందనేవారు.అమ్మ ఇచ్చిన ధైర్యం వల్లే..ఇప్పటికీ నాకు మా అమ్మ చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. ఆ మాటలు నాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తాయి. అందుకే నాకు ఎన్ని సమస్యలు వచ్చినా ఒంటరిగా పోరాడేందుకు ప్రయత్నిస్తాను. ఈ ధైర్యాన్ని నాకు మా అమ్మే ఇచ్చారు’ అని అన్నారు. మాధవి (Madhavi) మాట్లాడుతూ.. ‘నేను మానసిక ఒత్తిడిలో ఉన్నప్పుడు మా అమ్మ నాకు అండగా నిలబడింది. కొన్ని సందర్భాల్లో నేను ఒంటరిని అయిపోయానే అని బాధపడుతూ ఉన్నాను. ఆ టైంలో మా అమ్మ నా వద్దకు వచ్చి ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. ఎవ్వరు ఏమన్నా.. ఏం జరిగినా.. ఈ అమ్మ నీ వెంటే ఉంటుంది.. నీకు సపోర్ట్గా నిలుస్తుంది అని చేయి పట్టుకుని ధైర్యాన్ని ఇచ్చారు’ అని అన్నారు.శ్రీజ విషయంలో ఆమె వల్లే..చిరంజీవి మాట్లాడుతూ.. నా కూతురు శ్రీజ (వైవాహిక) జీవితంలో కొన్ని సమస్యలు వచ్చాయి. అప్పుడు శ్రీజ (Sreeja Konidela) ఏమందంటే.. నేను నానమ్మ దగ్గరకు వెళ్లాను. తనిచ్చిన భరోసాతో నాలో ఎక్కడలేని ఎనర్జీ వచ్చింది. నానమ్మతో ఎప్పుడు కూర్చున్నా పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది అని నాతో షేర్ చేసుకుంది. అప్పుడు నేను శ్రీజతో ఒకటే చెప్పా.. ఏం పర్లేదమ్మా.. జీవితమంటే ఒక్కరితోనే అయిపోదు. ఆ ఒక్కరు మనల్ని నియంత్రించలేరు. నీ గురించి నువ్వు ఆలోచించుకో.. నీ మనసులో ఏదనిపిస్తే అది చేయు అని సూచించాను అని పేర్కొన్నారు. కాగా శ్రీజ.. రెండుసార్లు పెళ్లి చేసుకోగా రెండుసార్లూ విడాకులిచ్చింది.చదవండి: కట్నంగా 40 గోల్డ్ బ్యాంగిల్స్ దానం.. నాకు 3 కిలోల బంగారం..: సింగర్ కల్పననా సోదరి మరణం.. ఇప్పటికీ మరిచిపోలేను: చిరంజీవి -
ఎన్టీఆర్ లుక్ పై ఎందుకింత ట్రోలింగ్?
'దేవర' తర్వాత ఎన్టీఆర్ రెండు సినిమాలు చేస్తున్నాడు. హిందీలో 'వార్ 2', ప్రశాంత్ నీల్ తో మరో మూవీతో బిజీగా ఉన్నాడు. తాజాగా తారక్ నటించిన ఓ డెలివరీ పోర్టర్ యాడ్ రిలీజైంది. అయితే అందులోని కంటెంట్ ఎంత రీచ్ అయ్యిందో లేదో తెలీదు గానీ తారక్ లుక్ గురించి ట్రోలింగ్స్ ఎక్కువయ్యాయి.ఈ మధ్య కాలంలో తారక్ సన్నబడినట్లు ఉన్నాడు. 'వార్ 2' కోసం డిఫరెంట్ లుక్ మెంటైన్ చేస్తున్నాడు. ఒకవేళ యాడ్ లోనూ అదే లుక్ తో ఉంటే కష్టం కాబట్టి క్రాఫ్ కాస్త మార్చినట్లున్నారు. అలా తారక్ డిఫరెంట్ గా కనిపించాడు. దీంతో అలా ఉన్నాడు ఇలా ఉన్నాడంటూ యాంటీ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: 'రేఖాచిత్రం' సినిమా రివ్యూ (ఓటీటీ))ఇలా కనిపించిన ప్రతి కంటెంట్ ని ట్రోల్ చేయడం సోషల్ మీడియాలో ఈ మధ్య బాగా పెరిగిపోయింది. ఆ హీరో ఈ హీరో అనేం లేదు. ప్రతిఒక్కరూ దీనిబారిన పడ్డవాళ్లే! ఇప్పుడు తారక్ నటించిన యాడ్ కి కూడా ఈ సెగ తగిలిందని చెప్పొచ్చు.ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే.. వార్ 2 ఆగస్టు 15న రాబోతుందని ఇదివరకే ప్రకటించారు. అందుకు తగ్గట్లే షూటింగ్ వేగంగా చేస్తున్నారు. త్వరలో ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ కి తారక్ హాజరవుతాడు. దీన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి ప్లాన్ చేశారు. కానీ రిలీజ్ చేస్తారా లేదా లేట్ అవుతుందా అనేది చూడాలి?(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 34 సినిమాలు)) -
అసత్య ప్రచారాలు.. మహిళా కమిషన్కు కల్పన ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: సింగర్ కల్పన (Kalpana Raghavendar) మహిళా కమిషన్ను ఆశ్రయించింది. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం అంటూ కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారదకు ఫిర్యాదు చేసింది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తన ప్రైవేట్ వీడియోలతో ట్రోల్ చేస్తున్నారని ఆరోపించింది. తనపై తప్పుడు ప్రచారం చేసినటువంటివారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. కల్పన ఫిర్యాదుపై నేరెళ్ళ శారద స్పందిస్తూ.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మహిళలపై అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై స్పెషల్ ఫోకస్ పెట్టామన్నారు. ఇష్టం వచ్చిన పోస్టులు పెడితే కఠిన చర్యలు ఉంటాయని ట్రోలర్స్ను హెచ్చరించారు.ఏం జరిగింది?సింగర్ కల్పన ఇటీవల తన ఇంట్లో అపస్మారకస్థితిలో కనిపించింది. ఆమె నిద్రమాతలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని తొలుత ప్రచారం జరిగింది. ఆస్పత్రిలో చికిత్స అనంతరం కోలుకున్న కల్పన.. తాను చనిపోవడానికి ప్రయత్నించలేదని, కేవలం మంచి నిద్ర కోసం నిద్రమాత్రలు వేసుకున్నానని తెలిపింది. అయితే మెడిసిన్ ఎక్కువ మోతాదులో తీసుకోవడంతో స్పృహ కోల్పోయినట్లు వివరించింది. తమ కుటుంబంలో ఎటువంటి విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చింది. 45 ఏళ్ల వయసులోనూ పీహెచ్డీ, ఎల్ఎల్బీ చేస్తున్నానని, అది భర్త సహకారంతోనే సాధ్యమైందని వివరించింది.చదవండి: అమ్మపై దాడి చేసి రూ.4.50 లక్షల బంగారం దోచేశారు.. నాకు 3 కిలోల బంగారం మిగిల్చింది: సింగర్ కుమారుడు -
ఉమెన్స్ డే స్పెషల్.. సమంత అలా నమ్రత ఇలా
వదిన-మరదలుతో మహేశ్ భార్య నమ్రతచీరలో చూడచక్కగా మెరిసిపోతున్న ఆషికా రంగనాథ్క్యూట్ అండ్ స్వీట్ వీడియోతో సామ్ పోజులుమొరాకోలో చిల్ అవుతున్న దృశ్యం పాప ఎస్తర్నీలం పట్టు చీరలో మెరిసిపోతున్న యాంకర్ విష్ణుప్రియఛార్టెడ్ ఫ్లైట్ లో పోజులతో చితక్కొట్టేసిన కరీనా కపూర్హరిద్వార్ లో భక్తిలో మునిగిపోయిన సుప్రీత View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Reba Monica John (@reba_john) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) View this post on Instagram A post shared by Shruti Sodhi (@aslishrutisodhi) View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) View this post on Instagram A post shared by Sakshi Agarwal (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Anshu (@actressanshuofficial) View this post on Instagram A post shared by Vani Bhojan (@vanibhojan_) View this post on Instagram A post shared by Manjima Mohan Gautham (@manjimamohan) View this post on Instagram A post shared by Aathmika 🦁 (@iamaathmika) View this post on Instagram A post shared by Sanya Malhotra (@sanyamalhotra_) View this post on Instagram A post shared by Esther (@_estheranil) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Amyra Dastur (@amyradastur) View this post on Instagram A post shared by Jacqueliene Fernandez (@jacquelienefernandez) View this post on Instagram A post shared by Meenakshi Dixit (@meenakshidixit) -
మాజీ ప్రేమికులు మళ్లీ కలిశారు..
మాజీ ప్రేమికులు మళ్లీ కలిశారు. బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ (Kareena Kapoor), హీరో షాహిద్ కపూర్ (Shahid Kapoor) రాజస్తాన్లోని జైపూర్లో జరుగుతున్న ఐఫా (ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ అవార్డ్స్) కార్యక్రమానికి వెళ్లారు. అక్కడ ఇద్దరూ ఒకరికొకరు తారసపడటంతో ఆత్మీయంగా హగ్ ఇచ్చుకుని పలకరించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన అభిమానులు ఇన్నాళ్లకు మీరిద్దరూ మెచ్యూర్డ్గా ప్రవర్తించారు. ఇలా మీ ఇద్దర్నీ చూస్తుంటే సంతోషంగా ఉంది అని కామెంట్లు చేస్తున్నారు.గతంలో ప్రేమజంటకాగా కరీనా, షాహిద్లు గతంలో ప్రేమించుకున్నారు. వీరిద్దరూ ఫిదా, చుప్ చుప్ కే, జబ్ వి మెట్ వంటి చిత్రాల్లో జంటగా నటించారు. ఆన్స్క్రీన్పైనే కాకుండా ఆఫ్ స్క్రీన్లోనూ జోడీగానే కనిపించేవారు. జబ్ వి మెట్ సినిమా షూటింగ్కు ముందు వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. దీంతో విడిపోక తప్పలేదు. అనంతరం కరీనా.. సైఫ్ అలీ ఖాన్ను పెళ్లి చేసుకోగా వీరికి ఇద్దరు కుమారులు సంతానం. షాహిద్ కపూర్.. మీరా రాజ్పుత్ను పెళ్లాడగా వీరికి ఓ కుమారుడు, కూతురు జన్మించారు. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) చదవండి: కట్నంగా 40 గోల్డ్ బ్యాంగిల్స్ దానం.. నాకు 3 కిలోల బంగారం..: సింగర్ కుమారుడు -
ఓటీటీలోకి వచ్చేసిన మిస్టరీ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్
భాష ఏదైనా సరే థ్రిల్లర్ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయా చిత్రాలని ఓటీటీలో రిలీజైన తర్వాత తెలుగు ప్రేక్షకులు చూసేస్తుంటారు. అలా రీసెంట్ గా మలయాళం నుంచి 'రేఖాచిత్రం' మూవీ స్ట్రీమింగ్ లోకి రాగా.. ఇప్పుడు తమిళ డబ్బింగ్ చిత్రం ఒకటి వచ్చేసింది.(ఇదీ చదవండి: 'రేఖాచిత్రం' సినిమా రివ్యూ (ఓటీటీ))సీనియర్ నటుడు శరత్ కుమార్ 150వ సినిమాగా తీసిన 'ద స్మైల్ మ్యాన్' గతేడాది డిసెంబరులో థియేటర్లలో రిలీజైంది. పేరున్న నటీనటులు పెద్దగా లేకపోవడంతో సరిగా ఆడలేదు. తర్వాత ఓటీటీలోకి వచ్చింది గానీ తమిళ వెర్షన్ మాత్రమే తీసుకొచ్చారు. తాజాగా ఆహా ఓటీటీలో తెలుగు వెర్షన్ రిలీజ్ చేశారు.'ద స్మైల్ మ్యాన్' విషయానికొస్తే.. శరత్ కుమార్ ఓ పోలీస్ ఆఫీసర్. అనుకోకుండా ప్రమాదానికి గురై అల్జీమర్స్ వ్యాధి బారిన పడతారు. జ్ఞాపకాలన్నీ ఏడాది గుర్తుంటాయని డాక్టర్స్ చెప్పడంతో తన పరిష్కరించిన కేసుల గురించి పుస్తకంగా రాస్తారు. ఇందులో స్మైల్ మ్యాన్ కేసు గురించి మాత్రం సగమే రాస్తారు? ఇంతకీ స్మైల్ మ్యాన్ ఎవడు? ఎందుకు హత్యలు చేస్తున్నాడనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 34 సినిమాలు)) -
కట్నంగా 40 గోల్డ్ బ్యాంగిల్స్ దానం.. నాకు 3 కిలోల బంగారం..: సింగర్ కుమారుడు
కొత్త పెళ్లికూతురా రారా.., ఓహో బావా.. మార్చుకో నీ వంకరటింకర దోవ.., కాశీకి పోయాను రామా హరి.. వంటి ఎన్నో హిట్ సాంగ్స్ ఆలపించింది లెజెండరీ సింగర్ స్వర్ణలత (Singer Swarnalatha). తెలుగు సినిమా స్వర్ణయుగ కాలంలో ఎన్నో హాస్య గీతాలు ఆలపించింది. ఎనిమిది భాషల్లో పాటలు పాడిన ఆమె దాదాపు 30 చిత్రాల్లో నటించింది కూడా! ఈమె పుట్టుక, చావు ఒకే రోజు జరిగాయి. ఆమె పెద్ద కుమారుడు ఆనంద్ రాజ్ తెలుగు, తమిళ చిత్రాల్లో విలన్గా ఎన్నో సినిమాల్లో నటించాడు. చిన్న కుమారుడు అనిల్రాజు పలు సినిమాల్లో డ్యాన్స్మాస్టర్గా పని చేశాడు. మరో ఏడుగురు సంతానం డాక్టర్స్ అయ్యారు.ఏడేళ్లకే గాయనితాజాగా అనిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో తల్లి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఆయన మాట్లాడుతూ.. అమ్మ ఏడు సంవత్సరాల వయసులోనే గాయని అయింది. తన అసలు పేరు మహాలక్ష్మి. రేడియోలో అమ్మ గాత్రం విని డైరెక్టర్ బాలచందర్ తనకు తొలి అవకాశం ఇచ్చాడు. అలా సినిమాల్లోకి వచ్చింది. మా అమ్మగారికి తొమ్మిదిమంది సంతానమవగా పదిమంది కుక్కల్ని పెంచుకునేది. ఓసారి అమ్మ ముస్లింకుటుంబ వివాహానికి వెళ్లింది. కట్నం ఇవ్వలేదని వరుడు పెళ్లే వద్దనడంతో అమ్మ తన చేతికున్న 40 బంగారు గాజుల్ని ఇచ్చి ఆ పెళ్లి చేసింది. ఆ మాటలు బాధించేవిఅయితే అన్నల పెళ్లిళ్లయ్యేసరికి కొన్ని సమస్యలు వచ్చిపడ్డాయి. మా వదిన.. అమ్మను వృద్ధాశ్రమంలో వదిలేద్దామనేది. అవి అమ్మ మనసును బాధించేవి. అమ్మ ఎప్పుడూ బంగారు ఆభరణాలు ధరించేది. 1972లో సినిమా ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చేసి భక్తిగీతాలు పాడేది. అలా 1997న మార్చి 5న నేను, అమ్మ చెన్నై నుంచి హైదరాబాద్కు వస్తున్నాం. అప్పుడు అమ్మ ఒంటిమీద రూ.4.50 లక్షల విలువైన బంగారం ఉంది. చిన్నవంగల్ అనే గ్రామానికి రాగానే గుర్తు తెలియని దుండగులు మా కారును ఆపేశారు.3 కిలోల బంగారండ్రైవర్ను, నన్ను, అమ్మను కొట్టారు. ఐదురోజులవరకు అమ్మ ఆస్పత్రిలో పోరాడుతూ మార్చి 10న తుదిశ్వాస విడిచింది. అమ్మ నివసించిన ఇంటిని అమ్మేయగా రూ.100 కోట్లు వచ్చాయి. దాన్ని తొమ్మిది మంది పంచుకున్నాం. అందులో రూ.3 కోట్లతో తన జీవితకథపై సినిమా తీస్తున్నాం. అమ్మ వెళ్లిపోతూ నాకు 3 కిలోల బంగారం ఇచ్చింది. తన 500 పట్టుచీరలు ఇప్పటికీ నాదగ్గరే ఉన్నాయి. కొన్ని చీరల్లో బంగారంతో తయారు చేసినవి.నేను హిజ్రా..నాకు 16 ఏళ్ల వయసు రాగానే నాలో ఆడలక్షణాలు ఎక్కువయ్యాయి. ఇంట్లో నుంచి ముంబైకి వెళ్లిపోయాను. మా అమ్మకు విషయం అర్థమై.. నువ్వు చీర కట్టుకో, ప్యాంటు షర్ట్ వేసుకో.. ఎలాగైనా ఉండు, కానీ నేను చనిపోయేవరకు నా దగ్గరే ఉండు అంది. మా అన్నకేమో నేను హిజ్రాలా ఉంటే నచ్చేది కాదు. చాలా ఏండ్లు కాటుక, లిప్స్టిక్ పెట్టుకుని చీర కట్టుకుంటూ ఉండేవాడిని. అన్నదమ్ములెవరూ నాతో మాట్లాడేవారు కాదు. ఇప్పుడు నాలో హిజ్రా లక్షణాలు తగ్గిపోయాయి అని చెప్పుకొచ్చాడు.చదవండి: ‘ఛావా’ తెలుగు వెర్షన్కి ఊహించని ఓపెనింగ్స్! -
రష్మికని హింసించకండి.. నటి రమ్య కౌంటర్
రష్మిక ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్. భాషతో సంబంధం లేకుండా మూవీస్ చేస్తూ దూసుకుపోతోంది. కానీ ఈమెపై సొంత రాష్ట్రం కర్ణాటకలోనే తీవ్రమైన ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. మొన్నటిమొన్న కాంగ్రెస్ నాయకుడు కూడా రష్మికపై నోరు పారేసుకున్నాడు. ఈ క్రమంలోనే రష్మికపై జరుగుతున్న ట్రోలింగ్ పై కన్నడ నటి రమ్య స్పందించింది. విమర్శకులకు కౌంటర్ ఇచ్చింది.(ఇదీ చదవండి: చివరి కోరిక తీరకుండానే చనిపోయిన ఎన్టీఆర్ అభిమాని)నటి-రాజకీయ నాయకురాలిగా దక్షిణాది ప్రజలకు పరిచయమున్న నటి రమ్య.. తెలుగులోనూ ఓ సినిమాలో నటించింది. కానీ అది ఫ్లాప్ కావడంతో పూర్తిగా కన్నడకే పరిమితమైంది. తాజాగా బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మాట్లాడుతూ రష్మికకు అండగా నిలిచింది.'రష్మిక లాంటి నటీమణుల్ని ట్రోల్స్ ద్వారా అవమానించడం దయచేసి ఆపండి. ఇది అమానవీయం. ఆడపిల్లలు మెత్తగా ఉంటారు. ఏమన్నా సే తిరిగి మాట్లాడరు కాబట్టి ఇలా హింసించడం తగదు. ఇప్పుడు సినిమా అనే కాదు అన్ని రంగాల్లోనూ మహిళలకు అన్యాయం జరుగుతోంది. దీనికి వ్యతిరేకంగా మనమందరం ఐక్యం కావాలి' అని నటి రమ్య చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: 'రేఖాచిత్రం' సినిమా రివ్యూ (ఓటీటీ))కెరీర్ ప్రారంభంలో రష్మిక పలు కన్నడ సినిమాలు చేసింది. ఎప్పుడైతే ఫేమ్ వచ్చిందో అప్పటినుంతి తెలుగు, హిందీ, తమిళ మూవీస్ మాత్రమే చేస్తోంది. మొన్నీమధ్య తనది హైదరాబాద్ అని చెప్పడం కన్నడ ప్రేక్షకులకు ఆగ్రహం తెప్పించింది. దీంతో అదేపనిగా ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రమ్య, రష్మికకు అండగా నిలిచింది.రమ్య తెలుగులో కళ్యాణ్ రామ్ అభిమన్యు చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆమె తెలుగులో నటించిన ఒకే ఒక చిత్రం అదే. ఆ మూవీ పరాజయం చెందడంతో మళ్ళీ తెలుగులో రమ్య కనిపించలేదు. రష్మిక విషయానికొస్తే కొన్నిరోజుల క్రితం 'పుష్ప 2', తాజాగా 'ఛావా'తో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టింది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 34 సినిమాలు)) -
SVSC Re-Release: థియేటర్స్లో అమ్మాయిల డ్యాన్స్.. వీడియో వైరల్
మహేశ్ బాబు, వెంకటేశ్ పెద్దోడు, చిన్నోడు పాత్రల్లో నటించిన చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. 2013లో రిలీజైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమా దర్శకుడు. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఈ సినిమాను మళ్లీ రిలీజ్ చేశాడు నిర్మాత దిల్ రాజు. మార్చి 7న రీరిలీజైన ఈ చిత్రానికి మహేశ్, వెంకీల ఫ్యాన్స్ బ్రహ్మరథం పట్టారు. విజయవాడలోని ఓ థియేటర్లో ఈ సినిమాలోని పెళ్లి సీన్ను రీ క్రియేట్ చేశారు. అలాగే పలు చోట్ల ఈ సినిమాలోని ‘ఆరడుగులుంటాడా’ పాటకి అమ్మాయిలు రెచ్చిపోయి చిందులేశారు. థియేటర్స్లో ఆ పాట రాగానే సమంత వేసే స్టెప్పులను అమ్మాయిలు అదే విధంగా అచ్చదించేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అలాగే మహేశ్ తెరపై కనిపించిన ప్రతిసారి ఫ్యాన్స్ ఈలలు వేశారు. పూల కుండి సీన్ని కూడా థియేటర్స్లో రీక్రియేట్ చేసి సెలెబ్రేట్ చేసుకున్నారు. Her dance 🔥#SVSCReRelease pic.twitter.com/Fb4AxT9rGB— Sun 🌞 Deep 🪔 (@sandyp_tweets) March 8, 2025TFI Banisalu In USA ♥️🔥 pic.twitter.com/IYrqdH0nRH— Naveen MB Vizag (@NaveenMBVizag) March 8, 2025All Theaters Controlled Under Lady DHFM's✅🔥 pic.twitter.com/mIts8H8O94— Naveen MB Vizag (@NaveenMBVizag) March 7, 2025Perfect Sync ✅ pic.twitter.com/cshwSWZHrp— Naveen MB Vizag (@NaveenMBVizag) March 8, 2025Perfect On & Off Screen Steps By Lady DHFM🤩🔥 pic.twitter.com/y6he1jFton— Naveen MB Vizag (@NaveenMBVizag) March 7, 2025Poola Kundi Recreation!😂🔥 pic.twitter.com/QkKfNV6cSI— Naveen MB Vizag (@NaveenMBVizag) March 8, 2025Age Is Just A Number!Family Audiences Shows Love Towards @urstrulyMahesh ♥️🔥 pic.twitter.com/rIzDHLMLdH— Naveen MB Vizag (@NaveenMBVizag) March 7, 2025 -
నేను కూడా అమ్మవారి భక్తుడిని : ఆకాశ్ పూరి
బిగ్ బాస్ ఫేమ్ అర్చన, మితాలి చౌహాన్, వినోద్ అల్వా, కలకేయ ప్రభాకర్, బాలగం సంజయ్, నాగ మహేష్ ముఖ్య పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘కర్మస్థలం’. రాకీ షెర్మన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాయ్ ఫిల్మ్స్ బ్యానర్పై శ్రీనివాస్ సుబ్రహ్మణ్య నిర్మించారు. తాజాగా ఈ చిత్రం మోషన్ పోస్టర్ని హీరో ఆకాష్ పూరి రిలీజ్ చేశారు. ముఖ్య అతిధులుగా ఆకాష్ పూరితో పాటు మరో హీరో విజయ్ శంకర్ పాల్గొన్నారుఈ కార్యక్రమంలో ఆకాష్ పూరి మాట్లాడుతూ..."కర్మస్థలం" అనే టైటిల్ చాలా చాలా బాగుంది.మోషన్ పోస్టర్ కూడా బాగుంది.చెప్పాలంటే నేను కూడా అమ్మవారి భక్తుడిని.ఇలా అమ్మవారి గురించి సినిమా రావడం సువర్ ఎక్ససైటింగ్.ఈ మధ్య హనుమాన్, కార్తికేయ,కాంతారా ఇలాంటి సినిమాలని ఆడియన్స్ బాగా సపోర్ట్ చేస్తున్నారు. బాగున్న సినిమాలను మన తెలుగు ఆడియన్స్ ఎపుడు ముందుండి ముందుకి తీసుకెళ్తారు.ఈ సినిమాని ని కూడా ముందుకు తీసుకెళ్తారు.ప్రొడ్యూసర్ గారికి హాట్స్ ఆఫ్ ఇలాంటి యంగ్ డైరెక్టర్స్ కి ఛాన్స్ ఇచ్చినందుకు.నేను కర్మ ని నమ్ముతాను. మనం మంచి చేస్తే మంచి జరుగుతుంది అలానే చెడు చేస్తే చేడు జరుగుతుంది అని నమ్ముతాను.ఇలాంటి కథ చేయాలి అని నాకు ఉంది’అన్నారు.విజయ్ శంకర్ మాట్లాడుతూ..మూవీ తీయడం ఎంత ముఖ్యమో పది మందికి తెలిసేలా చేయడం కూడా అంతే ముఖ్యం. మన టాలీవుడ్ లో మూవీస్ బాగా చేస్తున్నారు కానీ ప్రమోషన్స్ టైం లో డ్రాప్ అయిపోతున్నారు. ఈ మూవీ కి ఆలా కాకుండా ప్రమోషన్స్ మీద టైం పెట్టండి మంచి బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుంటారు. మిలో ఆ కసి కనిపించింది.మన టాలీవుడ్ లో చాలా మంది మంచి డైరెక్టర్స్ వున్నారు, వాళ్లకి కానీ మంచి ప్రోడుసెర్స్ దొరికితేయ్ రాజమౌళి, సుకుమార్ గారి లాగ సక్సెస్ అవుతారు.ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నారు.రాకీ డెబ్యూ డైరెక్టర్ అయినప్పటికీ విజువల్స్ పరంగా చూస్తే ఒక పెద్ద సినిమా లాగ చేసారు.చిన్న గా స్టార్ట్ అయ్యి ఇంత పెద్ద ప్రాజెక్ట్ గా తీర్చి దిద్దారు.ఒక సీక్రెట్ ఏంటి అంటే ఇందులో రాకీ గారు కూడా ఒక మంచి రోల్ చేసారు, డైరెక్షన్ చేస్తూ కూడా.ఇపుడే స్టార్ట్ చేసాం ఇంకా చాలా కంటెంట్ వుంది. అందరికి ఈ సినిమా నచుతుంది అని నమ్ముతున్నాను. చాలా థాంక్స్. అన్నారు.మనం సాధారణంగా ఎలాంటి పండగ వచ్చిన ఎంజాయ్ చేస్తూ ఉంటాం. దాని వెనకాల ఒక హిస్టరీ, వార్ ఇలా చాలా ఉన్నాయి.ఇందులో ఒక మంచి లైన్ చెప్పాను అదే మహిసాసుర మర్ధిని.సినిమా అందరికి నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అని డైరెక్టర్ రాకీ అన్నారు. -
హీరో ముద్దుపెడితే మరొకరితో పెళ్లి.. ఫన్నీగా ట్రైలర్
'పుష్ప 2'లో ఐటమ్ సాంగ్ ఉంది కదా! ఇప్పుడు ఆ లిరిక్స్ తోనే తెలుగులో ఓ సినిమా రిలీజ్ కాబోతుంది. 'కిస్ కిస్ కిస్సిక్' టైటిల్ తో ఉన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ మార్చి 21న థియేటర్లలోకి తీసుకొస్తున్నారు.(ఇదీ చదవండి: చివరి కోరిక తీరకుండానే చనిపోయిన ఎన్టీఆర్ అభిమాని)మార్చి 1న హిందీలో 'పింటూ కీ పప్పీ' పేరుతో సినిమా రిలీజైంది. ఇప్పుడు దాన్ని పేరు మార్చి, దక్షిణాది భాషల్ల విడుదల చేస్తున్నారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేయగా ఫన్నీగా ఉంది. హీరో ఎవరికి ముద్దుపెడితే.. ఆ అమ్మాయిలకు మరొకరితో వెంటనే పెళ్లి అయిపోయింది. ఈ క్రమంలోనే హీరో.. తన ముద్దు పవర్ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. చివరకు ఏమైందనేదే స్టోరీలా అనిపిస్తుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య ఇందులో అతిథి పాత్రలో నటించాడు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 34 సినిమాలు)) -
చివరి కోరిక తీరకుండానే చనిపోయిన ఎన్టీఆర్ అభిమాని
ఎన్టీఆర్ వీరాభిమాని చనిపోయాడు. గత కొంతకాలంగా క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతున్న కౌశిక్ అనే కుర్రాడు.. గతేడాది 'దేవర' రిలీజ్ సందర్భంగా మీడియా ముందుకొచ్చాడు. ఇతడి తల్లి అభ్యర్థన మేరకు స్వయంగా ఎన్టీఆర్ వీడియో కాల్ కూడా మాట్లాడాడు. ఇప్పుడు ఆ అభిమాని ఇంట్లో విషాదం నెలకొంది.(ఇదీ చదవండి: నా సోదరి మరణం.. ఇప్పటికీ మరిచిపోలేను: చిరంజీవి)తిరుపతికి చెందిన కౌశిక్.. జూ.ఎన్టీఆర్ కి వీరాభిమాని. డిగ్రీ చదువుతున్నప్పుడు ఓసారి జ్వరం రావడంతో పలు ఆస్పత్రుల్లో చూపించగా క్యాన్సర్ ఉందని వైద్యులు ధ్రువీకరించారు. దీంతో చివరగా తన అభిమాన హీరో నటించిన 'దేవర' చూసేంతవరకు బ్రతకాలనుకుంటున్నట్లు చెప్పాడు. ఈ క్రమంలోనే కౌశిక్ వీడియో.. పలువురు అభిమానుల ద్వారా ఎన్టీఆర్ వరకు వెళ్లింది. అలా గతేడాది 'దేవర' విడుదలకు ముందు స్వయంగా ఎన్టీఆర్.. కౌశిక్ తో వీడియో కాల్ మాట్లాడాడు. వైద్యానికి కావాల్సిన సాయం చేస్తానని మాట కూడా ఇచ్చాడు. తర్వాత కౌశిక్ వైద్యం కోసం టీటీడీ రూ40 లక్షలు, ప్రభుత్వం రూ.11 లక్షలు, తారక్ అభిమానులు రూ. 10 లక్షలు విరాళంగా ఇచ్చినట్లు అప్పట్లోనే వార్తలొచ్చాయి.(ఇదీ చదవండి: 'రేఖాచిత్రం' సినిమా రివ్యూ (ఓటీటీ))ఇది జరిగిన కొన్నాళ్లకు అంటే డిసెంబరులో అలా కౌశిక్ తల్లి ప్రెస్ మీట్ పెట్టి తమకు ఎన్టీఆర్ ఏం సాయం చేయలేదని చెప్పారు. దీంతో తారక్ ఫ్యాన్స్ వెళ్లి ఆమెతో మాట్లాడించి క్లారిటీ ఇవ్వడం లాంటివి జరిగాయి.అలా కాస్తోకూస్తో వార్తల్లో నిలిచిన కౌశిక్ కొన్నాళ్ల క్రితమే ఆస్పత్రి నుంచి కూడా డిశ్చార్జ్ అయిపోయాడు. ఇప్పుడు అతడు అనారోగ్యంతో చనిపోయాడు. తారక్ తో వీడియో కాల్ అయితే మాట్లాడాడు కానీ కలవడం అనే చివరి కోరిక తీరకుండానే తుదిశ్వాస విడిచాడని తోటి ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 34 సినిమాలు)) -
తెలుగులో ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ బ్యూటీ
బాలీవుడ్ హీరోయిన్లు టాలీవుడ్పై మనసు పారేసుకున్నారు. వరుసగా స్టార్ హీరోయిన్లు తెలుగు సినిమాల్లో నటిస్తున్నారు. కల్కి 2989 ఏడీ సినిమాతో దీపికా పదుకొణె, దేవరతో జాన్వీ కపూర్, లైగర్తో అనన్య పాండే.. ఇలా అక్కడి బ్యూటీలందరూ తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. తాజాగా సోనాక్షి సిన్హ (Sonakshi Sinha) సైతం టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. మహిళా దినోత్సవం సందర్భంగా..సుధీర్బాబు హీరోగా నటిస్తున్న జటాధర సినిమా (Jatadhara Movie)లో ముఖ్య పాత్రలో నటిస్తోంది. నేడు (మార్చి 8న) మహిళా దినోత్సవం సందర్భంగా జటాధర చిత్రబృందం సోనాక్షి ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశారు. అందులో ఈ బ్యూటీ కళ్లకు కాటుక, చిందరవందరగా ఉన్న జుట్టుతో ఆగ్రహంగా కనిపిస్తోంది. ఈ సినిమా ఫిబ్రవరి 14న లాంఛనంగా ప్రారంభమైంది. సుధీర్బాబు హీరోగా నటిస్తున్న ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీకి వెంకట్ కళ్యాణ్ దర్శకత్వం వహిస్తున్నాడు.అనంత పద్మనాభస్వామి ఆలయం నేపథ్యంలో..ప్రేరణ అరోరా సమర్పణలో సుధీర్బాబు ప్రొడక్షన్ బ్యానర్పై శివివన్ నారంగ్, నిఖిల్ నంద, ఉజ్వల్ ఆనంద్ నిర్మిస్తున్నారు. జటాధర సినిమా కథ అనంత పద్మనాభస్వామి ఆలయం చుట్టూ తిరుగుతుంది. అక్కడి సంపద, దాని చుట్టూ అల్లుకున్న వివాదాలు, నేపథ్యం, చరిత్ర ఇలా అనేక అంశాలను చూపించనున్నారు. అక్కడి నిధిని మాత్రమే కాకుండా ఆలయ చరిత్ర, పురాణ కథల్ని కూడా చూపించబోతోన్నారు. ఈ సినిమా కోసం బాడీని పెంచే పనిలో ఉన్న సుధీర్బాబు అందుకోసం ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటున్నాడు. View this post on Instagram A post shared by Zee Studios (@zeestudiosofficial) చదవండి: అది కూడా తప్పేనా? నాకు స్టార్గా ఉండాలని లేదు: అక్షయ్ కుమార్ -
ఉమెన్స్ డే ఎందుకు.. శ్రృతీహాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు
కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రుతీహాసన్(Shruti Haasan )..తనదైన నటనతో తక్కువ సమయంలోని స్టార్ హీరోయిన్గా ఎదిగింది. కోలీవుడ్తో పాటు టాలీవుడ్ స్టార్ హీరోలందరితోనూ కలిసి సినిమాలు చేసింది. చివరిగా సలార్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. కోలీవుడ్ టు బాలీవుడ్.. అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తున్నప్పటికీ శ్రుతీ హాసన్పై పెద్దగా పుకార్లేవి రాలేదు. ఏ విషయంలో అయినా ఆమె నిక్కచ్చిగా ఉండమే దానికి కారణం. ఏ అంశంపై అయినా తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేస్తుంటారు. తాజాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవంపై కూడా శ్రుతీ తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ..అసలు ఉమెన్స్ డేని జరుపుకోవడం దేనికని ప్రశ్నించింది. మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రుతీ మాట్లాడుతూ.. ‘మేల్ డే అనేది లేనప్పడు ప్రత్యేకంగా ‘ఉమెన్స్ డే’ ఎందుకు ? అంటే ఇంకా స్త్రీ వెనకబడి ఉందని చెప్పడానికే ఈ స్పెషల్ డేస్ జరుపుకుంటున్నారా? అలాగే ఉమెన్ ఓరియెంటెడ్’ సినిమా అంటారు. ‘మేల్ ఓరియెంటెడ్’ మూవీ అనరు. ముందు ఈ తేడా పోవాలి. మహిళా దినోత్సవం అనేది ప్రత్యేకంగా లేని రోజు ఉమెన్ ఎదిగినట్లు లెక్క’అని తనదైన శైలీలో చెప్పుకొచ్చింది. -
నా జీవితంపై వెబ్ సిరీస్.. ఎన్నో అవమానాలు, బెదిరింపులు.. నటి కన్నీళ్లు
నటి సోనా (Sona Heiden).. ఒకప్పుడు గ్లామరస్, బోల్డ్ పాత్రల్లోనే ఎక్కువగా కనిపించింది. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా ఇండస్ట్రీలో నటిగా రాణిస్తున్న ఆమె తన జీవితంపై ఓ వెబ్ సిరీస్ తెరకెక్కిస్తోంది. ఆ బయోగ్రఫీ సిరీస్ పేరు స్మోక్. సోనా డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ ఓటీటీ ప్లాట్ఫామ్ షార్ట్ బ్లిస్లో రిలీజ్ కానుంది. ఇందులో ముకేశ్ ఖన్నా, ఆస్త అబే, ఇలవరసు, జీవా రవి ప్రధాన పాత్రల్లో నటించారు.ఈ సిరీస్ గురించి సోనా మాట్లాడుతూ.. 'స్మోక్ తెరకెక్కించే క్రమంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఎంతోమంది ఈ సిరీస్ను వ్యతిరేకించారు. కొందరు ఈ ప్రాజెక్ట్ను ఆపేయమని బెదిరించారు. మరికొందరు అవమానించారు. ఆర్థికంగానూ మోసపోయాను.. అన్ని ఇబ్బందులను ఎదుర్కొని ఒంటరిగా సిరీస్ పూర్తి చేశాను' అని చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంది. గ్లామర్ పాత్రలకు నో'ఎవరిపైనో ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ సిరీస్ తెరకెక్కించలేదు. గ్లామర్ నటి అన్న ఇమేజ్ నుంచి బయటకు వచ్చి ఒక డైరెక్టర్గా నిరూపించుకోవాలనుకున్నాను. ఇకమీదట గ్లామర్ పాత్రలు చేయాలనుకోవడం లేదు. ప్రాధాన్యమున్న పాత్రలే చేస్తాను' అని చెప్పుకొచ్చింది. స్మోక్ వెబ్ సిరీస్ 8 ఎపిసోడ్లుగా తెరకెక్కింది. ప్రతి ఎపిసోడ్ నిడివి 30 నిమిషాలు ఉంటుంది. 2010 నుంచి 2015 మధ్యకాలంలో సోనా జీవితంలో జరిగిన సంఘటలను సిరీస్లో చూపించనున్నారు. అలాగే స్మోక్కు కొనసాగింపుగా సెకండ్ సీజన్ కూడా ఉంటుందని సోనా పేర్కొంది.ఎవరీ సోనా?కుసెలన్ మూవీలో వడివేలు భార్యగా సోనా గుర్తింపు తెచ్చుకుంది. గురు ఎన్ ఆలు, అళగర్ మలై, ఒంబాధులే గురు వంటి తమిళ చిత్రాలతో పాపులర్ అయిన ఆమె మలయాళంలోనూ సినిమాలు చేసింది. తెలుగులో ఆయుధం, విలన్, ఆంధ్రావాలా, కథానాయకుడు, -
ఉమ్మడి కుటుంబంగా ఎందుకు ఉండాలంటే: చిరంజీవి
టాలీవుడ్లో ఎక్కువగా వినిపించే పదం 'మెగా బ్రదర్స్'.. దీనంతటికి కారణం వారందరూ కలిసి సినిమా రంగంలో రాణించడమే.. ఆపై చిరంజీవి మాటకు తన కుటుంబ సభ్యులు ప్రాధాన్యత ఇస్తారని చెబుతుంటారు. ఇప్పటికే వారి కుటుంబంలో చిరంజీవి హిట్లర్ సినిమాలో మెగాస్టార్లా ఉంటారని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతుంటాయి. అయితే, వారందరూ అలా కలిసి ఉండటానికి కారణాలు ఎంటి అనేది చిరు తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.మెగాస్టార్ చిరంజీవి ఉమ్మడి కుటుంబం గురించి ఇలా చెప్పారు.. ‘ఉమ్మడి కుటుంబం, ప్రేమ, ఆప్యాయత, ఈ విలువలు అన్నీ కూడా తమకు అమ్మానాన్నల నుంచే సంక్రమించాయి. మా నాన్నకు చాలీ చాలని జీతం వచ్చినా కూడా.. ఆ డబ్బుతోనే మా కుటుంబాన్ని పోషించారు. అమ్మ తరుఫున ఉండే ఫ్యామిలీని కూడా చూసుకున్నారు. అమ్మ కూడా మా నాన్నకు సంబంధించిన ఫ్యామిలీని ఎంతో చక్కగా చూసుకునేవారు. అలా అప్పటి నుంచే మాకు ఉమ్మడి కుటుంబం, బంధాలు, ఆప్యాయతలు, ప్రేమలు అనేవి తెలిసి వచ్చాయి. అందుకే మేం ఇప్పటికీ కలిసి కట్టుగా ఉంటాం. మేం ప్రేమ, ఆప్యాయతలు, బంధాల విషయంలో అందరి కంటే ధనికులం. ఒక్కో సారి డబ్బు అన్ని సమస్యల్ని తీర్చలేకపోవచ్చు. కానీ ఓ భుజం తోడుగా ఉంటే వచ్చే ధైర్యం, భరోసా వేరేలా ఉంటుంది. మా కుటుంబంలో ఏ ఒక్కరికి కష్టం వచ్చినా.. మిగిలిన వారంతా వచ్చి కాపాడుకుంటాం. ఎప్పుడూ అందరూ కలిసి మెలిసి ఉండాలి, ప్రేమతో ఉండాలి అనే మా అమ్మ చిన్నతనం నుంచి నేర్పారు. మా అమ్మ చుట్టూ ఎప్పుడూ ఓ పాజిటివిటీ ఉంటుంది. ఎవరికైనా సరే మా ఫ్యామిలీలో ఏ కష్టం వచ్చినా, కాస్త బాధల్లో ఉన్నా కూడా అమ్మే అందరికీ ధైర్యాన్ని ఇస్తారు. అందరికీ నైతికంగా భరోసానిస్తారు. చిన్నప్పుడు నేను ఎక్కువగా అమ్మతో పాటే ఉండేవాడిని. అమ్మకు సాయంగా అన్ని పనుల్లో తోడుండేవాడిని. నాగబాబు అసలు ఇంట్లో పనులు చేసే వాడు కాదు. ఇక కళ్యాణ్ బాబు అంటే అమ్మకి కాస్త ఎక్కువ ఇష్టం. నా నిర్ణయానికి అమ్మానాన్నలు ఎంతో గౌరవాన్ని ఇస్తుండేవారు. ఏ నిర్ణయం తీసుకున్నా కాస్త జాగ్రత్తగా ఆలోచించి తీసుకో అని మాత్రమే చెప్పేవారు. అలా పిల్లలకు తల్లిదండ్రులు స్వేచ్చ ఇవ్వడం చాలా ప్రధానం. మా అమ్మానాన్నలు నాపై నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు నేను కూడా చాలా కష్టపడ్డాను. ఈ రోజు ఈ స్థాయికి వచ్చాను. ఈ రోజుకీ మేం ఇలా ఉన్నామంటే మా అమ్మ గారే కారణం’అని చిరు అన్నారు. -
నా సోదరి మరణం.. ఇప్పటికీ మరిచిపోలేను: చిరంజీవి
మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా మెగా ఉమెన్స్ పేరుతో మెగాస్టార్ ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ఇచ్చారు. చిరంజీవి అమ్మగారు అంజనాదేవితో పాటు ఆయన సోదరీమణులు, సోదరుడు నాగబాబుతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి జీవితంలో జరిగిన అనేక సంఘటనలతో పాటు పలు సరదా విషయాలను వారు పంచుకున్నారు. అయితే, చిరు సోదరీమణులలో మాధవి రావు కూడా ఈ ఇంటర్వ్యూలో కనిపించడం విశేషం. వాస్తవంగా ఆమె మీడియాకు చాలా దూరంగా ఉంటారనే విషయం తెలిసిందే.మెగా బ్రదర్స్తో పాటు ఇద్దరు సోదరీమణులు ప్రస్తుతం ఉన్న విషయం తెలిసిందే. అయితే, తాము మొత్తం ఏనిమిది మంది అని చిరంజీవి తెలిపారు. చిన్న వయసులోనే తన సోదర,సోదరీమణులు ముగ్గురు చనిపోయారని ఆ ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు. 'అమ్మకు మేము ఐదుగురు బిడ్డలం. అయితే, మరో ముగ్గురు బిడ్డలు చిన్న వయసులోనే చనిపోయారు. నేనే ఆరో తరగతి చదువుతున్నప్పుడు రమా అని నాకొక సోదరి ఉండేది. నాగబాబు, కల్యాణ్ల కంటే పెద్దది. చిన్న వయసులోనే ఆమెకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. ఒకరోజు ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో పోన్నూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి అమ్మ, నేను కలిసి తీసుకువెళ్లాం. రెండురోజుల తర్వాత రమా చనిపోయింది. ఆ బిడ్డ శవాన్ని నా భుజాల మీద పెట్టుకొని రిక్షాలో అమ్మతో పాటు ఇంటికి వచ్చాను. ఆ దృశ్యాలు ఇప్పటికీ నన్ను కలిచివేస్తుంటాయి. నాన్న ఉద్యోగరీత్యా అందుబాటులో లేరు. ఈ విషయాన్ని ఆయనకు ఎలా తెలపాలో కూడా మాకు తెలియలేదు. ఎదోలా తెలిసిన వారి ద్వారా విషయాన్ని నాన్నకు చేరవేశాం. ఇంతలో చుట్టుపక్కల వాళ్లు సాయం చేయడంతో అంత్యక్రియలు పూర్తిచేశాం. ఆపై నాన్న వచ్చేసరికి అంతా అయిపోయింది. ఆ రోజు జరిగిన ప్రతి క్షణం నాకు ఇప్పటికీ గుర్తుంది. అది తలుచుకున్న ప్రతిసారి చాలా బాధగా ఉంటుంది.' అని చిరు కంటతడితో ఈ మాటలు చెప్పారు. -
అది కూడా తప్పేనా? నాకు స్టార్గా ఉండాలని లేదు: అక్షయ్ కుమార్
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar) తనను స్టార్ అని పిలిస్తే నచ్చదంటున్నాడు. స్టార్లా ఉండటం తనకిష్టం లేదని చెప్తున్నాడు. తాజాగా ఓ కార్యక్రమంలో అక్షయ్ మాట్లాడుతూ.. నాకు స్టార్ (నక్షత్రం)గా ఉండాలని లేదు. ఎందుకంటే నక్షత్రాలు ఎప్పుడూ రాత్రివేళలో మాత్రమే ప్రకాశిస్తాయి. నాకు ఉదయం, రోజంతా కూడా ప్రకాశించాలని ఉంది. అందుకే స్టార్ను కాదల్చుకోలేదు అన్నాడు.స్కూల్లో క్రమశిక్షణ..క్రమశిక్షణ గురించి మాట్లాడుతూ.. మనమందరం స్కూల్లో ఎంతో క్రమశిక్షణతో మెదులుకునేవాళ్లం. కానీ పెరిగేకొద్దీ ఆ క్రమశిక్షణను నెమ్మదిగా కోల్పోతున్నాం. నేను త్వరగా పడుకుని అంతే త్వరగా నిద్రలేస్తాను. అది చూసి చాలామంది ఎందుకలా త్వరగా నిద్రపోతావ్? అని అడుగుతారు. డిసిప్లిన్గా ఉంటే కూడా ప్రశ్నిస్తారా? అన్నాడు.సినిమాఅక్షయ్ సినిమాల విషయానికి వస్తే.. గతేడాది బడే మియా చోటే మియా, సర్ఫిరా, ఖేల్ ఖేల్ మే, స్త్రీ 2, సింగం అగైన్ వంటి చిత్రాల్లో కనిపించాడు. ఈ ఏడాది స్కై ఫోర్స్ మూవీతో అలరించాడు. ప్రస్తుతం కేసరి చాప్టర్ 2, జాలీ ఎల్ఎల్బీ 3, హౌస్ఫుల్ 5, కన్నప్ప(తెలుగు), భూత్ బంగ్లా, వెల్కమ్ టు ద జంగిల్, హీరా ఫెరి 3 వంటి చిత్రాల్లో నటిస్తున్నాడు. చదవండి: తెలుగులో ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ బ్యూటీ -
వుమెన్స్ డే.. ఆర్జీవీ ట్వీట్ వైరల్
రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma )..ఎప్పుడు ఏ పని చేస్తాడో, ఎలాంటి కామెంట్స్ చేస్తాడో ఎవరికీ తెలియదు. ఓ అంశంపై అందరూ ఒకలా అభిప్రాయం వ్యక్తం చేస్తే.. ఆయన మాత్రం కాస్త డిఫరెంట్గా స్పందిస్తుంటాడు. దానికి లాజికైన సమాధానం కూడా ఆయన దగ్గర ఉంటుంది. అందుకే ఆర్జీవీ ట్వీట్స్ ఎప్పుడూ వైరల్ అవుతుంటాయి. కేవలం సినిమాల గురించే కాదు.. సమాజంలో జరుగుతున్న ప్రతి అంశంపై ఇతరులకు భిన్నంగా స్పందిస్తుంటాడు. నేను(మార్చి 8) అంతర్జాతీయ మహిళా దినోత్సవం(International Women’s Day 2025 ). ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆర్జీవీకి కూడా వుమెన్స్ డే విషెస్ తెలియజేశాడు. అయితే అందరిలా శుభాకాంక్షలు తెలిపితే ఆర్జీవీ ఎందుకు అవుతాడు? ఆయన విషెస్ కూడా కాస్త డిఫరెంట్గానే ఉంటాయి. ‘నా ఉనికి లేకుండా నేను జీవించగలను, కానీ స్త్రీల ఉనికి లేకుండా నేను జీవించలేను .. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు’ అని ఆర్జీవీ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ‘ఆర్జీవీ కూడా ఇలాంటి పోస్టులు పెడతారా’ అని కొంతమంది షాకవుతుంటే.. ‘సూపర్ సార్.. మీకు మీరే లెజెండ్’, ‘భళే చెప్పావ్ సర్’ అంటూ మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. రామ్ గోపాల్ వర్మ ప్రొడక్షన్లో ప్రముఖ వ్యాపారవేత్త రవిశంకర్ వర్మ‘శారీ’అనే మూవీని నిర్మిస్తున్నారు. గిరి కృష్ణ కమల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో సత్య యాదు, ఆరాధ్య జంటగా నటించారు. మార్చి 21న ఈ చిత్రం రిలీజ్ కానుంది. I can live without my existence , but i can’t live without women’s existence ..HAPPY WOMEN’S DAY🙏🙏🙏— Ram Gopal Varma (@RGVzoomin) March 8, 2025 -
ఐఫా అవార్డ్స్కు అంతా సిద్ధం.. ఈసారి ప్రత్యేకత ఏంటో తెలుసా..?
ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఫా) (IIFA Awards) అవార్డుల కార్యక్రమానికి ఏర్పాట్లు అన్నీ పూర్తి అయ్యాయి. భారత్లోని జైపూర్ వేదికగా ఐఫా సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. సినీరంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఐఫా (IIFA-2024) అవార్డులు 2000 సంవత్సరంలో మొదటిసారి ప్రకటించారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ రంగాలలో మెప్పించిన నటీనటులు, చిత్రాలను గుర్తించి అవార్డ్స్ అందిస్తారు. ఈసారి హోస్ట్లుగా బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్తో పాటు నిర్మాత కరణ్ జోహార్ వ్యవహరించనున్నారు.మార్చి 8,9 తేదీల్లో జైపుర్ వేదికగా ఐఫా వేడుకలు జరగనున్నాయి. ఇప్పటికే భారీగా నటీనటులు అక్కడకు చేరుకున్నారు. ఐఫా అవార్డ్స్ కార్యక్రమాన్ని భారత్లో జరపడం ఇది రెండోసారి. సుమారు ఐదేళ్ల క్రితం ముంబైలో నిర్వహించారు. ప్రతి ఏడాది అబుదాబి, సింగపూర్,మలేషియా, అమెరికా వంటి దేశాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేవారు. అయితే, ఐఫా అవార్డ్స్ ప్రయాణానికి 25 ఏళ్లు పూర్తి కావడంతో ఈసారి భారత్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. షారుఖ్ ఖాన్, మాధురీ దీక్షిత్, షాహిద్ కపూర్, కృతి సనన్,కరీనా కపూర్, శ్రేయా ఘోషల్ వంటి స్టార్స్ ఐఫా వేదిక మీద తమ డ్యాన్సులతో మెప్పించనున్నారు. View this post on Instagram A post shared by IIFA Awards (@iifa) -
‘ఛావా’ తెలుగు వెర్షన్కి ఊహించని ఓపెనింగ్స్!
విక్కీ కౌశల్,రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఛావా’(Chhaava Movie). ఫిబ్రవరి 14న హిందీలో రిలీజైన ఈ చిత్రం తొలిరోజే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ని సంపాదించుంది. మూడు వారాల తర్వాత నిన్న (మార్చి 7) ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ తెలుగులో విడుదల చేసింది. టాలీవుడ్లో కూడా ఈ చిత్రానికి హిట్ టాక్ వచ్చింది. విక్కీ కౌశల్ నటనకి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఫలితంగా ఈ చిత్రం తొలి రోజు మంచి కలెక్షన్లలే రాబట్టింది. (ఛావా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)రెండు తెలుగు రాష్ట్రాలలో కలిసి తొలి రోజు 3.03 కోట్ల రూపాయలను రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. ఓ డబ్బింగ్ సినిమాకు ఫస్ట్డే ఈ స్థాయి కలెక్షన్స్ రావడం రికార్డే అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. పాజిటివ్ టాక్ రావడంతో వీకెండ్లో మరింత కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ ఇప్పటి వరకు రూ. 483.58 కోట్లను రాబట్టింది.ఛావా విషయానికొస్తే.. మరాఠా రాజు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్. శంభాజీ పాత్రలో విక్కీ నటించగా.. ఆయన భార్య ఏసుబాయి పాత్రను రష్మిక పోషించింది. ఇక బాలీవుడ్ సీనియర్ నటుడు అక్షయ్ ఖన్నా..ఔరంగాజేబు పాత్రలో కనిపించి, తనదైన నటనతో ఆకట్టుకున్నాడు.ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. దాదాపు రూ.130 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. -
W/O అనిర్వేశ్ మూవీ రివ్యూ
జబర్దస్త్ రాంప్రసాద్, జెమినీ సురేష్ , కిరీటి , సాయి ప్రసన్న ,సాయి కిరణ్ , నజియా ఖాన్ , అద్వైత చౌదరి కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ W/O అనిర్వేశ్’. ‘ది డెవిల్ చైర్’ఫేం గంగ సప్తశిఖర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గజేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై మహేంద్ర గజేంద్ర సమర్పణలో వెంకటేశ్వర్లు మెరుగు, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మించారు. మార్చి 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే..ప్రైవేట్ ఉద్యోగి అనిర్వేశ్(జబర్దస్త్ రామ్ ప్రసాద్) తన భార్య విచెలిత(సాయి ప్రసన్న) తనను నిత్యం వేధిస్తోందని సి.ఐ వరదరాజులు(జెమిని సురేష్)కి ఫిర్యాదు చేస్తాడు. మరో వైపు అనిర్వేశే నిత్యం తనను వేధిస్తూ.. చిత్రహింసలకు గురిచేస్తున్నాడని, తనకు చావే శరణ్యమని సీఐ వరదరాజులకు ఫోన్లో తన ఆవేధను అంతా వెలిబుచ్చుతుంది. అదే అపార్ట్మెంట్లో ఉంటున్న యువకుడు రాబర్ట్(సాయి కిరణ్ కోనేరి).. అనిర్వేశ్, విచెలిత కలిసి తనను బ్లాక్ మెయిల్ చేస్తూ, లైంగికంగా వేధిస్తున్నారని ఫిర్యాదు చేస్తాడు.కట్ చేస్తే..బిజినెస్ మ్యాన్ ధనుర్భాక్షి(కిరిటీ) ఓ వేశ్యతో సన్నిహితంగా ఉంటూ.. ఆమెను లోబరుచుకొని దారుణంగా హత్య చేస్తాడు. ఈ కేసు విచారణలో సి.ఐ వరదరాజులు బిజీ అయిపోతాడు. అనిర్వేశ్ కేసు విచారణకు మరో పోలీసు ఆఫీసర్(కిశోర్ రెడ్డి)ను నియమిస్తాడు. మరి రెండు కేసుల విచారణలో తేలిన నిజాలు ఏంటి? అనిర్వేశ్, విచెలిత, రాబర్ట్లలో ఎవరు ఎవరిని వేధించారు? మైథిలీ ఎవరు? ఆమె ఎలా చనిపోయింది? ఈ కేసుతో రౌడీ షీటర్ ఆది, డాక్టర్ శరణ్య, సీఐ వరదరాజులుకు ఉన్న సంబంధం ఏంటి? మిమిక్రీ ఆర్టిస్ట్ రామకృష్ణతో ఈ కేసులకు ఉన్న సంబంధం ఏటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ మూవీస్ ఈ మధ్య ఆడియన్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. దర్శకులు, నిర్మాతలు కూడా ఇలాంటి కథలకు బాగా ఇంపార్టెన్స్ ఇచ్చి సినిమాలను తీస్తున్నారు. ఇంట్రెస్టింగ్ ప్లాట్ ను ఎంచుకుని... గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఆడియన్స్ ను రెండు గంటల పాటు ఎంగేజ్ చేయగలిగితే ఇలాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సులభంగా విజయం సాధిస్తాయనే నమ్మకం ఉండటమే ఇందుకు కారణం. W/O అనిర్వేశ్ కూడా ఆ జానర్ కథే. మర్డర్ మిస్టరీ ప్లాట్ కి... కాస్త అడల్ట్ డ్రామా కంటెంట్ ను జోడించి యూత్ ను ఆకట్టుకునే విధంగా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు గంగ సప్తశిఖర.భార్య వేధిస్తోందంటూ భర్త... భర్త వేధిస్తున్నాడంటూ భార్య... వీరిద్దరూ తోడుదొంగలు... నన్ను పార్టీ పేరుతో ఇంటికి పిలిచి... నేను, నా ప్రేయసి ఏకాంతంగా ఉన్న సన్నివేశాలను వీడియో తీసి బెదిరిస్తున్నారంటూ... మరో వ్యక్తి ఫిర్యాదు.. ఇలా ట్రయాంగిల్ లో జరిగే స్టోరీకి అడల్ట్ కంటెంట్ ను కాస్త జోడించి... సినిమాను ప్రేక్షకులు బోర్ గా ఫీల్ అవ్వకుండా చూసేలా తెరకెక్కించా. ఇది యూత్ కు బాగా కనెక్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ లో రామ్ ప్రసాద్, సాయి ప్రసన్నల మధ్య వచ్చే ఎపిసోడ్స్ రామ్ ప్రసాద్ లోని మరో కోణాన్ని భయట పెడతాయి. ఇక ఇంటర్వెల్ తరువాత వచ్చే సీన్స్ కొన్ని మరీ బోల్డ్ గా వున్నాయి. ఆ తరువాత ప్రీ క్లైమాక్స్ నుంచి అసలు కథ రివీల్ అవుతుంది. వీరి ముగ్గురి మధ్య ఉన్న సంబంధం... అలాగే సి.ఐ.వరదరాజులు అసలు పాత్ర ఏమిటి అనేది క్లైమాక్స్ లో రివీల్ చేయడంతో... ఈ చిత్రం అసలు సిసలైన సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ అనిపించుకుంటుంది. దర్శకుడు ఎక్కడా పాత్రలపై అనుమానం రాకుండా... చివరిదాకా అసలు విషయంలో సస్పెన్స్ ను చివరి దాకా క్యారీ చేయడం నిజంగా దర్శకుడి ప్రతిభకు అద్దం పడుతుంది. క్రైం థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ఆడియన్స్ కి ఇది నచ్చుతుంది.ఎవరెలా చేశారంటే..ఇప్పటి వరకు కామెడీతోనే అలరించిన జబర్దస్త్ రామ్ ప్రసాద్... ఇలాంటి క్రైం బేస్డ్ సినిమాలో నటించి తనలోని మరో సీరియస్ కోణాన్ని ప్రేక్షకులకు చూపించారు. అనుమానపు మొగుడిగా శాడిస్ట్ పాత్రలో బాగా ఒదిగిపోయి నటించారు రామ్ ప్రసాద్. అలాగే ఇంటర్వెల్ తరువాత వచ్చే రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లోనూ బాగా వేరియేషన్ చూపించారు. అతనికి జంటగా నటించిన సాయి ప్రసన్న కొన్ని బోల్డ్ సీన్స్ తో ఆకట్టుకుంటుంది. ఇక నజియా ఖాన్ హోమ్లీ గాళ్ గా చాలా క్యూట్ గా కనిపించి మెప్పించింది. కిరీటి క్యారెక్టర్ కూడా చివరి దాకా బ్యాగా క్యారీ అయింది.రాబర్ట్ పాత్రలో సాయి కిరణ్ కోనేరి ఆకట్టుకున్నాడు. సీఐ పాత్రలో జెమిని సురేష్ చివరి దాకా కనిపించి ఆకట్టుకున్నాడు. మిగతా పాత్రలన్నీ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంగేజింగ్ గా ఉంది. ఎడిటింగ్ చాలా గ్రిప్పింగ్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
ఆపరేషన్ వల్ల చాలా బాధలు పడ్డాను.. ఎవరూ అడగలేదు: రాధికా శరత్కుమార్
ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధికకు సర్జరీ జరిగింది. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ విషయాన్ని చెబుతూ సోషల్మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేశారు. కష్ట సమయంలో మహిళలు ఎలాంటి దృఢ సంకల్పంతో ఉండాలో ఆమె తెలిపారు. కొద్దిరోజుల క్రితం ఆమె కాలికి తీవ్రమైన గాయం అయినట్లు వార్తలు వచ్చాయి. అప్పుడు దాని గురించి రాధికా ఎక్కడా స్పందించలేదు.అయితే, తాజాగా రాధికా శరత్ కుమార్ తన గాయం గురించి ఇలా చెప్పారు. 'గత రెండు నెలలుగా చాలా బాధలు పడుతున్నాను. ఎవరూ నా వర్క్, నా గురించి మాట్లాడలేదు. రెండు సినిమాల్లో పనిచేస్తున్న సమయంలో నేను అధిక బరువు ఉన్న బ్లింకర్లు ధరించడం వల్ల నా మోకాలికి తీవ్రమైన గాయం అయింది. అప్పుడు నా మోకాలి వద్ద విపరీతమైన నొప్పి కలిగింది. నొప్పి నివారణ కోసం ఎన్నో మందులతో పాటు మోకాలి బ్రేస్, క్రయోథెరపీ వంటి వాటిని పాటించాను. కానీ, ఎలాంటి ఫలితం లేదు. తప్పని పరిస్థితిలో రెండు నెలల క్రితం సర్జరీ చేపించుకున్నాను.' అని ఆమె తెలిపారు. ప్రస్తుతం తాను బాగున్నట్లు కూడా చెప్పారు.నొప్పి భరిస్తూనే సినిమా ఎలా పూర్తి చేశారని తన స్నేహితుడు ఒకరు ఆశ్చర్యపోయాడని రాధిక గుర్తుచేసుకున్నారు. ఆ నిర్మాతలు కృతజ్ఞతలు ఏమైనా చెప్పారా..? అని కూడా ఆ స్నేహితుడు అడిగినట్లు రాధిక చెప్పుకొచ్చారు. కానీ, తనకు కృతజ్ఞతలు వంటి వాటిని పట్టించుకోనని రాధిక చెప్పారు. అలాంటివి ఎప్పుడూ తాను ఆశించలేదని, ఉత్తమంగా పనిపై మాత్రమే దృష్టి పెడతానని ఆమె పేర్కొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి స్త్రీ తనను తాను మరింతగా ప్రేమించుకోవాలని, ఆత్మవిశ్వాసంతో వ్యవహరించాలని కోరుకుంటున్నట్లు ఆమె అన్నారు. ఇతరులు చూపే సింపతీ తీసుకోవద్దని తెలిపారు. అయితే, శస్త్రచికిత్స జరిగినప్పుడు తన భర్త శరత్ కుమార్ తనను చిన్నపిల్లలా చూసుకున్నారని ఆమె గుర్తుచేసుకున్నారు. తన జీవితంలో మూలస్థంభంలాంటి వ్యక్తి తన భర్తే అంటూ ఆమె చెప్పారు. View this post on Instagram A post shared by Radikaa Sarathkumar (@radikaasarathkumar) -
చేతులెత్తి నమస్కరిస్తున్నా అంటూ ఫోటో షేర్ చేసిన చిరంజీవి
మహిళా దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు చెబుతూ ఒక ప్రత్యేకమైన ఫోటోను తన షోషల్మీడయాలో పంచుకున్నారు. తనతో నటించిన హీరోయిన్లతో పాటు ఆయన సతీమణి సురేఖతో దిగిన ఫోటోను షేర్ చేశారు. ఈ క్రమంలో ఆయన ఇలా చెప్పుకొచ్చారు. ' నా నిజ జీవితాన్ని, నా సినీ జీవితాన్ని పంచుకుని నాకు విజయం అందించిన నా హీరోయిన్స్ అందరికీ, యావన్మంది మహిళలకు చేతులు ఎత్తి నమస్కరిస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.' అని తెలిపారు. ఈ ఫోటోలో చిరుతో పాటు సురేఖ, నదియా, రాధిక, మీనా, జయసుధ, ఖుష్బూ,టబు ఉన్నారు. సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ అవుతుంది. నా నిజ జీవితాన్ని, నా సినీ జీవితాన్ని పంచుకుని నాకు విజయం అందించిన నా హీరోయిన్స్ అందరికీ, యావన్మంది మహిళలకు చేతులు ఎత్తి నమస్కరిస్తూ మహిళా దినోత్సవ ♀ శుభాకాంక్షలు. 💐🙏#HappyWomensDay pic.twitter.com/j5qtSrtIAC— Chiranjeevi Konidela (@KChiruTweets) March 7, 2025 -
'కోర్ట్' సినిమా నచ్చకుంటే.. నా 'హిట్ 3'ని చూడొద్దు: నాని
ప్రియదర్శి ప్రధాన పాత్రలో రోషన్, శ్రీదేవి ఇతర పాత్రల్లో నటించిన చిత్రం ‘కోర్ట్’–స్టేట్ వర్సెస్ ఏ నోబడీ’. ఇందులో శివాజీ, సాయికుమార్, రోహిణి, హర్ష వర్ధన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. నాని వాల్ పోస్టర్ సినిమా సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం మార్చి 14న హోలీ పండగ సందర్భంగా విడుదల కానుంది. హీరో నాని ప్రోడక్షన్ హౌస్ నుంచి ఈ సినిమా వస్తుండటంతో అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్లో ప్రీరిలీజ్ వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో నానితో పాటు నాగ్ అశ్విన్, మోహనకృష్ణ ఇంద్రగంటి, ప్రశాంత్ వర్మ, శ్రీకాంత్ ఓదెల, శైలేశ్ కొలను, శౌర్యువ్ తదితరులు పాల్గొన్నారు.'కోర్ట్' సినిమా సమర్పకుడు నాని ట్రైలర్ను విడుదల చేసిన అనంతరం పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నేను చిత్ర పరిశ్రమలోకి వచ్చి 16ఏళ్లు దాటింది. దయ చేసి ఈ సినిమా చూడండి అని నేనెప్పుడూ అడగలేదు. తొలిసారి ఈ మాట ప్రేక్షకులను అడుగుతున్నాను. ఈ సినిమా నిర్మాతగా చెప్పడం లేదు, నా తెలుగు ప్రేక్షకులు ఒక మంచి సినిమా మిస్ అవ్వొద్దని కోరుకుంటున్నా. దయచేసి కోర్టు చిత్రాన్ని ఇంటిల్లిపాది చూడండి. కోర్టు చిత్రం చూసిన వారంతా గర్వంగా థియేటర్ల నుంచి బయటికి వస్తారు.'కోర్టు' సినిమా కంటే హిట్ 3పై పది రెట్లు ఖర్చుపెట్టాను. ఈ చిత్రం ప్రేక్షకులను అంచనాలను అందుకోకపోతే నా నెక్స్ట్ మూవీ 'హిట్3'ని ఎవరూ చూడొద్దు. ఇంతకంటే బలంగా మీకు చెప్పలేను. ఈ సినిమాతో మీరు తప్పకుండా కనెక్ట్ అవుతారు. ఈ చిత్రంలోని పాత్రలతో ప్రతి ఒక్కరు కూడా ఎమోషన్తో కనెక్ట్ అయిపోతారు. ఆ పాత్రలతో పాటుగా మీరు కూడా నవ్వడమే కాకుండా ఏడిపించేస్తారు.' అని నాని అన్నారు. -
రన్యారావు వద్ద కోట్లలో డబ్బు.. ఆశ్చర్యపోయిన అధికారులు
బంగారం అక్రమ రవాణా కేసులో పట్టుబడిన నటి రన్యారావ్ కేసులో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దుబాయ్ నుంచి బంగారు బిస్కెట్లను అక్రమంగా తీసుకువస్తూ బెంగళూరులో ఆమె దొరికిపోయిన విషయం తెలిసిందే. అయితే, ఆమెను మూడురోజుల పాటు విచారించాలని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ)కు కోర్టు అనుమతి ఇచ్చింది.కిలో బంగారం రవాణాకు రన్యారావ్కు రూ.5 లక్షల కమీషన్ అందిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఆమె నుంచి ఇప్పటికే 14 కిలోల బంగారు బిస్కెట్లు, రూ.2 కోట్ల విలువైన ఆభరణాలు, సుమారు రూ.3 కోట్ల నగదును డీఆర్ఐ అధికారులు జప్తు చేశారు. ఆమె వద్ద మొత్తం రూ. 18 కోట్ల ఆస్తులను గుర్తించినట్లు తెలుస్తోంది. సినిమా అవకాశాలు లేని ఒక నటి వద్ద ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఉండటం చూసి అధికారులే ఆశ్చర్యపోతున్నారు. తన వద్ద ఉన్న డబ్బుకు సరైన ఆధారాలను ఆమె చూపించలేకపోయింది.ఆమె గత ఆరు నెలల్లో 27 సార్లు దుబాయ్కు వెళ్లి వచ్చినట్లు అధికారులు తెలిపారు. సౌదీ అరేబియాతో పాటు అమెరికా, పశ్చిమాసియా, ఐరోపా దేశాలలో కూడా రన్యారావు ప్రయాణించినట్లు అధికారులు గుర్తించారు. కేవలం బంగారం అక్రమ రవాణా మాత్రమే కాకుండా సంఘవిద్రోహ శక్తులతో కూడా ఆమెకు సంబంధాలు ఉన్నట్లు వారు కనుగొన్నారు. ఈ క్రమంలో రన్యారావు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. విచారణ క్రమంలోనే దానిని కోర్టు తోసిపుచ్చింది. -
అప్పుడే మహిళ ఎదిగినట్లు లెక్క!: శ్రుతీహాసన్
‘‘సమస్య ఎక్కడైనా ఉంటుంది. ఎలా ఎదుర్కొంటున్నామన్నదే ముఖ్యం. సమస్యలకు భయపడి పారిపోతే ఓడిపోతాం... ధైర్యంగా ఎదుర్కొంటే గెలుస్తాం’’ అంటున్నారు శ్రుతీహాసన్. తన తల్లి సారిక సినిమాలు చేసినప్పటి పరిస్థితులను, ఇప్పుటి పరిస్థితులను పోల్చి కొన్ని విషయాలు చెప్పారు శ్రుతి. ఇంకా ‘మహిళా దినోత్సవం’ సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో శ్రుతీహాసన్ చెప్పిన విషయాలు తెలుసుకుందాం.∙మీ అమ్మగారి కెరీర్ని చూశారు... అప్పటి ఆమె కెరీర్ పరిస్థితులను ఇప్పటి మీ కెరీర్తో పోల్చుకున్నప్పుడు ఏమనిపిస్తోంది? అప్పటి పరిస్థితుల గురించి అమ్మ నాతో చెప్పేవారు. ‘ఈక్వాలిటీ’ విషయంలో అప్పుడు ప్రాబ్లమ్ ఉండేదట. ఉమెన్కి చాలా తక్కువప్రాధాన్యం ఉండేదట. అలాగే అప్పట్లో ‘పీరియడ్స్’ గురించి బాహాటంగా మాట్లాడడానికి సిగ్గుపడేవాళ్లు. అసలు బయటకు చెప్పకూడదన్నట్లు ఉండేది. ఇబ్బందిగా ఉన్నా బయటకు చెప్పకుండా షూటింగ్ చేసేవాళ్లు. ఇప్పుడు పీరియడ్స్ ఇబ్బంది గురించి ఓపెన్గా చెప్పి, ఆ రోజు పని మానుకునే వీలు ఉంది.∙మరి... మీ జనరేషన్ హీరోయిన్లతో పోల్చితే అప్పటివారు ఏ విషయంలో హ్యాపీ? మాటల విషయంలో... అప్పట్లో కాస్త ఓపెన్గా మాట్లాడగలిగేవాళ్లు. కానీ ఇప్పుడు ఏం మాట్లాడితే ఏం వస్తుందోనని మాటలకు కత్తెర పెట్టాల్సిన పరిస్థితి. అయితే నేనలా కాదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతాను. అది అందరికీ తెలిసిన విషయమే. సోషల్ మీడియా వల్ల ఏం మాట్లాడలేకపోతున్నారు. అన్ని కళ్లూ మనల్నే చూస్తున్న ఫీలింగ్. అంతెందుకు? పదిహేనేళ్ల క్రితం నేను కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఇలా లేదు. రిలాక్సింగ్గా ఉండేది.ఇప్పుడు ఫొటోలు తీసేసి, సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. ఆ ప్రెజర్ చాలా ఉంది. ఈ ఒత్తిడి వల్ల పబ్లిక్లోకి వచ్చినప్పుడు చాలామంది ఎక్కువ జాగ్రత్తగా ఉంటున్నారు. మా అమ్మ జనరేషన్లో ఉన్నంత కూల్గా ఉండలేని పరిస్థితి. ఇంకా చెప్పాలంటే స్కూల్ పిల్లలకు కూడా తిప్పలు తప్పడంలేదు. ‘అలా ఉన్నావు... ఇలా ఉన్నావు’ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఇలా చిన్నప్పుడే ప్రెజర్ మొదలై పోతోంది. అయితే ఇప్పటి ఈ పరిస్థితిని నేను విమర్శించడంలేదు. మార్పుని స్వీకరించడమే. ∙ఇండస్ట్రీలో ‘క్యాస్టింగ్ కౌచ్’ ఎదుర్కొన్న నటీమణులు చాలామంది ఉన్నారు... మీకు అలాంటివి? నాకలాంటి చేదు అనుభవాలు లేవు. ఒకవేళ నాకు నచ్చని పరిస్థితి ఎదురైందంటే నిర్మొహమాటంగా చెప్పేస్తాను. నా పాలసీ ఒక్కటే. నేను ఎవరినైనా ఇష్టపడితే టూ హండ్రెడ్ పర్సెంట్ ఇష్టపడతాను... నాకు కంఫర్ట్గా ఉన్న చోట ఉంటాను. నాకు నచ్చని చోట ఉండను... నచ్చని మనుషులను నా లైఫ్లో నుంచి ఎగ్జిట్ చేసేస్తాను. ఇంకో విషయం ఏంటంటే... మనకు ఏదైనా నచ్చలేదనుకోండి గొడవపడక్కర్లేదు... అరిచి చెప్పక్కర్లేదు. ‘నాకు నచ్చలేదు’ అని కూల్గా చెప్పి, సమస్యకు ఫుల్స్టాప్ పెట్టేయాలి. ∙మీలా చాలామంది ధైర్యంగా ఉండలేరు... నిర్భయంగా మాట్లాడలేరు... వారికి మీరిచ్చే సలహా? భయాలు వదలండి. దయచేసి మీ మనసులోని సమస్యలను బయటకు చెప్పండి. మనసులోనే ఉంచుకుంటే ఆరోగ్యం చెడిపోతుంది. మనకు ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్లతో షేర్ చేసుకోవాలి. అయితే వారికన్నా కూడా ఒక మంచి కౌన్సెలర్ అవసరం. వాళ్లయితే మన మానసిక స్థితిని బాగా అర్థం చేసుకుని సలహాలు ఇవ్వగలుగుతారు. ఫిజికల్గా హెల్దీగా ఉండాలంటే ‘మెంటల్ హెల్త్’ చాలా ముఖ్యం. ∙కమల్హాసన్గారి కూతురు కావడం వల్లే మీకు ఇండస్ట్రీలో ఇబ్బందులు ఎదురు కాలేదనుకోవచ్చా? బ్యాక్గ్రౌండ్ అనేది ప్లస్సే... కాదనడంలేదు. నాన్నగారి పేరు నాకు హెల్ప్ అయింది. అయితే శ్రుతీహాసన్ అంటే కమల్హాసన్ కూతురు అనే విషయాన్ని మరచిపోయేలా చేయాలి. అప్పుడే నేను సక్సెస్ అయినట్లు. నా వర్క్తో నేను నిరూపించుకుని నాకంటూ పేరు తెచ్చుకున్నాను. పని పరమైన ఇబ్బందులు కామన్. అలాంటివి ఎప్పుడూ మా నాన్నగారికి చెప్పలేదు. నేనే సాల్వ్ చేసుకుంటుంటాను.∙‘మహిళా దినోత్సవం’ జరుపుకుంటారా? నా ఫ్రెండ్స్తో ‘అన్ని రోజులూ మనవే’ అంటుంటాను. ‘మేల్ డే’ అని లేదు. మరి... ‘ఉమెన్స్ డే’ ఎందుకు? అంటే... ఇంకా స్త్రీ వెనకబడి ఉన్నట్లేనా? అలాగే ‘ఉమెన్ ఓరియంటెడ్’ సినిమా అంటారు. ‘మేల్ ఓరియంటెడ్’ మూవీ అనరు. ముందు ఈ తేడా పోవాలి. మహిళా దినోత్సవం అనేది ప్రత్యేకంగా లేని రోజున ఉమెన్ ఎదిగినట్లు లెక్క. సినిమా ఇండస్ట్రీలో టెక్నికల్ డిపార్ట్మెంట్లో మహిళలు తక్కువగా ఉండటానికి కారణం? ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు మహిళల శాతం ఎక్కువే ఉంది. లేడీ టెక్నీషియన్స్ ఇంకా పెరుగుతారు. అంతెందుకు? నేను ఈ మధ్య లీడ్ రోల్ చేసిన ‘ది ఐ’ మూవీకి డైరెక్టర్,ప్రొడ్యూసర్, ఇంకా ఇతర విభాగాల్లో మహిళలే ఎక్కువ. ఆ విధంగా ఈ సినిమా నాకు స్పెషల్. -
ధైర్యంగా బతకాలి... ప్రశాంతంగా ఉండాలి: నదియా
‘‘మీ విలువ మీరు తెలుసుకోండి... మీకు నచ్చినట్లు మీరు బతకండి’’ అంటున్నారు నదియా. హీరోయిన్గా 1980–1990లలో విజయవంతమైన కెరీర్ని చూసిన నదియా బిజీగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని, అమెరికాలో సెటిలయ్యారు. 1994లో సినిమాలకు దూరమై, 2004లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సిల్వర్ స్క్రీన్కి వచ్చారు. ‘కారవాన్’ వాహన సౌకర్యాలు లేని రోజులను, ఇప్పుడు ఆ సౌకర్యాలు ఉన్న రోజులనూ చూస్తున్నారు నదియా. ‘మహిళా దినోత్సవం’ సందర్భంగా ‘సాక్షి’కి నదియా ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలోని విశేషాలు తెలుసుకుందాం. ‘‘నిజ జీవితాన్ని, నా సినీ జీవితాన్ని పంచుకుని నాకు విజయం అందించిన నా హీరోయిన్స్ అందరికీ, యావన్మంది మహిళలకు చేతులెత్తి నమస్కరిస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు’’ అంటూ శుక్రవారం సోషల్ మీడియా వేదికగా ఈ ఫొటోను షేర్ చేసి, చిరంజీవి పేర్కొన్నారు⇒ టీనేజ్లో హీరోయిన్ అయిన మీకు అప్పటి షూటింగ్ వాతావరణం, అంతమంది వ్యక్తులతో పని చేయడం వంటివి ఇబ్బందిగా అనిపించేదా? మలయాళంలో నా తొలి సినిమా ‘నోకెత్త దూరత్తు కన్నుమ్ నాట్టు’ (1984). ఈ సినిమా తమిళంలో ‘పూవే పూచ్చూడవా’గా రీమేక్ అయింది. తమిళంలోనూ నేనే నటించాను. తమిళంలో నాకు తొలి సినిమా. ఆల్రెడీ ఒక భాషలో చేసిన సినిమా కావడం ఒక ప్లస్. మలయాళం సినిమా డైరెక్టర్ ఫాజిల్ తమిళంలోనూ చేశారు. అలాగే నాకు తమిళ్ అస్సలు రాకపోవడంతో ఓ ట్యూటర్ను పెట్టి, నేర్పించారు. దాంతో ఈజీ అయింది. షూటింగ్ పరంగా ఎలాంటి చేదు అనుభవాలు ఎదురు కాలేదు. దాంతో భయపడాల్సిన అవసరం రాలేదు. అలాగే ఆ సినిమా హిట్ కావడంతో వెనక్కి తిరిగి చూసుకోనంతగా బిజీ అయ్యాను.⇒ సినిమా ఇండస్ట్రీలో అమ్మాయిలు నిలదొక్కుకోవాలంటే చాలా కష్టం అంటారు... ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుందనే టాక్ కూడా వినిపిస్తుంటుంది... నేను నా అనుభవాల గురించి మాట్లాడతాను. నాతో పాటు మా నాన్న షూటింగ్కి వచ్చేవారు. ఒక్క నిమిషం కూడా ఆయన నన్ను ఒంటరిగా వదిలిపెట్టేవారు కాదు. ఆయన అంతగాప్రొటెక్ట్ చేయడంతో నాకు ప్రెజర్ ఉండేది కాదు. అలాగే వచ్చిన ప్రతి సినిమా కమిట్ చేయించేసి, నాతో ఓవర్ వర్క్ చేయించలేదు. వర్క్ని ఎంజాయ్ చెయ్ అన్నారు. నా పక్కన ఓ గైడింగ్ ఫోర్స్ (తండ్రిని ఉద్దేశించి) ఉండటంతో నాకెప్పుడూ ‘అన్సేఫ్’ అనిపించలేదు.⇒షూటింగ్ స్పాట్లో స్టార్స్కి ఏర్పాటు చేసే ‘కారవాన్’ వాహన సౌకర్యం అప్పట్లో లేదు. పల్లెల్లో షూటింగ్స్ చేసినప్పుడు కాస్ట్యూమ్స్ మార్చుకోవడానికి, ఇతర వ్యక్తిగత విషయాలకూ పడిన ఇబ్బందుల గురించి? మాకు బోలెడంత ప్రేమ దక్కేది. విలేజెస్లో ఎవరో ఒకరింట్లో కాస్ట్యూమ్స్ మార్చుకునేంత అభిమానం మా మీద ఉండేది. ‘ఏం ఫర్వాలేదు. మీ ఇల్లులా అనుకోండి’ అనేవాళ్లు. ఎలాంటి భయాలూ ఉండేవి కావు. ఇప్పడున్నన్ని సౌకర్యాలు లేకపోయినా హ్యాపీగానే ఉండేది.⇒ అప్పట్లో సౌకర్యం లేకపోయినా హ్యాపీగానే గడిచిందన్నారు... సో.. ఇప్పుడు కారవాన్ తదితర సౌకర్యాలు పొందుతున్న నటీమణుల లైఫ్ ఇంకా హ్యాపీ అనుకోవచ్చా... మాతో పోల్చుకుంటే ఇప్పటి అమ్మాయిలు హ్యాపీ కాదు. అన్ని సౌకర్యాలతో పాటు సమస్యలూ ఎక్కువే. ప్రతి క్షణం ఎవరో ఒకరు మనల్ని గమనిస్తున్న ఫీలింగ్. సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ వల్ల పబ్లిక్లోకి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ఈ జనరేషన్కి ఆ ప్రెజర్ ఎక్కువ.⇒మరి... ఈ ప్రెజర్ని ఎలా అధిగమించాలి? ప్రపంచం మారిపోయింది. మనమూ అందుకు తగ్గట్టు మారాలి. పరిస్థితులు ఇలా ఉన్నాయేంటని భయపడకుండా మన జాగ్రత్తల్లో మనం ఉండటమే. ⇒ నెగటివిటీ ఎక్కువ శాతం ఉన్న ఈ మోడ్రన్ వరల్డ్లో అమ్మాయిలు తమ లైఫ్ని ఎలా లీడ్ చేయాలంటారు? ధైర్యంగా, గర్వంగా బతకాలి. ఎందుకంటే ఆ దేవుడు సృష్టించిన ప్రత్యేకౖమైనమనుషులం మనం. ఎక్కడ ఉన్నా మనం సౌకర్యంగా ఉండటం మనకు ముఖ్యం. సౌకర్యం అంటే లగర్జీస్ కాదు. మనకు నచ్చినట్లుగా మనం ఉండటం. అలాగే మనం అనుకున్నది నిర్మొహమాటంగా చెప్పాలి. మన విలువని మనం తెలుసుకోవాలి. మనం మన గురించి ఏమనుకుంటున్నామో అదే మనం. తక్కువగా అనుకుంటే తక్కువగా... ఉన్నతంగా అనుకుంటే ఉన్నతంగా. అందుకే మన గురించి మనం ఉన్నతంగా అనుకోవాలి. ఆత్మవిశ్వాసంతో బతకాలి. ⇒ఇద్దరు అమ్మాయిల తల్లిగా మీ పిల్లలకు ఈ విషయాలు చెబుతుంటారా? చెబుతాం. మా అమ్మాయిలకు బాగా స్వేచ్ఛ ఇస్తాం. వాళ్ల ఇష్టాలను కాదనం. వద్దని చెప్పాల్సి వస్తే ఎందుకు వద్దో చెబుతాం. ఎంత జాగ్రత్తగా ఉండాలో వివరిస్తాం. ఒకప్పుడు పెద్దలు చెప్పిన మాటలను పిల్లలు వినేవాళ్లు. ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగిన ఈ కాలంలో పిల్లలు చెప్పేది కూడా పెద్దలు వినాలి. మేం మా పిల్లలతో బాగా కమ్యూనికేట్ అవుతాం. మా పిల్లలకే కాదు... ఎవరికైనా నేను చెప్పేదేంటంటే... ధైర్యంగా బతకాలి... ప్రశాంతంగా ఉండాలి.నా జీవితం హ్యాపీ నా జీవితం మొత్తం సాఫీ. హీరోయిన్గా బిజీగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని, మా ఆయనతో అమెరికాలో సెటిలయ్యాను. ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆ లైఫ్ని పరిపూర్ణంగా ఆస్వాదించాను. చాలా గ్యాప్ తర్వాత సినిమాలకు చాన్స్ వచ్చింది. ‘నటిగా నీ పూర్తి ప్రతిభని నువ్వు వినియోగించుకోలేదు.. సినిమాలు కంటిన్యూ చెయ్’ అని మా ఆయన, ‘మళ్లీ యాక్ట్ చెయ్ అమ్మా’ అని పిల్లలు అన్నారు. వచ్చాను.. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బిజీగా ఉన్నాను. -
ఆర్జీవీ శారీ మూవీ.. రొమాంటిక్ సాంగ్ రిలీజ్
టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ప్రొడక్షన్లో తెరకెక్కుతోన్న చిత్రం శారీ. ఆర్జీవీ ఆర్వీప్రొడక్షన్స్ పతాకంపై రామ్గోపాల్వర్మ, రవి వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గిరి కృష్ణకమల్ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాలో సత్య యాదు, ఆరాధ్య దేవీ జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, పోస్టర్స్ అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. నిజ జీవిత సంఘటనల ఆధారంగా సైకలాజికల్ థ్రిల్లర్గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో మేకర్స్ శారీ మూవీ ఓ క్రేజీ సాంగ్ విడుదల చేశారు. మొదటిసారి అంటూ సాంగే రొమాంటిక్ సాంగ్ను రిలీజ్ చేశారు. ఈ పాటను కీర్తన శేష్, అర్జున్ విజయ్ ఆలపించగా.. రాజశేఖర్ సుద్మూన్ లిరిక్స్ అందించారు. ఈ చిత్రానికి కీర్తన శేష్ సంగీతమందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మార్చి 21న తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీలో సాహిల్ సంభయాల్, అప్పాజీ అంబరీష్, కల్పలత కీలక పాత్రలు పోషించారు.శారీ కథేంటంటే..ఉత్తరప్రదేశ్లో ఎంతోమంది అమాయకమైన మహిళలను హత్యాచారం చేసిన ఓ శారీ కిల్లర్ ఆధారంగా ఈ సినిమా ఉంటుంది. చీరలో ఉన్న అమ్మాయిని చూసి, ఆమెతో ప్రేమలో పడిన తర్వాత ఓ అబ్బాయి జీవితం ఎలా భయానకంగా మారింది అన్నదే ఈ చిత్రకథాంశమని గతంలోనే చిత్ర యూనిట్ పేర్కొంది. -
అలా జరుగుంటే రాజకీయాల్లోకి వెళ్లేవాడిని: కిరణ్ అబ్బవరం
తెలుగు ప్రామిసింగ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకడు. కొన్నాళ్ల వరకు ఫ్లాప్ సినిమాలతో ఇబ్బంది పడ్డ ఇతడు.. గతేడాది రిలీజైన 'క' మూవీ మళ్లీ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఇప్పుడు 'దిల్ రుబా'తో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.కిరణ్ అబ్బవరం ఒకవేళ నటుడు కాకపోయుంటే ఏమయ్యేవాడు అని యాంకర్ అడగ్గా.. 'రాజకీయాలంటే నాకు ఎంతో ఇష్టం. ఒకవేళ యాక్టర్ కాకపోయుంటే రాజకీయాల్లోకి అడుగుపెట్టేవాడ్ని. ప్రజలతో మమేకం కావడం నాకు నచ్చుతుంది. నాది రాయలసీమ కావడంతో చిన్నప్పటి నుంచి రాజకీయాలని దగ్గరి నుంచి చూశాను. బహుశా అందువల్లే నాకు వాటిపై ఆసక్తి పెరిగింది అనుకుంటా.'(ఇదీ చదవండి: 'కోర్ట్' ట్రైలర్ రిలీజ్.. సమ్ థింగ్ ఇంట్రెస్టింగ్!)'నటుడిగా ఇండస్ట్రీలోకి రావాలనుకున్నప్పుడు.. చేస్తున్న ఉద్యోగం వదిలేయాల్సి వచ్చింది. అప్పుడు చాలా బాధపడి ఏడ్చేశాను' అని కిరణ్ చెప్పుకొచ్చాడు. పెళ్లి తర్వాత జీవితం సంతోషంగా ఉందని అన్నాడు.ఇకపోతే భవిష్యత్తులో వ్యాపార చేయాలనుకుంటున్నాను. ఫుడ్ బిజినెస్లో రాణించాలనేది నా ఇంట్రెస్ట్. మంచి రాయలసీమ స్టైల్ ఆహారం అందించాలని ఉంది. అందుకు సంబంధించిన సన్నాహాలు చేస్తున్నాం. త్వరలోనే అనౌన్స్ చేస్తాను' అని కిరణ్ అబ్బవరం చెప్పాడు.'దిల్ రుబా' సినిమా మార్చి 14న థియేటర్లలోకి రానుంది. ప్రేమకథతో తీసిన ఈ మూవీలో కిరణ్ సరసన రుక్సాన్ థిల్లాన్ హీరోయిన్.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 34 సినిమాలు) -
జీవీ ప్రకాశ్ కుమార్ 'కింగ్స్టన్' మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ తమిళంతో పాటు తెలుగులోనూ మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా కింగ్ స్టన్ మూవీతో నిర్మాతగా కూడా మారిపోయాడు. ఈ చిత్రానికి నిర్మాతగా, హీరోగా, సంగీత దర్శకుడిగా త్రిపాత్రాభినయం చేశారు. ఈ మూవీలో హిరోయిన్గా దివ్య భారతి నటించారు. తెలుగు, తమిళం భాషల్లో ఈ మూవీ ఈరోజు రిలీజైంది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో రివ్యులో తెలుసుకుందాం.అసలు కింగ్స్టన్ కథేంటంటే..కింగ్ (జీవీ ప్రకాశ్ కుమార్) తుతువూరు ప్రాంతానికి చెందిన వాడు. తుతువూరు ప్రాంతానికి సముద్ర శాపం ఉంటుంది. ఆ ఊరి వాళ్లు ఎవరు సముద్రంలోకి వెళ్లినా తిరిగి శవంగానే బయటకు వస్తారు. ఆ కారణంతో ఆ ఊర్లో ఎవరికీ ఉపాధి ఉండదు. దీంతో ఆంటోని (సబూమన్) గుప్పిట్లోకి వెళ్తాడు కింగ్. అతడి వద్దే పని చేస్తుంటాడు. అక్కడ ఆంటోని చేసే పనులు నచ్చక ఓ టైంలో కింగ్ ఎదురు తిరుగుతాడు. దీంతో కింగ్తో పాటు, అతని ఊరి మొత్తానికి పని లేకుండా పోతుంది. అసలు తన ఊరికి ఉన్న శాపం ఏంటి? శాపం వెనుకున్న కారణాలు ఏంటి? సముద్రంలోకి వెళ్లిన వాళ్లు ఎందుకు మరణిస్తున్నారు? అనే విషయాల్ని తెలుసుకోవాలంటే కింగ్స్టన్ సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..తమిళంలో తెరకెక్కిన కింగ్స్టన్ మూవీని తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం అంటే కథలో బలం ఉన్నందుకే. ఇలాంటి డిఫరెంట్ కథలకి సినీ ఆడియన్స్ ఆదరిస్తారనే నమ్మకంతో విడుదల చేయటం అభినందనీయం. సముద్ర శాపంతో కొట్టుమిట్టాడే ఓ ఊరి ప్రాంతం.. ఉపాధి లేక అల్లాడిపోతోన్న జనం.. ఆ ఊరి జనం కోసం నిలబడే హీరో... మాస్ ఎలివేషన్స్తో వెండి తెరపై హీరో కనిపిస్తే బీసీ సెంటర్లలో విజిల్స్ పడాల్సిందే.ముఖ్యంగా మాస్ ఆడియన్స్ను మెప్పించేలా ఎలివేషన్స్, ఎమోషన్స్ ఉన్నాయి. విలన్ వద్ద హీరో పనిచేస్తూ... అతనికే ధమ్కీ ఇవ్వాలంటే హీరోకి కావాల్సినంత మాస్ ఉండాలి. అప్పుడే ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. ఈ విషయంలో దర్శకుడు బాగా సెట్ చేశాడు. లాజిక్స్ పక్కన పెట్టి సినిమాను చూస్తే... బాగానే ఎంగేజ్ చేస్తుంది మూవీ. సినిమా ఫస్ట్ హాఫ్ కాస్త స్లో కావడం ప్రేక్షకుల్ని నిరాశ కలిగించినా.... సెకండ్ హాఫ్ అద్భుతంగా ఉంటుంది. క్లైమాక్స్ సీన్ కూడా అదిరిపోయింది. డైరెక్టర్ కథను ఆడియన్స్కు వివరించడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు.ఎవరెలా చేశారంటే..జీవీ ప్రకాశ్ ఇలాంటి పాత్రలు ఈజీగా చేసేస్తుంటాడు. పాత్రకు తగ్గట్టుగా మేకోవర్ అయిపోతాడు. ఈ చిత్రంలో జీవీ ప్రకాష్ యాక్టింగ్తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా మాస్ లుక్లో అలరించాడు. యాక్షన్ సీక్వెన్స్లోనూ ఫ్యాన్స్ను జీవీ మెప్పించాడు. ఇక దివ్య భారతి తన పరిధిలో ఆకట్టుకుంది. ఆంటోని, సాల్మాన్, బోస్, చార్లెస్ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక సాంకేతికత విషయానికొస్తే విజువల్స్, కెమెరా వర్క్, బీజీఎమ్, వీఎఫ్ఎక్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. పడవ, సముద్రం, అక్కడ చూపించిన సీన్ విజువల్స్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్తా పని చెప్పాల్సింది. జీవీ ప్రకాశ్ కుమార్ నేపథ్య సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. -
'కోర్ట్' ట్రైలర్ రిలీజ్.. సమ్ థింగ్ ఇంట్రెస్టింగ్!
యాక్షన్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న హీరో నాని.. నిర్మాతగానూ ఓ మూవీని విడుదలకు సిద్ధం చేశాడు. అదే 'కోర్ట్'. ప్రియదర్శి ప్రధాన పాత్రధారి. రోషన్, శ్రీదేవి కీలక పాత్రలు పోషించారు. మార్చి 14న మూవీ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో తాజాగా ట్రైలర్ లాంచ్ చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్ హిట్ మలయాళ డార్క్ కామెడీ)ట్రైలర్ బట్టి చూస్తే.. తన కూతురితో ప్రేమలో ఉన్నాడనే కోపంతో ఓ తండ్రి.. ఓ కుర్రాడిపై కేసు పెడతాడు. ఏకంగా పోక్సో కేసు బనాయిస్తాడు. అలా 78 రోజుల పాటు జైల్లో మగ్గుతాడు. పోక్సో లాంటి సెన్సిటివ్ కేసు కావడంతో లాయర్స్ ఎవరూ ముందుకు రారు. అలాంటిది ప్రియదర్శి ఈ కేసు వాదించేందుకు సిద్ధమవుతాడు. తర్వాత ఏం జరిగిందనేదే మిగతా కథ అనిపిస్తుంది.నాని నిర్మాత అంటే కాస్త వైవిధ్యభరిత చిత్రాలే వస్తుంటాయి. 'కోర్ట్' ట్రైలర్ చూస్తుంటే సమ్ థింగ్ ఇంట్రెస్టింగ్ అనేలానే ఉంది. కోర్ట్ రూమ్ డ్రామాలు ఈ మధ్య కాలంలో తెలుగులో ఏం రాలేదు. రామ్ జగదీశ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 34 సినిమాలు) -
మంచి సందేశాన్ని ఇచ్చే చిత్రమే 'బందీ': ఆదిత్య ఓం
టాలీవుడ్ నటుడు ఆదిత్య ఓం ఇటీవలే బందీ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. గతవారం విడుదలైన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రఘు తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గల్లీ సినిమా బ్యానర్పై నిర్మించారు. ఈ మూవీ మంచి విజయాన్ని సాధించడంతో చిత్రయూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.ఈ సందర్భంగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. 'బందీ సినిమా అద్భుతంగా ఉంది. పర్యావరణాన్ని రక్షించాలనే ఉద్దేశంతో తీశాం. మేము ఊహించినట్లే అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆదిత్య ఓం ఎంతో విలక్షణ నటుడు. యూపీ నుంచి ఇక్కడకు వచ్చి ప్యాషన్తో చేస్తున్నారు. రఘు తిరుమల మంచి పాయింట్తో సినిమా తీశారు. అందరినీ ఆకట్టుకున్న ఈ చిత్రం కమర్షియల్గా ఆడటం ఆనందంగా ఉంది’ అని అన్నారు.రఘు తిరుమల మాట్లాడుతూ.. 'మా లాంటి కొత్త వాళ్లని ఆదిత్య ఓం చాలా బాగా ఎంకరేజ్ చేశారు. ఆయన సహకారంతోనే సినిమా ఇంత బాగా తీయగలిగాం. ఆయన లేకపోతే ఈ సినిమానే లేదు. వెంకటేశ్వరరావు ఈ మూవీని చూసి ఎగ్జైట్ అయ్యారు. ఈ సినిమాలో మ్యూజిక్, విజువల్స్ గురించి అందరూ ప్రశంసిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు చాలా థాంక్స్' అని అన్నారు.ఆదిత్య ఓం మాట్లాడుతూ.. 'బందీ సినిమాను చాలా బాగా ఆదరిస్తున్నారు. ప్రస్తుతం పర్యావరణ అసమతుల్యత వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిందే. మంచి సందేశాన్ని ఇచ్చేలా తెరకెక్కించిన బందీ మూవీని ఆదరిస్తున్న ఆడియన్స్కు ధన్యవాదాలు. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే మరిన్ని మంచి చిత్రాలతో ఆడియన్స్ను మెప్పించే ప్రయత్నం చేస్తాను.' అని అన్నారు.